Thursday 30 March 2017

స్వామి రామ్ దాస్ సూక్తి


The peace you crave for is ever within you. If you seek for it without, you will never have it anywhere. This is a great truth which very few realize.

-Swami Ramdas

Wednesday 29 March 2017

భీష్ముని సూక్తి



Ahimsa and truth speaking, control of senses, non-cruelty, non-hatred,- these, not the mortification of the body, do the sages term austerity.

- Bhishma pitamah

Monday 27 March 2017

శ్రీ వేంకటేశ్వర ప్రపత్తి నుంచి ఒక శ్లోకం- అర్దంతో



prāyaḥ prapanna janatā prathamāvagāhyau
mātuḥ stanāviva śiśo ramṛtāyamāṇau |
prāptau paraspara tulā matulāntarau te
śrīveṅkaṭeśa caraṇau śaraṇaṃ prapadye ||

O Lord Venkatesawara!
I seek refuge of Thy feet
which are to be seen at first
by the people that salute (them),
which are nectar-like
as the mother's breasts are to the baby,
which can be compared to each other,
and which are incomparable to anything else.

प्रायः प्रपन्न जनता प्रथमावगाह्यौ
मातुः स्तनाविव शिशो रमृतायमाणौ ।
प्राप्तौ परस्पर तुला मतुलान्तरौ ते
श्रीवेङ्कटेश चरणौ शरणं प्रपद्ये ॥

Saturday 25 March 2017

స్వామి శివానంద సూక్తి



Srutis emphatically declare: “This Atman cannot be obtained by weak persons.” Sincere aspirants dedicate their whole being to contemplation of the Eternal, having withdrawn their affection from the world of sense-objects. Those who have destroyed the Vasanas and host of habitual thoughts will enjoy their final beatitude in the Brahmic seat, replete with trust, quiescence and equality. They will have equal vision over all. This mischievous and powerful mind generates all pains and all fears, all sorts of diversities, heterogeneity, distinctions and dualities and destroys all noble, spiritual wealth. Slay this troublesome mind.

- Swami Sivananda

Friday 24 March 2017

వైవాహిక జీవితం - స్వామి సచ్చిదానంద బోధ



Real marriage is when two people agree on one goal or purpose in life. God has given us two eyes to see as one. In the same way, partners are two, but you should see as one. The two minds are the two eyes. You should have one goal, and, toward that goal, you should both go like the two wings of the same bird or two orders of the same boat.

- Swami Satchidananda

Wednesday 22 March 2017

మధర్ సూక్తి



It is no use reading books of guidance if one is not determined to live what teach.

Mother 

రాజేంద్ర సింగ్‌ - 'వాటర్‌ మేన్‌ ఆఫ్‌ ఇండియా'

ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా ఏడారి ప్రాంతంలో నదులను జీవింపచేసిన గొప్ప వ్యక్తి గురించి తెలుసుకుందాం.

రాజేంద్ర సింగ్‌ - 'వాటర్‌ మేన్‌ ఆఫ్‌ ఇండియా'

నది ప్రాణాధారం. ఆ నదికే ప్రాణం పోస్తే? ఆవిరైపోయిన జల కళకు జీవాన్నిస్తే. ఒక్కడే ఏకంగా ఐదు నదులకు నీటిదానం చేస్తే ఏమనాలి? కనుమరుగైపోతోన్న జీవజలాన్ని పునరుద్ధరిస్తున్న జల మాత ముద్దుల బిడ్డ రాజేంద్ర సింగ్‌ను 'వాటర్‌ మేన్‌ ఆఫ్‌ ఇండియా' అని పిలుస్తున్నారు. జబ్బు పడిన ఎడారి జలాలకు వైద్యం చేస్తున్నాడీ ఆయుర్వేద వైద్యుడు.

