Monday 27 February 2017

పరమహంస యోగానంద సూక్తి



He is just behind your thoughts. If you are not sincere with Him, He will fly away. He comes only to those who are humble and true devotees. When you love Him, you will know Him; and you will know He is fully present in every soul.

When you love God, you can truly love others. Your perception of souls is pure --- like a crystal-clear mirror. Whoever comes before you, will be reflected there as he really is.

- Paramahansa Yogananda

Sunday 26 February 2017

Saturday 25 February 2017

మెహెర్ బాబా సూక్తి



“What is the meaning of God-Realization? It means to become one with God. By thinking and imagining, one can never become one with God. Union is possible only after the death of thoughts and imagination — the mind must die.

“How does a person know that he has realized God? It is automatic. You are a human being. Do you ever think to yourself, `Am I a human being?´ You do not ask yourself this because you are a human being. In the same way, once a man realizes God, he spontaneously knows that he is God. He has the full experience of it by personal experience.”

- Meher Baba 

Friday 24 February 2017

స్వామి శివానంద సూక్తి



Annihilate the evil tendencies or Asubha Vasanas, viz., lust, anger, greed, hatred, jealousy, through Subha Vasanas or good tendencies, viz., Japa, meditation, study of religious books, Kirtan or singing Lord’s praise. You will enjoy the eternal bliss of Siva.

This is the destruction of the three cities or castles. This is Tripura Rahasya.

- Swami Sivananda

Thursday 23 February 2017

స్వామి రామా సూక్తి



Actually it is not necessary to renounce the objects of the world, because a human being does not actually own or possess anything. Therefore it is not necessary to renounce anything—but the sense of possessive ness should be renounced.

- Swami Rama

Wednesday 22 February 2017

స్వామి వివేకానంద సూక్తి



I have come to this conclusion that there is only one country in the world which understands religion — it is India.

- Swami Vivekananda

మహాపురుషుడు - స్వామి దయానంద సరస్వతి

భారతదేశంలో ఆధునిక కాలంలో పుట్టిన ముగ్గురు మహాపురుషులు స్వామి దయానంద సరస్వతీ, స్వామి వివేకానంద, శ్రీ అరొబిందో.
నేడు స్వామి దయానంద సరస్వతి జయంతి.

వైదిక ధర్మం నుంచే పుట్టి, వేరు పడిన 70 పైగా అవైదిక మతాలను ఖండించి, సనాతన ధర్మాన్ని ఆది శంకరులు పునఃస్థాపితం చేశారని మనం ఎలా చెప్పుకుంటున్నామో, అచ్చం అలానే దయానందుల గురించి కూడా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆదిశంకరులు సనాతనధర్మాన్ని ప్రక్షాళన చేసిన తర్వాత మళ్ళీ ఈ ధర్మంలో ఎన్నో అవైదిక వాదనలు ఉద్భవించాయి. సమాజమంలో వచ్చిన రుగ్మతలకు ఆది శంకరుల వలె, భగవద్రామానుజులు, మధ్వాచార్యులు తమదైన శైలిలో పరిష్కారం చూపి, ధర్మాన్ని రక్షించారు. సనాతనధర్మంలో ప్రతి ఆచార్యుడు గొప్పవాడే. ఎవరికి వారే. ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. ఎందరో సంస్కర్తలు వచ్చినా, కాలక్రమంలో ధర్మంలో అనేక అనాచారాలు, దురాచారాలు ప్రబలాయి. వ్యక్తి గుణకర్మలను బట్టి నిర్ణయించే వర్ణం, జన్మతః నిర్ణయించడం మొదలుపెట్టారు. అంటరానితనం అనే దురాచారం వచ్చింది. బాల్య వివాహాలు, సతిసహగమనం కూడా సమాజాన్ని పట్టి పీడించాయి. అనవసరమైన, కుతర్కమైన మూఢనమ్మకలాతో భారాతావని ఎన్నో బాధలు అనుభవించింది. ప్రజల్లో చైతన్యాన్ని, క్రియాశీలత్వాన్ని నింపాల్సిన ధర్మప్రభోధం, అకర్మను, తమస్సును నింపింది. అటువంటి సమయంలో మాఘబహుళ దశమి రోజు, 12 ఫిభ్రవరి 1824 లో, గుజరాత్ రాష్ట్రంలోని టంకర అనే గ్రామంలో జన్మించారు స్వామి దయనంద సరస్వతీ. వీరి పూర్వాశ్రమ నామం మూలశంకర. చిన్నవయసులోనే సత్యాన్వేషణతో ఇల్లు వదిలిన మూలశంకరుడు, అనేక ప్రాంతాలను తిరిగి ఆఖరికి మథురలో స్వామి విరాజానంద అనే సన్యాసి వద్ద శిష్యరికం చేశారు. విరజానందుడు అంధుడే అయినా, జ్ఞాన దృష్టి కలవాడు. సమాజంలో చెప్పబడుతున్న వేదప్రోక్తమైన సనాతన ధర్మం కాదని, అసలు ధర్మాన్ని ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని, ఆ పనిని దయానందునికి అప్పగించారు విరజానందుడు.

అప్పటి నుంచి దయానందుడు భారతదేశ నిర్మాణానికి, సనాతన ధర్మ పునరుద్ధరణకు ఎంతో కృషి చేశారు. ఎందరొతోనో వాదించారు. సనాతనధర్మంలో వివక్ష లేదని, అంటరానితనం వేదాల్లో లేదని, ఉంటే ఎక్కడ ఉందో చూపమని సవాల్ విసిరారు. అంటరానివారికి యజ్ఞోపవీతాలు చేసి, ఉపనయనం చేసి, వేదాధ్యనానికి బాటలు వేశారు. స్త్రీలు కూడా వేదం చదవచ్చని, వితంతువులు పునర్వివాహం చేసుకోవడం శాస్త్రబద్దమని వేదప్రమాణంగా నిరూపించారు. స్త్రీల కోసం వేదపాఠశాలలను స్థాపించారు. దైవం పేరుతో సనాతనధర్మంలో పాతుకుపోయిన మూఢనమ్మకాలను ఖండించారు. గోవధ మీద ఆంగ్లేయ ప్రభుత్వంతో మాట్లాడి, గోవధను నిషేదించాలని చెప్పిన వారిలో అగ్రగణ్యుడు దయానందుడు. అనేకమంది రాజులను కలిసి, వారిలో ధర్మానురక్తిని నింపారు. 1857 లో జరిగిన సిపాయిల తిరుగుబాటులో కీలకపాత్ర పోషించడంతో పాటు, భారతదేశానికి సంపూర్ణం స్వరాజ్యం రావాలని ఎలుగెత్తి అరిచారు. భారతదేశ స్వరాజ్యం గురించి భారతీయుడు ఇచ్చిన తొలి పిలుపు అదే. ఆ తర్వాత దాన్నే లోకమాన్య బాలగంగాధర తిలక్ కొనసాగించారు. తాను బ్రతికింది 59 ఏళ్ళే అయినా, అందులో ఋగ్వేదానికి సంపూర్ణంగానూ, యజుర్వేదానికి సగం వరకు భాష్యం రాశారు. వారు రాసిన వేదభాష్యం అప్పటి వరకు వేదంపై ఉన్న అభిప్రయాలను మరింత పెంచింది. ఆ కాలంలోనే ఋగ్వేద భాష్యం రాస్తూ, రేడియో, విమానాల గురించి ప్రస్తావించారు. కాశీవెళ్ళి కాశీ బ్రాహ్మణులతో శాస్త్రవాదం చేసి, వారిని ఓడించారు. సర్వమత సభను ఏర్పాటు చేసి, అన్ని మతాల పెద్దలను దానికి పిలిచి, ఈ లోకానికి వేదమే ప్రమాణమని, అందరూ వేదాన్నే అనుసరించాలని,  అని పిలుపిచ్చారు. వారు ఎవరూ ఒప్పుకోకపోవడంతో తన ఆశయసాధనకు ఆర్యసమాజ్ అనే సంస్థను స్థాపించారు. మేడం కామ, పండిత లేఖా రాం, స్వామి శ్రద్ధానంద, సావర్కర్, రాం ప్రసాద్ బిస్మల్, లాలా లజపతి రాయ్ మొదలైన వారిపై వీరి ప్రభావం తీవ్రంగా ఉంది. అంతెందుకు అరబిందో, సర్వేపల్లి రాథాకృష్ణన్ మొదలైనవారు వీరిని, ఆధునిక భారత నిర్మాతగా అభివర్ణించారు.

