Sunday 31 January 2016

హిందూ ధర్మం - 193 (గోవు ప్రాముఖ్యత - 5)

గోమూత్రానికున్న మరిన్ని ఔషధ లక్షణాలు తెలుసుకుందాం. మనం నిత్యం తీసుకునే ఆహారం పూర్తిగా జీర్ణం కాక చాలా కొద్ది భాగం (Residue) శరీరంలో మిగిలిపోతుంది. ఈ విషాలను ఆయుర్వేదం ఆమం (Toxins) అంటుంది. వ్యాయామం, యోగాసనాలు, సరైన జీవనవిధానం, అప్పుడప్పుడు ఉపవాసాల ద్వారా దాన్ని నిర్మూలించే ప్రయత్నం చేసే పద్ధతి సనాతన ధర్మం అందించింది. అయితే ఇలా మిగిలిపోయిన జీర్ణం కానీ పదార్ధాలు శరీరంలో విషాలుగా మారి, జబ్బులను కలిగిస్తాయి. జబ్బులను నయం చేసుకోవటానికి మందులను అధికంగా వాడినప్పుడు, రోగం తగ్గినా, ఆ మందులలోని కొంత భాగం వ్యర్ధ పదార్ధంగా దేహంలో మిగిలిపోతుంది. కాలక్రమంలో అది మురుగిపోయి, ఆమంగా మారి, కొత్త జబ్బులను కలిగిస్తుంది. మానవులకు ఈ ఆమం పెరిగిపోవడం వలన అనేకానేక వ్యాధులు వస్తాయి. శరీరంలో ఇతర మార్గాల ద్వారా ఏర్పడిన ఆమాన్ని తొలగించేందుకు ఔషధాలున్నాయి కానీ, ఔషధాల వలన ఏర్పడిన ఆమాన్ని తొలగించే మందులు ప్రపంచంలో లేవు. దీని విరుగుడు ఒక్క గోమూత్రం మాత్రమే. గోమూత్రాన్ని లేదా పంచగవ్యాన్ని 40 రోజుల పాటు ఉదయం పొరగడుపున నిర్ణీత పద్ధతిలో స్వీకరిస్తే, అది ఆమాన్ని హరించి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. అంతటి శక్తి గోమూత్రానికుంది.

శరీరం కఫ, వాత, పైత్యాలనే మూడు దోషాలతో ఏర్పడిందని ఆయుర్వేదం చెప్తోంది. వీటినే త్రిదోషాలు అంటారు. ఇవి సమంగా ఉంటేనే వ్యక్తి ఆరోగ్యంగా ఉంటాడు. ఈ 3 దోషాలు ఏది ఎక్కువైనా, అది రోగాలను కలిగిస్తుంది. జబ్బు ఒకటే కావచ్చు, కానీ దాన్ని కలిగించిన దోషం వేరై ఉండచ్చు. అందుకనే ఆయుర్వేదంలో బయటకు కనిపించే లక్షణాలను చూసి రోగానికి ఔషధమివ్వరు. మూలం ఏంటో కనుక్కునే ప్రయత్నం చేస్తారు. ఈ త్రిదోషాలకు జన్యుపరమైన సంబంధం కూడా ఉందని ఈ మధ్యనే సిసిఎంబి వారి పరిశోధనలో తేలింది. వేళ ఏళ్ళుగా ఆయుర్వేదం చెప్తున్న త్రిదోషాలను ఇన్నాళ్ళు అంగీకరించని ప్రపంచం ఈ పరిశోధనతో సత్యమని ఒప్పుకుని తీరాల్సి ఉంటుంది. ఈ త్రిదోషాలను సమంగా ఉంచే లక్షణం గోమూత్రానికుంది.  గోమూత్రాన్ని స్వీకరిస్తే కఫ, వాత, పైత్యాలు అదుపులోకి వస్తాయి.

గోమూత్రం కాలేయ పని తీరును మెరుగుపరుస్తుంది. కాలేయం (Liver) బాగుంటే శుద్ధమైన రక్తం ఏర్పడుతుంది. ఫలితంగా రోగనిరోధశక్తి పెరుగుతుంది.

శరీరానికి శక్తినిచ్చే కొన్ని సూక్ష్మపోషకాలు (micro-nutrients) దేహంలో ఉంటాయి. ఇవి మూత్రవిసర్జన ద్వారా బయటకు వెళ్ళిపోతాయి. వీటిని శరీరం అధికంగా కోల్పోతే వృద్ధాప్యలక్షణాలు త్వరగా వస్తాయి. గోమూత్రంలో ఈ సూక్ష్మపోషకాలను భర్తీ చేసే అనేక తత్త్వాలు ఉండడం చేత, దాన్ని స్వీకరించినవారికి ఆరోగ్యం సిద్ధిస్తుంది. వృద్ధాప్య లక్షణాలు త్వరగా రావు.

మానసిక ఆందోళన నాడీవ్యవస్థను ప్రభావితం చేస్తుంది. గోమూత్రాన్ని హృద్యమని, మేధ్యమని అన్నారు. అనగా అది మెదడుకు, గుండెకు శక్తినిస్తుందని అర్దం. గోమూత్రం మెదడు, గుండెకు ఆందోళన వలన నష్టం కలగకుండా రక్షిస్తుంది. ఆయా భాగాలను రోగాల నుంచి కాపాడుతుంది.

 Source: https://cowurinebenefit.wordpress.com/2012/10/06/cow-urine-benefits/

To be continued ....................