              రాజస్తాన్‌లో చుక్క నీరు కూడా అమృతంతో సమానమే. ఎడారంతా జల్లెడ పడితే ఎక్కడో చిన్న చిన్న జలాశయాలు కనిపిస్తాయి. మైళ్లకు మైళ్లు కాలినడకన నీటి బిందెల్ని మోయడమే అన్నింటి కన్నా ముఖ్యమైన విషయం అక్కడ. అలాంటి ప్రాంతంలో అమృత ధారలుగా పేరొందిన నదులు కాస్త అంతరించిపోతుంటే రాజేందర్‌ సింగ్‌ ప్రాణమే పోతున్నట్టు వ్యాకులచెందారు. ఆ నదీమ తల్లులను కాపాడుకోవాలని పరితపించారు. రాజేందర్‌ సింగ్‌ ఓ ఆయుర్వేద వైద్యుడు. కానీ, వ్యవసాయం పైనే ఆసక్తంతా. 1985లో వైద్య పట్టా చేతికందగానే ఆల్వార్‌ జిల్లాకు తిరిగొచ్చేసి తన ప్రాంతంలో వైద్యంతో పాటు వ్యవసాయం చేద్దామని ఉత్సాహంగా వచ్చారు. అంతకు ముందు తనకు ఇష్టమైన నది పాయ అదృశ్యమై, ఆ ప్రాంతం సగం ఖాళీ అయి కనిపించే సరికి విస్తుపోయారు. సరైన సంరక్షణ చర్యలు లేక నదీ పాయలు ఆవిరైపోయాయని అర్థం చేసుకున్న ఆయన తాను ముందు వైద్యం చేయాల్సింది నదీ ప్రాంతానికి అని గ్రహించారు. తన ఒక్కడి వల్ల అది అవుతుందా అనేది ఆలోచించకుండా వెంటనే రంగంలోకి దిగారు.

ప్రాచీన భారతీయ విజ్ఞానానికి చెందిన భూ, జల, పర్యావరణ సూత్రాలకు అనుగుణంగా 'జోహాద్‌' శైలిలో వాన నీటి జలాశయాల్ని తవ్వడం ప్రారంభించాడు. నదుల్లోకి చేరే వాగులున్న చోట వాటి నిర్మాణం చేపట్టాడు. అందుబాటులో ఉన్న మట్టి, రాళ్లు, కాంక్రీట్‌ వంటి వస్తువులతోనే వాటిని పూర్తి చేశాడు. వీటి వల్ల భూగర్భ జలాల మట్టంతోపాటు జలాశయాల మట్టం పెరుగుతుందనేది ఆయన అంచనా. వాగుల వేగాన్ని తగ్గించేందుకు చెక్‌ డ్యామ్‌లను ఏర్పాటు చేసి నీరు ఇంకేలా నీటి పారుదల వ్యవస్థను రూపొందించారు. రెండేళ్ల పాటు అవిశ్రాంతంగా కృషి చేసినా అనుకున్న ఫలితం అందలేదు. స్థానికుల ఆయన ప్రయత్నాన్ని పరిహసించినా వెనుకడుగు వేయలేదు. మరింత శ్రమించి జోహాద్‌ల సంఖ్య పెంచుకుంటూ పోయాడు. ఆయన ప్రయత్నం వెనుక ఉన్న సదాశయం గ్రామస్తులను కదిలించి వారూ చేయి కలిపారు. జోహాద్‌ల సంఖ్య పెరిగే కొద్దీ ఫలితం మెరుగవుతూ వచ్చింది. ఎప్పుడో 1940లోనే అంతరించిపోయిందనుకున్న ఆర్వారి నది తన ప్రస్థానాన్ని మళ్లీ ప్రారంభించింది. మరో నాలుగు నదులు తిరిగి ప్రాణం పోసుకున్నాయి. 1000 ఎకరాల ప్రాంతంలో మళ్లీ పచ్చదనం చిగురించింది. జలాశయాలు కళకళలాడాయి. మట్టికి నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం పెరిగింది. వాన నీటి వృథా తగ్గిపోయింది. తాగునీటి బావులు, జలాశయాలు జీవం పోసుకున్నాయి. 20 అడుగుల మేర భూగర్భ జల నీటి మట్టం పెరిగింది. అటవీ ప్రాంతం 33 శాతానికి పైగా విస్తరించింది. వలస పోయిన వారు తిరిగి గ్రామాలకు చేరుకున్నారు. వ్యవసాయం సాధ్యమైంది.
తన ప్రయత్నం వల్ల ఏకంగా నదులే జీవాన్ని సంతరించుకుంటాయని ఊహించని రాజేంద్ర సింగ్‌కు ఇది పెద్ద బహుమతి అయ్యింది. ఇంకా తన పథకాలు విస్తరించుకుంటూ ఎన్నో గ్రామాలకు తీరుతెన్నుల్ని మార్చారు. అలా ఇప్పటివరకు 11 రాష్ట్రాల్లోని 850 గ్రామాల్లో 4500 జోహాద్‌లను నిర్మించారు. నదీ సభలను ఏర్పాటుచేసి గ్రామస్తులు స్వతహాగా నీటిని సంరక్షించుకునేలా ప్రోత్సహిస్తున్నారు. రాష్ట్రంలోని జల సంరక్షణకు అడ్డు తగులుతున్న 470 గనుల్ని మూసివేయాల్సిందిగా ప్రభుత్వాన్ని ఒప్పించాడు. దీనిపై అక్కసు పెంచుకున్న గని యజమానులు ఆయనపై దాడులు చేయించారు. ప్రజల అండతో ఆయన తన ప్రయత్నాన్ని విరమించుకోలేదు. రాజేంద్ర సింగ్‌ రాజస్థాన్‌లో ఓ హీరో అని అనడం కన్నా వారికి, వారి ప్రాణ సమమైన జల వ్యవస్థకు ఆయువునిచ్చిన జల వైద్యుడు అని చెప్పుకోవచ్చు.