వీరి ప్రభావం ఎంతగా ఉండేదంటే ఆంగ్లేయులకు వీరంటే హడల్. గుండెలు జారిపోయేవి. వీరిని హిందూ మిలిటెంట్ గా అభివర్ణించారు. ఈ కాలంలో మనం చూసిన రాజీవ్ దీక్షిత్, ప్రస్తుత మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మొదలైనవారికి దయానందులే స్ఫూర్తి ప్రదాత. భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల పై వీరి ప్రభావం ఎంతగానో ఉంది. వీరి కారణంగానే వారు అంత వీరోచితంగా పోరాడారు. భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్న ఎందరో యోధులకు స్వామి దయానంద సరస్వతి, స్వామి వివేకానంద, అరబిందులే స్ఫూర్తి. దాదాపుగా దయానందుల ప్రభావం లేనివారు ఆ కాలంలో లేరని చెప్పవచ్చు. సనాతనధర్మంలో వచ్చిన ప్రతి సంస్కరణోద్యమంలో దయానందుల ప్రభావం ఎంతో ఉంది.

విగ్రహారాధన, అవతారవాదన మొదలైన వాటిని  దయానందులు ఖండించినా, అది ఆ కాలానికి అవసరమైనది కనుక అలా చేశారని భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ధర్మంలో ఉన్న ప్రతి ఆచార్యుడు, సమాజం extreme లో ఉన్నప్పుడు, తాను ఇంకోextreme కి వెళ్ళి, బలంగా వాదించి balance చేస్తారు. అదే దయానందులు కూడా చేశారు. బుద్ధుడు, శంకరాచార్యులు, రామానుజుల జీవితాలను పరిశీలిస్తే ఈ విషయం మనకు అర్దమవుతుంది. ధర్మ పునరుద్ధరణ ఒక లక్ష్యం అయితే, సమాజాన్ని balance చేయడం ఒక లక్ష్యం.

దయానందులు లేకపోతే, ఈనాడు హిందూ జాతి మిగిలి ఉండేది కాదు. మూఢనమ్మకాలతో, అంటారానితనం, బాల్యవివాహాలతో, మతమార్పిడులతో అంతరించిపోయి ఉండేదేమో. లేదా బానిస మనస్తత్త్వంతో ఉండేది. Colonise అయిన భారతీయ సమాజాన్ని Decolonise చేసే పని ప్రారంభించిన వ్యక్తులలో ప్రథముడిగా స్వామి దయానందులను చెప్పవచ్చు. అటువంటి దయానందులు సనాతన ధర్మంలో ప్రాతఃస్మరణీయులు.

ఇప్పటికీ వేదాల్లో ఏసు, మహమ్మదు అంటూ చేస్తున్న విషప్రచారాలను ఖండించగలిన, ఖండిస్తూ, జాకీర్ నయిక్ ను సైతం హడలుగొట్టిన సత్తా కలిగిన ఏకైక సంస్థ ఆర్య సమాజమే, దయానందుల భాష్యమే. అంత గొప్పవారు దయానందులు. మనం స్వామి వివేకానందను స్మరిస్తాం కానీ వారు చెప్పింది విస్మరిస్తాం. అరబిందులను, దయానందులను స్మరించడం కాదు, పూర్తిగా విస్మరించాం.

Monday 20 February 2017

స్వామి శివానంద సూక్తి



Thoughts crowd together just as the birds of the same feather flock together. So also, if you entertain one impure thought all sorts of impure thoughts join together and attack you. If you entertain any good thought, all good thoughts join together to help you.

- Swami Sivananda

Sunday 19 February 2017

సద్గురు శివానంద మూర్తి గారి సూక్తి



Minimum Prayer for minimum security. Maximum Prayer for Jnana, you will be purified, you will get absorbed into it.

- Satguru Sivananda Murthy Garu

వీర మాత జీజాభాయి


ఒక కుండ మంచి ఆకారంతో, మన్నికతో, నాణ్యతతో రూపు దిద్దుకోవాలంటే అది కుమ్మరి సృజనాత్మకత, నిపుణత మీద ఆధారపడి ఉంటుంది.
అలాగే ఛత్రపతి శివాజీ మహరాజు కూడా హైందవి స్వరాజ్యం స్తాపించడానికి అడ్డుపడుతున్న శత్రువులను ఎదురుకోవడానికి ఎంతో శిక్షణ పొందారు.

మాత జీజాబాయి మ్హకసా బాయి, మరియు లఖొజి జాదవ్ కు సింధ్ఖెడ్ రాజ్యంలో జన్మించారు. ఆమె పెరిగేకొద్ది, మొఘలాయుల పాలనలో హిందువులు అనుభవించే బాధలు ఆమేకు అవగాహనకు వచ్చేవి. ఆడపిల్లలు బొమ్మలతో ఆడుకునే వయస్సులో జీజాభాయి కత్తి స్వాము నేర్చుకునేది. జీజాభాయి తల్లి కూడా ఆమెకు సాహసం కు సంబంధించిన కథలు చెప్పి ఎంతో శిక్షణ ఇచ్చేది.

దేశం పరిస్థితి ఎలా ఉండేది అంటే మొఘలాయులకు సేవ చేయుట, వారి కింద అధికారులుగా పని చెయుట, వారి కోసం సొంత ప్రజలనే ఎత్తుకొచ్చి వారికి అప్పగించుట. హిందూ స్త్రీలు ముస్లింలచే అపహరింపబడి అమ్ముడుబోయేవాళ్ళు! అయినా సమాజం నోరుమెదపకుండా చూస్తూ ఊరుకునేది. రైతులు ఖాళి కడుపులతో మొఘలాయుల కోసం రెక్కలు ముక్కలు చేసేవాళ్ళు. ఈ అన్యాయన్ని ఎదిరించడానికి ఒక వ్యక్తి కోసం జీజా భాయి ఎదురుచూస్తోంది.

1605 లో జీజాభాయి సహాజి రాజె భొన్సలే ని పెళ్ళాడింది. తన ప్రార్థనల తో అమ్మ భవానిని "మంచి తేజస్సు, సాధన, స్వరాజ్యాన్ని స్తాపించగల సామర్ధ్యం గల పుత్రుడిని ప్రసాదించమని కోరుకునేది.

సహాజి రాజుని పెళ్ళడిన తరువాత, తన భర్త మొగల్ రాజుల దగ్గర, అదిల్ షా, నిజాం షా దగ్గర తక్కువగా చూడబడడం, అవమానింపబడడం సహించలేకపోయేది. తన భర్త ఎంత శక్తివంతుడు అయినప్పటికి తగిన గుర్తిపు, భధ్రత లేవు అని మరియు సమాజానికి తోడ్పడదం లేదని భావించేది. బిడ్డ పుట్టకముందే అతడి లక్ష్యాన్ని నిర్ణయించిన ఎకైక స్త్రీ ఈ చరిత్రలో మాత జీజాభాయి ఒక్కరే !

అమ్మ భవాని జీజాభాయి కోరికను తీర్చింది. ఎందుకంటే జీజాభాయి బాధలను అమ్మ కూడా పంచుకుంది. స్త్రీ అపహరణ, ఆలయాల కూల్చివేత, శత్రు సైనికులైన మొగల్, అదిల్ షా, నిజాం షాహ్ ఆలయాల్లోని విగ్రహాలను పగలగొట్టుట ఇవన్నీ చూడలేక అమ్మ భవాని, జీజాభాయి హైందవి స్వరాజ్యం స్వప్నాన్ని పంచుకున్నారు.

మాత జీజాభాయి శివాజీకి రాముని, కృష్ణుని, భీముని కథలు చెప్పి అన్యాయన్ని ఎలా ఎదిరించాలో, అమాయక ప్రజలను బానిసత్వం నుండి ఎలా విముక్తి చేయాలో బొధించేది. ఈ కథలన్నిటిని విన్న శివాజీ స్వేచ్ఛయే దారిగా అదే జీవిత లక్ష్యంగా చేసుకున్నాడు.

జీజా మాత శీవాజికి రాజనీతి కూడా బోధించేది. శివాజీ ని ధైర్య సాహసాలతో పోరాడేటట్టుగా తయారు చేసింది. తానే సొంతగా శివాజీ వివిధ ఆయుధాలతో శిక్షణ తీసుకుంటున్నపుడు పర్యవేక్షించేది. జీజా మాత అందించిన దిశానిర్దేశకత్వంతో, శివాజీ ఎన్నో పరిస్థితుల నుంచి అద్భుతంగా బయటపడగలిగాడు. అఫ్జల్ ఖాన్‌ని వధించుట, ఆగ్రా లో బంధిస్తే తప్పించుకొనుట మొదలగునవి.

జీజా మాత రెండు పాత్రలను సమర్ధవంతంగా పోషించింది. తల్లిగా ప్రేమని పంచిపెట్టింది మరియు తండ్రిగా లక్ష్యాన్ని సాధించడానికి కావలసిన ప్రతిభ, తెలివి తేటలను నేర్పించింది.