Friday 29 January 2016

శాంతినే ఎంచుకోండి - స్వామి సచ్చిందానంద

You Should Always Choose Peace

When anything comes to you, first ask yourself, "Will I be maintaining my peace by getting this, or will my peace be disturbed?" Ask that for everything. People you would like to be with, possessions you would like to acquire It doesn't matter what you want to do; strike that against the touchstone of peace. "Will this rob me of my peace?" If the answer is "Yes, you must choose peace or the other thing," you should always choose peace. If the answer is, "My peace will not be disturbed by it," okay, you can have that and still have your peace. That should be our aim.
Om Shanthi, Shanthi, Shanthi

- Sri Swami Satchidananda


Wednesday 27 January 2016

సత్యసాయి బాబా సూక్తి

Small minds select narrow roads; expand your mental vision and take to the broad road of helpfulness, compassion and service. - Sri Satya sai Baba


Tuesday 26 January 2016

సద్గురు జగ్గి వాసుదేవ్ చెప్పిన చిన్న కధ

ఓసారి ఓ రాజుకు చెడ్డకల వచ్చింది. దాని ఫలితం తెలుసుకోవాలనుకుని జోస్యుల్ని  పిలిపించాడు. ఒక జోస్యుడు తాటాకులు తెరిచి "చెడు వార్త.. నీ భార్య, పిల్లలు, భంధువులు అందరూ నీ కళ్ళముందే పోతారు అని నాదిజోస్యం చెప్తోంది" అన్నాడు.
రాజుకు కోపం వచ్చింది. "నా వాళ్ళంతా చనిపోతారని చెప్పిన వీడిని చెరలో వేయండి" అని ఆజ్య్నాపించాడు. తర్వాత వచ్చిన జోస్యుడు కూడా అదే చదివాడు.
అయితే వేరేలా చెప్పాడు. "మంచివార్త, నీ ఆయువు గట్టిది. నీ భంధువులు, భార్య, పిల్లలకన్నా నువ్వు ఎక్కువ కాలం బతుకుతావు" రాజు అతనికి ఎన్నో కానుకలిచ్చి పంపాడు. ఇద్దరు జోస్యులు ఒకే విషయాన్ని చదివి రెండు రకాలుగా చెప్పారు. అంటే వాళ్ళు విషయాన్ని చూసిన కోణంలో వాళ్ళ తెలివితేటలు ఇమిడి వున్నాయి.
కనుక, ఏ విషయాన్నైనా ఇష్టాయిష్టాల్ని పట్టించుకోకుండా చూడండి. ప్రతి పరిస్థితిని మీకు సానుకూలం చేసుకుని ఎలా ఎదగాలి అని ఆలోచించండి. గొడవ వుందా లేదా అన్నది పరిస్థితిలో లేదు. దాన్ని మీరెలా తీసుకుంటారన్న దాంట్లో వుంది. లభించినదాంతో జీవితాన్ని ఎలా ముందుకు నడిపిస్తారన్న విషయంలో మీ తెలివితేటలు దాగుంటాయి. ఇది మీరు గుర్తెరగాల్సిన రహస్యం.
--- సద్గురు జగ్గి వాసుదేవ్

ఓసారి ఓ రాజుకు చెడ్డకల వచ్చింది. దాని ఫలితం తెలుసుకోవాలనుకుని జోస్యుల్ని  పిలిపించాడు. ఒక జోస్యుడు తాటాకులు తెరిచి "చెడు వార్త.. నీ భార్య, పిల్లలు, భంధువులు అందరూ నీ కళ్ళముందే పోతారు అని నాదిజోస్యం చెప్తోంది" అన్నాడు.

రాజుకు కోపం వచ్చింది. "నా వాళ్ళంతా చనిపోతారని చెప్పిన వీడిని చెరలో వేయండి" అని ఆజ్య్నాపించాడు. తర్వాత వచ్చిన జోస్యుడు కూడా అదే చదివాడు.
అయితే వేరేలా చెప్పాడు. "మంచివార్త, నీ ఆయువు గట్టిది. నీ భంధువులు, భార్య, పిల్లలకన్నా నువ్వు ఎక్కువ కాలం బతుకుతావు" రాజు అతనికి ఎన్నో కానుకలిచ్చి పంపాడు. ఇద్దరు జోస్యులు ఒకే విషయాన్ని చదివి రెండు రకాలుగా చెప్పారు. అంటే వాళ్ళు విషయాన్ని చూసిన కోణంలో వాళ్ళ తెలివితేటలు ఇమిడి వున్నాయి.

కనుక, ఏ విషయాన్నైనా ఇష్టాయిష్టాల్ని పట్టించుకోకుండా చూడండి. ప్రతి పరిస్థితిని మీకు సానుకూలం చేసుకుని ఎలా ఎదగాలి అని ఆలోచించండి. గొడవ వుందా లేదా అన్నది పరిస్థితిలో లేదు. దాన్ని మీరెలా తీసుకుంటారన్న దాంట్లో వుంది. లభించినదాంతో జీవితాన్ని ఎలా ముందుకు నడిపిస్తారన్న విషయంలో మీ తెలివితేటలు దాగుంటాయి. ఇది మీరు గుర్తెరగాల్సిన రహస్యం.

--- సద్గురు జగ్గి వాసుదేవ్

Via Ashwin Kumar Dulluri​

Tuesday 19 January 2016

సద్గురు జగ్గివాసుదేవ్ - కష్టాలు -కధ

ఆ పరమాత్ముడి తో ఒక సన్నకారు రైతు ఒకసారి బలంగా దెబ్బలాట వేసుకొన్నాడు.

"నీకు పైరు గురించి ఏం తెలుసు? నీకిష్టమైనప్పుడు వానను కురిపిస్తావు. ఆ కాలంలో గాలి వీచేలా చేస్తున్నావు. నీతో పెద్ద గొడవగా ఉంది. మాట్లాడకుండా ఆ పనులన్నీ ఒక రైతుకి  అప్పగించారాదూ!” అన్నాడు.

 భగవంతుడు వెంటనే "అలాగా! అయితే ఈనాటి నుంచి గాలి, వాన, ఎండ అన్నీ నీ అజమాయిషిలోనే  ఉంటాయి”  అంటూ వరమిచ్చి చక్కాపోయాడు.
 ఆ రైతు ఆనందానికి అవధుల్లేవు.

