Saturday 2 September 2017

వక్రతుండ మహాకాయ..... (3)

"...... దిగీశాదిరూపం
అసత్ సత్ స్వరూపం జగద్ధేతురూపం సదావిశ్వరూపం గణేశం నతాః స్మః ||
అని గణపతిని గర్గ మహర్షి కీర్తించినట్లు గణేశపురాణంలో ఉంది. 

దశదిశలా వ్యాపించి ఉన్నవాడు; అసత్ (నశించిపోయే వస్తువులు, ప్రపంచం, పంచభూతాలు మొదలైనవి), సత్ (శాశ్వతమైనది, పరబ్రహ్మతత్త్వం) - ఈ రెండింటి రూపంలో ఉన్నవాడు, జగత్తుకు కారణమైనవాడు, ఈ విశ్వం యొక్క రూపంలో ఉన్న గణేశునికి నమస్కారలు అని భావం.

కనపడని తత్త్వమే కాదు, కనిపించే ఈ జగత్తు కూడా గణపతి స్వరూపమే. ఆయన తప్ప అన్యమైనది లేదు. ఈ జగత్తు మిథ్య అని కొన్ని సంప్రదాయల్లో ఎందుకు చెప్తారంటే, అలా చెప్పకపోతే ఎవ్వరూ అంతర్ముఖమవ్వరు. భౌతికమైన దృష్టితో బ్రతుకుతున్న వ్యక్తికి తాను అనుభవించేదంతా అసత్యమని, ఇంతకంటే గొప్పది ఇంకోటి ఉందని చెప్తే తప్పించి అతడు ఆత్మాన్వేషణ ప్రారంభించడు. అయితే చివరకు ఈ జగత్తు మిథ్య కాదు, అలా అని వేరేదో కాదు, ఇది కూడా భగవంతుని వ్యక్తరూపమే అని తెలుస్తుంది. అదేదో ఇప్పుడే తెలుసుకోవచ్చు కదా, జగత్తు లేకున్నా భగవంతుడు ఉన్నాడని, కానీ భగవంతుడు లేకుండా జగత్తు లేదని, దీనికి ప్రత్యేకమైన అస్థిత్వం లేదని, ఇది ఆయన నుంచి వచ్చిందని, ఇది ఆయనేనని ఇప్పటి నుంచే చూసే ప్రయత్నం చేయచ్చు కదా?! ఇలా చూసేవాడు భక్తుడు, భక్తియోగం ఈ మార్గాన్నే సూచిస్తుంది.……..

ఆధ్యాత్మికత అంటే అంతర్ముఖమవ్వడం. అయితే అంతర్ముఖమై అలాగే ఉండిపోవాలా? చాలామంది ఆధ్యాత్మికత పేరు చెప్పి, ఈ లోకంతో మనకేంటి అంటారు. అది పలాయనవాదమే అవుతుంది కానీ ఆధ్యాత్మికత కాదు. తాను అంతర్ముఖమై దర్శించిన సత్యాన్ని, అదే అంతఃనేత్రంతో బయట కూడా దర్శించాలి. అంటే మనసు నుంచి కాక, హృదయం నుంచి లోకాన్ని చూడాలి. అలా హృదయం నుంచి చూస్తూ జీవించాలి….. లోపల తాను ఏదైతే అనుభూతి చెందాడో, బయట ఉన్న ప్రతి అణువు (Atom) లో అదే అనుభూతి చెందాలి. భగవంతుడిని లోపలే కాదు, బయట కూడా దర్శించాలి. అప్పటివరకు మోక్షం రాదు. మనకున్న మామూలు దృష్టి నుంచి పైకి ఎదిగితే, ఈ లోకంలో ప్రతి అణువులో దైవమే ఉందని తెలుస్తుంది..... ప్రతి చర్యంలోను (Action), ప్రతిచర్య (Reaction) లోనూ ఆయన్నే చూడగలగాలి. అలా అన్నిటిలో చూసే ప్రయత్నం చేస్తే, ఆయన అనుగ్రహం చేత తప్పకుండా, అంతటా ఆయన్ను చూడగలిగే దృష్టి లభిస్తుంది. సాధ్యం కాదు అనుకోవడమే వక్రము….. 

భగావన్ రమణ మహర్షి, వారి ఉపదేశసారంలో 'జగత ఈశాధీయుక్త సేవనం, అష్టమూర్తి భృద్దేవపూజనం -5||’