కేవలం జీజా మాత అందించిన శిక్షణ వలనే, శివాజీ మహరాజ్ కొన్ని శతాబ్ధాల ముస్లిం పాలనను మట్టికల్పించి హైందవి స్వరాజ్యాన్ని స్తాపించాడు.

శివాజీ మహరాజ్ ఛత్రపతిగా పట్టాభిషక్తుడయ్యెవరకు జిజా మాత బ్రతికే ఉన్నారు. తన భర్త తోడు లేకపోయినా కొడుకుని ఎంతో ప్రేమగా పెంచి, హైందవి స్వరాజ్యం స్తాపింపబడడానికి ఎంతో తోడ్పడ్డారు. శివాజీ మహరాజ్ కు పట్టాభిషేకం అయిన 12 రోజుల తరువాత స్వర్గలోకాలకు వెళ్ళిపోయారు.

*గమనిక: ఈ వ్యాసం "హిందూ జనజాగృతిలో ప్రచురించబడిన ఆంగ్ల వ్యాసంలోంచి అనువదింపబడినది. ఆంగ్ల వ్యాసం చదవదలుచుకుంటే ఈ లంకె లోకి వెల్లండి: http://www.hindujagruti.org/articles/37.html

Source: తెలుగు మీడియా

Saturday 18 February 2017

Friday 17 February 2017

హఠయోగ లక్ష్యం- స్వామి సచ్చిదానంద బోధ



The Aim of Hatha Yoga

The aim behind all the Hatha Yoga postures is to be able to sit in one steady, comfortable position for meditation. It is only in a steady posture that you can have a good meditation. A body filled with toxins, weak muscles, and jumpy nerves will not be able to stay quiet for any length of time.

- Swami Satchidananda

స్వారాజ్య పీఠం స్థాపకులు వేదాంతం లక్ష్మణాచార్యులవారి సూక్తులు

Svarajya peetam- Jagadguru Vedantam lakshmanacharya


స్వారాజ్య పీఠం
స్వారాజ్య పీఠ స్థాపిత
"జగద్గురు వేదాంతం లక్ష్మణాచార్యులు" ప్రొద్దుటూరు.కడపజిల్లా.





for more details- contact: Jaya Teja

Wednesday 15 February 2017

స్వామి చిదానంద సూక్తి



Faith develops gradually. Full faith can be possessed only after realisation of God. Please so not worry on this point. With what faith you have, proceed onwards. Practice of spiritual life makes faith to grow.

- Swami Chidananda Saraswati

Tuesday 14 February 2017

స్వామి కృష్ణానంద సూక్తి



In the final stage of worship, the soul of the devotee itself performs the worship by offering itself, by surrendering itself, in an intimate union of itself with its Beloved.

- Swami Krishnananda

Monday 13 February 2017

సద్గురు శివాయ శుభ్రమునీయ స్వామి



Selfless service to mankind makes you free in the world of mortals.

- Satguru Sivaya Subramuniyaswami

14-02-2017, మంగళవారం, మాఘ బహుళ చవితి, సంకష్టహర చతుర్థీ, అంగారక చతుర్థి..



14-02-2017, మంగళవారం, మాఘ బహుళ చవితి, సంకష్టహర చతుర్థీ, అంగారక చతుర్థి..
మాఘ మాసంలో వచ్చింది కనుక దీనికి ద్విజప్రియ సంకష్టహర చతుర్థి అని పేరు.

వ్రత విధానం ఈ లింక్‌లో చూడగలరు.
http://ecoganesha.blogspot.in/2014/03/20-2014.html

15 ఫిబ్రవరి 2017, చంద్రోదయ సమయం హైద్రాబాదులో (భారత కాలమానం ప్రకారం) - రాత్రి 9.20 నిమి||
http://www.drikpanchang.com/vrats/sankashti-chaturthi-dates.html

Sunday 12 February 2017

సద్గురు శివానంద మూర్తి గారి సూక్తి



You need not ask your Guru as to when you will get Moksha or how many marks you got for your character and conduct last month. If there is any need, he will stop you and set you right. That is what is called surrender.

- Satguru Sivananda Murthy Garu

హిందూ ధర్మం - 237 (జ్యోతిష్యం- 17 (కాలగణన))



ఇప్పుడు జ్యోతిష్యంలో మన ఋషులు కాలాన్ని ఎలా గణించారో, మామూలు వారు ఊహించని స్థాయిలో, 17 మైక్రో సెకన్ల నుంచి 311,040,000,000,000 ఏళ్ళ వరకు కాలాన్ని అతి సూక్ష్మంగా ఎలా గణించారో, ఆ వివరాలు చూద్దాం.

1 పరమాణువు- ఒక సెకన్‌లో 60,570 వ వంతు, 16.8 మైక్రోసెకను (1 మైక్రోసెకను= 1 సెకెనులో 10 లక్షల వంతు)
1 అణువు- 2 పరమాణువులు≈ 33.7 మైక్రోసెకను
1 త్రసరెణు- 3 అణువులు≈ 101 మైక్రోసెకను
తృటి- 3 త్రసరెణు≈ 1/3290 సెకన్లు; అనగా ఒక సెకనులో 3290 వ వంతు= 304 మైక్రోసెకను
1 వేధ= 100 త్రుటి≈ 47.4 మిల్లిసెకన్లు
1 లవం- 3 వేధలు≈ 0.14 సెకన్లు≈ 91 మిల్లిసెకన్లు
1 నిమేషం (కంటిరెప్ప కాలము)- 3 లవములు≈ 0.43 సెకన్లు (లెకలన్నీ దరిదాపుల్లో)
1 క్షణం- 3 నిమేషాలు≈ 1.28 సెకన్లు
1 కాష్టా- 5 క్షణాలు≈ 6.4 సెకన్లు
1 లఘు- 15 కాష్టాలు≈ 1.6 నిమిషాలు
1 దంఢ- 15 లఘువులు≈ 24 నిమిషాలు
1 ముహూర్తం- 2 దంఢలు≈ 48 నిమిషాలు
1 అహోరాత్రం- 30 ముహుర్తాలు≈ 24 గంటలు
మాసము- 30 అహోరాత్రాలు≈ 30 రోజులు
ఋతువు= 2 మాసాలు ≈ 2 నెలలు
అయనము= 3 ఋతువులు≈ 6 నెలలు
సంవత్సరము= 2 అయనాలు= దేవతలకు ఒక రోజు.
-----
1 త్రుటి= 29.6296 మైక్రోసెకన్లు
1 తత్పర= 2.96296 మిల్లిసెకన్లు
1 నిమెషం- 88.889 మిల్లిసెకన్లు
45 నిమెషాలు - 1 ప్రాణ= 4 సెకన్లు
6 ప్రాణాలు- 1 వినాడి- 24 సెకన్లు
60 వినాడి(లు)- 1 నాడి- 24 నిమిషాలు
60 నాడులు= 1 అహోరాత్రము
--------


ఆధునిక ప్రమాణాల ప్రకారం, 24 గంటలు అంటే ఒక పగలు, రాత్రి. మనం గమనించేది 1 నాడి లేదా దంఢం= 24 నిమిషాలు, 1 వినాడి= 24 సెకన్లు, 1 ఆసు/ ప్రాణం= 4 సెకన్లు ........ 1 తృటి= 1 సెకనులో 33,750 వంతు. అసలు ఇంత చిన్న కాలాన్ని మన ఋషులు లెక్కించడమే ఆశ్చర్యం కదూ.

సూర్య సిద్ధాతం కాలాన్నివాస్తవికంగాను, వ్యవహారికంగానూ చెప్పింది. Virtual భాగాన్ని మూర్తం అని, Practical భాగాన్ని అమూర్తం అని చెప్పింది. ప్రాణం (ఊపిరి) పీల్చుకునే కాలంతో మొదలయ్యేది సత్యమని, తృటితో మొదలయ్యేది నిత్యజీవితంలో అవసరంలేనిదని చెప్పింది. 1 ప్రాణం అంటే, ఆరోగ్యవంతమైన మనిషి 1 సారి ఊపిరి పీల్చి విడువడానికి పట్టే సమయం లేదా గురువక్షరం అనే 10 అక్షరాలను పలికే సమయం.

To be continued ..............

Source: http://www.sanskritimagazine.com/indian-religions/hinduism/concept-measurement-time-vedas/
https://en.wikipedia.org/wiki/Hindu_units_of_time
http://veda.wikidot.com/vedic-time-system

Saturday 11 February 2017

స్వామి శివానంద సూక్తి



Thoughts gain strength by repetition. If you entertain an impure thought or good thought once, this impure thought or good thought has a tendency to recur again.