ఋతువులు మారాయి. "వానా! కురవాలి" అన్నాడు  రైతు.
కురిసింది. ఆగమనగానే ఆగింది.

తడినేలను దున్నాడు. కావాల్సిన వేగంతో  గాలిని విసరమన్నాడు. విసిరింది.
విత్తుజల్లాడు. గాలి, వాన, ఎండ అన్నీ ఆ రైతు మాట ప్రకారమే జరిగాయి.
పైరు పచ్చగా ఏపుగా పెరిగింది. ఆ పొలం చూడటానికి ఎంతో రమ్యంగా ఉంది.
కోతల కాలం వచ్చింది.

 రైతు ఒక కంకి కోశాడు. గింజ నులిమి చూ శాడు. అదిరిపడ్డాడు.  లోపల ధాన్యం  లేదు. ఉత్తి ఊక, మరొకటి, మరొకటి అంటూ అన్నీ కోసి చూశాడు. ఎందులోనూ ధాన్యం లేదు. అంతా ఉత్తి ఊకమాత్రమే ఉంది.

"హారి దేవుడా!" అంటూ కోపంగా ఎలిగెత్తి పిలిచాడు. "వాన,ఎండ,గాలి అన్ని తగిన మోతాదుల్లోనే వాడాను. కాలానుగుణంగా, ఋతువులకి తగట్టుగా. అయితే పైరు పాడైపోయిందే! ఏం? ఎందుకు?"

భగవంతుడు నవ్వాడు. "నా ఆధీనంలో గాలి బలంగా వీచేది. అప్పుడు అమ్మను కౌగిలించుకొనే పిల్లల్లా నారు వేళ్ళు భూమిలోకి లోతుగా జోచ్చుకొని గట్టిగా  పట్టుకొనేవి. వాన తక్కువైనా నీటికోసం వేళ్లను నాలుగు పక్కలకు పాకించేది. పోరాటం అంటూ ఉంటేనే చెట్లు తమను కాపాడుకోవడం కోసం బలంగా పెరుగుతాయి.

 అన్ని వసతులు నువ్వే కల్పించేసరికి పైరు సోమరిదయ్యింది. నవనవలాడుతూ పెరిగిందే తప్ప ఆరోగ్యవంతమైన ధాన్యాన్ని అందించాలని దానికి తెలీదు.
"నాకు నీ గాలి, వాన,ఎండ వద్దు. నువ్వే ఉంచుకో". అంటూ రైతు దేవుడిచ్చిన వాటిని తిరిగిచ్చేశాడు.

జీవితం లో అన్నీ చక్కగా అమరిపోతే, అంతకన్నా విసుగు, శూన్యం వేరే ఉండదు. కష్టాలు మిమ్మల్ని అదిమేసటప్పుడే మీలో చాకచక్యం మరింత పెరుగుతుంది. సావాళ్ళే మనిషికి పరిపూర్ణతను ఇస్తాయి.

- సద్గురు జగ్గివాసుదేవ్

Sent by Ashwin Kumar Dulluri 

Sunday 17 January 2016

హిందూ ధర్మం - 192 (గోవు ప్రాముఖ్యత - 4)

సుశ్రుత సంహిత ప్రకారం గోమూత్రం చేదు, ఘాటు, వేడిగా ఉంటుంది. త్వరగా జీర్ణమవుతుంది. మెదడుకు బలాన్నిస్తుంది, దగ్గును నయం చేస్తుంది. పొత్తి కడుపు నొప్పి, దురద, తామర, మలబద్దకం, నోటి రోగాలను నశింపజేస్తుంది. బొల్లి, కుష్టు వ్యాధి, బస్తి రోగాన్ని నాశనం చేస్తుంది. నేత్ర వ్యాధులకు మంచి ఔషధం గోమూత్రం. అమీబియాసిస్, విరేచనాలు, డయేరియా, వాతం వలన కలిగే అన్ని రోగాలు, దగ్గు, వాపు, ఉదర వ్యాధులు గోమూత్రం వలన నయమవుతాయి. గోమూత్రం యాంటి-బయోటిక్. కామెర్లు, ప్లీహవ్యాకోచము, చెవి వ్యాధులు, ఉబ్బసం, మలబద్దకం, రక్తహీనత పూర్తిగా తగ్గిపోతాయి. అన్ని మూత్రాల్లోకి గోమూత్రానికి ఎన్నో ఔషధ గుణాలున్నాయి. అందువలన గోమూత్రాన్ని మాత్రమే వాడాలి - సుశ్రుత సంహిత

గోమూత్రం ఉప్పగా, ఘాటుగా, వేడిగా ఉండి, త్వరగా జీర్ణమవుతుందని, ఆకలిని పెంచుతుందని, పైత్యరసాన్ని పెంచుతుందని, కొద్దిగా తీపిగా ఉంటుందని, మలబద్దకాన్ని నివారిస్తుందని, శరీరంలోని వ్యాధులను కూకటి వ్రేళ్ళతో పెకిలించి వేస్తుందని ఆర్యబిషక చెప్తోంది. అవేగాక దగ్గు, కుష్టు, కడుపునొప్పి, ఉదర సంబంధ వ్యాధులు, రక్తహీనత, బొల్లి, నొప్పులు, మూలశంకవ్యాధి, తామర, ఉబ్బసం, ప్రేగు కోశ వ్యాధులు, జ్వరము, ఒళ్ళు మంటలు, నోరు, కంటి వ్యాధులు, స్త్రీలకు వచ్చే జబ్బులు. మూత్రవ్రోధము, జిగట విరోచనాలను నయం చేస్తుందని చెప్తోంది.