ఈ జగత్తే ఈశ్వరుడు అనే బుద్ధితో కూడి, దీనికి సేవ చేస్తే, అది అష్టమూర్తులుగా వ్యక్తమవుతున్న భగవంతునికి చేసే పూజయే అవుతుంది అని భావం. ఇది పరిపూర్ణమైన భక్తియోగ మార్గం. అందుకోసం అంతర్ముఖమై, ఆ అంతఃదృష్టిని నిలుపుకుంటూనే దేశానికి, ధర్మానికి, లోకానికి సేవ చేయాలి, అందరికీ ప్రేమను పంచాలి. అంతటా దైవాన్నే చూస్తే, అప్పుడు కోపం, ద్వేషం, పగ, ప్రతీకారం, చిరాకు మొదలైన లక్షణాలకు తావు ఉండదు. ఇతరుల కోపంలో కూడా మనం స్వామినే చూస్తాము. ద్వేషాన్ని కూడా ద్వేషించము, పగను కూడా ప్రేమిస్తాము. ఎందుకంటే అన్నిటిలో ఆయనే ఉన్నాడు. మంచి, చెడులు రెండూ ఆయన నుంచే ఉద్భవించాయి. ఒకటి ఎలా ఉండాలో చెప్తే, ఇంకోదాని ద్వారా ఎలా ఉండకూడదో చెప్తున్నాడు.... మనం అనుకున్నది జరగనప్పుడు, అనుకోనిది జరిగినప్పుడు, మన ఆశలకు (expectations) భిన్నంగా జరిగినప్పుడు కోపం వస్తుంది. కానీ అంతటా ఆయనే ఉన్నాడు, ఆయన ఆజ్ఞ ప్రకారమే ఏదైనా జరుగుతోంది అని నిజంగా నమ్మితే, అనుకోనిది జరిగినా కోపం ఉండదు, బాధ ఉండదు. ఎవరివల్లనో పనులు ఆగిపోయాయని వాళ్ళ మీద విరుచుకుపడటం ఉండదు. మనం అలాంటి స్థితిని చేరుకోవాలి.  నిజానికి ఇవన్నీ చదివితే అనుభవంలోకి రావు, ఆచరణలో పెట్టాలి, మనం చేసే ప్రతి పనిలో ఆయన్ను చూడగలగాలి. అందుకు సిద్ధమవ్వాలి. పాత ఆలోచనలను ఈ క్షణంలోనే విడిచిపెట్టాలి.  కర్మ(ఆచరణ) ద్వారా మాత్రమే జ్ఞానం అనుభవంలోకి వస్తుంది. ఖచ్ఛితంగా దైవం యొక్క స్పందనను మనం వినవచ్చు. ప్రతి దాన్లోను జీవం ఉట్టిపడటం కనిపిస్తుంది. అప్పుడు విశ్వమంతా వ్యాపించి ఉన్న మహాగణపతి దర్శనం అవుతుంది. అదే గణపతి ‘మహాకాయం’.  విశ్వరూప గణపతికి ఎన్నో ముఖాలు ఉంటాయి. అందులోకి నీ ముఖం కూడా ఒకటి ఉంటుంది. అంటే నువ్వు ఆయన నుంచి వేరుగా లేవు. ఆయనలోనే ఉన్నావు. అదే మహాకాయం.

భగావన్ రమణ మహర్షి, వారి ఉపదేశసారంలో 'జగత ఈశాధీయుక్త సేవనం, అష్టమూర్తి భృద్దేవపూజనం -5||’
ఈ జగత్తే ఈశ్వరుడు అనే బుద్ధితో కూడి, దీనికి సేవ చేస్తే, అది అష్టమూర్తులుగా వ్యక్తమవుతున్న భగవంతునికి చేసే పూజయే అవుతుంది అని భావం. ఇది పరిపూర్ణమైన భక్తియోగ మార్గం. అందుకోసం అంతర్ముఖమై, ఆ అంతఃదృష్టిని నిలుపుకుంటూనే దేశానికి, ధర్మానికి, లోకానికి సేవ చేయాలి, అందరికీ ప్రేమను పంచాలి. అంతటా దైవాన్నే చూస్తే, అప్పుడు కోపం, ద్వేషం, పగ, ప్రతీకారం, చిరాకు మొదలైన లక్షణాలకు తావు ఉండదు. ఇతరుల కోపంలో కూడా మనం స్వామినే చూస్తాము. ద్వేషాన్ని కూడా ద్వేషించము, పగను కూడా ప్రేమిస్తాము. ఎందుకంటే అన్నిటిలో ఆయనే ఉన్నాడు. మంచి, చెడులు రెండూ ఆయన నుంచే ఉద్భవించాయి. ఒకటి ఎలా ఉండాలో చెప్తే, ఇంకోదాని ద్వారా ఎలా ఉండకూడదో చెప్తున్నాడు.... మనం అనుకున్నది జరగనప్పుడు, అనుకోనిది జరిగినప్పుడు, మన ఆశలకు (expectations) భిన్నంగా జరిగినప్పుడు కోపం వస్తుంది. కానీ అంతటా ఆయనే ఉన్నాడు, ఆయన ఆజ్ఞ ప్రకారమే ఏదైనా జరుగుతోంది అని నిజంగా నమ్మితే, అనుకోనిది జరిగినా కోపం ఉండదు, బాధ ఉండదు. ఎవరివల్లనో పనులు ఆగిపోయాయని వాళ్ళ మీద విరుచుకుపడటం ఉండదు. మనం అలాంటి స్థితిని చేరుకోవాలి.  నిజానికి ఇవన్నీ చదివితే అనుభవంలోకి రావు, ఆచరణలో పెట్టాలి, మనం చేసే ప్రతి పనిలో ఆయన్ను చూడగలగాలి. అందుకు సిద్ధమవ్వాలి. పాత ఆలోచనలను ఈ క్షణంలోనే విడిచిపెట్టాలి.  కర్మ(ఆచరణ) ద్వారా మాత్రమే జ్ఞానం అనుభవంలోకి వస్తుంది. ఖచ్ఛితంగా దైవం యొక్క స్పందనను మనం వినవచ్చు. ప్రతి దాన్లోను జీవం ఉట్టిపడటం కనిపిస్తుంది. అప్పుడు విశ్వమంతా వ్యాపించి ఉన్న మహాగణపతి దర్శనం అవుతుంది. అదే గణపతి ‘మహాకాయం’.  విశ్వరూప గణపతికి ఎన్నో ముఖాలు ఉంటాయి. అందులోకి నీ ముఖం కూడా ఒకటి ఉంటుంది. అంటే నువ్వు ఆయన నుంచి వేరుగా లేవు. ఆయనలోనే ఉన్నావు. అదే మహాకాయం.

సదావిశ్వరూపం గణేశం నతాః స్మః

వివరణ ఇంకా ఉంది……..

No comments:

Post a Comment