Saturday 31 October 2015

స్వామి శివానంద సూక్తి



The stronger the thoughts, the earlier the fructification. Thought is focussed and given a particular direction and, in the degree that thought is thus focussed and given direction, it is effective in the work it is sent out to accomplish - Swami Sivananda

Tuesday 27 October 2015

Monday 26 October 2015

త్రైలింగ స్వామి సూక్తి


శరత్ పూర్ణిమ - విశిష్టత

ఈ రోజు (25-10-2015, సోమవారం) శరత్ పూర్ణిమ. ఆశ్వీయుజ పూర్ణిమకే శరత్ పూర్ణిమ అని పేరు. ఇది అమ్మవారి ఆరాధనకు చాలా విశేషమైన రోజు. మామూలు ప్రజలు అమ్మవారి ఆరాధన దేవి నవరాత్రులు 9 రోజులు చేస్తే, దేవీ ఉపాసకులు అమ్మవారి ఆరాధన ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నుంచి పూర్ణిమ వరకు 15 రోజుల పాటు చేస్తారు. ఏడాదిలో ఈ పూర్ణిమ నాడు మాత్రమే చంద్రుడు పూర్తి 16 కళలతో ప్రకాశిస్తాడు. అందువలన ఈ రోజు చంద్రుడిని పూజించాలి.

ఈ శరత్ పూర్ణిమ రోజున చందకిరణాలకు విశేషమైన శక్తి ఉంటుంది. అవి శారీరిక, మానసిక రుగ్మతలను దూరం చేస్తాయి. అందువలన చంద్రకాంతిలో కూర్చుని లలితా సహస్రనామ పారాయణ చేయడం, ఆవుపాలతో చేసిన పరమాన్నం చంద్రుడికి నివేదన చేసి రాత్రంతా చంద్రకాంతిలో ఉంచి, ఉదయాన్నే దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారు. చంద్రకాంతి నుంచి ఈ పౌర్ణమి రోజున అమృతం కురుస్తుందని శాస్త్రం చెప్తోంది. చంద్రకాంతిలో ఉంచిన పరమాన్నం చంద్రకిరణాల లో ఉన్న ఓషిధీతత్త్వాన్ని తనలో ఇముడ్చుకుంటుంది. మరునాడు ఉదయం ఆ పరమాన్నాన్ని కుటుంబసభ్యులందరూ నైవేధ్యంగా స్వీకరించాలి.

శ్రీ కృష్ణుడు పరిపూర్ణావతారం. ఆయనలో 16 కళలున్నాయి. అందుకే ఈ శరత్ పూర్ణిమను బృందావనంలో రాసపూర్ణిమ అంటారు. శ్రీ కృష్ణుడు ఈ రోజే మహారాసలీల సలిపాడని అంటారు. కృష్నుడి వేణుగానం విన్న గోపికలు, అన్నీ వదిలేసి ఆయన కోసం అడవిలోకి పరిగెత్తగా, కొన్ని వేలమంది కృష్ణులు వేలమంది గోపికలతో ఈ పున్నమి రాత్రి మొత్తం నాట్యం చేసారట.

ఈ పూర్ణిమకే కోజాగరి పూర్ణిమ అనే పేరు కూడా ఉంది. కోజాగరీ పూర్ణిమ రోజున లక్ష్మీదేవిని పూజిస్తారు.

అందరికి శరత్ పూర్ణిమ శుభాకాంక్షలు 

Sunday 25 October 2015

హిందూ ధర్మం - 181 (ధర్మపరిచయం 4 రకాలు)



వేదార్దాన్ని వక్రీకరించినవారిలో ముఖ్యుడు మాక్స్ ముల్లర్. ఇతను జెర్మన్ దేశస్థుడు. నిజానికి ఇంగ్లాండ్‌లో సంస్కృత అభ్యాసం 16 వ శతాబ్దంలోనే మొదలైంది. కానీ భారతదేశంపై అధికారాన్ని బ్రిటన్ చేజిక్కించుకున్న తర్వాత భారతీయులలో చీలికలు తీసుకురావడానికి, సనాతన ధర్మాన్ని విఛ్ఛినం చేయడానికి తీవ్ర ప్రయత్నాలు చేసింది. భారతీయులను తమకు బానిసలు చేసుకోవాలని పన్నాగం పన్నింది. అందులో ఒక పావు మాక్స్ ముల్లర్. ఇతడు హిందువుల మతమార్పిడే లక్ష్యంగా వేదానికి అర్దం రాసేలా బ్రిటన్ ఆదేశించింది.

ఒక సంస్కృతి గురించి చెప్పవలసి వచ్చినప్పుడు, ఆ సంస్కృతిలో జన్మించి, దాన్ని పాటిస్తున్నవారు, దాని లోతులను అర్దం చేసుకున్నవారు చెప్తే, అసలు సందేశం యధాతధంగా అందుతుంది. దీని గురించి రాజీవ్ మల్హోత్రా గారు Invading the sacred పుస్తకంలో చెప్పిన ఒక విషయం చెప్పుకోవాలి. ఒక సంస్కృతి గురించి, జీవన విధానం గురించి విశదీకరించి చెప్పడం నాలుగు రకాలుగా ఉంటుంది.

ఆ సంస్కృతికి చెందినవారు, అదే సంస్కృతికి చెందినవారితో చెప్పడం మొదటి విధానం.  దీన్ని వారు Insider to Insider అన్నారు. Insider కి సంస్కృతి యొక్క మూలతత్త్వం, దాన్ని అర్దం చేసుకునే విధానం, దాని సందేశంపై పూర్తి అవగాహన ఉంటుంది. శ్రోత కూడా Insider కాబట్టి కాస్తకూస్తో అవగాహన ఉంటుంది.

రెండవ విధనం Insider to Outsider. ఈ విధానంలో సంస్కృతికి చెందిన అంతర్గతవ్యక్తి (Insider), దీనికి చెందని వ్యక్తి (outsider) కి దీని గురించి చెప్పడం. ఇందులో శ్రోతకు Insider యొక్క జీవిన విధానంపై ఏ మాత్రం అవగాహన ఉండదు. అతడికి ఏ విషయాన్ని ఏకవ్యాక్యంలో చెప్పలేరు. అందువలన విశదీకరించి చెప్పాలి.

Outsider to Insider మూడవ విధానం. ఇక్కడ సమూహంతో ఏ సంబంధంలేని వ్యక్తి, దాన్ని ఆచరించని వ్యక్తి, దాని గురించి అదే సమూహానికి/ జీవన విధానానికి చెందిన వ్యక్తులతో చెప్పడం. వారికి వారి సంస్కృతినే పరిచయం చేయడం.

నాల్గవ విధానం Outsider to Outsider. ఇందులో సమూహానికి చెందిన వ్యక్తులతో ఏ మాత్రం సంబంధం ఉండదు. Outsider తనకు అర్దమైనంతమేర, అవగాహన చేసుకున్నంతమేర అవతలి వ్యక్తికి చెప్తాడు.

ఇందులో మొదటి రెండు పద్ధతులు శ్రేష్టమైనవి. ఎందుకంటే ఒక సంస్కృతిలో పుట్టి పెరిగిన వ్యక్తికి, దానిపై సంపూర్ణ అవగాహన ఉండడమేకాక, దాని లోటుపాట్లు, లోతు కూడా తెలిసి ఉంటాయి. అయితే ఇక్కడ కూడా హిందూ ధర్మానికి, అన్యమతాలకు తేడా ఉంది. హిందూ ధర్మానికి సంబంధించి చెప్పుకుంటే, కేవలం ఈ ధర్మంలో పుట్టడం వలన దీనిపై అవగాహన రాదు. ఎవరైతే ధర్మాన్ని ఆచరిస్తారో, వారికి మాత్రమే వ్యక్తిగత అనుభవాల ద్వారా దీని రహస్యాలు, గూఢార్ధాలు బోధపడతాయి. కాబట్టి ఈ ధర్మానికి సంబంధించినంతవరకు Insider అంటే కేవలం ఇందులో పుట్టినవాడు అనే కాదు, ఇతర ప్రభవాలకు లోనుకాకుండా, ఈ ధర్మాన్ని అర్దం చేసుకునేవాడు, దీన్ని పాటించేవాడు అని అర్దం చేసుకోవాలి.. అన్యమతాల్లో ఇలా ఉండదు. అక్కడ అంతర్గత సాధనలు చేసి సాక్షాత్కారం పొందే వీలు వాటిలో లేదు. అవి కల్పించలేదు.

మూడు, నాలుగు పద్ధతులు లోపాలతో కూడినవి. అందులో ప్రధానమైన అంశం Outsider యొక్క ఉద్ద్యేశం (intention). అతను ఈ ధర్మం మీద ఏ ఉద్ద్యేశంతో, దీని గురించి ప్రవచిస్తున్నాడనేది ముఖ్యం. అతడు ఎంతవరకు సాధన చేసి, ఉన్నతమైన దివ్యానుభూతులు, సాక్షాత్కారం పొందాడనే పెద్ద ప్రశ్న వస్తుంది.  

To be continued .......................

Friday 23 October 2015

స్వామి శివానంద సూక్తి


If the food is pure, thought also becomes pure. He who has pure thoughts speaks very powerfully and produces deep impression on the minds of the hearers by his speech. He influences thousands of persons through his pure thoughts - Swami Sivananda 

Thursday 22 October 2015

దసరా తీర్మానం - స్వామి శివానంద

దసరా అనే పదం దశ-హర అనే పదం నుంచి వచ్చింది. పదితలల రావణుడిని వధించడమే దశహరా. కాబట్టి ఈ రోజు మనం రాక్షసుడి పదితలలైన
అభిరుచి (passion),
అహంకారం (pride),
క్రోధం (anger),
దురాశ (greed),
వాంఛ (infatuation),
కామం (lust),
ద్వేషం (hatred),
అసూయ (jealousy),
స్వార్ధం (selfishness),
వంకరబుద్ధి (crookedness—of the demon),
మదం (Ego) లను ఖండించాలని తీర్మానం చేసుకుని, దసరా పండుగను జరుపుకుందాం.