భావప్రకాశ అనే ఆయుర్వేదం గ్రంధం గోమూత్రం గుణాలను గురించి ఈ విధంగా చెప్తొంది. గోమూత్రం చేదు, ఘాటు, వేడి, ఉప్పగా  తక్కువ లవణాలు కలిగి ఉంటుంది. ఆకలిని పెంచుతుంది. మెదడు కణజాల వృద్ధికి ఎంతగానో తోడ్పడుతుంది. కఫాన్ని, పైత్యాన్ని హరిస్తుంది, జీర్ణరసాన్ని వృద్ధి చేస్తుంది. కడుపు నొప్పు, గ్యాస్, ఇతర ఉదర సంబంధ వ్యాధులు, తామర, నేత్ర దోషాలు, అన్ని రకాల నోటి దోషాలు నయం చేస్తుంది. బొల్లి, కుష్ఠులను నశింపజేస్తుంది. దగ్గు, ఊపిరాడకపోవడం, కామెర్లు, రక్తహీనత, జిగట విరోచనాలు, కీళ్ళ నొప్పులకు ఔషధం గోమూత్రం. హానికారక క్రిములని చంపేస్తుంది. కేవలం గోమూత్రం త్రాగడం వలననే అన్ని రోగాలు నశిస్తాయి. కాలేయానికి మేలు చేస్తుంది. వాపులు, మంటలు, మూలశంక, మలబద్ధకం, ఉదరవ్యాధులుకు గొప్ప ఔషధకారి. చెవిలో వేసుకుంటే అన్ని రకాల కర్ణవ్యాధులు తొలగిస్తుంది. మూత్రకోశ వ్యాధులు, ఆమం పెరిగిపోవడం వలన వచ్చే వ్యాధులు, కండరాల వ్యాధులు, అనేక వ్యాధులను నయం చేయగల శక్తి గోమూత్రానికుంది.

To be continued .................

Source:
http://www.blog.gomataseva.org/natural-healing-of-cow-dung/
https://trueayurveda.wordpress.com/2014/04/09/cow-dung-uses-and-used-for-centuries/

Wednesday 13 January 2016

ధనుర్మాస వ్రతం - ఆరోగ్యం - ఆయుర్వేదం

ధనుర్మాసం హేమంత ఋతువులో వస్తుంది. ఈ సమయానికి భారతదేశంలో చలి విపరీతంగా ఉంటుంది, పొగమంచు కారణంగా సూర్యుడి కిరణాలు భూమిని అధికంగా చేరలేవు, ఫలితంగా అరుగుదల, ఇతర జీవక్రియలు నెమ్మదిస్తాయి. అదే ఆకులు రాలి ప్రకృతి మొత్తం కళావీహినమైన కారణం చేత మనసుని జడత్వం, బద్దకం ఆక్రమిస్తాయి. హిందూ ధర్మం అంటే విశ్వధర్మం, మనిషి విశ్వానికి అనుగుణంగా బ్రతకడం జీవించడమే, ఆఖరున విశ్వాత్మలో ఐక్యమవడమే ఈ ధర్మం యొక్క లక్ష్యం. ఈ ధనుర్మాస వ్రతం ఆచరించేవారు ఉదయం వేకువజామునే లేచి పూజ ముగించి సూర్యోదయానికి పూర్వమే భగవంతునికి నివేదన చేయడం కూడా పూర్తి చేయాలి. ప్రతి రోజు ఒక్కో ప్రత్యేకమైన వంటకం ఉంటుంది, పులగం, కట్టెపొంగలి, చక్రపొంగలి, పరమాన్నం, పులిహోర ఇలా అన్నమాట. వాటిలో ఏఏ పదార్ధాలు వేయాలో, ఎప్పుడు వేయాలో, ఎంత వేయాలో కూడా ముందే నిర్ణయించారు పెద్దలు.

ఇందులో ఆయుర్వేద శాస్త్రం ఇమిడి ఉంది. మిరియాలు, శొంఠి, ధనియాలు, ఇంగువ మొదలైనవి ఉపయోగిస్తారు. ఇవి ఔషధగుణం కలిగినవి. ఈ కాలంలో వచ్చే అనారోగ్యాలను అరికట్టే శక్తి వీటికి ఉంది. ఇవే కాక దద్దోజనం కూడా వండుతారు. అసలు సూర్యోదయానికి ముందే నివేదన పూర్తి చేయాలన్న నియమం వెనుక కూడా ఆరోగ్య రహస్యం దాగి ఉంది. ఇది చలికాలం, పగలు తక్కువ, రాత్రి సమయం ఎక్కువ. సూర్యాస్తమాయం తర్వాత 1-2 గంటల్లోపు ఎట్టి పరిస్థితుల్లోనైన రాత్రి భోజనం ముగించాలి, అప్పుడే ఆహారం అరిగి, ఆరోగ్యంగా ఉండగలం. హేమంత ఋతువులు సూర్యాస్తమయం సాయంత్రం 5:30లో అవుతుంది. అంటే 7:30 లోపు రాత్రి భోజనం ముగించాలి. ఆ తర్వాత ఏమి తిన్నా అరగడం కష్టం. రాత్రి సమయం ఎక్కువ కావడం చేత ఉదయం సూర్యోదయం 6:30 కు అటుఇటుగా అవుతుంది. ఉదయం 8:30 కు ఉదయం భోజనం చేస్తామనుకున్నా, మధ్యలో 13-14 గంటల సమయం జీర్ణవ్యవస్థ ఖాళిగా ఉంటుంది. ఇంతసేపు ఖాళీగా ఉంటే, కడుపులో గ్యాస్ ఏర్పడి కొత్త రోగాలు వస్తాయి. కనుక ఇది ఆలోచించిన ఋషులు ఉదయమే అందరూ స్నానాలు ముగించి సూర్యోదయానికల్లా పూజ ముగించమన్నారు. సూర్యోదయం అవ్వగానే ఆహారం స్వీకరించవచ్చు కనుక ఈ ప్రసాదంగా చేసిన ఔషధవంటకాలను భుజిస్తారు. దద్దోజనం వంటివి గ్యాస్ ఏర్పడకుండా హరిస్తాయి. ఉదయం పరగడుపున ఏది స్వీకరిస్తమో, దాన్ని శరీరం పూర్తిగా స్వీకరిస్తుంది. ఔషధ తత్వాల ఆహారం స్వీకరిస్తే, రోగనిరోధకశక్తి పెరిగి ఆరోగ్యం పదిలంగా ఉంటుంది.

