Saturday 29 April 2017

స్వామి శివానంద సూక్తి



Body-building is the foundation of nation building. Build the body through nature’s aids. Avail yourself of healing agencies of nature—the sun, water, air, earth, steam, fasting, herbs, etc. Observe the laws of eating, drinking, sleeping, thinking and conducting yourself as laid down by the ancient Rishis and sages. Live in tune with nature. Use the herbs and greens. He who observes the rules of health and hygiene, who is moderate in eating, drinking, and other things, regular in his prayer, Japa, meditation who is free from jealousy, pride, hatred, who observes Brahmacharya, is free from diseases. He is healthy and attains longevity.

- Swami Sivananda

Friday 28 April 2017

జీవితాన్ని అంకితం చేయండి - స్వామి సచ్చిదానంద భోద



Dedicate Your Life

When you renounce your attachment, there is nothing to shake you. It is the feeling of possession, of clinging, that disturbs the mind. Dedicate your life in the name of God or humanity, and your mind will always be clean and calm. You will reflect your true nature always. That is the goal of all the different paths: to keep the mind clean and calm.

- Swami Satchidananda

Thursday 27 April 2017

స్వామి రామ తీర్థ సూక్తి



ఎంత చక్కని మాట- ఇది అర్దమైతే మన జీవితాలు మారిపోతాయి

Wanted —reformers
Not of others .... but of themselves,
who have won not university distinctions, but victory over the local self.

- Swami Rama Tirtha

Wednesday 26 April 2017

మహర్షి మహేశ్ యోగి సూక్తి



The philosophy of life is this: Life is not a struggle, not a tension... Life is bliss. It is eternal wisdom, eternal existence.

- Maharishi Mahesh Yogi

Tuesday 25 April 2017

స్వామి శాంతానంద పురీ సూక్తి



It is mainly the Grace of God or Guru which takes one to God Realisation, but one's own efforts in the form of Sadhana are essential in order to draw the Grace which is ever flowing.

- Swami Shantananda Puri

Sunday 23 April 2017

సద్గురు శివానంద మూర్తి గారి సూక్తి



Sadhana without objective goal is a waste. Sadhana is nothing but remembering all the time his desire to get away once for all to reach God. Remembering the desire without break is the ultimate meaning of sadhana.

- Satguru Sivananda Murthy Garu

హిందూ ధర్మం - 242 (జ్యోతిష్యం- 22) (మన్వంతరాలు)

ఒక బ్రహ్మ దినము లో 14 మన్వంతరాలు, 15 మన్వంతర రాత్రులు ఉంటాయి. ప్రస్తుతము మనము ఏడవ మన్వంతరములో ఉన్నాము. ప్రతి మన్వంతరము 71 మహాయుగములుగా విభజించబడినది.

భాగవతం అష్టమ స్కందంలో మన్వంతరాల గురించిన వివరణ ఉన్నది. ప్రస్తుతం వైవస్వత మన్వంతరంలో 27 మహాయుగాలు గతించి 28వ మహాయుగంలో సత్య, త్రేతా, ద్వాపర యుగాల తరువాత కలియుగం నడుస్తున్నది. ప్రతి మన్వంతరం లోను సప్తర్షులు, ఇంద్రుడు, సురలు మారుతుంటారు. భగవంతుని అవతారాలు కూడా మారుతుంటాయి.

14 మన్వంతరాల పేర్లు

స్వాయంభువ మన్వంతరము
స్వారోచిష మన్వంతరము
ఉత్తమ మన్వంతరము
తామస మన్వంతరము
రైవత మన్వంతరము
చాక్షుష మన్వంతరము
వైవస్వత (ప్రస్తుత) మన్వంతరము
సూర్య సావర్ణిక మనవు మన్వంతరము
దక్షసావర్ణి మన్వంతరము
బ్రహ్మసావర్ణి మన్వంతరము
ధర్మసావర్ణి మన్వంతరము
భద్రసావర్ణి మన్వంతరము
దేవసావర్ణి మన్వంతరము
ఇంద్రసావర్ణి మన్వంతరము