Source: Praja Sakti Newspaper- Saturday,June 27,2015

Tuesday 21 March 2017

అరొబిందో సూక్తి



Sit in meditation ! But do not think ! Look only at your mind ! You will see thoughts coming into it ! Before they can enter, throw these away from your mind till your mind is capable of entire silence.

Sri Aurobindo

అడవిని పెంచి ఆదర్శంగా నిలిచిన వ్యక్తి - జాదవ్ పాయెంగ్

మార్చి 21, ప్రపంచ అటవి దినోత్సవం సందర్భంగా మానవులు అడవులను నరుకుతున్న తరుణంలో, అడవిని పెంచి అందరికి ఆదర్శంగా నిలిచిన వ్యక్తి గురించి తెలుసుకుందాం.

-----------------------

ముందు నన్ను చంపి తరువాత నా చెట్ల మీద చెయ్యి వేయండీ....'అంటూ
అడవిలోని చెట్లను నరకటానికి వచ్చిన గ్రామస్తులకు అడ్డుగా నిలబడ్డాడు జాదవ్ పాయెంగ్.

ప్రాణం పోసిన వారికి కాకపోతె ప్రాణాన్ని పణం గా పెట్టేంతటి మమకారం ఇంకెవరికి వుంటుంది...!

ఇది అడవిని పెంచిన ఓ పర్యావరణ ప్రేమికుని కథ....

--------------------------

అడవిని సృష్టించాడు...

మనిషి తన స్వార్థం కోసం అడవుల్ని కొట్టేయడం వల్ల ఎన్నో జంతువులు అంతరించిపోయాయి. ఇంకెన్నో చివరి దశలో ఉన్నాయి. ఆ లెక్కన వాటి తర్వాత వరుసలో ఉన్నది మనుషులే. అతడు శాస్త్రవేత్త కాదు, ఇంత ఆలోచించడానికి. కానీ మనసున్న మనిషిగా సాటి జీవుల్నీ పర్యావరణాన్నీ ప్రేమించాడు. 1979లో అసోంలోని జొర్హాత్‌ జిల్లాలో వచ్చిన వరదల వల్ల పాములతో పాటు ఎన్నోరకాల సరీసృపాలు బ్రహ్మపుత్రా నదీ తీరానికి కొట్టుకొచ్చాయి. తర్వాత ఎండలు పెరగడంతో నది మధ్యలోని ఇసుక దీవులు వేడెక్కాయి. చుట్టుపక్కల ఎక్కడా చెట్లు లేకపోవడంతో కొట్టుకొచ్చిన జీవులు పెద్ద సంఖ్యలో ఆ ఇసుకలోనే సమాధి అయిపోయాయి. అక్కడకు దగ్గర్లోనే ఉండే జాదవ్‌ పాయెంగ్‌ చనిపోయిన వాటిని చూసి చలించిపోయాడు. ఆ ప్రాంతంలో చెట్లను పెంచితే ఆ పరిస్థితి రాదని అర్థమైంది. దాంతో పదహారేళ్ల వయసులో ఇంటినీ వూరినీ వదిలేసి, అరుణ చపోరి ప్రాంతంలోని ఆ దీవిలోనే ఉంటూ రోజూ అక్కడ కొత్త మొక్కల్ని నాటుతూ, నది నుంచి నీళ్లు తెచ్చి పోస్తూ ఉండేవాడు. నదీ తీరం కావడంతో నేలలో సారం లేక మొక్కలు బతికేవి కాదు. దాంతో వూళ్లొ నుంచి ఎర్ర చీమలూ వానపాముల్లాంటి వాటిని తీసుకొచ్చి అక్కడ వేసేవాడు. ఆ కష్టం ఫలితంగా 1360 ఎకరాల విస్తీర్ణంలోని ఇసుక దీవి ‘మొలాయి ఫారెస్ట్‌’గా మారింది. ‘మొలాయి’... పాయెంగ్‌ చిన్నప్పటి పేరు. అందుకే, దానికాపేరు వచ్చింది. ఇందులో ఇప్పుడు పులులూ ఏనుగులూ ఖడ్గ మృగాలూ, అడవి దున్నల్లాంటి ఎన్నోరకాల ప్రాణులు ఆశ్రయం పొందుతున్నాయి. ఈ పర్యావరణ ప్రేమికుడిని 2015 లో పద్మశ్రీ కూడా వరించింది.

Courtesy: Eenadu 

Monday 20 March 2017

కబీర్ సూక్తి



He is the real Guru Who can reveal the form of the formless before your eyes; who teaches the simple path, without rites or ceremonies; Who does not make you close your doors, and hold your breath, and renounce the world; Who makes you perceive the Supreme Spirit whenever the mind attaches itself; Who teaches you to be still in the midst of all your activities. Fearless, always immersed in bliss, he keeps the spirit of yoga in the midst of enjoyments.

- Kabir

Sunday 19 March 2017

సద్గురు శివానంద మూర్తి గారి సూక్తి



When passion, anger, selfishness, egoism all such things are annihilated, then only there can be real surrender.

- Satguru Sivananda Murthy Garu

హిందూ ధర్మం - 239 (జ్యోతిష్యం- 19) (కాలగణన - 3)




విష్ణుపురాణం కాలగణనం గురించి ఎంతో గొప్పగా వివరించింది.

2 అయనాలు = 1 మానవ సంవత్సరము లేదా దేవతలకు ఒక రోజు
4000+ 400+ 400 = 4800 దివ్య సంవత్సరాలు = 17,28,000 మానవ సంవత్సరాలు = 1 సత్యయుగం
3,000 + 300 + 300 = 3,600 దివ్య సంవత్సరములు = 12,96,000 మానవ సంవత్సరములు = 1 త్రేతా యుగం
2,000 + 200 + 200 = 2,400 దివ్య సంవత్సరములు = 8,64,000 మానవ సంవత్సరములు = 1 ద్వాపర యుగం
1,000 + 100 + 100 = 1,200 దివ్య సంవత్సరములు = 4,32,000 మానవ సంవత్సరములు = 1 కలి యుగం
4800 + 3600 + 2400 + 1200 దివ్య సంవత్సరములు = 12,000 దివ్య సంవత్సరములు = 1 మహాయుగం
17,28,000 + 12,96,000 + 8,64,000 + 4,32,000 మానవ సంవత్సరములు = 43,20,000 మానవ సంవత్సరములు = 1 మహాయుగము

1000 మహయుగాలు = 1 కల్పము = బ్రహ్మదేవునకు 1 పగలు లేదా రాత్రి = 4,32,00,00,000 మానవ సంవత్సరములు = 4.32 బిలియన్ సంవత్సరములు
2000 మహాయుగాలు = 2 కల్పాలు = బ్రహ్మదేవునకు ఒక రోజు = 8,64,00,00,000 మానవ సమవత్సరములు = 8.64 బిలియన్ సంవత్సరములు
బ్రహ్మదేవునకు 1 మాసం = బ్రహ్మదేవునకు 30 రోజులు = 2,59,20,00,00,000 మానవ సంవత్సరాలు = 259.2 బిలియన్ మానవ సంవత్సరాలు
బ్రహ్మదేవునకు 1 సంవత్సరము = 30 రోజులు గల 12 మాసాలు = 3.1104 ట్రిలియన్ మానవ సంవత్సరములు
బ్రహ్మదేవునకు 50 ఏళ్ళు = 1 పరార్ధము
2 పరార్ధాలు = బ్రహ్మకు 100 ఏళ్ళు = బ్రహ్మ జీవితకాలం = 1 పర = 1 మహాకల్పం = 311.04 ట్రిలియన్ మానవ సంవత్సరములు
బ్రహ్మదేవుని 1 పగలు లేదా రాత్రిని 1000 భాగాలుగా విభజిస్తారు, వాటిని చరణాలు అంటారు.