భోగి విశేషాలు ఈ లింక్ లో చూడవచ్చు.
http://ecoganesha.blogspot.in/2013/01/blog-post_10.html

గొబ్బెమ్మల విశేషాలు ఈ లింక్ లో చూడవచ్చు.
http://ecoganesha.blogspot.in/2013/01/blog-post_8.html

రంగవల్లులు - ఆరోగ్యం విశేషాలు ఈ లింక్ లో చూడవచ్చు
http://ecoganesha.blogspot.in/2013/01/blog-post.html

భోగి పండ్లెందుకు పోస్తారు కోసం ఈ లింక్ చూడండి
http://ecoganesha.blogspot.in/2013/01/blog-post_12.html

ఆండాళ్ అమ్మవారి కధ కోసం ఈ లింక్ చూడండి.
http://ecoganesha.blogspot.in/2016/01/blog-post_13.html

ధనుర్మాసం - ఆండాళ్ అమ్మవారు

అంతరిక్షం మొత్తాన్ని 360°గా, 12 రాశులుగా విభజించింది జ్యోతిష్య శాస్త్రం. అందులో సూర్యుడు ప్రతి రాశిలోకి ప్రవేశించే సమయాన్నే సంక్రమణం అంటారు. సూయుడు ఒక్కో రాశిలో నెలరోజులు ఉంటాడు. అలా మనకు ఒక ఏడాదిలో 12 సంక్రాంతులు వస్తాయి. సూర్యుడు ప్రవేశించడమేంటి అనే అనుమానం వస్తుంది. భూభ్రమణంలో కలిగే మార్పులను అనుసరించి, భూమి యొక్క అక్షాంశ, రేఖాంశలను బట్టి, భూమికి సూర్యునికి మధ్య ఉన్న దూరాన్ని అనుసరించి ఈ నిర్ణయం జరుగుతుంది. మనం భూమిపై నుంచి గమనిస్తాం కనుక, సూర్యుడు ప్రవేశించాడంటున్నాం. అలా సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించడంతో మొదలవుతుంది ధనుర్మాసం. శ్రీ మహావిష్ణువు ఆరాధనకు అత్యంత విశేషమైన మాసం ఇది. అన్ని పండుగులు చంద్రమానం ప్రకారం చేసుకున్నా, ధనుర్మాసాన్ని సౌరమానం ప్రకారం పాటిస్తాం. ధనుర్మాసం అనగానే గుర్తుకు వచ్చేది తిరుప్పావై, ఆండాళ్ అమ్మవారు, రంగవల్లులు, గొబ్బెమ్మలు.

ఆండాళ్ అమ్మవారు ఈ మాసంలో శ్రీ కృష్ణుడి గురించి వ్రతం చేసి ఆయన్ను చేరుకున్నారు. కలియుగంలో 93వ సంవత్సరంలో శ్రీ ఆండాళ్ తమిళనాట శ్రీవిల్లిపుత్తూర్ లోని వటపత్రశాయి మందిర తులసి వనంలో విష్ణుచిత్తులవారికి (పెరియాల్వార్) లభించారు ఆండాళ్ అమ్మవారు. తమిళంలో కోదై అనగా తులసి మాల అని అర్థం, తండ్రి ఆమెను కోదా అని పిలిచేవాడు, క్రమేపి ఆపేరే గోదాగా మారింది. తండ్రిపెంపకంలో ఆమెకు కృష్ణ పరమాత్మ పట్ల గొప్ప భక్తి అలవడింది. కాలక్రమంలో ఆమె కృష్ణుడినే తన పతిగా భావించింది. తన తండ్రి కృష్ణుడికి తులసి మాలలు సమర్పించేవారు, గోదాదేవి విష్ణుచిత్తులవారికి తెలియకుండా ఆ మాలలు తాను ధరించి, తను భగవంతుని వివహామాడటానికి సరిపోదునా అని చూసుకుని, మురిసిపోయి, తన తండ్రికి తెలియకుండా ఆ మాలలను యధావిధిగా బుట్టలో ఉంచేది. ఒకనాడు తండ్రికి మాలాలో వెంట్రుక కనిపిచగా, అది గోదా ధరించిందని గ్రహించి, ఒకరు ధరించిన మాలను స్వామికి సమర్పించడం తప్పని సమర్పించలేదు. ఆ రాత్రి స్వామి స్వప్నంలో కనిపించి, తనకు గోదా ధరించిన మాల అంటే ఇష్టం అని, అది ఎందుకు సమర్పించలేదని ప్రశ్నిస్తాడు. ఆ సంఘటనతో గోదాదేవి కారణజన్మురాలని అర్ధం చేసుకుని, మమ్మల్ని కాపాడుటకు వచ్చావని, ఆమెను ఆండాళ్ అని పిలవటం మొదలుపెట్టారు విష్నుచిత్తుడు. అప్పటినుంచే రోజు ఆండాళ్ సమర్పించిన మాలనే స్వామికి సమర్పించేవారు. గోదాదేవికి పెళ్ళి వయసు రాగానే తండ్రి వరుని వెదకటానికి సిద్ధమవ్వగా, ఆమె కృష్ణున్ని మాత్రమే వివాహమాడుతానని పంతంతో చెప్తుంది. కాని తండ్రి కృష్ణుడు ఉండేది ద్వాపరంలో నందగోకులమనే ప్రాంతము అని, అది చాలదూరము, కాలము కూడా వేరని, ఇప్పుడు కృష్ణుడిని కేవలం అర్చామూర్తిగానే చూడవచ్చని చెప్తారు. విష్ణుచిత్తులవారు వివిద దివ్యక్షేత్రాలలోని ఆయా మూర్తుల వైభవాన్ని కీర్తించగా, గోదాదేవి శ్రీరంగంలో ఉన్న రంగనాయకులని తనకు వరునిగా తలచింది. శ్రీరంగనాథున్ని వివాహమాడుటకై తాను "తిరుప్పావై" మరియు "నాచియార్ తిరుమొఱ్ఱి" అనే దివ్యప్రభందాలను పాడారు. ఆ తర్వాతా ఆమె శ్రీ రంగనాధుని వివాహమాడి, ఆయనలో ఐక్యమైంది.