- స్వామి శివానంద

Wednesday 21 October 2015

సిద్ధిదాత్రి

దుర్గా మాతా యొక్క నవమ శక్తిని సిద్ధిదాత్రి అంటారు. మార్కండేయ పురాణానుసారం అణిమా, మహిమా, గరిమ, లఘిమ, ప్యాప్తి, ప్రాకామ్య, ఈశిత్వ, వశిత్వ. ఇవి అష్టసిద్ధులు. బ్రహ్మ వైవర్త పురాణ శ్రీకృష్ణ జన్మ ఖండంలో ఈ విధంగా చెప్పబడింది.

1.అణిమా 2.సర్వకాయావసాయిత్వ 3.గరిమ 4. లఘిమ 5.ప్యాప్తి 6. ప్రాకామ్య 7.ఈశిత్వ 8.వశిత్వ 9.సర్వజ్ఞత్వ 10.దూర శ్రవణ 11.పరాకాయ ప్రవేశం 12.వాక్‌ సిద్ధి 13.కల్ప వృక్షత్వం 14.సృష్టి 15.సంహార కరణ సామర్థ్యం 16. అమరత్వం 17. సర్వనామ కత్వం 18. భావన 19. సిద్ధి .

సిద్ధిదాత్రీదేవి భక్తులకు సాధకులకు సర్వసిద్ధులను దేవి ఆరాధన పరిపూర్ణం చేసి చేసిన తరువాత భక్తు సాధకుల లౌకిక కామనలెన్నో సిద్ధిస్తాయి. సర్వాభీష్టాలకూ ఆవశ్యకతలకూ అతీతంగా భగవతీదివ్యలోకాలలో మానసికంగా విహారిస్తే దేవి కృపారసామృతాన్ని పానం చేస్తూ విషయభోగ శూన్యుడై ఉంటాడు. మాత సాన్నిధ్యమే సర్వపుణ్యాలను అందిస్తుంది.

http://www.suryaa.com/features/article.asp?subCategory=3&ContentId=50734

విజయదశమి పూజా మూహుర్తం

విజయదశమి రోజు అమ్మవారిని అపరాజితా దేవిగా పూజించాలి. అపరాజితా అంటే అపజయం లేనిది, ఓటమి లేనిదని అని అర్దం. అమ్మవారికి ఎందులోను అపజయంలేదు. ఆమె సర్వజ్ఞ, సరవ్యాపి, సర్వశక్తిమంతురాలు. ఆమెను ఓడించగలవారు ఎవరూ లేరు.

కలశ స్థాపన చేసి నవరాత్రులు పూజించినవారైనా, లేక 5, 3 రాత్రులు చేసినవారు విజయదశమి రోజు ఉదయం వ్యర్జ్యం లేని సమయంలో ఉద్వాసన చెప్పాలి. కలశస్థాపన చేయని మామూలు ప్రజలు కూడా విజయదశమి రోజు తప్పకుండా అమ్మవారిని అపరాజితాదేవిగా ఆరాధించాలి. ఈ రోజున అమ్మవారికి శమీపత్రలాతో పూజించి అర్చించినవారికి అనుకున్న పనుల యందు విజయం సిద్ధిస్తుంది.

ఓం అపరాజితాయై నమః అని, లేక ఓం చండికాయై నమః అనే నామాన్ని కానీ జపం చేయాలి.

రేపు ఉదయం 11.58 వరకు నవమి తిధి ఉంది. ఆ తర్వాతే దశమి వస్తుంది. కనుక అపరాజితాదేవి ఆరాధన 11.58 తర్వాతే చేయాలి. ధృక్పంచాంగం ప్రకారం 2015 విజయదశమి విజయ మూహుర్తం - మధ్యాహ్నం 1:55-2:41 వరకు.
మధ్యాహ్న పూజా సమయం - 1:09 నుంచి 15:28 వరకు. (ముహూర్తసమయాలు రెండు హైద్రాబాదు అక్షాంశ, రేఖాంశలను అనుసరించి).

మీ ప్రాంతంలో ముహూర్తం ఈ లింక్ లో తెలుసుకోవచ్చు.
http://www.drikpanchang.com/festivals/vijayadashami/aparajita-puja-date-time.html

ఆధ్యాత్మిక విజయానిచ్చే అమరిక

సాధకుడి ఆధ్యాత్మిక ఎదుగుదలకు, ఈ నవరాత్రుల ఆరాధనా అమరికకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఇది ప్రతి సాధకుడు అవశ్యకంగా దాటవలసిన పరిణామ దశలను సూచిస్తోంది. ఒక దశ సహజంగానే తర్వాతి దశకు తీసుకువెళుతుంది, కానీ తద్విరుద్ధంగా వెళితే, అది పతనానికి కారణమవుతుంది. ఈ కాలంలో అనేకమంది సాధకులు అజ్ఞానంతో తమలో మాలిన్యాలను తొలగించుకుని, శుద్ధి చేసుకుని, దైవీసంపత్తిని పొందే ప్రయత్నం చేయకుండా నేరుగా జ్ఞాన సముపార్జన చేయాలని ప్రయత్నించి, ఆ మార్గంలో విఫలమై ఫిర్యాదు చేస్తున్నారు. వారు ఎలా ముందుకెళ్ళగలరు? మాలిన్యాలు తొలగిపోయేవరకు, శుద్ధ గుణాలు పెంపొందేవరకు జ్ఞానం లభించదు. సాత్త్వికమనే మొక్క మాలిన్యమైన మట్టి యందు పెరగదు.

ఈ అమరికను అనుసరిస్తూ మీ ప్రయత్నం సాగిస్తే, మీరు తప్పక విజయం సాధిస్తారు. ఇదే మీ మార్గం. మోక్షానికి వేరొక మార్గం లేదు. దుర్గుణాలన్నిటిని నశింపజేసుకుని, వాటి విరుద్ధమైన సద్గుణాలను పెంపొందించుకోండి. ఈ ప్రక్రియ ద్వారా మీరు త్వరగా పరిపూర్ణతను సాధించి, మీ గమ్యమైన పరబ్రహ్మంతో ఏకమవుతారు. అప్పుడు మీకు పూర్ణ జ్ఞానం లభిస్తుంది, మీరు సర్వజ్ఞులు, సర్వశక్తివంతులై, సర్వత్రా వ్యాపించిన ఆత్మతత్త్వాన్ని అనుభూతి చెందగలుగుతారు. అందరిలో మిమ్మల్నే చూసుకోగలుగుతారు. జీవన్ముక్తులవుతారు. జననమరణ చక్రం మీద, సంసారనమనే అసురుడి  మీద శాశ్వతమైన విజయం పొందుతారు. ఇక మీకు ఏ మాత్రం బాధ ఉండదు, లేమి ఉండదు, పుట్టుక ఉండదు, చావు ఉండదు, విజయం మీదే అవుతుంది.

జగజ్జననికి విజయమగుగాకా! ఆమె మిమ్మల్ని ఆధ్యాత్మిక నిచ్చెనలో ఒక్కో మెట్టు ఎక్కించి, అత్యున్నత శిఖరమందున్న పరమాత్మ యందు లీనం చేయుగాకా !

- స్వామి శివానంద

Tuesday 20 October 2015

చందోలు శాస్త్రి గారు - బాలా అమ్మవారు

ఒక 50 ఏళ్ళ క్రితం మాట. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారనే గొప్ప బాలా త్రిపురసుందరి ఉపసాకులు గుంటూర్ జిల్లా చందోలులో నివసించేవారు. వారినే చందోలు శాస్త్రి గారని కూడా అనేవారు. తరుచూ వీరు గురించి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు చెప్తూ ఉంటారు. బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారు వారి గురించి ఒక ప్రవచనంలో చెప్పిన మాట. 'శాస్త్రి గారు ఒక కాలంలో తీవ్రమైన పేదరికం అనుభవించారు. తినడానికి తిండి లేని పరిస్థితి. అటువంటి పరిస్థిలో కూడా వారు అమ్మవారి ఉపాసనను విడిచిపెట్టలేదు. రోజుకు 27 సార్లు లలితా సహస్రనామం పారాయణ చేసి, అమ్మవారికి నివేదన చేయడానికి ఏమీ లేకపోతే, చెంచాతో మంచినీళ్ళు నివేదన చేసేవారు. ఎంతటి తీవ్రమైన వ్యతిరేక పరిస్థితులు ఎదురుకొన్నా, అమ్మవారి యందు నిశ్చలమైన, అచంచలమైన భక్తిని వీడలేదు. ఇది చూసి అమ్మ పొంగిపోయింది. ఒకానొకనాడు బాలా అమ్మవారు శాస్త్రిగారికి ప్రత్యక్షమై "శాస్త్రి! ఇంకా చాలు. ఎన్నాళ్ళు అనువభిస్తావు. ఇక అయిపోయిందిలే" అన్నది. అక్కడితో వారి పేదరికం అంతరించింది. అటు తర్వాత వారు మరణించేవరకు వారి ఇంట అనేకమందికి అన్నదానం చేశారు. బాలా త్రిపురసుందరి దేవి పై వారికి ఎంత భక్తి అంటే, ఆయన పనిలో ఉన్నప్పుడు, వారి ఇంటికి ఎవరైనా వచ్చి, శాస్త్రీగారిని పిలిస్తే, బాలా అమ్మవారు చిన్న పిల్లా రూపంలో ఇంట్లోంచి బయటకు వచ్చి, 'మా నాన్న గారు పనిలో ఉన్నారండి. కాసేపు ఆగండి' అని చెప్పేది. ఆఖరికి వారి మరణం తర్వాత దేహం చితిలో కాలుతున్న సమయంలో, ఆ చితి మంటలపై అమ్మవారు కనిపించింది. ఇది ఫోటో తీసి పత్రికలలో కూడా వచ్చింది.

అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అనే మాటకు ఇదే ప్రత్యక్ష ఉదాహరణ. అమ్మవారిని ప్రేమతో, నిశ్చల భక్తితో, అచంచల విశ్వాసంతో పూజిస్తే, పొందలేనిదంటూ ఏం ఉంటుంది?