- Swami Sivananda

Friday 10 February 2017

జీవనధర్మం- స్వామి సచ్చిదానంద బోధ



The Law of Life

If we bring the beautiful quality of selflessness and dedication into our lives, we need not do anything else. The candle gives light—not for itself. The flowers bloom—not for themselves. The entire nature leads a dedicated life. That is the law. Sacrifice is the law of life.

- Swami Satchidananda

Thursday 9 February 2017

స్వామి శాంతానంద పురీ సూక్తి



Everyone moves towards the Lord in their own way, and in their own capacity. That is why the life in, and leading to the Lord, is called the Pathless Path and the Choiceless Choice.

- Swami Shantananda Puri

Wednesday 8 February 2017

దాశరధి శతకం - 2

11
శ్రీ రఘువంశ తోయధికి శీతమయూఖుడవైన నీ పవి
త్రోరుపదాబ్జముల్ వికసితోత్పల చంపక వృత్తమాధురీ
పూరితవాక్ప్రసూనముల బూజలొనర్చెద జిత్తగింపుమీ
తారకనామ భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ

భావం: గొప్ప ఐశ్వర్యంతో కూడిన రఘువంశమనే సముద్రాన్ని ఉప్పొంగింపజేసే చంద్రుని వంటి వాడవైన నీ పాదపద్మాలను వికసించిన్న కలువల చేత, సంపెంగ పూల మాలలతో, మాధర్యంతో కూడిన మాటలనే పువ్వుల చేత నీకు అర్చన చేస్తాను. నాయందు దయతో అంగీకరించు. సంసార సాగరం నుంచి ఉద్ధరించే తారకనామం కలవాడా! భద్రాచల వాసా! దశరధ తనయ! కరుణాసముద్రా! శ్రీ రామా! కరుణించి.

12
గురుతరమైన కావ్యరస గుంభనకబ్బుర మందిముష్కరుల్
సరసులమాడ్కి సంతసిల జాల రదెట్లు శశాంక చంద్రికాం
కురముల కిందు కాంతమణి కోటిస్రవించిన భంగివింధ్యభూ
ధరమున జాఱునే శిలలు దాశరథీ కరుణాపయోనిధీ.

భావం: రామా! దశరధ తనయా! కరుణాసందురా! చంద్రుని వెన్నలకు చంద్రకాంతి శిలలు కరిగి దర్విస్తాయే కాని విద్య పర్వతం శిలలు ద్రవిస్తాయా? అలాగే భగవత్ పరమైన గ్రంధములలోని కూర్పుని చూసి రసికులు సంతోషిస్తారే కానీ మూర్ఖులు ఆనందించలేరు.

రసికులు అంటే సారమును గ్రహించేవారు, భగవద్భక్తులు. నవరసాలని మనకు శాస్త్రంలో ఉన్నాయి. నాట్యం మొదలైన కళలలో వీటిని ప్రదర్శిస్తారు. ఒక్కో సమయంలో ఒక్కో రసాన్ని ప్రదర్శిస్తారు. రసాన్ని ప్రదర్శించడం వలన మానసికంగా ఈశ్వరునిలో లీనమై తాత్కాలికంగా ఆత్మానందాన్ని పొందుతారు. సాధనతో అదే నిరంతరం పొంది, క్రమంగా భగవంతునిలో ఐక్యమవుతారు. భారతీయ కళాలన్నీ రసాస్వాదన కొరకే. మన కళలో రసం ప్రధానం. రసం అంటే ప్రారంభ దశలో భావన అనుకున్నా, అది అనుభవించిన తర్వాత, అది భావనకు అతీతమైనదని అర్దమవుతుంది. ఆ స్థితి రావాలంటే భగవతత్త్వం అర్దమవ్వాలి. అప్పుడే రాసలీల అర్దమవుతుంది. అంతేకానీ రాసలీల అంటే శారీరిక సుఖాలను అనుభవించడం కాదు.

భగవతత్త్వం మూర్ఖులకేమి అర్దమవుతుంది? కాబట్టి వారు తెలియక విమర్శ చేస్తుంటారు.

13
తరణికులేశ నానుడుల దప్పులు గల్గిన నీదునామ స
ద్విరచితమైన కావ్యము పవిత్రముగాదె వియన్నదీజలం
బరగుచువంకయైన మలినాకృతి బాఱిన దన్మహత్వముం
దరమె గణింప నెవ్వరికి దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: ఓ ఆర్తజనబాంధవ! జనకాత్మజాధవా! దశరధతనయా! కరుణాసముద్రుడవైన శ్రీ రామా! నా మాటలలో తప్పులున్నా, నీ పేరుతో ఈ కావ్యాన్ని రాస్తున్నాను కనుక అది పవిత్రమే అవుతుంది. ఎలాగంటే గంగానది నీరు వంకరగా పారినా, మురికిగా మారినా, దాని గొప్పతనం, పవిత్రత ఎక్కడకుపోతుంది స్వామి.

14.
దారుణపాత కాబ్ధికి సదా బడబాగ్ని భవాకులార్తివి
స్తారదవానలార్చికి సుధారసవృష్టి దురంత దుర్మతా
చారభయంక రాటవికి జండకఠోరకుఠారధార నీ
తారకనామ మెన్నుకొన దాశరథీ కరుణాపయోనిధీ.

భావం: దశరధతనయా! కరుణాసముద్రుడవైన శ్రీ రామా! నీ శ్రీ రామ అనే పవిత్రనామం సంసార సముద్రాన్ని తరింపజేస్తుంది. ఆ తారకనామమే భయంకరమైన మహాపాతకాలనే సముద్రాన్ని సైతం బడబాగ్ని వలె అడుగంటిస్తుంది/ ఎండగొడుతుంది. నీ నామం మళ్ళీ పుట్టు మళ్ళీ చస్తూ పడే బాధలనే కార్చిచ్చులనే మటలను ఆర్పే అమృతరస వర్షం వంటిది. అంతుములేని దుష్టమతాల ఆచారాలనే భయంకరమైన అడవని నరికివేసే తీవ్రమైన, కఠినమైన గొడ్డలు యొక్క అంచు వంటిది. నీ తారకనామ మహిమను వర్ణించడం నా తరం కాదు.

15.
హరునకు నవ్విభీషణునక ద్రిజకుం దిరుమంత్ర రాజమై
కరికి సహల్యకుం ద్రుపదకన్యకు నార్తిహరించుచుట్టమై
పరగినయట్టి నీపతిత పావననామము జిహ్వపై నిరం
తరము నటింపజేయుమిక దాశరథీ కరుణాపయోనిధీ.

భావం: దశరధతనయా! కరుణాసముద్రుడవైన శ్రీ రామా! నీ పవిత్రనామము శివునికి, విభీషణునికి, పార్వతీదేవికి ఐశ్వర్యం కలిగించినది అయింది. గంజేంద్రునకు, ద్రౌపదికి, అహల్యకు ఆపద నుంచి రక్షించే బంధవుగా ప్రసిద్ధి చెందింది. పంచమహా పాతకాలు చేసినవారిని సైతం పవిత్రం చేసే నీ నామం నా నలుకపై ఎప్పుడూ నిలిచి ఉండేట్లు చేయమని నిన్ను ప్రార్ధిస్తున్నాను తండ్రీ!

16.
పరమదయానిధే పతితపావననామ హరే యటంచు సు
స్ధిరమతులై సదాభజన సేయు మహాత్ముల పాదధూళి నా
శిరమునదాల్తుమీరటకు జేరకుడంచు యముండు కింకరో
త్కరముల కాన బెట్టునట దాశరథీ కరుణాపయోనిధీ.

భావం: దశరధతనయా! కరుణాసముద్రుడవైన శ్రీ రామా! యమధర్మరాజు తన భటులను పిలిచి 'పరమదయానిధి! పాపాలను భస్మం చేసే నామం కలిగిన ఆ హరిని 'హరే్' అని స్థిరమైన భక్తితో నీయందే (రాముని యందే) మనసు నిలిపి నిరంతరం స్మరించే భాగవతోత్తముల పాదధూళి నా శిరస్సును ధరిస్తాను కనుక, మీరు అటువంటి వారి జోలికి వెళ్ళకండి సుమా!' అని ఆజ్ఞాపించాడు. (అటువంటి నీ నామస్మరణ మహత్యం తెలుసుకోవడం ఎవరి తరం రామా!)
యమభటులు రారు అంటే ఘోరమైన మరణం ఉండదని, దేహం విడిచి ఆత్మ వెళ్ళనని దుఃఖించక, మరణం సంభైంచగానే ఆ పరబ్రహ్మం అయిన ఆ రామునికి చెంతకే వెళ్ళిపోతుందని అర్దం.