ఆండాళ్ అమ్మవారు చేసిన ఆ గానాన్ని ఈ ధనుర్మాసం నెల రోజులు వైష్ణవదేవాలయాల్లో సుప్రభాతానికి బదులుగా గానం చేస్తారు. శైవాలయాల్లో ఇదె సమయంలో తిరువెంబావైని గానం చేస్తారు. భోగి పండుగనాడు గోదారంగనాయకుల కళ్యాణం చేస్తారు.
----------------------------------------
భోగి విశేషాలు ఈ లింక్ లో చూడవచ్చు.
http://ecoganesha.blogspot.in/2013/01/blog-post_10.html

గొబ్బెమ్మల విశేషాలు ఈ లింక్ లో చూడవచ్చు.
http://ecoganesha.blogspot.in/2013/01/blog-post_8.html

రంగవల్లులు - ఆరోగ్యం విశేషాలు ఈ లింక్ లో చూడవచ్చు
http://ecoganesha.blogspot.in/2013/01/blog-post.html

భోగి పండ్లెందుకు పోస్తారు కోసం ఈ లింక్ చూడండి
http://ecoganesha.blogspot.in/2013/01/blog-post_12.html

ధనుర్మాస నివేదనలు - ఆయుర్వేదం - ఆరోగ్యం కొరకు ఈ లింక్ చూడండి.
http://ecoganesha.blogspot.in/2016/01/blog-post_49.html 

Sunday 10 January 2016

హిందూ ధర్మం - 191 (గోవు ప్రాముఖ్యత - 3)

ఈ కాలంలో మనం రెడియేషన్‌లో బ్రతుకుతున్నాం. అది మన మీద అనేక దుష్ప్రభావలను చూపిస్తోంది. గోమయం (ఆవుపేడ) రేడియేషన్‌ను పూర్తిగా నిరోధిస్తుంది. ఆవుపేడతో అలికిన ప్రాంతం రేడియోధార్మికశక్తిని నిరోధిస్తుందని రష్యన్ల పరిశోధనలో తేలింది. ఇంటిపై భాగంలో ఆవుపేడ అలికితే ,ఆ ఇంటి లోపలికి రేడియోధార్మికత ప్రవేశించదు. అంతటి శక్తి ఆవుపేడకు ఉంది. అందుకే ఇప్పటికి భారత్ మరియు రష్యా అణుశక్తి కేంద్రాల్లో రెడియేషన్ ప్రభావాన్ని నిరోధించడానికి/ ఎదురుకోవడానికి ఆవుపేడను ఉపయోగిస్తారని ఒక జంతుప్రేమికుల సంస్థ వెళ్ళడించింది. ఆవు పేడను నీటిలో కలిపి చల్లడం వలన ఇంటిలోనికి ఈగలు, దోమలు రావు. అదే ఇతరత్రా జంతువుల మలాన్ని చల్లితే అక్కడ క్రిములు చేరి రోగాలు వ్యాపిస్తాయి.

ఆవుపేడ యాంటి-సెప్టిక్ లక్షణాలు కలిగి ఉంటుంది. పవిత్ర ప్రదేశాల్లో, వంటగదిలో, ఇల్లంతా ఆవుపేడను అలికేది ఈ కారణం చేతనే. అందువల్ల ఇంట్లో వాళ్ళకి రోగాలు రావు. ఈ నాటికి కొన్ని తెగలవారు బాలింతలకు జ్వరం వచ్చినప్పుడు చికిత్సకు ఆవుపేడనే వాడతారు. ఆయుర్వేదంలో పంచగవ్యోప్రాశన అనే చికిత్సా విధానం కూడా ఉంది. ఇందులో ఆవు నుంచి వచ్చే పాలు, పెరుగు, నెయ్యి, మూత్రం, పేడలను ఉపయోగించి వైద్యం చేస్తారు. కొంతకాలంగా మరుగున పడిన ఈ పద్ధతి ఈ మధ్య కాలంలో మళ్ళీ వ్యాప్తి చెందుతోంది. అద్భుతమైన ఫలితాలు కనబరచడం, దీనివలన రోగాలు తగ్గడం, ఎటువంటి సైడ్-ఏఫెట్స్ లేకపోవడం వల్లనే ఇది జరుగుతోంది.

కొన్ని పెద్ద పెద్ద యజ్ఞయాగది క్రతువుల్లో, వ్రతాలు, నోముల సమయంలో, సూర్యభగవానుడి ఆరాధన పద్ధతుల్లో పంచగవ్యాలతో చేసిన తీర్ధాన్ని స్వీకరిస్తారు.

ఇల్లు శుభ్రం చేయడానికి వాడే ఫినాయిల్, ఇతర వస్తువులు మొదలైనవి శ్వాసకోశ సంబంధిత వ్యాధులను కలిగిస్తాయి, పాదాల పగుళ్ళకు కూడా ఇవి కూడా ఒక కారణం. కానీ దానికి భిన్నంగా ఆవుపేడ వాసన శ్వాశకోశ సంబంధిత వ్యాధులను నిరోధిస్తుంది. ఇన్ని విశిష్టతలు ఉన్నాయి కనుకే ఆవుపేడతో కళ్ళాపి చల్లుతారు, ఇల్లు అలుకుతారు హిందువులు.