ఓం శ్రీ మాత్రే నమః 

సరస్వతీ ఆరాధన పరమ జ్ఞానోదయం

సరస్వతీ ఆరాధన పరమ జ్ఞానోదయం

చివరి మూడు రోజులు : సరస్వతీ ఆరాధన

తనలో ఉండే అసురగుణాలను నిర్మూలించి, సత్వ, స్వచ్ఛ, దివ్య గుణాలను అలవరచుకున్న సాధకుడు దివ్యజ్ఞాన ప్రభాతాన్ని దర్శించడానికి, దివ్యజ్ఞాన సముపార్జనకు అర్హత సాధించిన అధికారి అవుతాడు. ఈ దశలో బ్రహ్మజ్ఞానానికి ప్రతిరూపమైన, మూర్తీభవించిన దివ్యజ్ఞానమైన సరస్వతీదేవిని ఆరాధిస్తాడు. ఆమె ధరించిన దివ్య మాణిక్యవీణ అత్యున్నతమైన మహావాక్యాలను, ఆదిశబ్దమైన ప్రణవ నాదాన్ని జాగృతం చేస్తుంది. సరస్వతీమాత బ్రహ్మానంద జ్ఞానాన్ని, తాను ధరించిన ధవళఛాయ గలిగిన వస్త్రంలాంటి స్వచ్ఛమైన సంపూర్ణ ఆత్మజ్ఞానాన్ని భక్తుడికి ప్రసాదిస్తుంది. జ్ఞానప్రదాయిని అయిన సరస్వతీ మాతను పూజించడమే సాధకుని ఆరాధనా కార్యక్రమంలో మూడవ దశ.

పదవ రోజు విజయదశమి. సరస్వతీ దేవి అనుగ్రహంవల్ల దివ్యజ్ఞానం సంపాదించిన జీవుడు. జీవన్ముక్తి పొందిన రోజు. విజయోత్సాహం జరుపుకునే రోజు. పరమ సచ్ఛిదానంద స్వరూపంలో జీవుడు విశ్రాంతి పొందుతాడు. విజయసాధనకు, జీవిత ధ్యేయసాధనకు ప్రతీకగా ఈ విజయదశమి పండుగ జరుపుకుంటారు. విజయ పతాకం వినువీధుల్లో రెపరెపలాడుతుంది.

'నేను', 'అదే'! 'నేను', 'అదే'!
చిదానంద రూపః శివోహం, శివోహం,
చిదానంద రూపః శివోహం, శివోహం!

- స్వామి #శివానంద సరస్వతీ (1887-1963)
(మూలం: ఆల్‌ ఎబౌట్‌ హిందూయిజం)

సేకరణ: http://goo.gl/P24x59

మహాగౌరి

మహాగౌరి...
దుర్గామాత యొక్క అష్టమ శక్తి నామం మహాగౌరి. ఈమె పరిపూర్ణంగా గౌరి వర్ణంలో ఉంటుంది. శంఖ, చంద్ర, కుంద, పుప్పాలతో ఈ గౌర వర్ణం ఉపమించబడింది. ఈమె వయస్సు అష్టవర్షాలు మాత్రమే! ‘అష్టవర్ణాభవేతో’ సర్వవస్త్య ఆభరణాదులన్నీ కూడా శ్వేతంగానే ఉంటాయి. చతుర్బుజాలు గల ఈ తల్లి వాహనం వృషభం. కుడి భుజంలో అభయ ముద్రనూ, కుడి కింది భుజంలో త్రిశూ లాన్నీ ధరించి ఉంటుంది. ఎడమ పై చేతిలో డమరుకాన్నీ, ఎడమ పై చేతిలో వరదముద్రనూ ధరించి ఉంటుంది. అత్యంత శాంతంగా ఉంటుంది. తన పార్వతీ రూనంలో శివదేవుని భర్తగా పొందాలని మహా తపస్సు చేసింది. శివదేవుని వినా నేను అన్య దేవునెవరినీ భర్తగా వరించను అని సంకల్పంచుకుంది, కఠోరమైన తపస్సుకు శరీరమంతా శుష్కించిపోయింది. తపస్సుకు ప్రసన్నుడై సంతుష్టుడై శివదేవుడు శరీరాన్ని గంగా జలం లో పరిశుద్ధం చేయడంతో దేహం విద్యుత్‌ ప్రభాసమంగా అత్యంత కాంతామంతంగా గౌరవర్ణంతో అలరారసాగింది.

నాటీ నుండి ఈ దేవికి మహాగౌరి నామం ఏర్పడింది. దుర్గా పూజలో ఎనిమిదివ నాడు మహాగౌరి దేవిని ఉపాసించడం విధి అయింది. శక్తి అమోఘమైన సత్‌ఫలదాయిని అయి నది. ఆరాధన వల్ల భక్తుల కల్మషాలన్నీ క్షాళితమై పోతా యి. వారి పూర్వ సంచిత పాపాలు కూడా క్షాళిత మైపోతాయి. భవిష్యత్తులో పాప సంతాప దైన్య దుఃఖా దులు వారిని దరిచేరవు. మహాగౌరి సర్వవిధ శుభాలు ప్రసాధిస్తుంది.

శ్వేతే వృషే సమారూఢా శ్వేతాంబరధరా శుచిః ।
మహాగౌరీ శుభం దద్యాత్ మహాదేవప్రమోదదా ॥

http://www.suryaa.com/features/article.asp?subCategory=3&ContentId=50734

Monday 19 October 2015

లక్ష్మి పూజ - సద్గుణ సముపార్జన

లక్ష్మి పూజ సద్గుణ సముపార్జన

మలి మూడు రోజులు : లక్ష్మి పూజ

దుర్గాదేవి ఆరాధనతో మలినమైన వాసనలు, చెడుస్వభావాలు, పాత అలవాట్లు లాంటి వ్యతిరేక గుణాలను నిర్మూలించే ప్రయత్నంలో సఫలీకృతుడవు కాగానే... నాశనం అయిన ఆ అసురగుణాల స్థానంలో సకారాత్మక గుణాలను, ఆధ్యాత్మిక వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవడం నీ తక్షణ కర్తవ్యం. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ స్పష్టీకరించిన దైవీ సంపదలను ఆర్జించుకోవాలి. జ్ఞానరత్నమనే అపూర్వమైన మణిని, ఆధ్యాత్మిక సంపదను సముపార్జన చేయాలి. శ్రద్ధాసక్తులతో ప్రతిపక్ష భావనను అలవరచుకునే ప్రయత్నం చేయని పక్షంలో పూర్వపు అసురీ గుణాలు మళ్లీ మళ్లీ తలెత్తుతాయి. అందుకే సాధకుడి అభ్యాసదశలో పూర్వ దశ ఎంత విలువైనదో, ఈ దశకూడా అంతే విలక్షణమైంది. తొలిదశ మలిదశల మధ్య ముఖ్యమైన తేడా వుంది. తొలిదశలో మలినమైన, అహంకార పూరిత హీనస్వభావాలను నిరంకుశంగా, నిశ్చయాత్మక బుద్దితో నిర్మూలన చేస్తే, మలిదశలో క్రమబద్ధంగా, కృత నిశ్చయంతో, దృఢంగా, ప్రశాంతంగా, పవిత్రమైన నిర్మలత్వాన్ని వృద్ధి చేసుకోవడం, మహాలక్ష్మి ఆరాధన ద్వారా సాధకుడి, సాధనలో వుండే ఆనందమయ దశ వ్యక్తీకరణ జరుగుతుంది. మహాలక్ష్మి తన భక్తులకు అనంతమైన దైవీ సంపదలను ప్రసాదిస్తుంది. సంపదలను ప్రసాదించే బ్రహ్మస్వరూపమే మహాలక్ష్మి. ఆమె అత్యంత నిర్మలం. రెండవ దశలో మూడు రోజులపాటు #మహాలక్ష్మి ఆరాధన జరుగుతుంది.

- స్వామి శివానంద సరస్వతీ (1887-1963)

సేకరణ: http://goo.gl/WqQGqB

కాళరాత్రీ దేవి


దుర్గాదేవి సప్తమ రూపం కాళరాత్రీ నామంతో ప్రఖ్యాతి చెందింది. శరీరం గాఢాంధకార సమంగా పూర్తి కాలవర్ణంలో ఉంటుంది. శిరోజాలు చెల్లాచెదురై ఉంటాయి. గళసీమలో విద్యుత్‌సమంగా భాసిల్లే హారం ఉంటుంది. ఈమెకు గల త్రినేత్రాలూ బ్రహ్మాండసమంగా గోళాకారంలో ఉంటాయి. ఈమె నుంచి విద్యుత్‌ సమంగా భాసిల్లే కిరణాలు బహిర్గతమవుతుంటాయి. నాసిక నుంచి ఉఛ్చ్వాసనిశ్వాసల ద్వారా భయంకర ప్రజ్వలితాగ్ని జ్వాలలు బహిర్గతమవుతుంటాయి. గార్ధభం వాహనం. పైకి లేచి ఉన్న దక్షిణ హస్తం వరద హస్తం ద్వారా సర్వులకూ వరాలను ప్రసాదిస్తుంటుంది. దక్షిణంగా క్రిందిభాగంలో ఉండే హస్తం అభయముద్రలో ఉంది.

వామభాగంలో పైకి లేచిన హస్తంలో లోహకంటము, క్రింది చేతిలో ఖడ్గమూ ఉన్నాయి. కాళరాత్రీదేవి స్వరూపం చూడ అత్యంత భయంకరంగా ఉన్నా ఈ తల్లి సర్వదా శుభఫలాలనే ప్రసాదిస్తుంది. ఈ కారణం వల్లనే ఈమెకు ‘శుభంకరీ’ అన్న నామం కూడా ఏర్పడి ఉంది. కనుక భక్తులు ఎంతమాత్రం ఈమెకు భయపడడం కానీ, ఆమె వల్ల విపత్తులు ఉంటాయని భావించడం కానీ చేయకూడదు. దుర్గాపూజలో ఏడవనాడు కాళరాత్రీదేవిని ఆరాధించే విధానం ఉంది. ఆ రోజు సాధకుని మనస్సు సహస్రార చక్రంలో స్థిరమై ఉంటుంది. సాధకునకై బ్రహ్మాండంలో ఉన్న సిద్ధిద్వారాలన్నీ తెరచుకొని ఉంటాయి. ఈ చక్రస్థితుడై ఉన్న సాధకుని మనస్సు పరిపూర్ణంగా కాళరాత్రీ దేవి స్వరూపంలో లయమై ఉంటుంది. జనని సాక్షాత్కారం వల్ల ప్రాప్తమగునట్టి పుణ్యసర్వస్వాన్ని పొందగలుగుతాడు.