17.
అజునకు తండ్రివయ్యు సనకాదులకున్ బరతత్త్వమయ్యుస
ద్ద్విజమునికోటికెల్లబర దేతవయ్యు దినేశవంశ భూ
భుజులకు మేటివయ్యుబరి పూర్ణుడవై వెలిగొందుపక్షిరా
డ్ధ్వజమిము బ్రస్తుతించెదను దాశరథీ కరుణాపయోనిధీ.

భావం: దశరధతనయా! కరుణాసముద్రుడవైన శ్రీ రామా! నీవు సృష్టికర్త అయిన బ్రహ్మదేవునకు తండ్రివి. సనకసనందనాది మహర్షులకు పరబ్రహ్మస్వరూపానివి. బ్రహ్మజ్ఞానసంపన్నులైన బ్రాహ్మణులకు, దివ్య ఋషులకు కులదేవతవు. సూర్యవంశ రాజులలో అధికుడవు. సమస్తమైన మంచి లక్షణాలు కలిగినవాడవై ప్రకాశించే ఓ గరుడ్వజా! నిన్ను తప్పక స్మరించు పొగుడుతాను.

18.
పండిత రక్షకుం డఖిల పాపవిమొచను డబ్జసంభవా
ఖండల పూజితుండు దశకంఠ విలుంఠన చండకాండకో
దండకళా ప్రవీణుడవు తావక కీర్తి వధూటి కిత్తుపూ
దండలు గాగ నా కవిత దాశరథీ కరుణాపయోనిధీ!

భావం: దశరధతనయా! కరుణాసముద్రుడవైన శ్రీ రామా! నీవు పండితులకు రక్షకుడవు. సమస్త జనులను వారి పాపాల నుంచి విముక్తులను చేయువాడవు. బ్రహ్మదేవుని చేత, దేవేంద్రుని చేత పూజింపబడినవాడవు. పదితలల రావణుడిని వాడియైన బాణాల చేత సంహరించి, ధనుర్విద్యలో నేర్పరివనే కీర్తిని పొందినవాడవు. అలాంటి నీ కీర్తి కాంతకు నాకున్న కవితా శక్తితో రచించిన పద్య కుసుమాలనే మాలను అర్పిస్తున్నాను. (నన్ను అనుగ్రహించు).

19.
శ్రీరమ సీతగాగ నిజసేవక బృందము వీరవైష్ణవా
చార జవంబుగాగ విరజానది గౌతమిగా వికుంఠ ము
న్నారయభద్ర శైలశిఖరాగ్రముగాగ వసించు చేతనో
ద్ధారకుడైన విష్ణుడవు దాశరథీ కరుణాపయోనిధీ.

భావం: దశరధతనయా! కరుణాసముద్రుడవైన శ్రీ రామా! సమస్త సిరిసంపదలను ఓసగే మహాలక్ష్మీ దేవియే భద్రాచలంలో సీతాదేవి. వైష్ణవ సంప్రదాయాన్ని అనుసరించి నీకు పూజ మొదలైన సేవలు చేసేవారే నీ సేవక సముదాయము. ఇక్కడ ప్రవహించే గోదావరి నదియే వైకుంఠంలో ప్రవహించే విరజానది. ఈ భద్రాచల శిఖరమే నీ వైకుంఠం. ఈ భద్రాచలంలో నివసించే నీవు సాక్షాత్తు శ్రీ మన్నారాయణుడవు. ఈ విధంగా విష్ణు స్వరూపుడైవైన నీవు ఈ లోకంలో ప్రజలను పాపముల నుంచి విముక్తి చేసి తరింపజేస్తావు. అలాంటి నువ్వు నన్ను కూడా ఉద్ధరించు స్వామి.

20.
కంటి నదీతటంబుబొడగంటిని భద్రనగాధివాసమున్
గంటి నిలాతనూజనురు కార్ముక మార్గణశంఖచక్రముల్
గంటిని మిమ్ము లక్ష్మణుని గంటి కృతార్ధుడ నైతి నో జగ
త్కంటక దైత్యనిర్ధళన దాశరథీ కరుణాపయోనిధీ!

భావం: దశరధతనయా! కరుణాసముద్రుడవైన శ్రీ రామా! గోదావరి నదీతీరాన్ని, ఆ నదిని ఒడ్డున ఉన్న భద్రాచలాన్ని సేవించి ఆనందించాను. నీ అర్ధాంగి అయిన సీతమ్మను, నువ్వు ధరించే ధనుర్బాణాలను, శంఖుచక్రాలు మొదలైన వాటిని చూసి సంతోషించాను. సర్వ సద్గుణాలను కలియక అయిన నిన్ను, నిన్ను విడువకుండా ఎప్పుడూ సేవ చేసిన నీ తమ్ముడు లక్ష్మణుడిని నా అదృష్ట వశమున చూసి పరవశించాను. జగత్తులో ప్రజలను హింసించే రాక్షసులను మట్టుబెట్టేవాడా! నన్ను పాలించు.

Monday 6 February 2017

కంచి పరమాచార్య స్వామి సూక్తి



If we spend money on ourselves or go seeking sensual pleasure, we do not obtain the same inner satisfaction. Work done for our own sake leads to disquiet and sorrow. We see our face in the mirror and note that there is no tilaka on our forehead. What happens if we apply a tilaka of dark unguent to the mirror[to the image]? It will be blackened. To apply a tilaka to the image means applying it to the one who is in front of the mirror. Doing things for ourselves[serving ourselves]is indeed like applying a dark spot to our mind- it is blackening ourselves. We take the image of the Paramatman reflected in the Maya mirror that is the mind to be ourselves. To bedeck the image in reality means adorning the Paramatman. This is the reason why serving humanity gives us a sense of fulfilment because humanity is a manifestation of the Paramatmam. Worshipping the Supreme Being the same. Only then will the black spot that we apply to ourselves will become an ornament. We decorate Amba to decorate ourselves. If we adorn ourselves we only enlarge our ego and feed our arrogance. When Amba is bedecked everybody will be happy about it. When we wear a well-laundered dupatta and preen ourselves, do others feel happy about it? They will speak scornfully of us: "See, how well-ironed he looks."

- Kanchi Paramacharya Swami

అనన్యశరణాగతి - భగవాన్ ఉపదేశం - శ్రీ రమణాశ్రమ లేఖలు

శరణాగతి
(6 వ భాగం)



10-4-1947
ఈ ఉదయం ఆంధ్ర యువకులొకరు శ్రీవారి కొక (భగవాన్ రమణ మహర్షి గారికి) జాబు వ్రాసి చేతికిచ్చారు. అందులో "స్వామి, భగవానుని యందు అనన్యశరణాగతి చెందితే, సర్వం లభిస్తుందటారు గదా. అనన్య శరణాగతి అంటే ఒక చోట స్థిరంగా కూర్చుని ఏ చింతలు లేకుండా శరీరపోషణ కావశ్యకమైన ఆహారాదుల చింత గూడా వదలి సదా భగవంతుని స్మరించుటేనా? వ్యాధిగ్రస్థుడనైతే, ఔషధసేవకై యత్నించక స్వస్థతాస్వస్థతలు భగవదధీనం చేయుటేనా? గీతలో స్థిరప్రజ్ఞుని గుఱించి "విహాయ కామాన్ యస్సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహః, నిర్మమో నిరహంకార స్స శాంతిమధిగచ్ఛతి" - 2-21 అనటం వల్ల, సమస్త కోరికలు త్యజించుటనిగదా తేలుతుంది. అందువల్ల, మనం భగవంతుని స్మరిస్తూ ఆహారపానీయాదులు భగవదాదేశమై ఆయాచితంగా లభిస్తే, స్వీకరించటమా? లేక, స్వల్పంగా యత్నించటమా? భగవాన్, ఈ శరణాగతి రహస్యం వివరించి అనుగ్రహించా"లని ఉన్నది.