భారతీయ గోవు యొక్క పేడకు ఇన్ని లక్షణములున్నాయి కాబట్టే లక్ష్మీదేవిని నువ్వు ఎక్కడుంటావు అని విష్ణుమూర్తి అడిగితే గోమయంలో ఉంటాను స్వామి అన్నది. అందుకే ధర్మశాస్త్రం 'అష్టైశ్వర్యమయి లక్ష్మీ వసతే గోమయేసదా' అని అంటుంది. అనగా లక్ష్మీదేవి అష్టైశ్వరములతో గోమయమందు ఉంటుందని అర్దం.

To be continued ...............

Tuesday 5 January 2016

మిమ్మల్ని మీరు మార్చుకోండి - చిన్న కధ - సద్గురు జగ్గీ వాసుదేవ్

శంకరన్ పిళ్ళై ఉద్యోగార్ధం అరేబియా దేశం వెళ్ళాడు. రాజుగారికి క్షవరం చేసే పని దొరికింది.

జీతం మంచిది. శంకరన్ పిళ్ళై తను దాచిన మొత్తానికి బంగారం కొన్నాడు. అది ఒక బత్తాయిపండు సైజులో వుంది. దానిని తన క్షురకపెట్టేలో దాచాడు.
ఒకసారి రాజు క్షవరం చేయించుకుంటూ, అడిగాడు, "మన పాలనలో మనుషులేలాగున్నారు?" అని.

"బాదుషా, మీ పాలనకేం కొరత? ఒక్కోకడి దగ్గరా కనీసం బత్తాయంత బంగారం వుంది" అన్నాడు.

రాజు తన మంత్రికిది చెప్పి, సంతోషపడ్డాడు. "రేపు ఇదే ప్రశ్న శంకరన్ పిళ్ళైను అడిగి చూడండి" అన్నాడు.

ఆ రాత్రి శంకరన్ పిళ్ళై దాచిన బంగారాన్ని దొంగలించడానికి మంత్రి తగిన ఏర్పాట్లు చేశాడు. మర్నాడు శంకరన్ పిళ్ళైను రాజు అదే ప్రశ్న వేశాడు.
శంకరన్ పిళ్ళై ముఖం వేలాడబడింది. "చెప్తే తప్పుగా అనుకోరు కదా బాదుషా! మీ పాలనలో ఎక్కడ చూసినా దొంగతనం, కొల్లగొట్టడం, దారికాయడమే! కనీసం బత్తాయంత బంగారం కూడా దాచుకోలేకపోతున్నారు ప్రజలు" అంటూ బాధపడ్డాడు.

శంకరన్ పిళ్ళై తన పరిస్థితిని ఆధారంగా చేసుకుని, ఒక రాజ్యం స్థితిగతుల్ని లేక్కించినట్టే మీరూ, మిమ్మల్ని దృష్టిలో వుంచుకొని, చుట్టూ వున్న అందరి జీవితాలు నాశనమయ్యాయని తీర్పు చెప్తున్నారు.

ఆర్దికంగా వెనుకబడి వున్న మన దేశం ఊపందుకొని కదంతోక్కుతూ ముందంజ వేయడాన్ని మీరు రెండు చేతులూ జాచి ఆహ్వానించండి. ఈ పరిస్థితికి వ్యతిరేకమైన ఆలోచన కూడా మీ మనసులో రానియకండి.
మీ వసతిని తగ్గించారని, ఎవరినో ఏదో అనడం మానండి. అన్ని అయిపొయాయను కోవద్దు.

మీరు ఎదగడానికి, జీవితంలో ఎన్నో అవకాశాలుంటాయి. మార్పులకి తగ్గట్టు మిమ్మల్ని మీరు మార్చుకోండి. ఏ క్షణమూ అలాగే వుండిపోదు, మార్పే జీవితానికందం. మార్పును మనసారా అంగీకరించడానికి తయారవకపోతే జీవితంలో బాధా, వేదనా మిగులుతాయంతే! మీరూ నేర్చుకోవలసిన ప్రాకృతిక రహస్యం ఇది.
------ సద్గురు జగ్గీ వాసుదేవ్ -----

Sent by Ashwin Kumar Dulluri

Sunday 3 January 2016

హిందూ ధర్మం - 190 (గోవు ప్రాముఖ్యత - 2)

వేదాలు ఆవునెయ్యి, ఆవుపాలను అమృతం అన్నాయి. పసిపిల్లలకు తల్లిపాలు పట్టే పరిస్థితి లేనప్పుడు ఆవుపాలనే పడతారు. ఎందుకంటే ఆవుపాలలో కొవ్వు శాతం చాలా తక్కువగా ఉండడమే కాక అవి తల్లి పాలతో సమానమైనవిగా పిల్లలపై పని చేస్తాయి. అందుకే ఆవును అమ్మగా భావిస్తారు. దేశీ ఆవుపాలను ఎ2 పాలుగా పరిగణిస్తారు. గోమాత అంటారు. ఇవి క్యాన్సర్ కలిగించే కణాలను నశింపజేస్తాయి, శరీరంలో కొవ్వు పేరుకోనివ్వవు, మంచి బలవర్ధకమైన, పోషక విలువలు కలిగిన ఆహారం. దేశీ గోవు వీపుపై నూపురం ఉంటుంది. ఇందులో సూర్యకేతు నాడి అనే ప్రత్యేకమైన నాడి ఒకటి ఉంటుంది. ఇది సూర్యుని సంబంధం కలిగి ఉండి, సూర్యుడి నుంచి వచ్చే శక్తిని నేరుగా  గ్రహిస్తుంది. ఆ కారణంగా ఆవుపాలు కొద్దిగా లేత బంగారు వర్ణం కూడా కలిగి ఉంటాయి. ఇది విటమిన్ డి దేహానికి అందిస్తుంది. ఈ సూర్యకేతు నాడి కేవలం భారతీయ గోసంతతికి మాత్రమే ఉంటుంది. ఆవుపాలు మేధో వృద్ధిని కలిగిస్తాయి. నిత్యం ఆవుపాలనే త్రాగడం, 3 జన్మల కాలం పట్టే జ్ఞానాన్ని కేవలం 30 ఏళ్ళలో పొందినట్టుగా హిమాలయల్ల వద్ద నివసిస్తున్న ఒక విదేశీయుడు వెళ్ళడించాడు. అది ఆవుపాలకున్న శక్తి.