1. స్వాయంభువ మన్వంతరము
తండ్రి - బ్రహ్మ
మనువు - స్వాయంభువు.ప్రథముడు
భార్య - శతరూప(అనంతి)
మనుపుత్రులు - ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు. ఉత్తానపాదుని కొడుకు ధ్రువుడు తపస్సు చేసి, నారాయణుని దర్శనము పొందాడు.
మనుపుత్రికలు -ఆకూతి(రుచి ప్రజాపతి భార్య),ప్రసూతి(దక్ష ప్రజాపతి భార్య),దేవహూతి(కర్ధమ ప్రజాపతి భార్య).
భగవంతుని అవతారాలు - కపిలుడు, యజ్ఞుడు - దేవహూతి కడుపున కపిలునిగా జన్మించి ధర్మ జ్ఞానాలను లోకాలకు ఉపదేశించాడు.దీనినే కపిలగీత అని అన్నారు. స్వాయంభువ మనువు చిరకాలం రాజ్యం పాలించి, విరక్తుడై రాజ్యాన్ని త్యజించి, భార్యయైన శతరూపతో బయలుదేరి అరణ్యాలకు వెళ్ళాడు. సునంద నది ఒడ్డున తీవ్రమైన తపస్సు చేశాడు. క్షుధార్తులైన అసురులు, యాతుధానులు ఆ మనువును భక్షించడానికి వచ్చారు. నారాయణుడు ఆకూతి(స్వాయంభువ మనువు కూతురు) గర్భంలో యజ్ఞునిగా జన్మించి దుష్టులను సంహరించి త్రిదివాలను పాలించాడు.వేదశిరుడు అను విప్రుని కుమార్తెకు విభుడు అను పేరుతో అవతరించెను.
సప్తర్షులు - వశిష్ట, అత్రి, మరీచి, అంగిరసుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు
ఇంద్రుడు - రోచనుడు
సురలు - యామాదులు
ప్రహ్లాదుని జననము, నరసింహ అవతారము మరియు వరహ అవతారము ఈ మన్వన్తరములొ జరిగినది.

2. స్వారోచిష మన్వంతరము
మనువు - స్వరోచికి వనదేవతయందు కలిగిన కుమారుడు.
మనువు పుత్రులు - చైతుడు, రోచిష్మదుడు, కింపురుషుడు
భగవంతుని అవతారాలు - విభువు - వేద శిరసునికి తుషతయందు విభుడనే పేరుతో అవతరించి, కౌమార బ్రహ్మచారియై, ఎనభై అయిదు మంది మునులచే వ్రతాన్ని ఆచరింపజేశాడు.
సప్తర్షులు - స్తంభుడు, దత్త, ,ఔర్యుడు, వశిష్టపుత్ర, కశ్యపపాణి, బృహస్పతి, చ్యవనాత్రి
ఇంద్రుడు - విపశ్చింతుడు
సురలు - తుషితాదులు
సురత చక్రవర్తి వృత్తాంతము

3. ఉత్తమ మన్వంతరము
మనువు - ప్రియవ్రతుని కొడుకు.స్వాయంభువమనువు మనవడు
మనువు పుత్రులు - పవనుడు, సృంజయుడు, యజ్ఞహోత్రుడు
భగవంతుని అవతారాలు - సత్య సేనుడు - ధర్మునికి సూనృత యందు సత్యసేనుడనే పేర అవతరించి సత్యవ్రతం అనుష్టించి దుష్టులను సంహరించి సత్యజితునికి సుఖాన్ని కూర్చాడు.
సప్తర్షులు - ప్రమాదాదులు (వశిష్టుని సుతులు); కౌకుంది, కురుంది, దలయ, శంఖ, ప్రవాహిత, మిత, సమ్మిత - (సప్త ఊర్జులు)
ఇంద్రుడు - సత్యజిత్తు
సురలు - సత్యదేవ శృతభద్రులు

4. తామస మన్వంతరము
మనువు - సురాష్ట్రుడు అనే రాజు వలన మృగి(లేడి)(ఉత్పలావతి శాపవశమున) కి జన్మించెను.
మనువు పుత్రులు - వృషాఖ్యాతి, కేతువు, జానుజంఘుడు, శాంతి, నరుడు, ప్రస్థలుడు, దృఢుడు మరియు కృతబంధువు మొదలైన పదుగురు పుత్రులు
భగవంతుని అవతారాలు - హరి - హరిమేధసునికి హరిణియందు హరి యను పేరిట అవతరించి మకరగ్రస్తుడైన గజేంద్రుని రక్షించాడు. (గజేంద్ర మోక్షము)
సప్తర్షులు - ధాత, జహ్నుడు, పృథుడు, కావ్యుడు, కపీవంశుడు, అగ్ని, అకపీవంశుడు
ఇంద్రుడు - త్రిశిఖుడు(శిబి)
సురలు - విధృతి తనయులు వైధృతులు (వేదరాశి నశించినపుడు ఆ తేజస్సును తమలో జీర్ణం చేసుకొన్నవారు)