భగవాన్ చూచి, సావధానులై సమీపస్థులతో "ఇదుగో, అనన్యశరణాగతి అంటే, ఏ చింతలు లేకుండా ఉండాలనటం సత్యమేగాని, దేహపోషణ కావశ్యకాలైన అన్నపానాదుల చింత గూడా వదలవలెనా అంటే ఏం చెప్పగలం. భగవదాదేశమై ఆయాచితంగా వస్తే తినవలెనా? కొద్ది ప్రయత్నం చేయవలెనా. అంటారే; దానంతటదే వస్తుందనుకో. మింగనైనా మింగాలా? అది మాత్రం యత్నంకాదూ? 'వ్యాధిగ్రస్థుడనైతే ఔషధం సేవించాలా? స్వస్థతాస్వస్థతలు భగదధీనం చేసి, ఊరుకోవాలా?' అంటారు. 'క్షుద్వ్యాధేః ఆహారం' అన్నఆరు. దీనికి రెండర్థాలున్నవి. క్షుత్తున్నూ, వ్యాధి వంటిదే గనుక క్షుత్తనే (క్షుత్తు= ఆకలి) వాధికి ఆహారమనే ఔషధ మవసరమనీ, వ్యాధికి ఔషధం వలే, ఆకలికి ఆహారం ఇవ్వాన్లనీ చెప్పారు. శంకరులు రాసిన సాధనా పంచకంలో "క్షుద్వ్యాధిశ్చ చికిత్స్యతాం ప్రతిదినం బిక్షౌషధం భుజ్యతాం" అని ఉన్నది. క్షుత్తనే వ్యాధ్కి భిక్షాన్నం తినమన్నారు. బిక్షకైనా పోవాలిగదా? అంతా కళ్ళు మూసుకుని కదలక కూర్చుని 'వస్తే తింటా'మంటే లోకయాత్ర నడిచేదెట్లా? అందువల్ల వారి వారి సంస్కారాన్ననుసరించి ప్రాప్తమైనది అనుభవిస్తూ కర్తృత్వ రాయిత్యంగా ఉందాలి. నేణు చేస్తున్నాననే భావనే బంధం. ఆ బంధం లేకుండా ఉండే విధానం యోచించి తెలుసుకోవాలిగాని, ఆకలికి ఆహారం, వ్యాధికి మందు ఇవ్వవచ్చునా? లేదా? అని శంకలు పెట్టుకుంటే, అంతులేకుండా శంకలు వస్తూనే ఉంటవి. ఊ అని మూల్గవచ్చునా? ఊపిరి పీల్చవచ్చునా? అన్న శంకగూడా బయలుదేరుతుంది. ఈశ్వరుడనుకో, కర్మనుకో, ఏదొ ఒక కర్త వారి వారి సంస్కారాన్ని బట్టి అన్నీ తానే నడుపుతాడు. భారం అతని మీద వేసి, బంధం లేకుండా ఉంటే నడిచేది తానే నడుస్తుంది. భూమి మీద నడుస్తూ ఉంటాం. అడుగడుక్కు కాలు ఎత్తాలి, నిలపాలి అని గమనిస్తామా, దానంతటది నడక సాగటం లేదూ? ఉచ్చ్వాస నిశ్వాసాలూ అంతే. క్షణక్షణం ఊపిరి పీల్చాలి, విడవాలి అని ప్రయత్నించటం లేదే. ఆ విధంగానే ఇదీను. ఏదైనా విడువాలంటే విడవగలమా? చేయాలంటే చేయగలమా. తెలిసీ తెలియక అప్రయత్నంగానే లోగడ ఎన్నో పనులు జరుగలేదా? ముందు జరుగవా? భగవానునందు అనన్యశరణాగతి చెందటమంటే, ఇంతర చింతలన్నీ వదిలి మనసు అతని యందే లగ్నం చేయాలి. ఎంతెంత మగ్నం చేస్తామో, అంతంతగా ఇంతర చింతలు దూరమౌతవి. మనోవాక్కాయ కర్మలన్నీ భగవత్పరంగా ఉంటే, మన కార్యభారం ఆయనమీదే ఉంటుంది. కృష్ణభగవాన్ అర్జునునితో-

అనన్యాశ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్

అన్నారు. అర్జునునకు యుద్ధం చేయవలసినపని ఉన్నది. అందువల్ల భారం నా మీద వేసి, పని చేయవోయ్, నీవు నిమిత్తమాత్రమే సుమా. అంతా నేనే చూచుకుంటాను, నిన్నేదో బాధించ"దన్నారు కృష్ణ భగవాన్. అయితే, ఈ అనన్య శరణాగతి చేయటానికి ముందు చేసేదెవరో తెలుసుకోవాలి. ఏ చింతనా లేకుంటే గాని, శరణాగతి కాదు. ఏ చింతనా లేనప్పుడు ఉండేది తానే గదా? తనకు తానే శరణాగతి చెందగలడన్నమాట. భక్తిపరమైతే, భగవానునందే భారం వేసి, తన కర్మ సాగిస్తుంటే, క్రమంగా తానెవరో తనకే బోధపడుతుంది. ఏదైనా ఫలితం ఒకటే. శరణాగతి అంటే తన్ను విచారించి తెలుసుకుని, తాను తానుగ నిలుచుటే; తన్ను విడిచి అన్యం ఏమున్నది?" అన్నారు భగవాన్.

"అది తెల్సుకునే మార్గమో?" అన్నాడా యువకుడు. "గీతలో ఎన్నో మార్గాలు చెప్పారు. ధ్యానం చేయమన్నారు. దానికి శక్తి లేదూ, భక్తి, కాకుంటే యోగం, నిష్కామ కర్మ, ఇంకా ఎన్నో చెప్పారు. ఏదొ ఒక మార్గాన్ననుసరించి పోవాలి. తానెప్పుడూ ఉండేవాడేకదా? సంస్కారాన్ననుసరించి పనులు వాటంతటవే జరుగుతుంటవి. చేసేది నేననే భావనే బంధం. విచారణవల్ల దాన్ని పొగొట్టుకుంటే ఈ ప్రశ్నలే రావు. కళ్ళు మూస్కుని కూర్చున్నతనే #శరణాగతి కాదు. అంతా అదే విధంగా కూర్చుకుంటే లోకయాత్ర సాగేదెట్లా?" అని భగవాన్ అంటూ ఉండగా, భోజనశాలలో గంట మ్రోగింది. "అదుగోనయ్యా గంట, లేచిపోవద్దూ?" అని నవ్వుతూ లేచారు భగవాన్.

మూలం - శ్రీ రమణాశ్రమ లేఖలు; సూరి నాగమ్మ.

(ఇంకా ఉంది)

Sunday 5 February 2017

సద్గురు శివానంద మూర్తి గారు సూక్తి



Surrendering one′s own liberties and independence at the feet is real surrender.

- Satguru Sivananda Murthy Garu

హిందూ ధర్మం - 236 (గ్రీకు సాహిత్యంలో వైదిక ధర్మం)



గ్రీకు పండితుడు సెక్యులస్ అంటాడు, 'పోలిబ్రోత (పాటలిపుత్ర, ఈనాటి పాట్నా) నగరం శాండ్రకోటస్‌కు (చంద్రగుప్త మౌర్యునికి గ్రీకులు పెట్టిన పేరు) 138 తరాల ముందు హెర్కులస్ (శ్రీ కృష్ణుడు) స్థాపించాడు'. దీనిని అనుసరించి కృష్ణుడు క్రీస్తు పూర్వం 3300 కాలమానికి చెందినవాడని గ్రహించవచ్చు.

కృష్ణుడి జీవితంలో జరిగిన సంఘటనలనే గ్రీకులు తీసుకుని, తమకు అనుగుణంగా కధలు రాసుకున్నారు. అందులో కొన్ని;
కృష్ణుడు కాళీయ మర్దనం చేసి, కాళింగుడనే సర్పం యొక్క అహంకారాన్ని అణిచివేస్తాడు. దాన్ని చంపకుండా వదిలేసి, యమునను విడిచి వెళ్ళమని ఆజ్ఞాపిస్తాడు. అలగే హెర్కులస్ కూడా హైడ్రా అనే సర్పాన్ని చంపకుండా, దాని నెత్తి మీద పెద్ద బండరాయిని పెడతాడు.

కృష్ణుడు పక్షి రూపంలో వచ్చిన బకాసురిని చంపుతాడు. హెర్కులస్ కూడా రాకాసి పక్షులను మట్టుపెడతాడు.
కృష్ణుడు అరిష్టాసురుడనే ఎద్దును వధిస్తాడు, హెర్కులస్ క్రెటన్ అనే ఎద్దును వధిస్తాడు.
రాక్షసుడు కేశి అనే పేరుతో గుఱ్ఱం రూపంలో రాగా, దాన్ని మట్టు పెడతాడు కృష్ణ పరమాత్ముడు. హెర్కులస్ జీవితంలో కూడా ఈ ఘటన చూపిస్తారు.

కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి పట్టుకుని గోవులను, గోపాలకులను, వారి పరివారాలను రక్షిస్తాడు. దీన్నే గ్రీకులు హెర్కులస్ భూమిని మోసినట్లుగా చూపించారు.

దేవకీ దేవి 8 వ గర్భంలో జన్మించే పిల్లవాడు తనకు మృత్యువని, అతడి పట్ల శత్రుత్వం పెంచుకుంటాడు మేనమామ అయిన కంసుడు. కృష్ణుడిని చంపటానికి ఎంతో మంది రాక్షసులను పంపుతాడు. పిల్లలకు విషమున్న పాలిచ్చి చంపమని పూతనను పంపుతాడు. సరిగ్గా అటువంటిదే హెర్కులస్ జీవితంలో కూడా జరుగుతుంది. అతడి సవతి తల్లి హీరా, అతడిని చంపమని రెండు విష సర్పాలను పంపుతుంది.

ఇలా గ్రీకుల నోట సనాతన సంస్కృతికి చెందిన విషయాలు ఆ కాలంలోనే పశ్చిమాన వినిపించాయి. అయితే ఇవన్నీ చూపి, మనమే గ్రీకుల నుంచి అన్నీ కాపీ కొట్టామని, మనవన్నీ కల్పితాలని, మనకంటూ ఏదీ లేదని మన దేశపు కుహనా- మేధావులు, మతమార్పిడి వెధవులు చెప్తారు. కధలను కాపీ కొట్టామని వారు వాదించవచ్చు, కానీ కృష్ణుడు ఏలైన ద్వారక ఈ నాటికి భారతదేశంలో పశ్చిమాన ఉన్న గుజరాత తీరంలో, అరేబియా సాగర గర్భంలో ఉన్నది. దాని మీద పురావస్తు పరిశోధనలు కూడా జరుగుతున్నాయి. దేశవిదేశాల్లో ఉన్న ఎందరో శాస్త్రవేత్తలు ఆసక్తిగా చూస్తున్నారు. మరి ఆ ద్వారకను కూడా కాపీ కొట్టామంటారా ఈ మేధావులు? మనమే ఓ నగరం కట్టి సముద్రంలో ముంచేశామని చెప్పుకొస్తారా? మన దేశంలో పరీక్షిత్తు మహారాజు జరిపిన సర్పయాగానికి సంబంధించి దొరికిన ఆనవాళ్ళు, ఇతర రాజులు వేసిన తామ్ర శాసనాలు ఆకాశం నుంచు ఊడిపడ్డాయని చెప్తారా? (ఈ శాసనాల గురించి, ద్వారక గురించి ఇదే శీర్షికన 138 నుంచి వరుసగా 142 వరకు ప్రచురించడం జరిగింది. అది చూడగలరు.)

క్రీ.పూ. 190-188 మధ్య అగాతోక్లస్ ఆఫ్ఘనిస్థాన్ లో  అనే ప్రాంతాన్ని పాలించాడు. అతడు చతురస్ర, దీర్ఘ చతురస్రాకారంలో ఉండే కొన్ని బంగారు, వెండి, కంచు నాణేలను ముంద్రించాడు. వాటిపై శివ, విష్ణు, బలరామ, బుద్ధుడి ముద్రలు ఉన్నాయి. వీటి మీద బ్రాహ్మీ లిపిలో ఇవి రాజు అగాతోక్లయసకు చెందినవని ఉంది. 180 కాలానికి చెందిన డేటింగ్ లో నిర్ధారించబడిన చత్రురస్రాకార నాణేలు ఈ మధ్యే ఆఫ్ఘనిస్తాన్ తవ్వకాల్లో బయటపడ్డాయి. అందులో ఒకవైపు బలరాముడు, ఇంకో వైపు కృష్ణుడు ముద్రించబడి ఉన్నారు. దీన్ని బట్టి అంతకు పూర్వమే ఇరాక్, ఆఫ్ఘనిస్థాన్‌లలో కృష్ణుడి ఆరాధన ఉండేదని తెలుస్తున్నది.

గ్రీకు రాయబారి హెలియోడొర్స్‌కు కృష్ణుడంటే చాలా ఇష్టమట. అందుకే ఆయన గరుడ ద్వజాలు పాతించాడు. అందులో తనకు కృష్ణుడంటే ఇష్టమని, తాను భగవతుడినని, సనాతన ధర్మాన్ని అవలంభిస్తున్నానని, భాగభద్రుడు ఆస్థానికి వచ్చానని శాసనం వేయించుకున్నాడు. అది క్రీ.పూ.113 కు చెందినది. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఉంది.

చంద్రగుప్త మౌర్యుడు ఆశోకుని తాత. ఆయన ఒక యుద్ధంలో గ్రీకు పాలకుడైన సెక్యులస్‌ను ఓడించాడు. ఆ తర్వాత సెక్యులస్ కుమార్తెను వివాహం చేసుకున్నాడు. దీనివలన భారతదేశం యొక్క ప్రభావం అతిదూరాన ఉన్న గ్రీకుపై కూడా బలంగా పడింది.

భారత్, గ్రీకు నుంచి ఏమీ తీసుకోలేదని, గ్రీకుకే జ్ఞానదానం చేసిందని చెప్పడానికి ఇలా చరిత్రలో ఎన్నో సాక్ష్యాలు తారపడతాయి.

To be continued ........

Source: http://experiencehinduism.com/interesting-stories/heracles-derived-from-krishna

Saturday 4 February 2017

ప్రతిపక్ష భావన- స్వామి శివానంద సూక్తి



Now think strongly of the opposite thoughts, the opposite of gloom. Think of those things that elevate your mind; think of cheerfulness. Imagine the advantage of cheerfulness. Feel that you are in actual possession of this quality.

Again and again repeat the formula: OM CHEERFULNESS, mentally. Feel, “I am very cheerful.” Begin to smile and laugh several times. Sing: sometimes this can elevate you quickly. Singing is very beneficial to drive off gloom. Chant OM loudly several times. Run in the open air. The depression will vanish soon.

- Swami Sivananda

Friday 3 February 2017

నిజమైన ప్రేమ మరియు సేవ- స్వామి సచ్చిదానంద భోద



Real Love and Service

Real love and service are one-sided; you just give for the joy of giving. There is no expectation whatsoever, so you never get into any troubles. The scriptures say, ‘Do the work that comes to you—but don’t look for the results. Don’t be motivated by the fruits of your actions.’

- Swami Satchidananda

శ్రీ శివప్రోక్తం శ్రీ సూర్యాష్టకం



సాక్షాత్తు శివునిచే చేయబడిన సూర్యాష్టకం ఇది. ఈ రోజు చదివి, సూర్యనారాయణ స్వామి అనుగ్రహం పొందుదాం.

ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మభాస్కర
దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే

సప్తాశ్వ రధ మారూఢం ప్రచండం కశ్యపాత్మజం
శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం

లోహితం రధమారూఢం సర్వ లోక పితామహం
మహాపాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం

త్రైగుణ్యం చ మహాశూరం బ్రహ్మ విష్ణు మహేశ్వరం
మహా పాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం

బృంహితం తేజసాం పుంజం వాయు మాకాశ మేవచ
ప్రభుంచ సర్వ లోకానాం తం సూర్యం ప్రణమామ్యహం

బంధూక పుష్ప సంకాశం హార కుండల భూషితం
ఏక చక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం

విశ్వేశం విశ్వ కర్తారం మహా తేజః ప్రదీపనం
మహా పాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం

తం సూర్యం జగతాం నాధం జ్నాన విజ్నాన మోక్షదం
మహా పాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం

సూర్యాష్టకం పఠేన్నిత్యం గ్రహపీడా ప్రణాశనం
అపుత్రో లభతే పుత్రం దరిద్రో ధనవాన్ భవేత్

ఆమిషం మధుపానం చ యః కరోతి రవేర్ధినే
సప్త జన్మ భవేద్రోగీ జన్మ కర్మ దరిద్రతా

స్త్రీ తైల మధు మాంసాని హస్త్యజేత్తు రవేర్ధినే
న వ్యాధి శోక దారిద్ర్యం సూర్య లోకం స గచ్ఛతి

ఇతి శ్రీ శివప్రోక్తం శ్రీ సూర్యాష్టకం సంపూర్ణం

Thursday 2 February 2017

భగవాన్ రమణ మహర్షి సూక్తి



If you would only fix your gaze upon me, you would know that, established in the Heart, my gaze is ever fixed upon you.

- Bhagavan Ramana Maharshi

శరణాగతి (3 వ భాగం)



శరణాగతి చేయడానికి ఒక విధానమంటూ లేదు, ఒక ప్రత్యేక సమయం కూడా లేదు. అది spontaneous గా, ఆ క్షణంలో కలిగే భావన. పరిస్థితులే ఆ స్థితికి తీసుకెళతాయని చెప్పేకంటే ఈశ్వరుడే అలాంటి సందర్భాన్ని కలిగిస్తాడని చెప్పడం సమంజసంగా ఉంటుంది.. నేను ఫలాన రోజు, ఫలాన సమయాన భగవంతునికి శరణాగతి చేస్తానని అనుకుంటే జరిగేది కాదు. శరాణగతి చేస్తున్నానని చెప్పడానికి ఒక భాష లేదు, స్తోత్రం లేదు. భగవాన్ రమణులు అంటారు శరణాగతి మౌఖికం కాదు, షరతులతో చేసేది కాదు (Surrender is non-verbal and unconditional). అది ఆ సమయంలో, ఇంకా చెప్పాలంటే ఆ క్షణంలో, కలిగే భావన. ఆ మరుక్షణం నుంచి నీదంటూ ఏదీ ఉండదు. ఎందుకంటే శరణాగతి అంటే సర్వం భగవంతునికి సమర్పించడమే. ఆయన ఇచ్చింది ప్రసాదంగా స్వీకరించడమే. జరిగిన, జరుగుతున్న, జరగబోయే ప్రతీదాన్ని బేషరతుగా (unconditional), ఆనందంగా దైవప్రసాదంగా స్వీకరించడమే.