పసిపిల్లలకు జ్వరాలు వచ్చినప్పుడు గోపుఛ్ఛాన్ని(ఆవు తోకను) వాళ్ళ చుట్టూ తిప్పుతారు. అలా చేయడం వలన పిల్లలపై పడిన చెడు దృష్టి తొలగిపోతుంది. ఆవును స్పృశించినప్పుడు అది మనలో ఉన్న నకారాత్మక శక్తి (Negative Energy) ని తీసుకుని, సకారత్మక శక్తి (Positive Energy) ని ప్రసాదిస్తుంది. అందుకే ప్రతి నిత్యం గోవును స్పృశించి, నమస్కరించి బయటకు వెళ్ళమంటారు. మనుష్యులలో ఉన్న నకారాత్మక శక్తిని ఏ ప్రతిఫలం ఆశించకుండా, రూపాయి ఖర్చు లేకుండా తీసుకునే ప్రాణి భారతీయ గోవు మాత్రమే. ఉదయం నిద్రలేచిన తర్వాత గోవును దర్శనం చేసుకున్నవారి రోజు ఎంతో ప్రశాంతంగా గడుస్తుందని అనేకుల నిత్య జీవితానుభవం.

ఈ ప్రపంచంలో ఏ జీవి మలం, మూత్రాదులైనా హానికారక క్రిములు కలిగి ఉంటాయి. కానీ ఒక్క గోమయం (ఆవుపేడ), గోపంచకం (మూత్రం) మాత్రమే మిత్రజీవాలను, ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. వాటికి ఎనలేని పవిత్రత ఉంది. అందుచేతనే ఇంటిని గోపంచకంతో సంప్రోక్షణ చేస్తారు. దాని వలన పవిత్రత కలగడమే కాక, క్రిమి సంహారం కూడా జరుగుతుంది. ఆవుపేడను ఇళ్ళకు అలకడం అందరికీ విదితమే. ఇప్పటీ ఈ ఆచారం పల్లెల్లో ఉంది.

1 గ్రాము దేశీ ఆవు పేడలో 300 కోట్ల మిత్ర క్రిములున్నాయని శ్రీ సుభాష్ పాలేకర్ గారు రుజువు చేసారు. జెర్శీ ఆవుకు , దేశీ ఆవుకు ఎన్నో తేడాలున్నాయని కూడా ఈయన రుజువు చేసారు. దేశీ ఆవు పేడలో, మూత్రంలో ఉన్నన్ని మిత్రక్రిములు జెర్సీ ఆవుతో సహా మరే ఇతర జంతువు మల మూత్రాలలో కూడా లేవని అయన రుజువు చేసారు. పైగా వాటి మల మూత్రాలలో మానవునికి కీడు చేసే భారీ లోహాల మిగులు , హాని కారక క్రిముల శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. జెర్సీఆవు 1 గ్రాము పేడలో 70 లక్షల హానికారక సూక్ష్మక్రిములు ఉన్నాయి. మిత్రక్రిములంటే భూమికి, మనిషికి, ప్రకృతికి మేలు చేకూర్చేవి. మనిషి శరీరంలో కూడా కొన్ని మిత్రక్రిములుంటాయి. పేగులు ఉంటూ, జీర్ణవ్యవస్థలో ప్రధానపాత్ర పోషిస్తాయి. యాంటి-బయాటిక్స్ అధికంగా సేవించడం వలన ఇవి నశించి, ఉదర, పేగు సంబంధిత రోగాలు వస్తాయి. అట్లాగే దేశీ ఆవుపేడలో ఉండే మిత్రజీవాలు కూడా అందరికి మేలు చేస్తాయి. జీవరాశి నుంచి వెలువడిన మలం అత్యంత రోగకారమైందిగా ఉంటుంది. కానీ దేశీ ఆవు పేడ మాత్రం అందుకు పూర్తి భిన్నం. అది ఆరోగ్యానికి హేతువు.  

To be continued ...............

Saturday 2 January 2016

స్వామి శివానంద సూక్తి

Prarabdha is Purushartha of last birth. You sow an action and reap a habit; a habit sown results in character. You sow a character and reap a destiny. Man is the master of his own destiny. You yourself make, by the power of your thought, your destiny. You can undo it if you like. All faculties, energies and powers are latent in you. Unfold them, and become free and great.  - Swami Sivananda


Friday 1 January 2016

శ్రీ శారదమాత జన్మతిధి

తిధి ప్రకారం నేడు శ్రీ శారదమాత పుట్టినరోజు. శ్రీ రామకృష్ణ పరమహంస గారి పత్ని అయిన శ్రీ శారదామాత సాక్షాత్తు కాళీ స్వరూపం. స్వామి సత్స్వరూపానంద మొదలైన అనేకమందికి అమ్మ కాళీ మాతగా దర్శనమిచ్చారు. అయినప్పటికి సాధారణ మహిళ వలనే జీవితం గడిపారు. రామకృష్ణుల భక్తులకు అన్నం వండడం కోసం కట్టెల పొయ్యి దగ్గర కూర్చుని వంట చేసేవారు, కళ్ళు మండుతున్నా, పొగ గొట్టంతో ఊది త్వరగా వంట సిద్ధం చేసేవారు. భక్తుల బట్టలు ఉతికేవారు. ఇలా అమ్మ చేయని పనిలేదు. అటువంటి శారదామాత అనుగ్రహం మన అందరిపై ప్రసరించాలి.

ఓం యాదేవీ సర్వభూతేషు మాతృ రూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః