Wednesday 29 November 2017

స్వామి కృష్ణానంద సూక్తి



It is said that when the devotee takes one stop towards the Lord, he is greeted by the Lord with a hundred steps. The Bhakti Sastras state that the love of God for the devotee is more than man’s love for God. The power of the Whole is more intense than the force of the part.

- Swami Krishnananda

Tuesday 28 November 2017

స్వామి చిదానంద సూక్తి



Do not think “What will someone else do for me", but always think "What can I do for others? In what way can I make myself a source of benefit, happiness and help to others?". Happiness comes to him who gives happiness to others.
~ Sri Swami Chidananda

Saturday 25 November 2017

స్వామి శివానంద సూక్తి



All habits originate from the subconscious plane. Subconscious life is more powerful than your ordinary life of objective consciousness. Through the practice of Yoga you can modify, control and influence the subconscious depths. Take one evil trait. Meditate on its opposite virtue every morning. Practice it during the day. The evil quality will vanish soon. Meditate on mercy in the morning and practice it during the day. You will soon develop mercy.

- Swami Sivananda

Thursday 23 November 2017

శారదా మాత సూక్తి



Don't be afraid. Human birth is full of suffering and one has to endure everything patiently, taking the Name of God. None, not even God in human form can escape the sufferings of the body and mind.
- Sarada Devi

GOING BACK AND SET RIGHT THINGS IN OUR LIFE...



SUM ONE SAID....GURUJI HOW NICE IT WOULD BE IF WE CAN GO BACK AND SET RIGHT THINGS IN OUR LIFE...
I SAID...YEAH...IT WOULD HAVE BEEN STILL MORE NICE HAD THE BOOK OF LIFE BEEN WRITTEN WITH PENCIL...THERE R A FEW PAGES WHICH I TOO WOULD LIKE TO ERASE.. 

శ్రీ రామకృష్ణ పరమహంస సూక్తి


The supreme purpose and goal for human life... is to cultivate love.
- Sri Ramakrishna Paramahamsa

Tuesday 21 November 2017

ఓషో సూక్తి



If you love a person, you will not interfere his personal life. You would not dare to break the boundaries of his inner world.

- Osho

Sunday 19 November 2017

సద్గురు శివానందమూర్తి గారి సూక్తి


A religion has its culmination only in spirituality. That spirituality is a conscious activity. It is a sub conscious activity. It starts at the mental level enters into subconscious and ends up at the point of soul searching the ultimate goal.

- Satguru Sivananda Murthy Garu

Saturday 18 November 2017

స్వామి శివానంద సూక్తి



Every thought must be constructive and noble. Thoughts are only refractions. Slay all thoughts. Go thou within to the Light of lights. If you wish to attain Self-realization, imagination and speculation must stop. Purify and control the emotions. Beneath your conscious life, there is a very wide region of subconscious life.

- Swami Sivananda

Friday 17 November 2017

స్వామి సచ్చిదానంద సూక్తి



You will enjoy the world when you know how to handle it well, when you become the master of it. Who is the person who enjoys eating? The one who eats well, chews well, digests well, and assimilates well—not the one who eats for the sake of the tongue, overloads the stomach, and then use purgatives. So learn how to live a balanced life and you will enjoy the world.

- Swami Satchidananda

Thursday 16 November 2017

శ్రీ అరోబిందో సూక్తి


Life is life--whether in a cat, or dog or man. There is no difference there between a cat or a man. The idea of difference is a human conception for man's own advantage.

- Sri Aurobindo

Wednesday 15 November 2017

Tuesday 14 November 2017

ఆనందమయి మా సూక్తి



God Himself is revealed in some guise even in individuals supposed to be sinners, as also in Suffering seemingly unbearable.

- Sri Anandamayi Ma

Sunday 12 November 2017

సద్గురు శివానంద మూర్తి గారి సూక్తి



In Spirituality, dependence only is safe. To whom and where is the independence? Can one look after one′s own safety? That is why keeping it in someone else′s hand is safe.

- Satguru Sivananda Murthy Garu

హిందూ ధర్మం - 254 (సృష్టి - మతాల మధ్య వ్యత్యాసాలు)

అట్లాగే ఈ ఆడాం- ఈవ్ కథను గమనిస్తే, గాడ్ మొదట ఇద్దరినే సృష్టించాడని ఉంటుంది, కానీ మన ధర్మం ప్రకారం సృష్ట్యాదిలోనే అనేకమంది స్త్రీపురుషులు ఉద్భవించారు, వాళ్ళంతా పరమపుణ్యాత్ములు- ఋషులు, ఋషిపత్నులు. 

ఇద్దరు వ్యక్తుల నుంచి పుట్టిన సంతతి మధ్య సోదరసోదరి బంధం ఉంటుంది. అందుకే ఆ మతాలు ఈ కోణం నుంచే సర్వమానవ సౌభాతృత్వం గురించి చెప్తాయి. అంటే ప్రపంచంలోని మానవులంతా ఒకే తల్లిదండ్రుల నుంచి పుట్టారు కనుక అందరు అన్నదమ్ములు, అక్కచెళ్ళెల్లు అంటాయి. కానీ అందులో కూడా బైబిల్ కొందరిని యెహోవా కు ప్రియమన వారికి, కొన్ని జాతులను బానిసలుగా వర్గీకరిస్తుంది. అబ్రహం మతాలన్నీ ఈ అంశం బోధించిన, అవిశ్వాసులను (అనగా అన్యమతస్థులు) వారితో మతస్థులతో సమానంగా అంగీకరించవు. వారికి నరకం ప్రాప్తిస్తుందని నిర్ణయం చేశాయి. సనాతన ధర్మంలో సర్వమానవ మాత్రమే కాదు, సర్వజీవ సౌభాతృత్వం, ఆత్మవత్ సర్వభూతేషు గురించి బోధిస్తుంది, ఇంకో అడుగు ముందుకేసి, అందరిలో అంతర్యామిగా ఉన్నది ఒకటే తత్త్వం, భౌతికమైన రూపాలు వేరైనా, సారం ఒకటే. అంతా ఒకటే, ఏ బేధం లేదని వివరిస్తుంది. సమదృష్టి లభించేవరకు మోక్షం సిద్ధించదని చెబుతుంది. సత్కర్మ చేసేవారు నాస్తికులైనా, వారు స్వర్గానికి  వెళతారని, పాపకర్మ చేసేవారు ఆస్తీకులైనా వారికి నరకం తప్పదని వివరిస్తుంది. అన్యమతాలు స్వర్గనరకాల వరకే ఆగిపోతే, సనాతన ధర్మం స్వర్గనరకాలకు అతీతమైన పరపదం గురించి మాట్లాడుతుంది. వారికి సృష్టి కారకుడైన గాడ్, దీనికి దూరంగా స్వర్గంలో ఉంటాడు. (ఈ సృష్టి ఎంతవరకు ఉందని నేటి సైన్స్ ను అడిగితే, అది ఇంకా సమాధానం కొసం వెతుకుతూనే ఉంది. అంటే ఆయన దీనికి ఎంతో దూరంలో ఎక్కడో ఉన్నాడని వాళ్ళ నమ్మకం) హిందూధర్మంలో సృష్టికారకుడైన భగవానుడే ఈ సృష్టి రూపంలో వ్యక్తమవుతున్నాడని, ఆయనే సృష్టి అని, అందులో జీవరాశి అని, ఆయన వ్యాపించి లేని చోటు లేదని వివరిస్తుంది. 