భక్తుడి పాపవిఘ్న సర్వస్వం నశిస్తుంది. అక్షయ పుణ్యలోకాలు లభిస్తాయి. కాళరాత్రీదేవి దుష్టులను నాశనం చేస్తుంది. దానవ, రాక్షస భూత ప్రేతాదులు ఈ జనని స్మరణ మాత్రం చేతనే భయపడిపోతాయి. జంతుభయం, శత్రుభయం, రాత్రిభయం అనేవి ఉండవు. కాళరాత్రీదేవి కృప వల్ల ఆ తల్లి భక్తుడు సర్వభయాలకూ దూరమవుతాడు. కాళరాత్రీదేవి స్వరూప విగ్రహాన్ని తన హృదయంలో ఉంచుకొని సాధకుడు ఏకగ్రతాభావంతో ఆమెను ఉపాసించాలి. యమనియమ సంయమాలను పరిపూర్ణంగా పాటించాలి. మనోవాక్కార్మభి పవిత్రుడై భక్తుడు వ్యవహరించాలి. శుభకరీదేవిని ఉపాసించడం వల్ల లభించే శుభాలను వర్ణించలేం.

సేకరణ: సూర్య దినపత్రిక 2011
http://www.suryaa.com/features/article.asp?subCategory=3&ContentId=49658

హిందూ ధర్మం - 180 (నిరుక్తము - 3)

మహాభారత యుద్ధానికి పూర్వం వరకు వేదానికి నిరుక్తము, శాస్త్రీయ, గూఢార్ధ పద్ధతుల ద్వారానే భాష్యం స్వీకరించడం జరిగింది. యుద్ద్గం ముగుసి కలియుగం ప్రారంభమైన తర్వాత ఈ పద్ధతిలో కొన్ని స్వల్ప మార్పులు జరిగాయి. కానీ భారతదేశంపై మహమ్మదీయ దండయాత్రలు మొదలైన తర్వాత మొత్తం పరిస్థితి తారుమారైంది. అవి జరగడానికి ముందే ఈ దేశంలో జైనం, భౌద్ధం వంటి మతాలు ఉద్భవించాయి. బౌద్ధమత విస్తరణ కోసం బౌద్ధాన్ని స్వీకరించ్న రాజులు వైదిక మతంపై దాడులు జరిపి, ధార్మిక గ్రంధాలను కాల్చివేశారు, వాటికి వక్రభాష్యాలిచ్చారు, భౌద్ధ పరమైన, నాస్తికమైన అర్దాలను అన్వయం చేశారు. గురుకుల వ్యవస్థను, ఆశ్రమ వ్యవస్థను నిర్వీర్యం చేసే యత్నం చేశారు. అటువంటి సందర్భంలో క్రీ.పూ.7 వ శత్బాదంలో వచ్చినవారే ఆదిశంకరులు. దేశంలో ఎక్కడ చూసినా, వక్రభాష్యాలే, నాస్తిక వాదమే. అటువంటి సమయంలో గోవింద భగవత్పాదుల వద్ద శిష్యరికం చేసిన శంకరులు, తన మేధాశక్తితో వేదానికి ఇచ్చిన అవైదిక, వక్రభాష్యాలను ఖండించి, శాస్ర్తీయమైన అర్దాన్నిచే ప్రయత్నం చేశారు. వారి తర్వాత 1500 ఏళ్ళ పాటు వారి ప్రభావం కొనసాగింది.

కానీ మహమ్మదీయ దండయాత్రలు కొత్త పోకడలను తీసుకువచ్చాయి. వైదిక ధర్మం తార్కిక ఆలోచనకు, తాత్త్వికతకు, బుద్ధి వికసనానికి అధిక ప్రాధాన్యతనిస్తుంది. కానీ అబ్రహామిక్ మతాలు అలా కాదు. (అబ్రహం అనే మూలపురుషుడి నుంచి ఉద్భవించినవిగా భావించే క్రైస్తవం, ఇస్లాం, యూదు మొదలైన మతాలు). అవి ప్రశ్నించే తత్త్వానికి, వ్యక్తి తార్కిక ఆలోచనకు అడ్డుకట్ట వేస్తాయి. ఆ దండయాత్రల్లో అనేక వైదిక గ్రంధాలు తగలబెట్టబడ్డాయి. భారతదేశానికి అక్కడి నుంచి చీకటి యుగం ప్రారంభమైంది. వాటి ప్రభావం భారతీయ సంస్కృతిపై చాలా పడింది. ఈ సందర్భంలోనే వేదాలకు నిరుక్తం ఆధారంగా అర్దం చెప్పక, పురాణాల ఆధారంగా చెప్పే పద్ధతి ప్రచారంలోకి వచ్చింది. ఇంకోకప్రక్కన దండయాత్రులు చేసిన ముష్కరులు, కొందరిని బెదిరించి, ధార్మిక గ్రంధాల్లో నూతన విషయాలను ప్రవేశపెట్టారు.

వేదాలతో పోల్చి చూసినప్పుడు పురాణాలు అత్యంత నవీన సాహిత్యం. వేదం ఈశ్వరునిలానే సనాతనం. ఈశ్వర సృష్టిలో ఉండే కోటానుకోట్ల బ్రహ్మాండాలకు సంబంధించినది. సముద్రపు అలలపై ఏర్పడే నురుగులో అప్పటికప్పుడు ఉద్భవించి, నశించిపోయే నీటి బుడగల వలే అనేక బ్రహ్మాండాలు నిత్యం ఉద్భవిస్తూ ఉంటాయి, లయిస్తుంటాయి. ఆయా బ్రహ్మాండాల్లో నడుస్తున్న యుగాలతో సంబంధం లేకుండా, అన్నిటికి వేదమే పరమ ప్రమాణం. అందుకే వేదం కాలాతీతం. కానీ ఈ పురాణమనే సాహిత్యం ఈ సృష్టిలో ఇప్పుడున్న కలియుగంలో మానవులకు ధర్మం, వేదం యొక్క సందేశం అందించడం కోసం వ్యాసుని ద్వారా ద్వాపరయుగాంతంలో ఇవ్వబడింది. ఈ పురాణల్లో అనేక కల్పాలు, మన్వంతరాలు, ఇతర సృష్టిల్లో జరిగిన సంఘటనలు కనిపిస్తాయి. అవి వేదంలో చెప్పబడ్డ ధర్మాన్ని వివరించేవే కానీ, వాటిలో ఉన్న పాత్రలను వేదంలో ఉన్న పదాలకు అన్వయం చేయడం వంటివి చేయకూడదు. కానీ ఈ దండయాత్రల ప్రభావంతో వేదాలకు కొంత పురాణాల ఆధారంగా భాష్యం చెప్పడం ప్రారంభమైంది. అదేగాక మాములు సంస్కృతార్దాలను వైదిక వాజ్ఞ్మయానికి అన్వయం చేయడం కూడా ఈ తర్వతే ప్రారంభమైంది. ఫలితంగా నిరుక్తం మూలనపడింది. 14 వ శత్బాదానికి చెందిన సుప్రసిద్ధ భాష్యకారుడైన సాయనాచార్యుడు వేదానికి నిరుక్తం, పౌరాణిక పద్ధతులలో భాష్యం అందించారు.

అటు తర్వాత ఆంగ్లేయుల దండయాత్రలు జరిగాయి. వైదిక ధర్మాన్ని నాశనం చేయడమే, తమ మతాన్ని స్థాపన చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న ఆంగ్లేయులు వేదాల్లో లేని అనేక విషయాలు, ఉన్నాయని భ్రమలు కల్పించి, సంస్కృతిని కూకటివేళ్ళతో పెకిలించాలని విశ్వప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నాల్లో భాగంగా వచ్చినవే ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం, వేదాల్లో గోవధ, జంతుబలి వంటి కల్పిత సిద్ధాంతాలు.

To be continued .................

Sunday 18 October 2015

కాత్యాయిని మాత

చంద్రహాసోజ్జ్వలకరా శార్దూల వరవాహనా |
కాత్యాయనీ శుభం దద్యాదేవీ దానవఘాతినీ ||

దుర్గామాత యొక్క ఆరవ రూపం కాత్యాయినీ దేవి. ఆమెకు ఆ పేరు రావడానికి కారణమిలా ఉంది. కతుడనే ప్రఖ్యాతి చెందిన మహర్షి ఒకడుండేవాడు. ఆ మహర్షి పుత్రుడి పేరు కాత్యుడు. ఈ కాత్య మహర్షి గోత్రంలోనే విశ్వవిఖ్యాతుడైన కాత్యాయన మహర్షి ఉద్భవించాడు. ఈ మహర్షి పరాంబను ఉపాసిస్తూ అనేక సంవత్సరాలు కఠోర తపస్సు చేశాడు. పరమేశ్వరి తన సదనంలో పుత్రికగా ఆవిర్భవించాలన్నది ఆ మహర్షి అభిలాష.

పరమేశ్వరి అతని అభీష్టాన్ని నెరవేర్చింది. కొంత కాలం తరువాత మహిషాసురుడి అత్యాచారాలతో తల్లడిల్లిన భూభారాన్ని దూరం చేయాలని త్రిమూర్తులు తమ తేజోంశాలను అర్పించి మహిషాసుర వినాశనార్థం ఓ దేవిని ప్రభవింపజేశారు. సర్వప్రథమంగా కాత్యాయ మహర్షి ఆ దేవిని ఆరాధించడం వల్ల ఆమె కాత్యాయిని అని పిలువబడింది. మరో కథ కూడా వినిపిస్తుంది. ఈ దేవియే కాత్యాయనుని సదనంలో పుత్రికగా అవతరిస్తుంది. ఆశ్వీజ కృష్ణ శుక్ల చతుర్దశి నాడు జన్మించి శుక్ల సప్తమి, అష్టమి, నవమి పర్యంతం మూడు ఆ దేవి కాత్యాయన రుషి పూజలు గ్రహించి దశమి నాడు మహిషాసురుడిని వధించింది.