5. రైవత మన్వంతరము
మనువు - దుర్దమునకు రేవతియందు పుట్టినవాడు.
మనువు పుత్రులు - బలుడు, బంధుడు, స్వయంభావ్యుడు, సత్యకుడు, అర్జున ప్రతినింద్యాదులు
భగవంతుని అవతారాలు - వైకుంఠుడు - శుభ్రునకు వికుంఠయందు వైకుంఠునిగా అవతరించాడు. రమాదేవి ప్రార్ధనను మన్నించి వైకుంఠాన్ని నిర్మించాడు.
సప్తర్షులు - హిరణ్యరోముడు, వేదశిరుడు, ఊర్ధ్వబాహుడు, దేవబాహుడు, సత్యనేత్రుడు, పర్జన్యుడు యదుధృడు
ఇంద్రుడు - విభుడు
సురలు - భూత దయాదులు

6. చాక్షుష మన్వంతరము
మనువు - చక్షుసుని భార్య అగు జృహతికి రిపుని వల్ల కలిగిన పుత్రుడు చాక్షుసుడు.
మనువు పుత్రులు - శతద్యుమ్నుడు, ఊరుడు, పూరుడు, తపస్వి శుచి, అగ్నిష్టోముడు, అతిరాత్రుడు, ప్రద్యుమ్నుడు మరియు అభిమన్యుడు మొదలైనవారు.
భగవంతుని అవతారాలు - అజితుడు, కూర్మావతారం - వైరాజునికి సంఖ్యాతియందు అకితుడనే పేర అవతరించాడు. ఇదే మన్వంతరంలో దేవతలు, రాక్షసులు కలిసి అమృతము కొరకై క్షీరసాగర మథనము చేశారు. భగవంతుడు కూర్మావతారుడై మందరగిరిని నిలిపాడు. శివుడు కాలకూట విషము మింగాడు. లక్ష్మీ దేవి అవతరించింది. సాగర మధనం చివర ధన్వంతరి అమృతంతో వచ్చాడు. మోహినీరూపుడై భగవంతుడు అమృతాన్ని దేవతలకు అందజేశాడు.
సప్తర్షులు - విరజుడు, అతినాముడు, భృగుడు, నభుడు, వివస్వంతుడు, సుధాముడు, సహిష్ణుడు
ఇంద్రుడు - మనోజవుడు
సురలు - ఆప్యాదులు

7. వైవస్వత (ప్రస్తుత) మన్వంతరము
ఇది ప్రస్తుతం జరుగుతున్న మన్వంతరము. చాక్షుష మన్వంతరం చివర కల్పాంత ప్రళయకాలంలో భగవానుడు మత్స్యావతారుడై జలరాశినుండి జనులను, ఓషధులను దరిజేర్చాడు. వేదాలను కాపాడాడు.

మనువు - వివస్వంతుడని పుత్రుడు వైవస్వతుడు.
తండ్రి - వివస్వంతుడు (సూర్య భగవానుడు)
తల్లి - సంజ్ఞ
భార్య - శ్రద్ధ అందుకే ఇతనికి శ్రాద్ధదేవుడు అనే పేరు కూడా ఉంది.
మనువు పుత్రులు - ఇక్ష్వాకుడు, నాభాగుడు,ధృష్టుడు,సంయాతి,కరుషుడు,వృషధ్రుడు,వసుమంతుడు,నరిష్యంతుడు మరియు పృషపదుడు.
మనువు పుత్రికలు - ఇల(సుద్యుమ్నుడు).
భగవంతుని అవతారాలు - కశ్యపునకు అదితి యందు వామనుడిగా జన్మించి బలి చక్రవర్తి నుండి మూడడుగుల నేల యాచించి త్రివిక్రముడై ముల్లోకాలను ఆక్రమించాడు.
సప్తర్షులు - కశ్యపుడు, అత్రి, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, జమదగ్ని, భరద్వాజుడు
ఇంద్రుడు - ఓజస్వి
సురులు - వసువు, రుద్రుడు, ఆదిత్యుడు, విశ్వదేవుడు, నాసత్యుడు, మరుత్తు
ఈ మన్వంతరమున పరశురామ, శ్రీ రామ, బలరామ, శ్రీ కృష్ణ మరియు బుద్ద అవతారములు జరిగినవి, మరియు కల్కి అవతరిస్తారు.

8. సూర్యసావర్ణిక మన్వంతరము
రాబోయే మన్వంతరము

మనువు - సావర్ణి - విశ్వకర్మకు సంజ్ఞ, ఛాయ అను ఇద్దరు పుత్రికలు. వీరు వివస్వంతుని భార్యలయ్యారు. వివస్వంతునికి బడబ అనే మూడవ భార్య కూడా ఉన్నదంటారు. సంజ్ఞకు యముడు, యమి, శ్రాద్ధదేవుడు జనించారు. ఛాయకు సావర్ణి, తపతి, శనైశ్చరుడు కలిగారు. బడబకు అశ్వినులు జనించారు. వీరిలో సావర్ణియే కాబోయే ఎనిమిదవ మనువు.
తండ్రి - సూర్యుడు
తల్లి - ఛాయ
మనువు పుత్రులు - నిర్మోహ వారజస్కాదులు
భగవంతుని అవతారాలు - సార్వభౌముడు - వేదగుహ్య అయిన సరస్వతి యందు సార్వభౌముడనే పేర అవతరిస్తాడు. ఇంద్ర పదవిని పురందరుని నుండి బలికి అప్పగిస్తాడు. వైవస్వత మన్వంతరంలో వామనునికి మూడడుగుల వేల దానమిచ్చినందుకు ప్రతిఫలంగా బలికి ముల్లోకాల సార్వభౌమత్వం సిద్ధించనుంది. బలి ఇప్పుడు సుతల లోకంలో ఉన్నాడు.
సప్తర్షులు - అజర, అశ్వత్థామ, గౌతమ, శరద్వంత, కౌశిక, కాశ్యప, ఔర్వ .
ఇంద్రుడు - విరోచన సుతుడైన బలి
సురలు - సుతపసులు, విరజులు, అమృత ప్రభులు

9. దక్షసావర్ణి మన్వంతరము
మనువు - దక్షుని పుత్రుడు దక్ష సావర్ణి
మనువు పుత్రులు - ధృతకేతువు, దీప్తి కేతువు మొదలైనవారు.
భగవంతుని అవతారాలు - (ధర్మసేవ్యుడు?) భగవంతుడు ఆయుష్మంతునికి అంబుధార వలన ఋషభుడనే పేర అవతరించి అద్భుతునికి ఇంద్ర పదవిని ప్రసాదిస్తాడు.
సప్తర్షులు - మేథాతిధి, వసువు, సత్యుడు, జ్యోతిష్మంతుడు, ద్యుతిమంతుడు, సవనుడు మరియు హవ్యవాహనుడు
ఇంద్రుడు - అద్భుతుడు(కుమారస్వామి)
సురలు - పరమరీచి గర్గాదులు

10. బ్రహ్మసావర్ణి మన్వంతరము
మనువు - ఉపశ్లోకుని సుతుడు బ్రహ్మసావర్ణి
మనువు పుత్రులు- భూరిషేణుడు మొదలైనవారు
భగవంతుని అవతారాలు - భగవంతుని అంశచే విశ్వసృజునికి విషూచియందు జనించి ఇంద్రునిగా ఉంటాడు. శంభునికి శక్తినిస్తాడు.
సప్తర్షులు - హవిష్మంతుడు, సుకృతి, సత్య, అపంముర్తి, నాభాగ, అప్రతిమౌజసుడు, సత్యకేతు
ఇంద్రుడు - శంభుడు
సురలు - విభుదాదులు

10. ధర్మసావర్ణిక మన్వంతరము
మనువు - దక్షసావర్ణి కుమారుడు
భార్యలు - కీర్తి, లక్ష్మి, ధృతి, మేధ మరియు లజ్జ
మనువు పుత్రులు - సత్య ధర్మాదులు, శముడు, కాముడు హరుడు పదిమంది.
భగవంతుని అవతారాలు - సూర్యునికి ధర్మసేతువనే పేర జన్మించి వైధృతునికి త్రైలోక్య సామ్రాజ్యాన్నిస్తాడు.
సప్తర్షులు - భరద్వాజ, ఆత్రేయ, రామ, వ్యాస, దీప్తిమంత, బహుశృత, ద్రౌణి
ఇంద్రుడు - వైధృతుడు
సురలు - విహంగమాదులు

12. రుద్రసావర్ణిక మన్వంతరము
మనువు - రుద్రసావర్ణిక
మనువు పుత్రులు - దేవసుతాదులు
భగవంతుని అవతారాలు - సత్య తాపసుడు - సత్యతపసునికి సూనృత యందు అవతరిస్తాడు.
సప్తర్షులు - తపస్వి, సుతపసుడు, తపోమూర్తి, తపోనిధి, తపోధృతి, ధ్యుతి, తపోధనుడు
ఇంద్రుడు - ఋతధాముడు
సురలు - పరితారులు

13. దేవసావర్ణి మన్వంతరము
మనువు - దేవసావర్ణి
మనువు పుత్రులు - విచిత్ర సేనాదులు
భగవంతుని అవతారాలు - దేవహోత్రునికి బృహతియందు దైవహోత్రుడు అనుపేర అవతరిస్తాడు. దివస్పతికి ఐశ్వర్యం అనుగ్రహిస్తాడు.
సప్తర్షులు - నిర్మోహ తత్వదర్శనాదులు; నిర్మోహ, తత్వదర్శనుడు, నిష్ప్రకంప, నిరుత్సుక, ధ్రుతిమతుడు, అవ్యయుడు, సుతప
ఇంద్రుడు - దివస్పతి
సురలు - సుకర్మాదులు

14. ఇంద్రసావర్ణి మన్వంతరము
మనువు - ఇంద్ర సావర్ణి
మనువు పుత్రులు - గంభీరాదులు
భగవంతుని అవతారాలు - సత్రాయణునకు బృహద్భానుడు అను పుత్రునిగా జన్మిస్తాడు.
సప్తర్షులు - అగ్నిబాహ్యాదులు; అగ్నిబాహు, శుచి, శుక్ర, మగధ, గృధ్ర, యుక్త, అజిత
ఇంద్రుడు - శుచి
సురలు - పవిత్రాదులు

To be continued ................

సేకరణ: వికీపిడియా

Saturday 22 April 2017

స్వామి శివానంద సూక్తి



If you want to increase your power of concentration, you will have to reduce your worldly desires and activities. You will have to observe silence everyday for some hours. Then only can the mind concentrate very easily and without difficulty.

- Swami Sivananda

ధరిత్రీ దినోత్సవం - వరాహ స్వామి



నాకు ధరిత్రీ దినోత్సవం అనగానే భూదేవి, వరహాస్వామి గుర్తుకువస్తారు. స్వార్ధపరుడైన హిరణ్యాక్షుడు భూదేవిని రసాతలానికి తీసుకువెళ్ళి, బంధిస్తే, శ్రీ మహావిష్ణువు వరహారూపంలో అవతరించి, భూదేవిని ఉద్ధరించారు. హిరణ్యాక్షుడిని సంహరించారు. అక్కడ ఉద్భవించిన వరాహం మామూలు వరాహం కాదు, అది దివ్య వరాహం, యజ్ఞవరహాం. ఆయన రూపమే యజ్ఞస్వరూపం. అక్కడ జరిగిన యుద్ధంలో వాడబడిన అస్త్రాలు కూడా అలాంటివే. ఇది నేను ఒకసారి మా గురువుగారి ప్రవచనంలో విన్నాను. ఆ ఘట్టాన్ని సరిగ్గా అర్దం చేసుకుంటే, అప్పుడు ఒక్కడే హిరణ్యాక్షుడు ఉండేవాడు, ఇప్పుడు ప్రతివాడిలో ఒకడు ఉన్నాడు. స్వార్ధ చింతన పెరిగిపోయింది. 'ఈ లోకంలో చలించేది, చలించనిదంతా ఈశ్వరమయమై ఉంది. అందువల్ల భోగ బుద్ధితో కాక, త్యాగబుద్ధితో చరించి, జీవించండి' అని ఉపనిషత్తు ఆదేశించింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చూస్తే భూగోళం, వనరుల వినియోగంలో త్యాగబుద్ధికి బదులు భోగబుద్ధి ప్రవేశించి సమస్తమూ దుర్వినియోగం చేస్తున్నాం, అతివినియోగం చేస్తున్నాం. తర్వాతి తరాలకు అందకుండా చేస్తున్నాం, ఈ భూమిపై మనకు ఏ అధికారం లేదు, కేవలం జీవించే అవకాశం మాత్రమే ఉందని, అది కూడా ఈశ్వరుని కరుణ కారణంగానేనని మర్చిపోతున్నాం. అందుకే ఈనాడు ప్రపంచంలో భూమి, నీరు, వాయువు, ఆకాశం, ప్రజల మనసులు సహా సర్వం కలుషితమైపోయింది.

ఇప్పుడు మనం వరాహస్వామి అవతార ఘట్టం గుర్తుకుతెచ్చుకుని మన మార్గాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ భూమిపై భోగబుద్ధితో కాక, త్యాగబుద్ధితో చరించాల్సిన అవసరం ఉంది. ప్రపంచం ఏప్రియల్ 22 న ధరిత్రీ దినోత్సవం జరుపుకుంటోంది కానీ నిజానికి సనాతన ధర్మాన్ని పాటించేవారికి వరాహస్వామి అవతరించి, భూమాతను ఉద్ధరించిన రోజే ధరిత్రీ దినోత్సవం. వరాహజయంతియే నిజమైన ధరిత్రీ దినోత్సవం (Earth Day). మన గత చరిత్రను మనం స్మరించాల్సిన రోజది. మనకు అది గుర్తుకులేదు, కనీసం ఈరోజైనా గుర్తుకు తెచ్చుకుందాం.

Friday 21 April 2017

అంకితభావంతో ఉన్న వ్యక్తి- స్వామి సచ్చిదానంద బోధ



A Truly Dedicated Person

You do not need to go to a monastery or sit in a cave somewhere because, it is not in renouncing actions that you will find peace, but in renouncing your attachment to the results of the actions. A truly dedicated person is the king of kings, the Queen of Queens, the richest person in the world.

- Swami Satchidananda

Wednesday 19 April 2017

నీమ్ కరోలి బాబా సూక్తి



RAM’S FORM LEFT THIS WORLD, KRISHNA’S FORM LEFT THIS WORLD, BUT THE NAME STAYS. BY RECITING HIS NAME, EVERYTHING IS ACHIEVED.”
“EVERYTHING IS ACHIEVED.”

- Neem Karoli Baba

Monday 17 April 2017

కంచి పరమాచార్య సూక్తి


To go in search of money, fame and sensual pleasure, thinking them to be good, is to blacken our minds. What is it that is good for us? That which is good for the world -- and it is but a form of Paramatmam. This truth is known to our inner being; we realise it deep in our mind. That is why we find greater fulfilment in doing good to others, unmindful of all the difficulties, than in finding comforts for ourselves.

- Kanchi Paramacharya

Friday 14 April 2017

Thursday 13 April 2017

స్వామి దయానంద సూక్తి



While traveling to a particular destination, people may enjoy a few things along the way, but they do not lose sight of their destination. Self-knowledge need not be any different.

- Swami Dayananda 

14-04-2017, శుక్రవారం, చైత్ర బహుళ చవితి, సంకష్టహర చతుర్థీ.



14-04-2017, శుక్రవారం, చైత్ర బహుళ చవితి, సంకష్టహర చతుర్థీ.
చైత్ర మాసంలో వచ్చింది కనుక దీనికి వికట సంకష్టహర చతుర్థి అని పేరు.

వ్రత విధానం ఈ లింక్‌లో చూడగలరు.
http://ecoganesha.blogspot.in/2014/03/20-2014.html

14 ఏప్రిల్ 2017, చంద్రోదయ సమయం హైద్రాబాదులో (భారత కాలమానం ప్రకారం) - రాత్రి 9.10 నిమి||
http://www.drikpanchang.com/vrats/sankashti-chaturthi-dates.html

Wednesday 12 April 2017

Tuesday 11 April 2017

స్వామి కృష్ణానంద సూక్తి



All that we read and think does not get assimilated into the feeling of the heart. That is why a post-graduate scholar who is dead is not reborn with the same amount of knowledge. That which has gone deep into the heart becomes a part of our life. The rest is only a wind that blows over the surface of our minds.

- Swami Krishnananda

Monday 10 April 2017

స్వామి చిదానంద సూక్తి


If your Bhava is that you are doing every work for the purpose of attaining God then your work will be transformed into Sadhana. It may be that for the purpose of earning your livelihood you have taken up a job. But if you have this sublime Bhava, you will not only get your salary, but you will eventually attain Moksha, too!

- Swami Chidananda Saraswati

Sunday 9 April 2017

సద్గురు శివానంద మూర్తి గారి సూక్తి



Sadhana means coming out of all limitations.

- Satguru Sivananda Murthy Garu

హిందూ ధర్మం - 241 (జ్యోతిష్యం- 21) (కల్పాలు, వాటి పేర్లు)



కల్పం అంటే 4,32,00,00,000 సంవత్సరాలని, ఒక కల్పం బ్రహ్మదేవునకు ఒక రోజని చెప్పుకున్నాం. ఆ కల్పాల పేర్లు స్కాంద పురాణం, మత్స్య పురాణం, మహాభారతం మొదలైన గ్రంథాల్లో 30 పేర్ల వరకు చెప్పబడ్డాయి. అవి

మహాభారతంలో చెప్పిన ప్రకారం ప్రస్తుతం బ్రహ్మకు 51వ సంవత్సరంలో "శ్వేతవరాహ కల్పం" నడుస్తున్నది. మత్స్య పురాణం (290.3-12)లో 30 కల్పాల పేర్లు చెప్పబడ్డాయి. అవి

శ్వేత కల్పము / శ్వేత వరాహ కల్పము
నీలలోహిత కల్పము
వామదేవ కల్పము
రత్నాంతర కల్పము
రౌరవ కల్పము
దేవ కల్పము
బృహత్ కల్పము
కందర్ప కల్పము
సద్యః కల్పము
ఈశాన కల్పము
తమో కల్పము
సారస్వత కల్పము
ఉదాన కల్పము
గరుడ కల్పము
కౌర కల్పము
నారసింహ కల్పము
సమాన కల్పము
ఆగ్నేయ కల్పము
సోమ కల్పము
మానవ కల్పము
తత్పుమాన కల్పము
వైకుంఠ కల్పము
లక్ష్మీ కల్పము
సావిత్రీ కల్పము
అఘోర కల్పము
వరాహ కల్పము
వైరాజ కల్పము
గౌరీ కల్పము
మహేశ్వర కల్పము
పితృ కల్పము
వాయు పురాణం 21వ అధ్యాయంలో 28 కల్పాల పేర్లున్నాయి. తరువాతి అధ్యాయంలో మరో ఐదు కల్పాల పేర్లున్నాయి.

ఇప్పుడు మనం ఉన్నది బ్రహ్మదేవుని 51 సంవత్సరంలో, మొదటిదైన శ్వేతవరాహ కల్పంలో. అందుకే సంకల్పంలో 'శ్వేతవరాహ కల్పే' అని చెప్తారు. ఈ సమస్త జగత్తు శ్రీ మహావిష్ణువు ఆజ్ఞానుసారం నడుస్తున్నది కనుక నిత్యం చెప్పే సంకల్పంలో 'శ్రీ మహావిష్ణురాజ్ఞయ ప్రవర్తమానస్య' అని చెప్పుకుంటూ, కాలపురుషుడు, కాలస్వరూపుడు, కాలకాలుడైన ఆ శ్రీ మన్నారాయణుని స్మరించుకుంటాము.

అలాగె ప్రతి కల్పంలో బ్రహ్మదేవుడు ఒక మనువును సృష్టి చేస్తాడు. ఆ మనువు ఈ ప్రపంచాన్ని, అందులో జీవరాశిని సృష్టిస్తాడు. ప్రతి మన్వంతరము, ఒక మనువు జీవితకాలం వరకు ఉంటుంది, అనగా ఒక మన్వంతరం వయస్సు 30,67,20,000 సంవత్సరాలు. శ్రీ మహావిష్ణువు ఆజ్ఞ ప్రకారం నడిచే ఈ జగన్నాటకం ముందుకు సాగడానికి ప్రతి మన్వంతరం తర్వాత బ్రహ్మదేవుడు ఒక కొత్త మనువును సృష్టిస్తాడు. అది వారి పూర్వ పుణ్యాన్ని అనుసరించి ఉంటుంది. పూర్వ కల్పాలు, మన్వంతరాల్లో పుణ్యం చేసుకున్న జీవులు, తపస్సు చేసిన మహాత్ములు ఆ స్థాయికి చేరుకుంటారు. ప్రతి మన్వంతరము ఒక మనువు చేత పాలించబడుతుంది. ప్రతి మన్వంతరంలో శ్రీ మహావిష్ణువు ఒక కొత్త అవతారాన్ని స్వీకరిస్తారు, ఇంద్రపదవికి కొత్త ఇంద్రుడు వస్తాడు, సప్తఋషుల పదవులకు నూతనమైన వారు ఎన్నికవుతారు. బ్రహ్మ దేవుడి కాలమానంలో (31,10,40,00,00,00,000 సంవత్సరాల్లో) 5,04,000 మనువులు, బ్రహ్మదేవుని ఒక ఏడాదిలో 5040 మనువులు, బ్రహ్మదేవుని ఒక నెలలో 420 మనువులు ఉంటారని వేదాలు, ధార్మిక గ్రంథాలు చెప్తున్నాయి.

To be continued ..........

(సేకరణ: వికీపీడియా సౌజన్యంతో) 

Saturday 8 April 2017

స్వామి శివానంద సూక్తి



Do not try to drive away the unimportant and irrelevant thoughts. The more you try, the more they will return, the more they will gain strength. You will tax your energy and will. Become indifferent. Fill the mind with divine thoughts. They will gradually vanish. Get yourself established in Nirvikalpa Samadhi through constant meditation.

- Swami Sivananda

Friday 7 April 2017

ఆందోళన ఎందుకు? - స్వామి సచ్చిదానంద భోద



Why Worry?

Whatever has to come, will come; what will not come, will not come. Why should you worry about it? I know some of you might say, ‘Then should I not do anything?’ You should do something, yes. If you allow yourself to be an instrument in the hands of the divine, you will have plenty to do. You will be doing much more than anyone else. At the same time, you’ll be totally relaxed. Don’t think that relaxation or peace comes from not doing anything. No, you’ll be put to even greater use.

- Swami Satchidananda

Wednesday 5 April 2017

Sunday 2 April 2017

సద్గురు శివానంద మూర్తి గారి సూక్తి



The problem with desire is that it gets fulfilled! If not today, tomorrow, if not this janma, next birth!

- Satguru Sivananda Murthy Garu

హిందూ ధర్మం - 240 (జ్యోతిష్యం- 20) (కాలగణన - 4)



1 కృత, త్రేతా, ద్వాపర, కలియుగాలు (17,28,000 + 12,96,000 + 8,64,000 + 4,32,000) = 1 మహాయుగం (43,20,000 సంవత్సరాలు)
1 మన్వంతరం = 71 మహాయుగాలు (71* 43,20,000 = 30,67,20,000 సంవత్సరాలు)
ప్రతి మన్వంతరానికి ఒక మనువు ఉంటాడు. అతడు దానికి పాలకుడు.
ప్రతి మన్వంతరం తర్వాత ఒక కృతయుగం కాలమానికి సరిపడా సంధికాలం ఉంటుంది. అనగా 17,28,000 సంవత్సరాలు సంధికాలం. ఈ సంధికాలంలో భూమి అనంతమైన జలరాశిలో మునిగి ఉంటుంది. ఇక్కడ జలరాశి అంటే నీరుగా భావించకూడదు. అప్పుడు సృష్టి అంతా శూన్యంతో నిండి ఉంటుందని గ్రహించాల్సి ఉంటుంది.

బ్రహ్మదేవునకు 1 రోజు = 14 మన్వంతరాలు+ 15 చరణాలు అనగా 1,000 మహాయుగాలు.

సూర్య సిద్ధాంతంలో 14 వ అధ్యాయం - మానాధ్యాయంలో కాలాన్ని 9 విధాలుగా విభజించి, దాన్ని మానం అన్నారు. అందులో అతి చిన్నదైన ప్రాణం (4 సెకన్లు) నుంచి అతి పెద్దకాలమానమైన పర (300000.04 సౌర సంవత్సరాలు) వరకు ఉంది.

ఇప్పటికి బ్రహ్మకు 50 ఏళ్ళు గడిచాయి. 50 ఏళ్ళ ముగింపులో గతించిన ఆఖరి కల్పానికి పద్మ కల్పం అని పేరు. ఇప్పుడు మనం బ్రహ్మదేవుడి 51 వ సంవత్సరంలో మొదటి రోజులో ఉన్నాము. దీనికి శ్వేత వరహా కల్పం అని పేరు. ఈ మొదటి రోజులో ఇప్పటికే 6 మన్వతరాలు ముగిసి, ఏడవదైన వైవశ్వత మన్వంతరంలో ఉన్నాము. అందులో కూడా 27 మహాయుగాలు గడిచి, 28 వ మహాయుగంలో  కృత, త్రేతా, ద్వాపర యుగాలు గతించి, ప్రస్తుతం కలియుగంలో ఉన్నాము.

ఈ 4,32,000 సంవత్సరాల కలియుగం నాలుగు పాదాలుగా విభజించబడింది. ప్రతి పాదానికి 1,80,000 సంవత్సరాలు. అందులో ప్రథమ పాదంలో ఉన్నాము. ఈ 28 వ కలియుగం క్రీ.పూ.3102 లో ప్రారంభమైంది. ఇప్పటికే బ్రహ్మదేవుడికి 50 ఏళ్ళు గడిచి, రెండవ 50 సంవత్సరాల్లో ఉన్నాం కనుక సంకల్పంలో ద్వితీయ పరార్ధం అని చెప్పుకుంటాము.

శ్రీ రాముడు ఈ మన్వంతరంలోనే 24 వ త్రేతాయుగానికి చెందిన వాడు. శ్రీ కృష్ణుడు 28 వ ద్వాపరయుగానికి చెందినవాడు. గతించిన కాలమానంలో మనకు అతి సమీప కాలంలో వచ్చిన అవతార పురుషుడు శ్రీ కృష్ణుడు ఇలా అనేక అవతరాలు అనేక మహాయుగాలు, వేర్వేరు మన్వంతరాల్లో, కల్పాల్లో వచ్చాయి. వాటి అన్నిటి గురించి మనకు వివరంగా అందించేవి పురాణాలు. .

అందుకే సంకల్పంలో
శ్రీ మహావిష్ణో రాఙ్ఞయా, ప్రవర్త మానస్య, అద్య బ్రహ్మణః, ద్వితీయ పరార్థే, శ్వేతవరాహ కల్పే, వైవశ్వత మన్వంతరే, కలియుగే, ప్రథమ పాదే అని చెప్పుకుంటాము.

To be continued ............

Saturday 1 April 2017

స్వామి శివానంద సూక్తి



When the seen and the sight merge into one another in the seer, then is the experience of Ananda (bliss). This is Turiya state. Then one sees the illimitable Jnana, Atman only everywhere. All sorts of distinctions and dualities vanish now entirely.

- Swami Sivananda