ఆడాము- ఈవ్ చేసిన పాపం కారణంగా మానవజాతి పుట్టింది కనుక మానవులంతా పాపులని ఆ మతాల తీర్మానం. కానీ వారికి పుణ్యం అనే మాట లేదు. పుణ్యం చేయడమన్నది ఉండదు. సనాతనధర్మం విషయానికి వస్తే, మొదట ఉద్భవించిన స్త్రీపురుషులంతా ఇంతకుపూర్వం కల్పాల్లో ఎంతో పుణ్యం చేసుకున్నారు. అందుకే వారికి ఈ కల్పంలో మొదటిగా జన్మించే అవకాశం లభించింది. వారికి పుట్టిన సంతానం కూడా పుణ్యాత్ములే అవుతారు. అందుకే మనకు పుణ్యం కొద్ది పురుషుడు, ఫలం కొద్ది పిల్లలు అనే నానుడి కూడా వాడుకలో ఉంది. అక్కడ పాపం చేస్తే పిల్లలు పుడతారు, ఇక్కడ పుణ్యం చేస్తే పుడతారు. సనాతనధర్మంలో- జీవుడు సహజగుణమైన దైవత్వాన్ని తెలుసుకోకుండా ఏది అడ్డుపడుతోందో అది పాపం. కానీ హైందవేతర మాతల్లో అలా కాదు, అది ఎవరో చేసిన పని వలన సమస్త మానవజాతికి సంక్రమించిన శాపం.కాబట్టి హైందవులు చెప్పే పాపం, క్రైస్తవ మరియు మహమ్మదీయులు చెప్పే పాపం ఒక్కటి కాదు. అవి తత్త్వతః వేర్వేరు. ఏ మాత్రం వాటి మధ్య పోలిక లేదు. కాబట్టి పైపైన పదాలు పట్టుకుని, అన్ని మతాలు ఒక్కటేనని తేల్చడం మూర్ఖపు చర్య అవుతుందే కానీ ఎంతమాత్రం వివేకవంతుల లక్షణం కాదు. మనకు వారికి మధ్య వ్యత్యాసాలను ప్రస్పుటంగా వెళ్ళడిస్తూనే, మనం అన్ని మతాలను గౌరవించాలి, అది పరస్పర గౌరవంతో కూడినది ఉండాలి. వాళ్ళేమీ చేసిన మనం గౌరవిస్తూనే ఉంటాము అని చెప్పడం కాదు, గౌరవం వారు ఇస్తేనే, మనం తిరిగి ఇచ్చే విధంగా ఉండాలి. అప్పుడే సామరస్యం ఉంటుంది. 

సైన్సు ప్రకారం ఒకే మాతృగర్భంలో నుంచి పుట్టిన వారి డిఎన్ఏ ఒకే రకంగా ఉంటుంది. ఒకే విధమైన డిఎన్ఏ ఉన్నవారు వివాహం చేసుకుంటే, పుట్టేవాళ్ళందరూ అంగవైకల్యంతో పుడతారు, కొన్ని తరాల తర్వాత సంతతి కలగదు లేదా వైకల్యాలు తీవ్రమవుతాయి. అందుకే భారతీయ సంప్రదాయంలో సోదరీసోదరుల మధ్య, అలాగే మేనరికపు వివాహాలు కూడా నిషిద్ధం. ఇట్లాంటి చర్యల వల్ల డిఎన్ఏ చెడిపోతుందని, అంగవైకల్యం, మానసిక వైకల్యం ఏర్పడతాయని ఆధునిక శాస్త్రవేత్తలు కూడా అంగీకరించారు. ఇక విషయంలోకి వస్తే, మనమంతా ఋషుల సంతానమే. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, మాల, మాదిగ, గిరిజన అనే బేధం లేదు, చివరకు మతబేధం కూడా లేదు. అందరూ ఋషులసంతానమే. అందరు పుణ్యాత్ములే. అందుకనే ఋషులు మానవజాతిని ఉద్దేశ్యించి చెప్తూ, శృణ్వంతు విశ్వే అమృతస్య పుత్రాః - వినండి ఓ అమృతపుత్రులారా! అంటారు. పుట్టిన ప్రతి వాడు పరమాత్మ ప్రతిరూపమే అంటుంది హైందవ ధర్మశాస్త్రం. 

దీని గురించి స్వామి వివేకానందా విశ్వమత మహాసభలో మాట్లాడుతూ, "దివ్యలోక నివాసులైన ఓ అమృతపుత్రులారా, ఆలకించండి: అజ్ఞానంధకారానికి ఆవల ప్రకాశించే పరమ పురుషుణ్ణి కనుగొన్నాను. అతణ్ణి కనుగొనటంవల్ల మీరు మృత్యువు నుంచి తరిస్తారు. వేరే మార్గంలేదు. అమృతపుత్రులు - ఆహా! ఏం మధురవాక్కు! ఏం ఆశాజనకదివ్య నామం! సోదరులారా, ఈ పేరులో - అమృతపుత్రులనే పేరులో - మిమ్మల్ని పిలువనివ్వండి - నిజంగా హైందవులు మిమ్మల్ని పాపులనటానికి నిరాకరిస్తారు. మీరు భగవంతుడి బిడ్డలు, అమృతసంతానం, పావనులు, పరిపూర్ణులు. మీరు భూదేవతలు. - పాపులా? మానవుణ్ణి పాపి అనటమే మహాపాతకం. మానవస్వభావానికి అపకీర్తి, దూషణం. ఓ సింహాల్లారా, బయలుదేరండి, గొర్రలమని భ్రాంతి విడనాడండి. మీరు అమృతజీవులు, ముక్తాత్మలు, శాశ్వాతనందమయులు. జడప్రకృతి కాదు మీరు. శరీరులు కారు; ప్రకృతి మీ దాసురాలు; అంతేకాని ప్రకృతికి మీరు దాసులు కారు" అన్నారు. 

To be continued ...............

Saturday 11 November 2017

శివయోగసాధన - పరిక్రమ ప్రయోజనాలు - స్వామి శివానంద

పరిక్రమ అంటే ఒక పవిత్ర ప్రదేశం చుట్టూ ప్రదక్షిణ చేయటం. అది ఒక పర్వతశిఖరం, ఒక పుణ్యతీర్థం, యాత్రాస్థలం లేదా సంప్రదాయం ప్రకారం పవిత్రంగా భావించే ఒక పెద్ద ప్రదేశమైనా కావచ్చు. ఇలా ప్రదక్షిణ చేయడం అనేది సాధరణంగా ఏ సమయంలోనైనా చేయవచ్చు, మరియు ముఖ్యంగా సంవత్సరంలోని ప్రత్యేక రోజుల్లో భక్తులు గుంపుగా చేస్తారు.

చిన్న స్థాయిలో, తక్కువ స్థలంలో, ఆలయంలో ప్రతిష్టించిన మూర్తి చుట్టూ గానీ, లేదా పవిత్ర తులసి మొక్క లేదా రావి చెట్టు చుట్టూ చేసేదాన్ని సాధరణంగా ప్రదక్షిణం అంటారు. పరిక్రమ అంటే కూడా నిస్సందేహంగా ప్రదక్షిణమే, కానీ లోకరీతిలో, అది పెద్ద స్థలానికి చేసే ప్రదక్షిణం.

ఎన్నో కష్టమైన పరిక్రమలు వాడుకలో ఉన్నాయి. అధిక శారీరిక శ్రమ మరియు కష్టంతో కూడిన అనేక విధానాలను పరిక్రమతో కలుపుతారు. కొందరు మార్గమంతా పొర్లుదండాలు పెడతారు. కొందరేమో నెమ్మదిగా ప్రతి మూడు లేదా పది అడుగులకు వంగి నమస్కారం చేస్తూ కొనసాగిస్తారు. కొందరు ప్రతి అడుగును లెక్కపెట్టుకుంటూ, నెమ్మదిగా నడుచుకుంటూ మొత్తం దూరం నడుస్తారు; మరికొందరు తమ చుట్టూ తామే తిరుగుతూ, ఆత్మ ప్రదక్షిణంగా వెళతారు. ప్రత్యేక సాధనల్లో లేదా మొక్కుకున్నప్పుడు, లేదా స్వతస్సిద్ధంగా అప్పటికప్పుడు ఏర్పడిన భావనను అనుసరించి ఈ కష్టమైన విధులను భక్తులు ఆచరిస్తారు. మీ మానసిక భావన మరియు ఉద్దేశం మీకు అత్యధిక, ఉన్నతమైన ఆధ్యాత్మిక లక్ష్యాన్ని ప్రసాదిస్తుంది.

చలించని యాత్రికులు మంచుతో కప్పబడిన హిమాలయాల్లో కైలాస పర్వతానికి లేదా మానససరోవరానికి సైతం కష్టమైన పరిక్రమను చేస్తారు. ఇతర యాత్రికులు మొత్తం ఉత్తారాఖండ్ ను చుట్టి వస్తారు, చార్-ధాం ను చుట్టి వచ్చిన తర్వాత కేదార్-బధ్రీ యాత్రలో భాగంగా ఒక దారిలో వెళ్ళి వేరే దారిలో వస్తారు.

దక్షిణాన, విశ్వాసముగల భక్తులు తిరువణ్ణామలై (అరుణాచలం) లో ఉన్న పవిత్ర పర్వతానికి ప్రదక్షిణం చేస్తారు. రామ భక్తులు మరియు కృష్ణ ప్రేమికులు చిత్రకూట పర్వతం, అయోధ్య, వ్రజ, బృందావనం, గోవర్ధనగిరి మరియు బధ్రీనాథ్ చుట్టూ ప్రదక్షిణం చేస్తారు. 

పరిక్రమ యొక్క లోతైన ప్రాముఖ్యం ఏమిటంటే భక్తుడు అక్కడి బాహ్యమైన తీర్థం లేదా పర్వతాన్ని చూడడు, కానీ అక్కడ ప్రత్యక్షమై, కొలువై ఉన్న ఆధ్యాత్మిక శక్తిని చూస్తాడు. భగవద్గీతలోని పదవ అధ్యాయం ద్వారా, అలాంటి ప్రత్యేకస్థలాల్లో దైవత్వం ఎంతగా ఉందో మీకు అర్ధమవుతుంది. శ్రద్ధతో కూడిన విశ్వాసం మరియు ఆరాధన ద్వారా, పవిత్ర స్థలంలోని ఆధ్యాత్మిక స్పందనల మీలోనికి ప్రవేశించేందుకు మిమ్మల్ని మీరు గ్రహణశీలం చేసుకుంటారు. ఈ శక్తివంతమైన ఆధ్యాత్మిక తరంగాలు స్థూల, సూక్ష్మ మరియు అన్ని కోశాల్లోకి ప్రవేశించి చెడు వాసనలను, సంస్కారాలను నశింపజేస్తాయి. తమోగుణం మరియు రజోగుణం తగ్గుతాయి. కేంద్రీకృతమైన సత్త్వగుణం నిద్రాణమైన ఆధ్యాత్మిక వాసనలను జాగృఅతపరుస్తుంది. పరిక్రమ ద్వారా, ఆ ప్రదేశమంతా వ్యాపించి ఉన్న ఆధాయ్త్మిక వాతవరణాన్ని భక్తుడు బాగా స్వీకరించి, సత్త్వంతో తడిసిన ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వస్తాడు. ఇది పరిక్రమ చేయడంలోని నిజమైన ఆంతర్యము మరియు ప్రాముఖ్యత.

గొప్ప శుద్ధినిచ్చేది కనుక, అది ఒక విధమైన ఉన్నతమైన సంప్రదాయానికి చెందిన తపస్సుగా భక్తులకు ఆజ్ఞాపించబడింది. ఇది గొప్ప ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని మరియు పుణ్యాన్నిచ్చే కర్మ. భక్తుడు స్నానమాచరించి, శుభ్రమైన బట్టలు ధరించి, తిలకం లేదా పవిత్రభస్మం ధరించి, తులసి లేదా రుద్రాక్ష మాల వేసుకుని, భగవన్నామాన్ని పెదవులతో పలకడం మొదలుపెడతాడు. పరిక్రమ మార్గంలో, అక్కడ నివసించే సన్యాసులు మరియు సాధ్వుల విలువైన సత్సంగం మీకు లభిస్తుంది. పవిత్రనదుల్లో లేదా తటాకాలు, కుండాల్లో స్నానమాచరించడం వలన మీ పాపాలు నశిస్తాయి. ఆ మార్గంలో ఉన్న ఎన్నో పవిత్ర క్షేత్రాలు మరియు ఆలయాల సందర్శన ద్వారా మీరు ఉన్నతమైన స్థితిని పొందుతారు. ఎండ, వాన, చలి మొదలైన అసౌకర్యాలను తట్టుకోవడం ద్వారా మీలో ఓపిక మరియు సహనశీలత పెరుగుతుంది. మీ మనస్సు అన్ని ఆలోచనల నుంచి ముక్తి పొంది, దైవం యొక్క ఉనికి అనే ఆలోచనలో మీరు లీనమవుతారు. భక్తితో చేసిన పరిక్రమ అనే ఒక కర్మ త్రివిధమైన సాధనగా మీ దేహం, మనస్సు మరియు ఆత్మలను ఉద్ధరిస్తుంది. పవిత్ర ప్రదేశాలు మరియు ఆలయాల్లోని ఆధ్యాత్మిక ప్రతిస్పందనలను మీలోని సహజమన ఆసూరి వృత్తులను శుద్ధి చేసి, సత్త్వాన్ని, పవిత్రతను నింపుతాయి. మీరు సత్సంగానికి వెళ్ళాల్సిన పనిలేదు. మహాపురుషులే మీ వద్దకు వస్తారు. వారెప్పుడు నిజమైన మరియు నిజాయతీగల సాధకుల కోసం అన్వేషణలో ఉంటారు. అందుకే వారు పవిత్రస్థలాలైన బధ్రీ, కేదార్, కైలాసపర్వతం, హరిద్వార్, బృందావనం, మథుర మొదలైన క్షేత్రాల్లో కూడా ఉంటారు.

పరిక్రమలో పాల్గోనెవారు అదృష్టవంతులు, ఎందుకంటే వారు త్వరగా శాంతిని, పరమానందాన్ని, మోక్షాన్ని పొందుతారు! అయోధ్యకు అధిపతి అయిన శ్రీ రామునకు జయము! బృందావనంలో ప్రత్యేకంగా ఉండేవాడు, హృదయనివాసి అయిన శ్రీ కృష్ణునకు జయము! భక్తులకు జయము! వాళ్ళ ఆశీస్సులు మీపై ఉండుగాకా! 

- స్వామి శివానంద  

Wednesday 8 November 2017

శివయోగసాధన- తీర్థయాత్ర ప్రయోజనాలు- స్వామి శివానంద



ఓర్టెల్ యొక్క వైద్యగ్రంథంలో మీకు కొన్ని వివరణలు కనిపిస్తాయి. కొన్ని హృదయ సంబంధ వ్యాధులకు, రోగిని మెల్లిగా కొండలు ఎక్కమంటారు. కాబట్టి కైలాస యాత్ర, ఆధ్యాత్మిక ప్రయోజనాలను పక్కన పెట్టి, అనేకమైన చిన్న చిన్న హృదయ వ్యాధులను తొలగిస్తుంది. గుండె ఉత్తేజితమై బలం పొందుతుంది. మొత్త గుండె, నాడి, శ్వాసకోశ, ఆహార సంబంధిత, శరీరావరణకు సంబంధించిన వ్యవస్థలన్నీ పూర్తిగా బాగుచేయుబడతాయి మరియు శుద్ధవుతాయి. ఆవిరి స్నానం చేయాల్సిన అవసరంలేదు. నడక వలన మీరు బాగా చెమటోడ్చుతారు. శరీరం మొత్తం శుభ్రము, ఆక్సిజనీకరణమైన రక్తంతో నిండుతుంది. అంతటా నిండిన ఎత్తైన దేవదారు వృక్షముల నుంచి వచ్చే చిరుగాలి, దేవదారు నూనెతో నిండి, ఊపిరితిత్తుల్లో రోగరహితం చేస్తుంది, మరియు లోనికి తీసుకుంటే క్షయరోగము నయమవుతుంది. అధికంగా ఉన్న కొవ్వు తగ్గుతుంది. లావాటి వ్యక్తులకు కైలాస యాత్ర అనేది స్థూలకాయ నివారణకు గొప్ప చికిత్స. ఎన్నో రకాల ఉదర సంబంధ వ్యాధులు, ఊరిక్ యాసిడ్ సమస్యలు మరియు అనేక రకాల చర్మరోగాలు నివారణమవుతాయి. మీకు 12 సంవత్సరాల వరకు ఏ రోగం రాదు ఎందుకంటే మీరు నూతన ఋణవిద్యుత్కణాలు, నూతన అణువులు, నూతన కణాలు, నూతన త్రసరేణువులు, నూతన (పరమాణు)కేంద్రకాలతో జీవరసము మఱల బలం పొంది మీరు శక్తిని పొందుతారు. ఇది అర్థవాదం (గొప్పతనం చెప్పటం) కాదు. మీకు ఒకే దెబ్బకు రెండు పిట్టలు పడతాయి. కైలాసయాత్ర మీకు చక్కని ఆరోగ్యాన్ని మరియు ఆధ్యాత్మిక ఆశీస్సులను తీసుకువస్తుంది. జయము! శంభునకు, కైలాసంలో తన శక్తి అయిన పార్వతితో ఉండే శివునకు జయము! తన భక్తులకు ముక్తినిచ్చే వానికి జయము. హర, సదాశివ, మహాదేవ, నటరాజ, శంకర మొదలైన నామాలు గలవాడికి జయము.
ఈ జీవితం యొక్క లక్ష్యం భగవత్ సాక్షాత్కారం, కేవలం అది మాత్రమే మనల్ని సంసారదుఃఖాల నుంచి, జననమరణ చక్రం నుంచి విముక్తిని కలిగిస్తుంది. నిత్యకర్మ, నైమిత్తిక కర్మ, యాత్రలు మొదలనవి నిష్కామంగా చేయటం చేత పుణ్య సముపార్జన జరుగుతుంది. ఇది పాపరాశి దగ్ధమవటానికి కారణమై, మనస్శుద్ధిని ఇస్తుంది.  మనోశుద్ధి సంసారం యొక్క నిజతత్త్వాన్ని తెలుసుకొనటానికి, దాని అసత్యము మరియు విలువలేని గుణాన్ని తెలుసుకొనుటకు దారి తీస్తుంది. దీన్నుంచి వైరాగ్యం జనియించి, మోక్షకాంక్ష కలుగుతుంది. దీని నుంచి ఆ దిశగా వెళ్ళే మార్గాన్వేషణ తీవ్రమవుతుంది. దీన్నుంచి అన్ని కర్మలను త్యజించడం వస్తుంది. తద్వారా యోగాభ్యాసం అలవాటై, మనస్సు ఆత్మలో లేదా బ్రహ్మంలో లీనమవటం అలవాటుగా మారుతుంది. ఇది అవిద్యను తొలగించే 'తత్త్వమసి' మొదలైన శృతి వ్యాక్యాలు అర్ధం చేసుకోవటానికి కారణమై, తన ఆత్మలో స్థిరంగా నిలువటానికి తోడ్పడుతుంది. అందుకే మీరు గమనిస్తే, కైలాసయాత్ర అనేది భగవత్ సాక్షాత్కారానికి పరంపరమైన సాధన అవుతుంది, ఎందుకంటే అది చిత్తశుద్ధిని మరియు నిధిధ్యాసను కలిగిస్తుంది. ధ్యానం అనేది సూటియైన సాధన. ప్రాపంచిక విషయాల్లో, బరువుబాధ్యతల్లో ఇరుక్కుపోయిన గృహస్థులకు ఈ యాత్రలో గొప్ప ఉపశమనం లభిస్తుంది. ఈ యాత్ర తర్వాత మనస్సు ఎంతో ఉపశమిస్తుంది. అంతేగాక, యాత్ర సమయంలో వారు అనేక సాధువులను, సన్యాసులను దర్శిస్తారు. చక్కని సత్సంగం దొరుకుతుంది. వారు వారి సందేహాలను తీర్చుకోవచ్చు. ఆధ్యాత్మికసాధనలో వారికి అనేక రకాలుగా సాయం అందుతుంది. ఇది యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం.


మీ స్ఫురణకు మరొక్కసారి తీసుకువస్తాను, వేదాల చివరి మాటలు, ఉపనిషత్తులు చెప్పింది- తత్త్వమసి, నా ప్రియమైన పాఠకులార. ఓం తత్ సత్, ఓం శాంతి, సకల జీవులకు శాంతి కలుగుగాక.

- స్వామి శివానంద 

Monday 6 November 2017

శివయోగసాధన- ప్రసాదం యొక్క మహత్యం- స్వామి శివానంద

ప్రసాదం అంటే శాంతినిచ్చేది. కీర్తనం, పూజ, ఆరాధన, హవనం మరియు హారతి సమయంలో బాదాం, పాలు, మధురపదార్ధాలు, పండ్లను స్వామికి అర్పిస్తారు. బిల్వపత్రాలు, పువ్వులు, తులసీ, విభూతితో పూజించి, వీటిని స్వామి నుంచి ప్రసాదంగా ఇస్తారు. పూజ మరియు హవనంలో పఠించిన మంత్రాల వలన వాటికి అద్భుతమైన శక్తులు ఆవహించి ఉంటాయి.

ప్రసాదం గొప్ప శుద్ధిని ఇస్తుంది. ప్రసాదం సర్వరోగనివారిణి/ చింతామణి. ప్రసాదం అనేది ఆధ్యాత్మిక అమృతం. స్వామి అనుగ్రహమే ప్రసాదం. ప్రసాదం శక్తి స్వరూపం. ప్రసాదం అనేది మూర్తీవభించిన దైవత్వం. ఎంతో మంది నిజాయతీగల సాధకులకు ప్రసాదం ద్వారానే ఎన్నో అద్భుతమైన అనుభూతులు కలుగుతాయి. నయంకాని ఎన్నో రోగాలు నయమవుతాయి. ప్రసాదం శక్తినిస్తుంది, జీవం పోస్తుంది, పుష్టినిస్తుంది మరియు భక్తిని పుట్టిస్తుంది. దాన్ని గొప్ప విశ్వాసంతో స్వీకరించాలి.

బృందావనం, పండరీపురం లేదా బెనారస్ లో ఒక వారం నివసించండి. ప్రసాదం యొక్క మహత్యం మరియు అద్భుతమైన ప్రభావాలను మీరు అనుభూతి చెందుతారు. ప్రసాదం ధీర్ఘాయువు, చక్కని ఆరోగ్యం, శాంతి మరియు శౌభాగ్యాలను అందరికి ఇస్తుంది. శాంతిని మరియు పరమానందాన్ని ఇచ్చే ప్రసాదానికి జయము. ప్రసాదాన్ని ఇచ్చే భగవంతునకు జయము. అమరత్వాన్ని మరియు నశించని ఆనందాన్నిచ్చే పరమాత్మకు జయము.

విభూతి పరమశివుని ప్రసాదం, నుదుటన ధరించాలి. కొద్ది భాగం లోపలికి తీసుకోవచ్చు.

కుంకుమ అనేద శ్రీ దేవి లేదా శక్తి యొక్క ప్రసాదం, రెండు కనుబొమ్మల మధ్య (భ్రూమధ్యంలో/ ఆజ్ఞా చక్రం) లో ధరించాలి.

తులసి అనేది శ్రీ మహావిష్ణువు, రాముడు లేదా కృష్ణుని ప్రసాదము, లోపలికి తీసుకోకూడదు. బాదం, కిస్‌మిస్, మధురపదార్ధాలు, ఫలాలు మొదలైనవి లోనికి తీసుకోవచ్చు.

ముఖ్య్మైన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఈ ప్రసాదాలను ఇస్తారు.

- స్వామి శివానంద 

07-11-2017, మంగళవారం, కార్తీక బహుళ చవితి, సంకష్టహర చతుర్థీ, అంగారక చతుర్థీ.

07-11-2017, మంగళవారం, కార్తీక బహుళ చవితి, సంకష్టహర చతుర్థీ, అంగారక చతుర్థీ.

దీనికి గణాధిప సంకష్టహర చతుర్థి అని పేరు. వి

వ్రత విధానం ఈ లింక్‌లో చూడగలరు.
http://ecoganesha.blogspot.in/2014/03/20-2014.html

07 నవంబరు 2017, చంద్రోదయ సమయం హైద్రాబాదులో (భారత కాలమానం ప్రకారం) - రాత్రి 8.54 నిమి||

http://www.drikpanchang.com/vrats/sankashti-chaturthi-dates.html

ఓం గణాధిపాయ నమః

Sunday 5 November 2017

శివయోగసాధన- శివుడిని పొందే మార్గాలు- స్వామి శివానంద

మూడువేళ ఏళ్ళక్రితం తిరుమూలర్ తిరుమంత్రం అనే కావ్యాన్ని రచించారని చెప్తారు. అది శైవ మతం మరియు తాత్త్వికత యొక్క ఆచరణీయ/ వ్యవహారిక మరియు సిద్ధాంతపరమైన అంశాలను వెళ్ళడిస్తుంది. పతి (శివుడు), పశు (జీవుడు) మరియు పాశము (బంధము) గురించిన పురాతన పద్ధతిని ఈ గ్రంథం వివరిస్తుంది. ఈ క్రింద చెప్పేది తిరుమంత్రంలో తిరుమూలర్ యొక్క వ్యాఖ్యానం.

భగవంతుడు మాత్రమే గురువు. అతడే శివుడిని లేదా సత్ ను చూపిస్తాడు. సత్-గురు అంటే అంబలం లేదా చిదాకాశ శివుడు. నువ్వు గురువు కోసం నీ హృదయంలో వెతకాలి. జ్ఞానం, భక్తి, పవిత్రత మరియు సిద్ధులు గురువు అనుగ్రహంతో ప్రాప్తిస్తాయి. పవిత్రత, వైరాగ్యం మొదలైనవి ఉన్న సాధకులలో అనుగ్రహం ఉదయిస్తుంది.

ఆర్తి/ కుతూహలంతో ఉన్న సాధకుడు గురు పరం నుంచి సహాయం తీసుకోవాలి. గురు పరం సాధకునకు ఆధ్యాత్మిక సూచనలు ఇస్తారు. అప్పుడు శుద్ధ గురువు అతనిపై దైవానుగ్రహాన్ని అనుగ్రహిస్తాడు. సాధకునకు దైవానుగ్రహం లభించగానే అతనికి అనేక శక్తులు, పవిత్రత, మంత్రాలను తెలుసుకునే శక్తి, ఉన్నతమైన సిద్ధులు మొదలైనవి లభిస్తాయి. అప్పుడు చిదాకాశంలో సద్గురువు తానుగా చిదాకాశంలో వ్యక్తం/ ప్రత్యక్షమై మూడు బంధాలైన అణవ (అహంకారం), కర్మ మరియు మాయ ను త్రెంచి, అతడు అపరిమితమైన నిత్యానంద స్థితికి లేదా మోక్షానికి ప్రవేశించేందుకు సాయపడతారు. తర్వాత శివగురు తానుగా వ్యక్తమై సత్, అసత్, సదసత్ వ్యక్తమవుతాయి. జీవుడు ఈ అంతిమమైన జ్ఞానం పొందగానే, అతడు శివుడవుతాడు. ప్రారంభ మరియు అంతిమ దశల్లో వ్యక్తమైన గురువు సాక్షాత్తు శివుడే.

స్వామిని తన హృదయ కుహరంలో, రెండు కనుబొమ్మల మధ్య మరియు శిరస్సున ధ్యానించినప్పుడు, భక్తుడు స్వామి అనుగ్రహాన్ని పొందుతాడు. స్వామి యొక్క పవిత్ర పాదాలు ఎంతో స్తుతింౘదగ్గవి. " స్వామి పవిత్ర పాదాలే నాకు మంత్రము, సౌందర్యము మరియు సత్యము" అంటారు తిరుమూలర్.

జ్ఞేయం అనగా తెలుసుకోదగినది ఏదంటే, అది శివానందం, శివుడు మరియు ఆయన శక్తి (అనుగ్రహం) యొక్క సారం. జ్ఞాత (తెలుసుకునేవాడు) జీవుడు లేద జీవాత్మ. అతడు శివానందంలో ఉండటం చేత శివుడిని తెలుస్కుని, జ్ఞానాన్ని పొందుతాడు.

మోక్షం అంటే శివానందాన్ని పొందటం. మోక్షాన్ని పొందినవాడు, ఉన్నతమైన శివ జ్ఞానాన్ని పొందుతాడు. శివానందంలో నిశ్చలంగా ఉన్నవాడు జ్ఞానాన్ని మరియు మోక్షాన్ని పొందుతాడు. శివానందాన్ని అనుభూతి చెందిన వ్యక్తి అందులోనే ఎల్లకాలం ఉంటాడు. అతడు శివానందంలో శివుడు మరియు శక్తిని పొందుతాడు. శివశక్తుల కలయిక అయిన సత్యజ్ఞానాన్ని అతడు పొందుతాడు. వైరాగ్యం, బంధరాహిత్యం, త్యాగం, మరియు శివుని స్తుతించి నిరంతరం పూజించేవానికి శివ్డే మోక్షానికి దారి చూపుతాడు.

ప్రపమం మరియు ఇంద్రుని ప్రలోభాలను తట్టుకునే శక్తి శివభక్తునకు అతని తపస్సు ద్వారా లభిస్తుంది. ఇంద్రునిచే ఇవ్వబడే స్వర్గసుఖాలను అతడు పట్టించుకోడు. శివునిలో లీనమవటం చేత పొందిన పరమానందంతో అతడు సంతృప్తిగా ఉంటాడు.

సాధకుడు తీవ్రమైన సాధనలు చేసి, ఏకాగ్రతను సాధన చేసినప్పుడు, అతనికి అనేక శక్తులు లభిస్తాయి. వారి పదవులను కోల్పోతారేమోనని ఇంద్రుడు మరియు ఇతర దేవతలు ఎంతో భయపడతారు. అందుకే వారు అతని మార్గంలో అనేక అడ్డంకులను కలిగించి, పుష్పక విమానం, అప్సరసలు, మరియు ఇతర దేవలోక భాగాలను ప్రసాదించి అతడిని ప్రలోభపెడతారు. కానీ స్థిరమైన సాధకుడు దేనికీ లొంగడు. అతడు ఎన్నటికీ లొంగడు మరియు తన గమ్యమైన శివపదం లేదా అమరత్వానికి స్థానమైన పరమానందం వైపు నేరుగా నడుస్తాడు. లొంగినవాడు పతనమవుతాడు. విశ్వామిత్రుడు పతనమయ్యాడు.

ఋషి తిరుమూలర్ అంటారు: "పాండిత్య అహంకారాన్ని విడిచిపెట్టండి. ఆత్మ పరిశీలన చేసుకోండి. లోనికి చూడండి. మీరు శివునిలో నిశ్చలంగా ఉంటారు. మిమ్మల్ని ఏదీ కదపలేదు. జననమరణాలనే లంపటాల నుంచి మీరు విడువడతారు."


శివసిద్ధాంతం అద్వైతాన్ని మాత్రమే బోధిస్తుంది. అది శివ అద్వైతం.

- స్వామి శివానంద 

హిందూ ధర్మం - 253 (సృష్టి- జ్యోతిష్యం)



వేదాంగమైన జ్యోతిష్యం ప్రకారం ఈ సృష్టి 197.5 కోట్ల సంవత్సరాల క్రితం ప్రారమభమైంది. శ్రీ మద్భాగవతం కూడా ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది. వేదాంగ జ్యోతిష్యం ప్రకారం 2017 నాటికి ఈ సృష్టి ప్రారమభమై 197, 29, 49, 117 సంవత్సరాలు గడిచాయి. నిజానికి 20 వ శతాబ్దం మొదటి అర్ధభాగం వరకు పాశ్చాత్య ప్రపంచం, ముఖ్యంగా క్రైస్తవ, యూదు, మహమ్మదీయ మొదలైన అబ్రహం మతాల వారు ఇదే నమ్మేవారు. క్రైస్తవ ప్రభావం అధికంగా ఉన్న ఐరోపా (యూరోప్) లోని శాస్త్రవేత్తలకు సైతం ఈ సృష్టి కొన్ని వేల ఏళ్ళ క్రితం నాటిదని అంగీకరించేందుకు మనస్కరించలేదు.

ప్రముఖ మత పరిశోధకుడు, పండితుడైన హూస్టన్ స్మిత్ (మే 31, 1919 – డిసెంబర్ 30, 2016) అంటారు: " సనాతన ధర్మంలో అవ్యక్తం దేన్ని మినహాయించదు, అవ్యక్తం దేన్నీ మినహాయించకపోవటమే అనంతం- అనతమే భారతీయ ఆత్మ."

ఎల్లలు/ సరిహద్దులు లేని దాన్ని లేదా అంతటిని భారతదేశం తన ముఖం తిప్పి స్పష్టంగా చూసింది.................

పాశ్చాత్యం విశ్వం వయస్సు 6,000 ఏళ్ళు కావచ్చునని ఆలోచిస్తుండగా- గంగానదిలో ఇసుకు రేణువుల మాదిరిగా అనతమైన కల్పాలను, నక్షత్రవీధులను భారతదేశం దర్శించింది. ఈ విశ్వం ఎంత విశాలమైందంటే, ఆధునిక ఖగోళశాస్త్రం ఎటువంటి అలజడిలేకుండా అందులోకి జారిపోతుంది.

“The invisible excludes nothing, the invisible that excludes nothing is the infinite – the soul of India is the infinite.” 

“Philosophers tell us that the Indians were the first ones to conceive of a true infinite from which nothing is excluded. The West shied away from this notion. The West likes form, boundaries that distinguish and demarcate. The trouble is that boundaries also imprison – they restrict and confine.” 

“India saw this clearly and turned her face to that which has no boundary or whatever.” “India anchored her soul in the infinite seeing the things of the world as masks of the infinite assumes – there can be no end to these masks, of course. If they express a true infinity.” And It is here that India’s mind boggling variety links up to her infinite soul.”

“India includes so much because her soul being infinite excludes nothing.” It goes without saying that the universe that India saw emerging from the infinite was stupendous.”

While the West was still thinking, perhaps, of 6,000 years old universe – India was already envisioning ages and eons and galaxies as numerous as the sands of the Ganges. The Universe so vast that modern astronomy slips into its folds without a ripple.” - Huston Smith (source: The Mystic's Journey - India and the Infinite: The Soul of a People – By Huston Smith).
=======================

వేదాన్ని తొలుతుగా భగవంతుడు అగ్ని, వాయు, ఆదిత్యుడు, ఆంగీరసుడు అనే నలుగురు ఋషులకు ప్రకాశ పరిచినట్లు శతపధబ్రాహ్మణం చెప్తోందని దయానందులు పేర్కొన్నారు. ఈ నలుగురు ఋషులే మిగితా ఋషులకు చెప్పారు. ఆ తర్వాత వారు తమ పిల్లలకు, వారు వారి పిల్లలకు, ఇలా చెప్పుకుంటూ వచ్చారు. ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. సనాతన ధర్మం ప్రకారం ఈ భూమి మీద ఉన్న సమస్త మానవజాతి కుల, వర్ణ, మత, జాతి, భాషలకు అతీతంగా ఋషుల సంతానం. జీవుల పూర్వ పుణ్యాలను, వారి తపోనిష్ఠను, ధర్మనిష్ఠను, కర్మఫలాలను అనుసరించి ఋషులను, సామాన్య మానవులను సృష్టింపజేశాడు భగవంతుడు. ఈ ఋషులనే ప్రజాపతులు అంటారు, వీరే మానవజాతికి మూలపురుషులు. ప్రజాపతులకు భార్యలు ఉన్నారు. వీరిని అనేకమందిని సృష్టినిచిన బ్రహ్మ మానవజాతిని కొనసాగించమని, సంతానం ద్వారా లోకంలో ధర్మం వర్ధిల్లేలా చూడమని ఆజ్ఞాపించాడు. బ్రహ్మ ఆజ్ఞానుసారం ఋషులు మానవజాతిని పునరుత్పత్తి చేశారు. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న మానవులంతా ఋషుల సంతానమే అంటుంది హైందవ ధర్మం. ఈ మధ్య ఏసు క్రీస్తును ప్రజాపతి అంటూ మతమార్పిడి కోసం పన్నాగం పన్నుతున్నారు. ప్రజాపతులకు, ఏసుకు చాలా తేడా ఉందని గ్రహించాలి. ఏసుకు పెళ్ళి అయ్యిందని క్రైస్తవులు ఒప్పుకోరు, బైబిల్ లో ఏముంది అన్నది తర్వాతి సంగతి. ప్రజాపతులు యజ్ఞాన్ని, వైదిక దేవతలను అంగీకరించారు. ఏసు అంగీకరించట్లు క్రైస్తవులు ఒప్పుకుంటారా?...

ఈ సిద్ధాంతం కూడా భారతదేశంలో పుట్టిన మతాలను ఇతర మతాల నుంచి వేరు చేస్తుంది. జైన, బౌద్ధ మొదలైన మతాలు, హిందు ధర్మం, చైనాలో హిందు ధర్మం ఆధారంగా వచ్చిన మాతాలను తప్పించి పాశ్చాత్య ప్రపంచంలో ఉన్న మిగితా మతాలను అబ్రహామిక్ మతాలంటారు. వాళ్ళకి మూల పురుషుడు అబ్రహం అని చెప్తారు. దేవుడు ఆదాము, ఈవ్ అనే ఒక పురుషుడిని, ఒక స్త్రీని సృష్టించి, వారిని ఒక సుందరమైన ఉద్యానవనంలోకి ప్రవేశపెడతాడు. అందులో ఉన్న ఫలాలను స్వీకరించమని, ప్రకృతి అందాలను ఆస్వాదించమని చెప్తాడు కానీ ఒక వృక్షాన్ని చూపించి, దానికున్న ఫలాన్ని మాత్రం తినవద్దని, అది మంచి, చెడుల విచక్షణ జ్ఞానం కలిగించే ఫలమనీ, అది ముట్టుకుంటే మరణిస్తారని చెప్తాడు. ఇంతలో అక్కడికి సైతాన్ రావడం, ఈవ్, ఆదాము ఆ ఫలాన్ని తినడం జరుగుతుంది. ఫలితంగా వారికి లింగ విచక్షణ జ్ఞానం వస్తుందట. వారి మధ్య ఆకర్షణ మొదలవుతుంది, కామోద్రేకానికి దారి తీస్తుంది. ఈ విషయం దేవుడికి తెలిసి, వారిని శపిస్తాడు. పైగావారు చేసిన పాపానికి, వారి నుంచి పుట్టే సమస్త మానవజాతికి పాపం చుట్టుకుంటుందని అంటాడు. దాన్ని క్రైస్తవం Original sin  అంటుంది. తర్వాత ఆదాము, ఈవ్‌ల నుంచే మొత్తం మానవజాతి ఉద్భవించిందని, వారు చేసిన పాపం కారణంగా, పుట్టినవాళ్ళందరూ పాపులేననీ ఆయా మతగ్రంధాలు చెప్తాయి. అందుకే ఇతర మతగురువులు జనులను ఉద్దేశ్యించి పాపుల్లారా! అంటూ సంబోధిస్తారు. ఆయా మతగ్రంధాల ప్రకారం పుట్టినప్రతి వాడే పాపియే. అందుకే ఈ రోజుకీ మతమార్పిడి చేసే సమయంలో కూడా మీరంతా పాపులు, మా ప్రవక్త రక్షకుడు. అతడే సరైనవాడు, అతన్ని మాత్రమే పూజించండి అని వారంటారు.