కాత్యాయనీ దేవి అమోఘ ఫలదాయిని. శ్రీకృష్ణ భగవానుడిని భర్తగా పొందేందుకు గోపికలు యమునాతీరంలో ఈ దేవినే ఆరాధించారు. పూజ మండలంలో అధిషాత్రీదేవిరూపంలో ప్రతిష్టించబడి విరాజిల్లుతూ ఉంటుంది. ఆ తల్లి స్వరూపం అత్యంత భవ్యమైనది. ఆమె వర్ణం స్వర్ణసమంగా భాసిల్లుతూ ఉంటుంది. దేవి చతుర్భుజాలలో అలరారుతుంటుంది. దక్షిణ హస్తం పైన ఉన్నది అభయముద్రలోనూ. క్రింది చేయి వరద ముద్రలోనూ ఉంటుంది. ఎడమవైపు పై చేతిలో ఖడ్గమూ, క్రింది హస్తంలో పద్మమూ విరాజిల్లుతుంటాయి. ఆమె వాహనం సింహం. భక్తులు దుర్గాపూజలో ఆరవ నాడు ఈ దేవి స్వరూపాన్నే ఉపాసిస్తూ ఉంటారు. ఆ రోజున సాధకుడి మనస్సు ఆజ్ఞాచక్రంలో లయమై ఉంటుంది. యోగసాధనలో దీనికి అత్యంత మహత్వపూర్ణ స్థానముంది. ఈ చక్రంలో స్థితుడై ఉన్న సాధకుడు తన సర్వస్వాన్ని కాత్యాయనీదేవి చరణ కమలాలలో అర్పించి పరిపూర్ణంగా ఆత్మసమర్పణ చేస్తాడు. దేవీ కటాక్షంతో చతుర్విధ పురుషార్థ ఫలాలు లభిస్తాయి. తేజోసంపన్నులై భాసిల్లుతుంటారు.

సేకరణ : సూర్య దినపత్రిక 2011

‪దుర్గాదేవి ఆరాధన దుర్గుణాల నిర్మూలన‬

‪దుర్గాదేవి ఆరాధన దుర్గుణాల నిర్మూలన‬
మొదటి మూడు రోజులు : దుర్గాదేవి ఆరాధన

దుర్గాపూజ సాధనలో దృఢ సంకల్పం, నిశ్చయాత్మకమైన ప్రయత్నం, కఠినమైన శ్రమ అంతర్లీనమై ఉంటాయి. మరోవిధంగా చెప్పాలంటే బలం, అనంతమైన శక్తి అతి ప్రధానమైన ఆవశ్యకతలు. పరబ్రహ్మం, మహాశక్తిఅయిన దివ్యమాత ఆ సాధకుడిద్వారా పనిచేయాలి. మొదటి మూడు రోజులు ఈ 'అమ్మ'ను శక్తి, బలానికి ప్రతిరూపమైన దుర్గాదేవిగా పూజిస్తారు. తమలోని మాలిన్యాలు, దుష్టగుణాలు, లోపాలను నిర్మూలించమని దుర్గామాతను ప్రార్థిస్తారు. సాధకుడిలోని హీనగుణాలతో, అసురగుణాలతో మాత పోరాడవలసి వస్తుంది. నీ సాధనను ప్రమాదాల నుంచి, అవరోధాలనుంచి మాత రక్షిస్తుంది. మొదటి మూడు రోజులు నీలోని మాలిన్యాన్ని నాశనం చేయడానికి, నీ మనస్సులోని చెడువాసనలను నిర్మూలించడానికి శక్తి స్వరూపిణి అయిన ‪దుర్గా‬ మాత ఆరాధన జరుగుతుంది.
- స్వామి ‪శివానంద‬ సరస్వతీ (1887-1963)

సేకరణ: http://goo.gl/3GjnCK


Saturday 17 October 2015

దేవీ నవరాత్రులు - స్వామి శివానంద

ఒక సాధకుడి జీవితంలో నవరాత్రులను మూడు భాగాలుగా విభజించి ఆ దేవికి వుండే మూడు అంశలుగా భావించి ఆరాధించడంవల్ల ఎంతో పవిత్రమైన సత్యం ఆవిష్కరణ అవుతుంది. దేవికి తొమ్మిది రోజులు చేసే నవరాత్ర పూజ ఆత్మ సాక్షాత్కారానికి అనువైన మార్గం.

ధర్మాచరణకు, సాంప్రదాయక పూజలకు, వ్రతాలకు కొన్ని సమయాలలో ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. ఇవి దేవతారాధన మాత్రమే కాక, పూర్వకాలంలో జరిగిన కొన్ని అద్భుత సంఘటనలను జ్ఞాపకం చేస్తాయి. వీటిలోని నిగూఢ రహస్యాలను అర్థం చేసుకొనే ప్రయత్నం చేస్తే కొన్ని దృష్టాంతాలు అగుపడ్తాయి. ఈ దృష్టాంతాలే జీవుడు ఆత్మానుభూతి పథంలో చేసే పయనానికి ప్రధానమైన సూచికలుగా, మార్గదర్శిలుగా పనిచేస్తాయి.

స్థూలంగా గమనిస్తే దేవికి తొమ్మిది రోజులు చేసే నవరాత్ర పూజ విజయోత్సవంలాంటిదే. శుంభ, నిశుంభులలాంటి రాక్షసుల సంహారానికి చేసిన యుద్ధాలలో దేవి సాధించిన విజయ పరంపరలను ఈ నవరాత్రులలో దేవికి సమర్పిస్తారు. కాని ఒక సాధకుడి జీవితంలో నవరాత్రులను మూడు భాగాలుగా విభజించి ఆ దేవికి వుండే మూడు అంశలుగా భావించి ఆరాధించడంవల్ల ఎంతో పవిత్రమైన సత్యం ఆవిష్కరణ అవుతుంది. విశ్వం వివిధ దశలలో మానవుడు భగవంతుడిగా. జీవాత్మ పరమాత్మగా ఎదగడానికి, వికాసానికి ప్రతీకగా ఈ సత్యం నిలుస్తుంది. వ్యక్తిగత స్థాయిలో సాధకుడి ‪ఆధ్యాత్మిక‬ సాధనకు దిశానిర్దేశం చేస్తుంది.

పరమాత్మతో నీకు గల శాశ్వత ఐక్యతను గుర్తించడమే నీ ఉనికి మూల ఉద్దేశం. ఉన్నతమైన సంపూర్ణత్వానికి ప్రతిరూపమే పరమాత్మ. అది మాలిన్యాలులేని స్వచ్ఛత, నిరంజనం. 'దాని'తో నీ ఐక్యతను గుర్తించడం, 'దాని'లో విలీనం కావడం... అంటే ఆ దివ్యత్వంలా ఎదగడమే, వికసించడమే. అందువల్ల సాధకుడు ప్రాధమిక చర్యగా తనలో పేరుకుపోయిన లెక్కకు మించిన మాలిన్యాలను, దుర్గుణాలను తొలగించుకోవాలి. అటు తర్వాత అనంతమైన సద్గుణాలను, పవిత్రమైన దైవీ గుణాలను అలవరచుకోవాలి. అప్పుడు స్వచ్ఛమైన దైవీగుణాలతో పరిపూర్ణమైన స్థితిలో నీలో .... నిర్మలమైన నీటికొలనులో ప్రభాత సూర్యకిరణాలలాగ  జ్ఞానం ప్రకాశిస్తుంది. అందుకు దోహదం చేస్తూందీ నవరాత్రి వ్రతం.

స్వామి ‪శివానంద‬ సరస్వతీ (1887-1963)

సేకరణ: http://goo.gl/JwHM0H (స్వల్ప సవరణలతో)

స్కందమాత

దుర్గామాత పంచమ స్వరూపం స్కందమాత నామంతో ప్రఖ్యాతి చెందింది. స్కంధ భగవానుడే కుమార, కార్తికేయ నామంతో వ్యవహరించబడుతాడు. ప్రసిద్ధ దేవాసుర సంగ్రామంలో ఈయనే దేవసేనాధిపతి. పురాణాలు ఈయన్ను కుమారుడని, శక్తిధరుడనీ, మయూర వాహనుడని అంటాయి. ఆయన మహిమలు వాటిలో కీర్తించబడ్డాయి. ఈ స్కందదేవుడి జనని కావడం వల్లనే దుర్గా మాత యొక్క ఈ పంచమ స్వరూపం స్కంద మాత నామంతో విఖ్యాతి చెందింది. నవరాత్రులలో పంచమ దినాన స్కబ్దామత ఉపాసన జరుగుతుంది.

ఈనాడు సాధకుడి మనస్సు ‘విశుద్ధ’ చక్రంలో లయమై ఉంటుంది. స్కంద దేవుడు బాలరూపంలో ఈ తల్లి ఒడిలో ఆసీనుడై ఉంటాడు. స్కంద మాతృస్వరూపిణికి చతుర్భుజాలు. ఈమె దక్షిణంగా ఉన్న పైకి లేచిన చేతిలో స్కందబాలుడిని ఒడిలో కూర్చోబెట్టుకొని ఉంటుంది. అదే వైపున ఉన్న కింది చేయి వరముద్రతో ఉంటుంది. పై రెండు చేతులలో పద్మాలు ఉంటాయి.సంపూర్ణంగా శుభ్రవర్ణంలో విరాజిల్లే ఈ తల్లి కమలాసనంపై ఉంటుంది. అందుకే ఈమెను పద్మాసనాదేవి అని కూడా పిలుస్తారు. ఈమె వాహనం సింహం. నవరాత్రి దీక్షలోని పంచమ దివసానికి విశేషతత్వము ఉన్నట్లు శాస్త్రాలు వర్ణించాయి. పంచమ దినం నాడు సాధకుడి మనస్సు విశుద్ధ చక్రంలో లయమై ఉంటుంది. ఈ చక్రంలో స్థిరమనస్కుడైన సాధకుని బాహ్యక్రియలూ, చిత్తత్పత్తులూ లోపించి ఉంటాయి. అతని మనస్సు విశుద్ధ చైతన్యం వైపు పురోగమిస్తూ ఉంటుంది.