4 చరణాలు = సత్య యుగము = 17,28,000 సంవత్సరములు
3 చరణాలు = త్రేతా యుగము = 12,96,000 సంవత్సరములు
2 చరణాలు = ద్వాపర యుగము = 8,64,000 సంవత్సరములు
1 చరణాలు = కలి యుగము = 4,32,000 సంవత్సరములు

ఇప్పుడు మనమున్నది ప్రస్తుతం ఉన్న బ్రహ్మగారి రెండవ పరార్ధంలో. అందుకే సంకల్పంలో అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే అని చదువుతారు. ఇప్పుడు ఆయన వయస్సు 51 సంవత్సరాలు.

To be continued ............

Saturday 18 March 2017

స్వామి శివానంద సూక్తి



All sorts of habitual thoughts, concerning the body, the dress, the food, and so on, must be overcome through the Atma-Chintana, or reflection on the Nature of the divine Self within one’s own Heart. This is an uphill work. It demands patient, incessant practice and inner spiritual strength.

- Swami Sivananda

Friday 17 March 2017

స్వామి సచ్చిదానంద సూక్తి



Block any wastage of your immunity or energy. Stopped wasting energy. Anything that drains your energy should be avoided—worry, stress, fear, anxiety, etc. Resolve that: ‘I created the problem and I am going to destroy it. I will do that by stopping all the ways through which I lost my immunity.’

- Swami Satchidananda

Wednesday 15 March 2017

నేడు ఫాల్గుణ బహుళ తృతీయ- ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి.


ఛత్రపతి శివాజీ నుంచి యువకులు నేర్చుకోవలసింది ఎంతో ఉంది. శివాజికి దేశభక్తి ఎంతో ఉంది, దైవభక్తి, గురుభక్తి అంతే ఉంది. శివాజీ రాజైనా గర్వం ఇసుమంత కూడా ఉండేది కాదు. ఏ యోగి కనిపించినా అతడిని గౌరవించి, రాజ్యాన్ని వదిలి వారి వెంట వెళుతూండేవాడు. భజనలు, కీర్తనలు ఎక్కడ జరుగుతున్నా శివాజీ అక్కడే ఉండేవాడు. దైవభక్తిని, ఆత్మజ్ఞానాన్ని ఎప్పుడూ మర్చిపోలేదు. రాజ్యమదం అతనికి ఎంత మాత్రం లేదు. శివాజీకి శ్రీ తుకారాంబావాజీ అంటే ఎంతో భక్తి. ఎంత దూరమైన ఆయన భజనలకు వెళుతూ ఉండేవాడు. ఒకరోజు భక్తి పారవశ్యంలో శివాజీ తుకారాం వద్దకు పోయి, నిజమైన భక్తిని ఉపదేశించమని వేడుకున్నాడు. అప్పుడు తుకారం 'నేను నీకు ఉపదేశించేవాడిని కాదు. చక్కని ఉపదేశం కావాలనుకుంటే వెళ్ళి, సమర్థ రామదాసు కాళ్ళపై పడు' అని మధురమైన మాటలతో ఆనతిచ్చాడు. కానీ సమర్థ రామదాసు గారు ఎప్పుడు ఎక్కడ ఉంటారో, ఆయన శిష్యులే తెలియదు. ఇక శివాజీ ఎలా వెతకగలడు. ఆయన కోసం అనేక మఠాలు తిరిగాడు, ఎన్నో అడువులను జల్లెడ పట్టాడు. అయినా రామదాసు జాడ దొరకలేదు. చివరకు, సమర్థ రామదాసు గారి దర్శనం లభించేంత వరకు కనీసం నీరు కూడా ముట్టనని ప్రతిజ్ఞ చేశాడు. అది గురువు యందు భక్తి అంటే. శిష్యుడు సిద్ధమైనప్పుడు గురువు లభిస్తాడు. తానే నడిచి వస్తాడు. అంతటి కరుణామూర్తి సద్గురువు. ఆఖరికి స్వప్నంలో శివాజీ ఎదుట ఒక మహాపురుషుడు వచ్చి నిలబడ్డాడు. ఆయనే సమర్థ రామదాసు.

మరునాడు ఉదయం శివాజీ నిద్రలేచి మంచం దిగకముందు ఒక సన్యాసి (సమర్థ రామదాసు శిస్ష్యుడు), రామదాసుగారి నుంచి శివాజీని కలుసుకోవడం కోసం నిర్దేశించిన జాబు తీసుకువచ్చాడు. ఆ జాబులో ఇలా ఉంది. 'యాత్రకు వెళ్ళవలసిన పుణ్యక్షేత్రాలన్నీ నాశనం చేయబడ్డాయి. బ్రహ్మక్షేత్రాలు అపవిత్రం చేయబడ్డాయి. ప్రపంచమంతా అల్లకల్లోలం చేయబడింది. ధర్మం ఎక్కడా కనపడటంలేదు. ధర్మాన్ని కాపాడటం కోసం భగవంతుడు నిన్ను ఏర్పరిచాడు. ఈ దేశంలో అనేక మహారాజులు, మంత్రులు, రాజనీతికోవిదులు, గొప్పపండితులు, ఉన్నా ధర్మాన్ని రక్షించే వాతు ఎవ్వరూ లేరు. మహారాష్ట్ర ధర్మమంతా నీ మీదనే ఆధారపడి ఉంది. నేను నీ రాజ్యంలోనే ఇనాళ్ళు ఉన్నప్పటికి నన్ను నీవు కనగొన లేదు. అందుకు కారణం ఏంటో నేను చెప్పలేను. నీ మంత్రులు బుద్దిమంతులే. నీవు ధర్మమూర్తివి. అందుచేత నీకు మాటిమాటికి హితోపదేశము చేయనక్కఱలేదు. ధర్మము పునరుద్ధరించడం అనే ప్రతిష్ఠ నీకే దక్కాలి. అది నీవు పోగొట్టుకొన కూడదు. అతి సామన్యములైన రాజకీయ విషయములపై నా శ్రద్ధ నిలిచి యున్నది. ఈ ఉపదేశం వలన మనసులో ఆగ్రహించక నన్ను క్షమించు.' ఒక రాజుకు లేఖ రాస్తున్నప్పుడు ఎంత మర్యాదగా రాస్తారో అంత మర్యాదగా శివాజీకి జాబు రాశారు రామదాసు గారు. ఆ తర్వాత శివాజీని తన దగ్గరకు పిలిపించుకుని రహస్యంగా ఉపదేశం చేశారు. శివాజీకి గురువు పట్ల ఎనలేని భక్తి ఉండేది. చలించని విశ్వాసం ఉండేది. అదే ఆయనకు శక్తినిచ్చింది.

ఒకసారి యుద్ధ సమయం సమీపించిన తరుణంలో శివాజీ శ్రీశైలం వచ్చి తపస్సు చేశారు. అమ్మవారిని మెప్పించి ఖడ్గం పొందారు. ఎంతో బలం, బలగం ఉన్నా, శివాజీకి దైవభక్తి, గురుభక్తి అచంచలంగా ఉండేది. అదే ఆయన్ను అంత గొప్పగా నాయకుడిగా నడిపించింది.

త్రైలింగ స్వామి సూక్తి


16-03-2017, గురువారం, ఫాల్గుణ బహుళ చవితి, సంకష్టహర చతుర్థీ.



16-03-2017, గురువారం, ఫాల్గుణ బహుళ చవితి, సంకష్టహర చతుర్థీ.
ఫాల్గుణ మాసంలో వచ్చింది కనుక దీనికి భాలచంద్ర/ ఫాలచంద్ర సంకష్టహర చతుర్థి అని పేరు.

వ్రత విధానం ఈ లింక్‌లో చూడగలరు.
http://ecoganesha.blogspot.in/2014/03/20-2014.html

16 ఫిబ్రవరి 2017, చంద్రోదయ సమయం హైద్రాబాదులో (భారత కాలమానం ప్రకారం) - రాత్రి 9.39 నిమి||
http://www.drikpanchang.com/vrats/sankashti-chaturthi-dates.html

Tuesday 14 March 2017

కంచి పరమాచార్య సూక్తి



All of you give me heaps of garlands. You do so because you think I am great and want to express your devotion for me. You also feel that instead of wearing them yourselves the garlands would be an ornament for me. If I decorate myself with them thinking myself to be a great man, it would means that I am satisfying my ego. But you bring me garlands with devotion and would it be right for me to spurn them? So just as you want to see me decorated I want to see Amba adorned and so I offer the garlands to her.

- Kanchi Paramacharya

Monday 13 March 2017

స్వామి దయానంద సరస్వతి సూక్తి



Any form of prayer is as efficacious as any other. This fact must be understood well, not as tolerance for or accommodation of forms of worship other than one’s own, but in terms of understanding that the universal order alone is being implied. There is no pagan’s prayer; there is only prayer.

- Swami Dayananda Sarasvati

Sunday 12 March 2017

సద్గురు శివానంద మూర్తి గారి సూక్తి



To think surrender is complete, is wrong notion. Think always there is still something to surrender.

- Satguru Sivananda Murthy Garu

హిందూ ధర్మం - 238 (జ్యోతిష్యం- 18) (కాలగణన - 2)



1 యామం- ఒక రోజులో 4 వ వంతు, 1/4 దినం≈ 3 గంటలు
1 యామం= 7½ ఘటిలు= 3¾ ముహూర్తాలు= 3 హోరలు
1 హోర= 1/24 రోజు
4 యామాలు= పగలు లేదా రాత్రి; సగం రోజు.
8 యామాలు = 1 అహోరాత్రము (పగలు+రాత్రి)
పక్షం = 15 రోజులు
శుక్ల పక్షం+ కృష్ణ పక్షం = ఒక చాంద్రమాన మాసం

పితృమానం

మానవులకు 15 రోజులు (1 పక్షం) = పితృదేవతలకు సగం రోజు
మానవుల 30 రోజుల కాలం = పితృదేవతలకు 1 రోజు
పితృదేవతల 30 రోజులు = పితృదేవతల 1 నెల = 30*30= 900 మానవదినములు
పితృదేవతలకు 12 నెలలు = 1 సంవత్సరం= 10,800 మానవదినములు
పితృదేవతల వయసు 100 సంవత్సరాలు (= పితృదేవతలకు 36,000 దినములు = 10,80,000 మానవ దినములు = 3000 మానవ సంవత్సరాలు)
దేవతలకు 1 రోజు = మానవులకు 1 సంవత్సరం
దేవతలకు 1 నెల/మాసం = దేవతల 30 రోజులు (మానవుల 30 ఏళ్ళ కాలం)
దేవతలకు 1 సంవత్సరం (దివ్య సంవత్సరం) = దేవతలకు 12 నెలల కాలం = 360 మానవ సంవత్సరములు
12,000 దివ్య సంవత్సరములు = దేవతల వయస్సు = 1 మహాయుగం

ఇక్కడ దేవతలంటే ఇంద్రుడు, అగ్ని, వాయువు, వరుణుడు ఇత్యాది దేవతలని అర్దం చేసుకోవాలి. శివ, విష్ణు, శక్తి మొదలైన వారు పరబ్రహ్మం యొక్క ప్రతిబింబాలు. పరబ్రహ్మం సనాతనము, ఎల్లప్పుడూ ఉంటుంది. మానవ జన్మ వలన కలిగిన సదవకాశాన్ని వినియోగించుకుని, శాస్త్రంలో చెప్పబడ్డ పుణ్యకర్మలను, తపస్సును ఆచరిచిన జీవులు, తమ పుణ్యకర్మ చేత స్వర్గం మొదలైన లోకాలను చేరుతారు. ఇంద్రుడు మొదలైన దేవతలుగా మారి తమ పుణ్య కర్మను అనుభవిస్తారు. భగవద్గీతలో చెప్పింటలు 'క్షీణే పుణ్యే మర్త్యలోకం విశ్మతి' అని, పుణ్యం క్షీణించగానే తిరిగి మానవ లోకంలో పుడతారు. గత జన్మలో చేసుకున్న పుణకర్మ వలన, వాసనల వలన ఉన్నతమైన సిరిసంపదలుకుటుంబంలో పుట్టి, తిరిగి ధర్మమార్గంలో నడుస్తారు.  

ఇంద్ర, వాయు, వరుణ మొదలైన దేవతలు మానవుల వంటి జీవులే. ఇంద్రాది నామాలను పదవులను సూచిస్తాయి. ఉదాహరణకు మన దేశానికి ప్రధాన మంత్రి పదవి ఉంది. ఆ పదవిలో కూర్చున్న వారు ఎవరైనా ప్రధానమంత్రి అవుతారు. అంతేకానీ ప్రధానమంత్రి అనేది జన్మతో వచ్చే పదవి కాదు. అలానే దేవలోకంలో కూడా. అయితే ఇక్కడే మనకూ, అన్యమతాలకు బేధం ఉంది. దేవ, యక్ష, కిన్నెర, కింపురుష మొదలైన ఊర్ధ్వలోకల జీవులు ఉన్నారని గుర్తించింది, వారికి కూడా ధర్మంలో స్థానం కల్పించింది కేవలం సనాతన ధర్మం మాత్రమే. ఆయా మతాలు స్వర్గం వరకే చెప్పగలిగాయి. కానీ సనాతన ధర్మం స్వర్గానికి భిన్నమైన లోకాలను సైతం చెప్పింది. అక్కడ ఇంద్రాది దేవతలు లేరు. పుణ్యకర్మను అనుభవించి, తిరిగి మర్త్యలోకంలో జన్మించడం లేదు. పునర్జన్మ సిద్దాంతానికి అవి వ్యతిరేకం. మనమున్న భూలోకంలో నిర్వహించబడే యజ్ఞయాగాది కర్మలు, ఇతర వైదిక కర్మలు కేవలం మానవుల మేలు కోసమే కాదు. ఇక్కడ జరపబడే కర్మలు అన్యలోక జీవులకు ఆహారాన్ని, శక్తిని ఇస్తాయి. ఇవి వారికి కూడా మేలు చేస్తాయి. అన్ని లోకాలను కాపాడతాయి. అందుకే హిందువులు, తమ ప్రార్థన చివరలో లోకాసమస్తాః సుఖినోభవంతు అంటారు. సమస్త లోకాలు సుఖంగా, క్షేమంగా ఉండాలని దాని అర్దం. ఇలా కోరేది కూడా సనాతన ధర్మమే. అన్యమతాల్లో తమ మతస్థులు బాగుండాలనే కోరుకుంటే, సనాతనధర్మం 'శతృబుద్ధిం వినాశాయ' - శతృవు కూడా బాగుండాలి, కానీ అతనిలోనున్న శతృత్వం నశించాలని కోరుకుంటుంది.

To be continued ..................

Source: https://en.wikipedia.org/wiki/Hindu_units_of_time

Saturday 11 March 2017

స్వామి శివానంద సూక్తి



Fill the mind with divine thoughts, by Japa, Prayer, Dhyana and study of holy books. Be indifferent to all negative and undivine thoughts. They will pass away. Do not struggle with them. Pray to God for strength. Read the lives of saints. Study the Bhagavata and the Ramayana. All devotees have passed through similar ordeals. So, take heart.

- Swami Sivananda

Friday 10 March 2017

భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రకటించండి- స్వామి సచ్చిదానంద బోధ


Express the Unity in Diversity

You may be angry with your husband or wife, but be gentle. See the same spirit in everyone and everything. That is unity in diversity. There is nothing without life in this world. Be gentle, be nice, be loving. See your own Self in all and treat everything properly. That is how to show the unity in diversity visibly and powerfully.

- Swami Satchidananda

Wednesday 8 March 2017

భగవాన్ రమణ మహర్షి సూక్తి



Abandon the drama of the world and seek the self within. Remaining within, I will protect you, ensuring that no harm befalls you.

- Bhagavan Ramana Maharshi

Saturday 4 March 2017

స్వామి శివానంద సూక్తి



Thoughts of depression, failure, weakness, darkness, doubts, fear, etc., are negative thoughts. Cultivate positive thoughts of strength, confidence, courage, cheerfulness. The negative thoughts will disappear.

- Swami Sivananda

Friday 3 March 2017

లోపల మరియు బయట మార్పు- స్వామి సచ్చిదానంద సూక్తి


Inner and Outer Change

“Many people ask, ‘How can we do everything for our own peace when the world is so full of suffering?’ Normally, we think of the world first. But Yoga believes in transforming the individual before transforming the world. Whatever change we want to happen outside should first happen within. And if you walk in peace and express that peace in your own life, others will see you and learn something.

- Swami Satchidananda

Thursday 2 March 2017

స్వామి రంగనాథానంద సూక్తి



So, work hard; perform all duties; develop yourself; then come and surrender to the highest. Do a whole day's honest work, then sit and meditate; then resign yourself to God. Otherwise, that meditation has no meaning or value. Meditation at the end of a lazy day has no meaning; but the same at the end of an active day, filled with good deeds, has meaning, and is rewarding.

- Swami Ranganathananda

Wednesday 1 March 2017

రాధానాథ స్వామి సూక్తి



Be whoever you want to be, but don’t be motivated by greed, egoism, lust, envy, anger and pride; rather, be motivated by your own inherent nature, as an instrument of God’s compassion. – Radhanath Swami