To be continued ......

Friday 3 November 2017

శివయోగసాధన- శివలింగం చిన్మయం- స్వామి శివానంద



సదాశివుని నుంచి వచ్చే చైతన్యం యొక్క కాంతి, వాస్తవంలో శివలింగం. ఆయన నుంచి చరాచరమైన సృష్టి ఉద్భవిస్తుంది. ఆయనే అన్నిటికి లింగం లేదా కారణం. అంతిమంగా సమస్త ప్రపంచం ఆయనలోనే ఐక్యమవుతుంది. పీఠం అంబమయం సర్వం శివలింగశ్చ చిన్మయం అంటుంది శివపురాణం. పీఠం లేదా ఆధారంగా ఉండేది సమస్త ప్రకృతి లేదా పార్వతి, మరియు లింగం అనేది స్వయంప్రకాశమైన దేదీప్యమానమైన వెలుగులు ప్రసరించే చిన్మయ పురుషుడు. ప్రకృతి పురుషుల సమాగమము లేదా పార్వతీ పరమేశ్వరుల సమాగమమే ఈ ప్రపంచానికి కారణం. శివపురాణం సనత్కుమార సంహితలో, పరమశివుడు ఇలా అంటాడు: "ఓ పార్వతీ, పర్వతరాజు పుత్రిక, లింగమే సమస్తానికి మూలకారణం అని, ప్రపంచం లింగమయం లేదా చిన్మయమని తెలుసుకుని, నన్ను లింగరూపంలో పూజించే వ్యక్తి కంటే నాకు దగ్గరివాడు వేరొకడు లేడు."

లింగం అండాకారంలో ఉంటుంది. అది బ్రహ్మాండాన్ని సూచిస్తుంది. బ్రహ్మాండంలో ఉన్నదంతా లింగమే. సమస్త ప్రపంచమూ శివస్వరూపమే. ప్రపంచమే లింగము. లింగము కూడా శివుని రూపమే.

ప్రకృతి పురుషుల సమాగమం ద్వారా సృష్టి ప్రభావితమవుతుందని లింగం సూచిస్తుంది. అంటే అది లయం, జ్ఞానం, వ్యాప్యం, ప్రకాశం, ఆరథప్రకాశం, సామర్ధ్యం మరియు పై అర్ధాన్ని సూచిస్తుంది. లింగం అంటే ప్రపంచం మరియు జీవులు లయమయ్యే స్థానం. అది సత్యం, జ్ఞానం, అనంతం అనేవాటిని కూడా సూచిస్తుంది. శివుడు సర్వవ్యాపకుడని, స్వయంప్రకాశ తత్త్వం కలవాడని అందులో అర్ధం దాగుంది. పైన చెప్పిన అనేక అర్థాలను మనం అర్ధం చేసుకునేందుకు లింగం చిహ్నము. అండలింగం, పిండలింగం, సదాశివలింగం, ఆత్మలింగం, జ్ఞానలింగం మరియు శివలింగం అనేవి ఆరు లింగాలు. ఈ లింగాలు అండ, పిండ, సదాశివ మొదలైన వాటి గుణాలను తెలుసుకుని, అర్ధం చేసుకునేందుకు పరిగణలోకి తీసుకుంటారు.

యోని (పానపట్టము) తో లింగం యొక్క సంయోగము అనేది పరమ సత్యం యొక్క నిశ్చల/స్థిర మరియు చంచల తత్త్వాల శాశ్వతమైన/ అద్యంతరహితమైన ఐకమత్యానికి నిదర్శనము. దృగ్గోచరమైన వైవిద్యాలు దేని నుంచి వచ్చాయో ఆ సనాతనమైన ఆధ్యాత్మిక మాతృ మరియు పితృ తత్త్వాల ఐకమత్యానికి ఇది నిరూపిస్తుంది. ఇది మార్పుచెందని తత్త్వం మరియు చంచలమైన, నిరంతరం మార్పు చెందే శక్తి యొక్క శాశ్వతమైన కలియిక.

ఇంకా, ఈ ఘనమైన భావనతో సాధకుల యొక్క నీచమైన కామవాంఛలు తొలగుతాయి. లింగం మరియు యోని యొక్క ఆధ్యాత్మీకరణం మరియు పవిత్రీకరణం అనేవి సాధకుడు కామపూరితమైన ఆలోచనల నుంచి విముక్తిని పొందేలా చేస్తాయి. ఉత్కృష్టమైన/శ్రేష్టమైన ఈ భావన ద్వారా అన్ని నీచమైన ఆలోచనలు క్రమంగా మాయమవుతాయి. ప్రపంచంలోని సమస్త కామంతో కూడిన సంబంధాలు సనాతనమైన ఆత్మానందంతో కూడిన, స్వయంవృద్ధి కలిగిన పరతత్త్వమైన చైతన్య శక్తి అయిన పరమశివుడు మరియు ఆయన శక్తి యొక్క అభివ్యక్తీకరణలుగా ఆధ్యాత్మీకరించబడుతాయి.  

యోని (పానపట్టము) తో లింగం యొక్క సమాగమము పరమశివుడు, ఆయన శక్తితో కలిసి చేసిన ఈ సృష్టిని సూచిస్తుంది.

విద్యావంతులుగా పిలువబడే ఈ ఆధునిక మానవులకు ఆధ్యాత్మిక లోదృష్టి మరియు తాత్త్వికత లేదు. వారి తీవ్ర అజ్ఞానం మరియు విచారణ శక్తి లేకపోవటం చేత, లోతైన ఆలోచన మరియు ఋషులతో సత్సంగం లేని కారణంగా వారు యోనితో లింగం యొక్క సంయోగాన్ని నీతిబాహ్యమని, అశ్లీలమని విమర్శిస్తారు. ఇది అత్యంత శోచనీయము మరియు దుఃఖప్రదము. అజ్ఞానంతో ఉన్న జీవులకు భగవంతుడు జ్ఞానం ప్రసాదించుగాక!