దేవీస్కందమాతా
సింహాసనగతా నిత్యం పద్మాశ్రితకరద్వయా |
శుభదాస్తు సదా దేవీ స్కందమాతా యశస్వినీ ||

సేకరణ - సూర్యదినపత్రిక 2011
http://www.suryaa.com/features/article.asp?subCategory=3&ContentId=49658

Friday 16 October 2015

భూమ్మీద పుడిశెడు ఉయ్యాలో - బతుకమ్మ పాట



మొదటి భాగం
భూమ్మీద పుడిశెడు ఉయ్యాలో
బండారీ పోసి ఉయ్యాలో
భూదేవి నీ పాట ఉయ్యాలో
బుగ్గలై రాని ఉయ్యాలో

జగతి మీద చారెడు ఉయ్యాలో
చందురం పోసి ఉయ్యాలో
జలదేవి నీ పాట ఉయ్యాలో
జల్దీన రాని ఉయ్యాలో
పాపెట్ల శూరుడా ఉయ్యాలో
బాలవన్నె కాడ ఉయ్యాలో
దండమోయి దేవ ఉయ్యాలో

దండమోయి నీకు ఉయ్యాలో
నెత్తిమీద శూరుడా ఉయ్యాలో
నెల వన్నెకాడ ఉయ్యాలో
దండమోయి దేవ ఉయ్యాలో
దండమోయి నీకు ఉయ్యాలో
పారేటి నా గంగ ఉయ్యాలో
పాతాళదేవి ఉయ్యాలో

పాట నాకివ్వవూ ఉయ్యాలో
జలజల వారేటి ఉయ్యాలో
జల్దీల గంగమ్మ ఉయ్యాలో
గంగమ్మా నా పాట ఉయ్యాలో
జల్దీన రాని ఉయ్యాలో
పర్వతాన ఉండే ఉయ్యాలో
పాతాళమల్లు ఉయ్యాలో
బండారీ నాకివ్వు ఉయ్యాలో.

రెండవభాగం
బొట్టు వెట్టుకుంట ఉయ్యాలో
చుక్కన్నా మెరిసేటి ఉయ్యాలో
చక్కన్నీ తల్లీ ఉయ్యాలో
కురుచ బొమ్మల నడుమ ఉయ్యాలో
కుంకుమబొట్టు ఉయ్యాలో

కాపువరి బాలలు ఉయ్యాలో
వాకన్నె పడసులు ఉయ్యాలో
అందరితోటి గూడి ఉయ్యాలో
అక్కవ్వ ఎల్లెనే ఉయ్యాలో

ఏడుగురి తోడనే ఉయ్యాలో
అక్కవ్వ ఒక్కతే ఉయ్యాలో
అందరి గుల్లలు ఉయ్యాలో
మేదరి గుల్లలు ఉయ్యాలో

అక్కవ్వ గుల్ల ఉయ్యాలో
బంగారి గుల్ల ఉయ్యాలో
అందరితో కల్సి ఉయ్యాలో
అడవికి ఎల్లెనే ఉయ్యాలో
పెద్దలకు వచ్చె ఉయ్యాలో

పెత్తర అమాస ఉయ్యాలో
బాలల కచ్చిందే ఉయ్యాలో
బతుకమ్మ పండుగ ఉయ్యాలో
గుట్టకు చేరిరే ఉయ్యాలో
గునుకపువ్వు తెంపిరి ఉయ్యాలో

చెట్టుకు చేరిరి ఉయ్యాలో
చేమంతి తెంపిరి ఉయ్యాలో
పోతపోతనే వాళ్లు ఉయ్యాలో
పోకపువ్వు తెంపే ఉయ్యాలో.

మూడవ భాగం
అన్ని పూవులు కల్సి ఉయ్యాలో
ఆనందం తోటి ఉయ్యాలో
బంగారి బాలలు ఉయ్యాలో

గుల్లలు నింపిరి ఉయ్యాలో
గుల్లలు తీసుక ఉయ్యాలో
నెత్తిన వెట్టిరి ఉయ్యాలో
ఇంటికి బాలలు ఉయ్యాలో

చేరనే వచ్చిరి ఉయ్యాలో
అవ్వలా మా యవ్వ ఉయ్యాలో
మమ్ముగన్న తల్లీ ఉయ్యాలో
స్నానాలు వొయ్యవే ఉయ్యాలో

నూనెలు అంటవే ఉయ్యాలో
వెండిబిందెలు తీసుకొని ఉయ్యాలో
వేడి నీళ్లే వోసి ఉయ్యాలో
వేడి నీళ్లు చన్నీళ్లు ఉయ్యాలో

ఏడు రంధ్రాల నీళ్లు ఉయ్యాలో
సిద్దెల నూనె ఉయ్యాలో
సిరిగిన్నెల ఒంపనే ఉయ్యాలో
కుడి చెంపనంటే ఉయ్యాలో
మారు చెంపనంటే ఉయ్యాలో

వెండి దువ్వెన వట్టి ఉయ్యాలో
వేయి చిక్కులు తీసే ఉయ్యాలో
పైడి దువ్వెన వట్టి ఉయ్యాలో
పక్క చిక్కులు దీసే ఉయ్యాలో
ముత్యపు గుండెక్కి ఉయ్యాలో
ముని జలకామాడె ఉయ్యాలో.

నాల్గవ భాగం
పగడంపు గుండెక్కి ఉయ్యాలో
పై జలకమాడె ఉయ్యాలో
అవ్వలా ఓ యవ్వ ఉయ్యాలో

మమ్ముగన్న తల్లీ ఉయ్యాలో
పెద్దదినెకు ఉన్నది ఉయ్యాలో
చిక్కు చీరె ఉయ్యాలో
చిక్కు చీరె నాకు ఉయ్యాలో
కావాలె నాకు ఉయ్యాలో

నన్ను అడుగకు బిడ్డా ఉయ్యాలో
వదినెనే అడుగు ఉయ్యాలో
వదినే దగ్గరకు వోయి ఉయ్యాలో
చీరె అడుగవట్టె ఉయ్యాలో
ఆ వదినే అనవట్టె ఉయ్యాలో

చిక్కు చీరెమీద ఉయ్యాలో
చినుకు వడితే హక్కు ఉయ్యాలో
హక్కు నీ నెత్తురు ఉయ్యాలో
చుక్క బొట్టు వెడుదు ఉయ్యాలో

ఆ చీర తీసింది ఉయ్యాలో
మరదలికి ఇచ్చింది ఉయ్యాలో
అందమూ సక్కగా ఉయ్యాలో
చీరెలు గట్టెనే ఉయ్యాలో
పెసరగాయ బబ్బెర్లు ఉయ్యాలో

పెయినిండా సొమ్ము ఉయ్యాలో
కందికాయ బబ్బెర్లు ఉయ్యాలో
కాళ్ళ కడియాలు ఉయ్యాలో
అన్ని సొమ్ముల మీద ఉయ్యాలో
ఆది బన్నసరమూ ఉయ్యాలో.

ఐదవ భాగం
బతుకమ్మ వట్టుకొని ఉయ్యాలో
బయలు దేరినారె ఉయ్యాలో
పారేటి గంగలో ఉయ్యాలో
బతుకమ్మను ఇడిసిరి ఉయ్యాలో
పసులకాడి బాలలు ఉయ్యాలో

పలుగాకులోయి ఉయ్యాలో
హక్కు చీరెనే ఉయ్యాలో
అంతా నానిపాయె ఉయ్యాలో
సిన్నవాయె హక్కుఉయ్యాలో
పొన్న పూవోలె ఉయ్యాలో
బీరిపాయె హక్కు ఉయ్యాలో
బీర పూవువోలె ఉయ్యాలో

ఇంటికి అక్కవ్వ ఉయ్యాలో
చేరవచ్చెనే ఉయ్యాలో
ఆ చీర జూసనే ఉయ్యాలో
వదినె కండ్లతోటి ఉయ్యాలో
అందరి పెద్దోడు ఉయ్యాలో
రామన్నను పిలిచే ఉయ్యాలో
మీ చెల్లె నిందలు ఉయ్యాలో
మనమూ మెయ్యరాదు ఉయ్యాలో
చంపవోయి నీవు మీ చెల్లెను ఉయ్యాలో
చెల్లెను తీసుకొని ఉయ్యాలో

అడవికి వెళ్లెను ఉయ్యాలో
అడవిల ఉన్నాడు ఉయ్యాలో
అంధకారి బాపనయ్య ఉయ్యాలో
కత్తిని జూసింది ఉయ్యాలో
పరుగులూ వెట్టింది ఉయ్యాలో.

ఆరవ భాగం
భయపడకు బాల ఉయ్యాలో
గుబులు పడకు బాల ఉయ్యాలో
బాపనయ్యతో బాల ఉయ్యాలో
ఇంటికి చేరింది ఉయ్యాలో
చెల్లెలు జాడలు ఉయ్యాలో
తల్లి అడుగవట్టె ఉయ్యాలో
పొద్దులు వాయె ఉయ్యాలో
చెల్లెలేది ఉయ్యాలో

వస్తదే నా తల్లీ ఉయ్యాలో
ఆరాటం జేయకు ఉయ్యాలో
బాపనయ్య వెంటనే ఉయ్యాలో
చెల్లెలు చేరవచ్చే ఉయ్యాలో
అప్పుడు చెల్లెలు ఉయ్యాలో
అవ్వలా నాయమ్మ ఉయ్యాలో
అన్న కత్తులు దీసె ఉయ్యాలో
కనుగుడ్ల కోసమని ఉయ్యాలో
భయపడి నేను ఉయ్యాలో
బాపనయ్యను జేరితి ఉయ్యాలో.

సేకరణ:శ్రీమతి బి. కళాగోపాల్;
నిజామాబాద్
http://goo.gl/wTmWWZ

కూష్మాండా దేవి

కూష్మాండా దేవి

దుర్గామాత చతుర్థ స్వరూప నామం కూష్మాండా దేవి. తన మందస్మితం ద్వారా అండాన్ని అంటే బ్రహ్మాండాన్ని ఉత్పన్నం చేయడం కారణంగా ఈమె కూష్మాండా దేవి నామం తో పిలవబడుతున్నది. సృష్టియే లేని వేళ దశ దిశలా అంధకారం అలుముకున్న సమయంలో ఈ దేవియే బ్రహ్మాండాన్ని సృష్టించింది. కనుక సృష్ట్యాది స్వరూపురాలు, ఆదిశక్తి ఆమెయే. ఈమెకు ముందు బ్రహ్మాండ అస్తిత్వం లేనే లేదు. సూర్యమండలాంతర్భాగంలో ఈమె నివసిస్తూ ఉంటుంది. సూర్యమండంలో నివసించే శక్తిసామర్థ్యాలు ఈమెకు మాత్రమే ఉన్నాయి.

ఈమె శరీర కాంతి ప్రభాసూర్య సమంగా దేదీప్యమానంగా ఉం టుంది. ఆమె తేజస్సు అతులనీ యమైనది. ఇతరేతర దేవి తేజోప్రకాశాల వల్లనే దశదిశలూ ప్రకాశిస్తూ ఉంటాయి. బ్రహ్మాండాంతర్గత సమస్త వస్తు వులు ప్రాణిమాత్రులలోని తేజస్సు ఈమె ఛాయయే. అష్టభుజాలూ ఉండడం వల్ల ‘అష్టభుజాదేవి’ అన్న నామం తో ఖ్యాతి చెందింది. ఆమె హస్తాలలో క్రమంగా కమండలం, ధనుర్బానాలు, కమలం, అమృతకలశం, చక్ర గదాదులున్నాయి. అష్టమ భుజంలో సర్వనిధులనూ, సిద్ధులనూ ప్రసాదించు నట్టి జపమాల ఉంది. ఆమె వాహనం సింహం. సంస్కృతంలో గుమ్మడికాయ ను కూష్మాండమని అంటారు. ఈ దేవికి బలులలో కూష్మాండా బలి విశేష ప్రీతిదాయమైనది.

ఈ కారణం వల్ల కూడా ఆమెను కూష్మాండా దేవి అని అంటా రు. నవరాత్రులలో నాలుగవ నాడు కూష్మాండా దేవి స్వరూపార్చనయే జరుగుతుంది. ఆ రోజున సాధకుడి మనస్సు అనాహత చక్రంలో లయమవుతుంది. కనుక సాధకుడు తత్వమయంలో అత్యంత పవిత్రంగా అచంచల మనస్సుతో కూష్మాండా దేవి స్వరూపాన్ని ధ్యానంలో ఉంచుకొని పూజోపాసనలలో లగ్నం కావాలి. కూష్మాండా దేవి ఉపాసన వల్ల భక్తుల రోగశోకాదులన్నీ నాశనమవుతాయి. ఈ జనని భక్తి ద్వారా ఆరోగ్యం వర్ధిల్లుతుంది. కూష్మాండా దేవి అత్యల్ప భక్తి సేవలకే ప్రసన్నురాలవుతుంది. శరణు వేడగలిగితే అతడు సుగమంగా పరమపదాన్ని పొందగలుగుతాడు. శాస్తప్రురాణాల్లో వర్ణించబడిన విధి విధానాల అనుసారం మనం దుర్గామాతను ఉపాసిస్తూ అహర్నిశలూ భక్తి మార్గంలో పురోగమించాలి. మాతృభక్తి మార్గంలో సాధకుడు కొన్ని అడుగులు మాత్రం ముందుకు వేయగలిగితే సాధకునికి అమ్మవారి కృపాకటాక్షం యొక్క సూక్ష్మానుభవం కలుగుతుంది. దుఃఖ స్వరూపమైన ఈ సంసారం అట్టి భక్తునకు అత్యంత సుఖకరమైనదిగా మారుతుంది.

సేకరణ - సూర్యదినపత్రిక 2011
http://www.suryaa.com/features/article.asp?subCategory=3&ContentId=49658

Thursday 15 October 2015

ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ - బతుకమ్మ పాట

ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ
ఏమేమి కాయొప్పునే గౌరమ్మ
తంగేడు పువ్వొప్పునే గౌరమ్మ
తంగేడు కాయొప్పునే గౌరమ్మ
తంగేడు చెట్టు కింద ఆట

సిల్కాలార పాట సిల్కాలారా
కల్కి సిల్కాలారా కందుమ్మ
గుడ్డలు రానువోను అడుగులు
తీరుద్ద ఆశలు తారు గోరంటలు
గణమైన పొన్న పువ్వే గౌరమ్మ
గజ్జాల ఒడ్డానమే గౌరమ్మ
ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ
ఏమేమి కాయొప్పునే గౌరమ్మ
గుమ్మడి పువ్వొప్పునే గౌరమ్మ
గుమ్మడి కాయొప్పునే గౌరమ్మ
గుమ్మడి చెట్టు కింద ఆట

సిల్కాలార పాట సిల్కాలారా
కల్కి సిల్కాలారా కందుమ్మ గుడ్డలు
రానువోను అడుగులు
తీరుద్ద ఆశలు తారు గోరంటలు
గణమైన పొన్న పువ్వే గౌరమ్మ
గజ్జాల ఒడ్డానమే గౌరమ్మ
ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ
ఏమేమి కాయొప్పునే గౌరమ్మ
రుద్రాక్ష పువ్వొప్పునే గౌరమ్మ
రుద్రాక్ష కాయొప్పునే గౌరమ్మ

రుద్రాక్ష చెట్టు కింద
ఆట సిల్కాలార పాట సిల్కాలారా
కల్కి సిల్కాలారా కందుమ్మ గుడ్డలు
రానువోను అడుగులు
తీరుద్ద ఆశలు తారు గోరంటలు
గణమైన పొన్న పువ్వే గౌరమ్మ

గజ్జాల ఒడ్డానమే గౌరమ్మ
ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ
ఏమేమి కాయొప్పునే గౌరమ్మ
కాకర పువ్వొప్పునే గౌరమ్మ
కాకర కాయొప్పునే గౌరమ్మ
కాకర చెట్టు కింద ఆట

సిల్కాలార పాట సిల్కాలారా
కల్కి సిల్కాలారా కందుమ్మ గుడ్డలు
రానువోను అడుగులు
తీరుద్ద ఆశలు తారు గోరంటలు
గణమైన పొన్న పువ్వే గౌరమ్మ

గజ్జాల ఒడ్డానమే గౌరమ్మ
ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ
ఏమేమి కాయొప్పునే గౌరమ్మ
చామంతి పువ్వొప్పునే గౌరమ్మ
చామంతి కాయొప్పునే గౌరమ్మ..

చామంతి చెట్టు కింద ఆట
సిల్కాలార పాట సిల్కాలారా
కల్కి సిల్కాలారా కందుమ్మ
గుడ్డలు రానువోను అడుగులు
తీరుద్ద ఆశలు తారు గోరంటలు
గణమైన పొన్న పువ్వే గౌరమ్మ

గజ్జాల ఒడ్డానమే గౌరమ్మ
ఆ పూలు తెప్పించి పూజించి
గంధముల కడిగించి కుంకుమల జాడించి
నీ నోము నీకిత్తుమే గౌరమ్మ
మా నోము మాకియ్యవే గౌరమ్మ

నీ నోము నీకిత్తుమే గౌరమ్మ
మా నోము మాకియ్యవే గౌరమ్మ
నీ నోము నీకిత్తుమే గౌరమ్మ
మా నోము మాకియ్యవే గౌరమ్మ

చిత్తు చిత్తుల బొమ్మ
చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ ॥2॥
బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన ॥2॥
చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ ॥2॥
బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన ॥2॥
రాగి బిందె తీసుక రమణి నీళ్లకు పోతే ॥2॥

రాములోరు ఎదురాయెనమ్మో ఈ వాడలోన ॥2॥
చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ ॥2॥
బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన ॥2॥
వెండి బిందె తీసుక వెలది నీళ్లకు పోతే ॥2॥
వెంకటేషుడు ఎదురాయెనమ్మో ఈ వాడలోన ॥2॥
చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ ॥2॥

బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన ॥2॥
బంగారు బిందె తీసుక బామ నీళ్లకు పోతే ॥2॥
భగవంతుడు ఎదురాయెనమ్మో ఈ వాడలోన ॥2॥
చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ ॥2॥

బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన ॥2॥
పగిడి బిందె తీసుకు పడితి నీళ్లకు పోతే ॥2॥
పరమేశుడు ఎదురాయెనమ్మో ఈ వాడలోన ॥2॥
చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ ॥2॥
బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన ॥2॥

ముత్యాల బిందె తీసుక ముదిత నీళ్లకు పోతే ॥2॥
ముద్దు కృష్ణుడు ఎదురాయెనమ్మో ఈ వాడలోన ॥2॥
చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ ॥2॥
బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన ॥2॥

చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ ॥2॥
బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన ॥2॥
బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన ॥2॥
బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన ॥2॥
బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన ॥2॥

కలవారి కోడలు ఉయ్యాలో
కలవారి కోడలు ఉయ్యాలో
కనక మహాలక్ష్మి ఉయ్యాలో
కడుగుతున్నది పప్పు ఉయ్యాలో
కడవళ్లోన పోసి ఉయ్యాలో
అప్పుడే వచ్చేను ఉయ్యాలో

ఆమె పెద్దన్న ఉయ్యాలో
కాళ్లకు నీళ్లిచ్చి ఉయ్యాలో
కన్నీళ్లు దీసి ఉయ్యాలో
ఎందుకు సెల్లెలా ఉయ్యాలో
ఏమి కష్టాలమ్మా ఉయ్యాలో