శరణాగతి అంటే అహాన్ని ఈశ్వరుని పాదాల వద్ద త్యజించడం. అహాన్ని వదిలేస్తే, అన్నీ అవే వదిలిపోతాయి. అప్పుడు నేను చేస్తున్నాను అనే భావన ఉండదు, నాది అని ఉండదు, నేను అంతవాడిని, ఇంతవాడిని అనుకోవడం ఉంది. అవమానమైన, సన్మానమైనా ఈశ్వర ప్రసాదమే. ఆనందమైనా, విచారమైనా ఈశ్వరానుగ్రహమే. ఇతరులలో దోషాలు ఎంచడం ఉండదు. ఎవరు ఎలా ఉన్నా, అదంతా ఈశ్వరుడి లీలయే. అందరిని అంగీకరిస్తాడు. ఇకప్పుడు కోపతాపాలకు తావు ఉండదు. అంతా ఆయనకే అర్పించాకా, మన యోగక్షేమాల గురించి మనమెందుకు చింతించాలి? అందువల్ల శరణాగతి చేశాక, కోరికలు కోరడం ఆగిపోతుంది. ఇతరులు అలా ఉన్నారు, ఇలా ఉన్నారని ఈశ్వరుని ఫిర్యాదులు చేయవు, మనసులో కూడా అనుకోవు. నీకు నచ్చనట్టు జరగకున్నా, ఈశ్వరుడిదే భారం కనుక అన్నీ యథాతధంగా, రెండవ మాట లేకుండా, ఆనందంగా అంగీకరిస్తావు.

అందుకే గురుదేవులు సద్గురు శివానంద మూర్తిగారు అంటారు- శరణాగతి అంటే పరిణామం యొక్క విజయం, కర్మ యొక్క ఫలం, మరియు కర్మ వెనుకనున్న ఉద్దేశ్యం వంటివన్నీ ఆయనవే అని అర్దం చేసుకుని, విశ్వసించడం. నువ్వు శరణాగతి చేస్తే, అడగడం ఆగిపోతుంది, ఫిర్యాదులు నిలిచిపోతాయి. ప్రతీది ఆయన ప్రసాదంగానే స్వీకరిస్తావు; ఏది జరిగినా ఈశ్వరేచ్ఛ ప్రకారం, నీ గురువు అనుమతితోనే జరిగిందని గ్రహించి, స్వీకరించు. అదే శరణాగతి. జ్ఞానానికి అదే పాస్‌పోర్టు.

Surrender is understanding and believing that the success of the result, the result of the action and the intention of the action are all ‘His’. If you have surrendered, asking stops. Complaints cease. Every thing is accepted as his ‘Prasadam’.

Know and accept that whatever happens is according to the will of God and with the permission of your Guru. This is surrender; this is the passport to Jnana.

(ఇంకా ఉంది)

Wednesday 1 February 2017

ధ్యానం గురించి స్వామి చిన్మయానంద సూక్తి





All our experiences, joys, sorrows, successes and failures, pains and pleasures, honor and dishonor, are His prasada: Let us accept them all in humbleness and gratitude. If we orient our life's plans on this essentially divine basis, we need not sit for meditation- all life will become one meditation.

- Swami Chinmayananda


శరణాగతి (2 వ భాగం)



భగవంతుడికి అన్నీ తెలుసు. ఆయన సర్వజ్ఞుడు. ఆయన ఎప్పుడూ మంచి మాత్రమే చేస్తాడు. ఎవ్వరికీ అపకారం చేయడు అనే భావన కలిగి ఉన్నప్పుడు, నాకు ఏది మంచిదో కూడా ఆయనకే తెలుసు. నేను అనవసరంగా అది అని, ఇది అని బాధపడేకంటే, ఆయన మీద భారం వేసి, ఆందోళన చెందకుండా, ఆయన ఏది ఇస్తే, అది ప్రసాదంగా స్వీకరిస్తాను అని బలమైన విశ్వాసంతో ఉండడమే శరణాగతి.

నువ్వు నమ్మింది జరుగుతుంది అని కాదు. నీవు నమ్మింది జరిగినా, జరగకున్నా, జరిగింది నీకు ప్రస్తుతానికి మంచిది అనిపించకున్నా, భగవంతుడు మంచి మాత్రమే చేస్తాడు అని భావన కలిగి ఉండటమే విశ్వాసం అని అంటారు ఛాయ అధర్వణ వేద పండితులు శ్రీధర్ గురూజీ.

భగవద్గీత ఆప్తవాక్యం. భగవానుడు ప్రేమతో కలియుగంలో మానవుల కోసం ఎన్నో విషయాలను అందులో చెప్పాడని అన్నారు సద్గురు శివానంద మూర్తి గారు. అందులో భగవానుడు ఎన్నో ప్రమాణాలను చేశాడు. నామే భక్తః ప్రణశ్యతి (భగవద్గీత 9-31) అన్నాడు. నన్ను నమ్మినవాడు ఎన్నటికీ నశించడు. అతడు అధర్మవర్తనుడైనా, నన్ను నమ్మాడు కనుక క్రమంగా ధర్మవర్తనుడై, శాశ్వతమైన శాంతిని పొందుతాడని చెప్పాడు. అతడిని ఉద్దరించడం నా కర్తవ్యం అని కూడా స్పష్టం చేశాడు.

అంతేనా 18 వ అధ్యాయంలో
సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ ! 
అహం త్వా సర్వపాపేభ్యోమోక్షయిష్యామి మా శుచః !! 66

భావం - అన్ని ధర్మాలను విడిచిపెట్టు, నన్ను మాత్రమే శరణు వేడు. నేను నిన్ను అన్ని పాపాల నుంచి విముక్తుడిని చేసి, మోక్షం ప్రసాదిస్తాను.

అన్ని ధర్మాలను విడిచిపెట్టడమంటే బాహ్యంలో కాదు. భార్యా/ భర్తని, పిల్లల్ని చూసుకోవాలి, ఉద్యోగం కూడా చేయాలి. ఇతరమైన ప్రయత్నాలన్నీ విడిచి నన్ను మాత్రమే శరణు వేడు అంటున్నాడు. అంటే మనసులో చీకుచింతలు వదిలెయ్, భవిష్యత్తు గురించి ఆందోళన పడకు; గతంలో పాపాలు చేశానంటావా? గతం గడిచిపోయింది, ఇప్పుడు బాధపడి వ్యర్ధం, ఇకముందు మళ్ళీ ఆ తప్పులు చేయకు. జరిగిపోయిన దాని గురించి కూడా బాధపడకుండా వర్తమానంలో నా మీద మనసు నిలిపి ఉంచు. నీకు మోక్షం నేను ఇస్తాను అన్నాడు.

9 వ అధ్యాయంలో ఏమన్నాడో చూడండి.

అనన్యాశ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే 
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్ - 22

ఎవరైతే వెరొక ఆలోచన లేకుండా నా యందే మనసు నిలిపి, నాకు దగ్గరగా (మానసికంగా) ఉంటారో, అటువంటి వారి యోగక్షేమాలను 'వ్యక్తిగతంగా' నేను వహిస్తాను.

వేరే ఇతర చింతలు (ఆలోచనలు) వద్దు. నా మీద విశ్వాసం కలిగియుండు. ఎల్లప్పుడు నన్నే మనసులో నిలుపుకో. నీ యోగక్షేమాల బాధ్యత నాది అన్నాడు. ఇవన్నీ ఆయన చేసిన శపథాలు. నా మీద భారం వేయవయ్యా! నీ భారం నేను మోస్తాను అని ఆయన అభయం ఇస్తున్నప్పుడు, మనం దేనికి భయపడాలి? ఎందుకు భయపడాలి? భయపడితే మనకు ఆయన మీద ఉన్నది విశ్వాసం కాదు, అవిశ్వాసం.

ఆయన గీతలో కూడా చెప్పింది శరణాగతియే.

(ఇంకా ఉంది)