- స్వామి శివానంద

Wednesday 1 November 2017

శివయోగసాధన- శివలింగ పూజ- స్వామి శివానంద

శివలింగ పూజ

శివలింగం అంటే పురుషాంగం లేదా   అని, ప్రకృతిలోని పునరుత్పత్తి శక్తికి సంకేతం అని జనబాహుళ్యంలో నమ్మకం ఉంది. ఇది ఉపేక్షింపరాని, తీవ్రమైన పొరపాటు మాత్రమే కాదు, తీవ్రమైన తప్పు కూడా. వేదకాలం తర్వాతి కాలంలో, లింగం అనేది శివుని పునరుత్పత్తి శక్తికి చిహ్నముగా మారింది. లింగం అనేది తారతమ్యము చూపే గుర్తు కావచ్చు, కాని అది కామానికి సంకేతం కాదు. మీరు లింగపురాణంలో చూస్తే, "ప్రధానం ప్రకృతిర్ యదాహుర్-లింగముత్తమం; గంధవర్ణరసైర్హీనం శబ్ద-స్పర్శ-విరాజితం" అని ఉంటుంది. ఆదిలో ఉన్న లింగం ముఖ్యమైనది మరియు వాసన, వర్ణం(రంగు), రుచి, వినికిడి (శబ్దము), స్పర్శ మొదలైనవాటికి అతీతమైనది. దాన్నే ప్రకృతి అనేవారు.

లింగం అంటే సంస్కృతంలో సంజ్ఞ/ గుర్తు/ చిహ్నము. అది ఒక ఉహను/ అనుమానాన్ని వ్యక్తపరిచే చిహ్నము. మీరు నదిలో పెద్ద వరదను చూస్తే, ఆ ముందురోజు భారీవర్షాలు కురిశాయని అనుమానం వ్యక్తం చేస్తారు. మీరు పొగను చూసినప్పుడు, నిప్పు ఉందని అనుమానిస్తారు/ ఊహిస్తారు. అనంతమైన రూపాలతో ఉన్న ఈ సువిశాలమైన ప్రపంచమే సర్వశక్తిమంతుడైన భగవంతుని లింగము (చిహ్నము). శివలింగం అనేది శివునికి చిహ్నము. మీరు ఒక్కసారి లింగాన్ని చూస్తే, మీ మనస్సు ఒక్కసారిగా ఉన్నత స్థితికి వెళ్ళి, మీరు స్వామి గురించి ఆలోచించడం మొదలుపెడతారు.

నిజానికి శివుడు నిరాకారుడు. ఆయనకు తనకంటూ ఒకరూపం లేదు, కానీ అన్నీ ఆయన రూపాలే. అన్ని రూపాల్లో శివుడు వ్యాపించి ఉన్నాడు. ప్రతి ఆకరం లేదా రూపం శివ లింగమే లేదా శివస్వరూపమే.

మనస్సును ఏకాగ్రం చేయటానికి శివలింగంలో అద్భుతమైన, గుహ్యమైన శక్తి ఉంది. అంజనం వేయడంలో మనస్సు ఎలాగైతే సులువుగా కేంద్రీకరించబడి ఉంటుందో, అలానే శివలింగం వైపు చూడగానే మనస్సు ఏకాగ్రతను పొందుతుంది. ఆ కారణంతోనే భారతీయ ప్రాచీన ఋషులు లేదా ద్రష్టలు, శివాలయాల్లో లింగాన్ని ప్రతిష్టించాలని సూచించారు.

శివలింగం తప్పులకు ఆస్కారం లేని మౌనంభాషలో "నేను అద్వీతీయుడను (రెండవది అనేది లేకుండా ఒక్కటైన ఉన్నావాడు), నిరాకారుడను" అని మీకు చెబుతోంది. శుద్ధమైన, పవిత్రమైన ఆత్మలు మాత్రమే ఈ భాషను అర్ధం చేసుకోగలవు. తక్కువ అవగాహన లేదా జ్ఞానం కలిగి కామంతో నిండిన ఉత్సాహంగల, అశుద్ధడైన విదేశీయుడు "ఓహ్! హిందువులు జననాంగాన్ని పూజిస్తారు. వాళ్ళు అమాయకులు, వాళ్ళకు తత్త్వజ్ఞానం లేదు" అని దూషణగా అంటాడు. విదేశీయులు తమిళం కానీ లేదా ఏ ఇతర భారతీయ భాష నేర్చుకున్నా, ముందు అతడు కొన్ని భూతు మాటలను ఏరుకుంటాడు. అది అతని ఉద్రేకమైన గుణం. అలాగే, ఉత్సాహం కల విదేశీయుడు, పూజించే చిహ్నాల్లో కూడా లోపాలు వెతుకుతాడు. లింగం అనేది నిరాకారుడు, అవిభాజ్యుడు, సర్వవ్యాపకుడు, సనాతనుడు, మంగళుడు, నిత్యశుద్ధుడు, ఈ సమస్త విశ్వంలో ఉన్న అమరత్వ సారమైనవాడు, మీ హృదయకుహరంలో కూర్చున్న మరణంలేనివాడు, నీ అంతర్యామి, లోపల దాగున్న ఆతం, పరంబ్రహ్మం అయిన పరమశివుఇని యొక్క బాహ్యచిహ్నము.  

శివలింగానికి మూడు భాగాలు ఉంటాయి. అట్టడుగు భాగం బ్రహ్మ-పిత, మధ్యభాగం విష్ణుపీఠం, పైభాగం శివపీఠం.

కొన్ని స్వయంభూ లింగాలు, కొన్ని నర్మదేశ్వరులు. భారతదేశంలో 12 జ్యోతిర్లింగాలు మరియు 5 పంచభూత లింగాలున్నాయి. కేదార్నాథ్, కాశీ విశ్వనాథుడు, శొమనాథుడు, వైద్యనాథుడు, రామేశ్వరుడు, ఘృష్ణేశ్వరుడు, భీమశంకరుడు, మహాకాలుడు, మల్లిఖార్జునుడు, అమలేశ్వరుడు, నాగేశ్వరుడు మరియు త్ర్యంబకేశ్వరుడు - ద్వాదశ జ్యోతిర్లింగాలు. కాళహస్తీశ్వరుడు, జంబుకేశ్వరుడు, అరుణాచలేశ్వరుడు, కాంచీపురంలోని ఏకామబరేశ్వరుడు మరియు చిదంబరంలోని నటరాజు పంచభూతలింగాలు. మధ్యార్జున గా పిలువబడే తిరువిదైమరుదుర్ లో ఉన్న మహాలింగ ఆలయం దక్షిణభారతదేశంలో గొప్ప శివాలయం.

స్పటికలింగం కూడా శివుని చిహ్నమే. శివారాధనకు లేదా శివపూజకు దీన్ని నిర్దేశిస్తారు. అది స్ఫటికశిలతో చేయబడి ఉంటుంది. దానికి తనకంటూ ఒక రంగు ఉండదు కానీ దానికి దగ్గరగా ఉన్న వస్తువుల రంగును తీసుకుంటుంది. అది నిర్గుణపరబ్రహ్మాన్ని, లేదా నిర్గుణ పరమాత్మాన్ని మరియు నిర్గుణ శివుడిని సూచిస్తుంది.

నిజాయతీ గల భక్తునకు శివలింగం అంటే ఒక శిల కాదు. అది సమస్తైన తేజస్సు, చైతన్యం. ఆ లింగం అతడితో మాట్లాడుతుంది, ధారాళమైన కన్నీటిని కార్పిస్తుంది, గగుర్పాటు కలిగిస్తుంది, హృదయాన్ని కరిగిస్తుంది, అతడిని శరీరిక స్పృహ నుంచి పైకి తీసుకువస్తుంది మరియు భగవంతునితో సంభాషించి, నిర్వికల్ప సమాధిని పొందేలా చేస్తుంది. శ్రీ రాముడు రామేశ్వరంలో శివలింగాన్ని అర్చించాడు. విద్వాసుడైన రావణుడు శివపూజ చేశాడు. లింగంలో ఎంత అద్భుతమైన శక్తి ఉండి ఉంటుంది!

మీరంతా మనస్సుకు ఏకాగ్రతను ఇచ్చి, శిష్యునకు ప్రారంభంలో మనస్సు ఆయన వైపు వెళ్ళేలా చేసే శివుని చిహ్నమైన లింగపూజ ద్వారా నిరాకరుడైన శివుని పొందుగాక! 

- స్వామి శివానంద