తుడుచుకో కన్నీళ్లు ఉయ్యాలో
ముడుచుకో కురులమ్మ ఉయ్యాలో
ఎత్తుకో బిడ్డాను ఉయ్యాలో
వెళ్లి వద్దాము ఉయ్యాలో
చేరిమి వారితో ఉయ్యాలో
చెప్పిరా పోవమ్మా ఉయ్యాలో

పట్టె మంచం మీద ఉయ్యాలో
పవళించినామా ఉయ్యాలో
మాయన్నల వచ్చిరి ఉయ్యాలో
మమ్ము పంపుతారా ఉయ్యాలో
నేనెరుగ నేనెరుగ ఉయ్యాలో
మీ అత్తను అడుగు ఉయ్యాలో

అరుగుల్ల కూసున్న ఉయ్యాలో
ఓ అత్తగారు ఉయ్యాలో
మా అన్నలు వచ్చిరి ఉయ్యాలో
మమ్ము పంపుతారా ఉయ్యాలో
నేనెరుగ నేనెరుగ ఉయ్యాలో
మీ బావను అడుగు ఉయ్యాలో

భారతం చదివేటి ఉయ్యాలో
బావ పెద్ద బావ ఉయ్యాలో
మా అన్నలు వచ్చిరి ఉయ్యాలో
మమ్ము పంపుతారా ఉయ్యాలో
నేనెరుగ నేనెరుగ ఉయ్యాలో
మీ అక్కను అడుగు ఉయ్యాలో

వంటశాలలో ఉన్న ఉయ్యాలో
ఓ అక్క గారూ ఉయ్యాలో
మా అన్నలు వచ్చిరి ఉయ్యాలో
మమ్ము పంపుతారా ఉయ్యాలో
నేనెరుగ నేనెరుగ ఉయ్యాలో
నీ భర్తనే అడుగు ఉయ్యాలో

రచ్చలో కూర్చున్న ఉయ్యాలో
రాజేంద్రబోగి ఉయ్యాలో
మా అన్నలు వచ్చిరి ఉయ్యాలో
మమ్ము పంపుతారా ఉయ్యాలో
కట్టుకో చీరలు ఉయ్యాలో
పెట్టుకో సొమ్ములు ఉయ్యాలో

ఎత్తుకో బిడ్డను ఉయ్యాలో
వెళ్లి రా ఊరికి ఉయ్యాలో
పుట్టినింటికి నీవు ఉయ్యాలో
శుభముగా పోయిరా ఉయ్యాలో
మెట్టినింటికి నీవు ఉయ్యాలో
క్షేమంగా తిరిగి రా ఉయ్యాలో
మెట్టినింటికి నీవు ఉయ్యాలో
క్షేమంగా తిరిగి రా ఉయ్యాలో.

http://goo.gl/RD49mM

Wednesday 14 October 2015

రామ రామ రామ ఉయ్యాలో - బతుకమ్మ పాట


రామ రామ రామ ఉయ్యాలో
రామనే శ్రీరామ ఉయ్యాలో ॥2॥
రామ రామ నంది ఉయ్యాలో
రాగమెత్తరాదు ఉయ్యాలో ॥2॥
నెత్తిమీద సూర్యుడా ఉయ్యాలో
నెల వన్నెకాడ ఉయ్యాలో ॥2॥

పాపట్ల చంద్రుడా ఉయ్యాలో
బాలకుమారుడా ఉయ్యాలో ॥2॥
పెద్దలకు వచ్చింది ఉయ్యాలో
పెత్తారామాస ఉయ్యాలో ॥2॥
బాలలకు వచ్చింది ఉయ్యాలో
బతుకమ్మ పండుగ ఉయ్యాలో ॥2॥

తెల్లతెల్లయి గుళ్లు ఉయ్యాలో
తెల్లయమ్మా గుళ్ళు ఉయ్యాలో ॥2॥
పన్నెండేండ్ల నాడు ఉయ్యాలో
పాతవడ్డ గుళ్ళు ఉయ్యాలో ॥2॥

తెల్లయి ఏములాడ ఉయ్యాలో
రాజన్న గుళ్ళు ఉయ్యాలో ॥2॥
నల్లనల్లయి గుళ్ళు ఉయ్యాలో
నల్లయమ్మా గుళ్ళు ఉయ్యాలో ॥2॥
నల్లయి నల్లగొండ ఉయ్యాలో
నరసింహా గుళ్ళు ఉయ్యాలో ॥2॥
పచ్చపచ్చయి గుళ్ళు ఉయ్యాలో
పచ్చయమ్మా గుళ్ళు ఉయ్యాలో ॥2॥

పచ్చయి పర్వతాల ఉయ్యాలో
మల్లన్న గుళ్ళు ఉయ్యాలో ॥2॥
పర్వతాల మల్లన్న ఉయ్యాలో
పదములు సెలవయ్యా ఉయ్యాలో ॥2॥
రామ రామ రామ ఉయ్యాలో
రామనేశ్రీ రామ ఉయ్యాలో ॥2॥

ఇద్దరక్కా చెల్లెళ్ల ఉయ్యాలో
ఒక్క ఊరికిస్తే ఉయ్యాలో ॥2॥
ఒక్కడే మాయన్న ఉయ్యాలో
చూసన్నా వోడాయే ఉయ్యాలో ॥2॥
ఎట్ల వత్తు చెల్లెళ్ల ఉయ్యాలో
ఏరు అడ్డమాయే ఉయ్యాలో ॥2॥
ఏరుకు ఎలుపల్ల ఉయ్యాలో
తలుపు అడ్డమాయే ఉయ్యాలో ॥2॥

తలుపులకు తాళాలు ఉయ్యాలో
వెండి సీలాలు ఉయ్యాలో ॥2॥
వెండి సీల కింద ఉయ్యాలో
వెలపత్తి చెట్టు ఉయ్యాలో ॥2॥
వెలపత్తి చెట్టుకి ఉయ్యాలో
ఏడు విత్తులపత్తి ఉయ్యాలో ॥2॥
ఏడు గింజల పత్తి ఉయ్యాలో
ఎల్లనే ఆ పత్తి ఉయ్యాలో ॥2॥

ఆ పత్తి తీసుకుని ఉయ్యాలో
ఏడికి వోయిరి ఉయ్యాలో ॥2॥
పాలపాల పత్తి ఉయ్యాలో
పావురాయి పత్తి ఉయ్యాలో ॥2॥
ముసల్ది వడికింది ఉయ్యాలో
ముద్దుల పత్తి ఉయ్యాలో ॥2॥
వయస్సుది వడికింది ఉయ్యాలో
వన్నెల పత్తి ఉయ్యాలో ॥2॥

చిన్నది వడికింది ఉయ్యాలో
చిన్నెల పత్తి ఉయ్యాలో ॥2॥
ఆ పత్తి ఈ పత్తి ఉయ్యాలో
సాలె చింతల పత్తి ఉయ్యాలో ॥2॥
సాలె చింతలగాడ ఉయ్యాలో
సంగడి సారన్న ఉయ్యాలో ॥2॥
సంగడి సారన్న ఉయ్యాలో
సాగదీయవట్టే ఉయ్యాలో ॥2॥

సాగదీయవట్టే ఉయ్యాలో
ఆ పత్తి వడికి ఉయ్యాలో ॥2॥
ఆ పత్తి వడికిన ఉయ్యాలో
నెలకొక పోగు ఉయ్యాలో ॥2॥
దీవినె ఆ చీర ఉయ్యాలో
దివిటిల మీద ఉయ్యాలో ॥2॥
ఆ చీర కట్టుకుని ఉయ్యాలో
కొంగల బావికి ఉయ్యాలో ॥2॥

నీళ్లకంటూ పోతే ఉయ్యాలో
కొంగల బావికి ఉయ్యాలో ॥2॥
ఆ చీర కట్టుకుని ఉయ్యాలో
హంసల బావికి ఉయ్యాలో ॥2॥
హంసలన్నీ చేరి ఉయ్యాలో
అంచునంతా చూసే ఉయ్యాలో ॥2॥
ఆ చీర కట్టుకుని ఉయ్యాలో
పట్నంబు పోతిని ఉయ్యాలో ॥2॥
పట్నంబు పారిని ఉయ్యాలో
కొంగు బంగారేమో ఉయ్యాలో ॥2॥

కొంగు బంగారంబు ఉయ్యాలో
ఈ చీరలున్నాయా ఉయ్యాలో ॥2॥
గొప్పగా సాలెళ్ళు ఉయ్యాలో
నేసినారు ఈ చీర ఉయ్యాలో ॥2॥
దిగినే ఆ చీర ఉయ్యాలో
దివిటీల మీద ఉయ్యాలో ॥2॥
అన్నల వోయన్నా ఉయ్యాలో
అన్నలో పెద్దన్న ఉయ్యాలో ॥2॥

ఏడాదికోసారి ఉయ్యాలో
బతుకమ్మ పండుగ ఉయ్యాలో ॥2॥
ఆడపిల్లలనన్నా ఉయ్యాలో
నేను ఉన్న జూడు ఉయ్యాలో ॥2॥
కలిగేను పెద్దమ్మ ఉయ్యాలో
కన్నెతల్లి ఉన్నదా ఉయ్యాలో ॥2॥
ఏడంత్రాల ఉయ్యాలో
తీరైన బతుకమ్మ ఉయ్యాలో ॥2॥

తీరైన బతుకమ్మ ఉయ్యాలో
పువ్వులే తెచ్చిరి ఉయ్యాలో ॥2॥
వారిద్దరు ఒత్తురా ఉయ్యాలో
వీరిద్దరు ఒత్తురా ఉయ్యాలో ॥2॥
సంవత్సరానికి ఉయ్యాలో
ఒక్కసారే తల్లే ఉయ్యాలో ॥2॥
తంగేడు పూలనే ఉయ్యాలో
రాశిగా తెచ్చిరి ఉయ్యాలో ॥2॥

పోయిరా బతుకమ్మ ఉయ్యాలో
మళ్లీ ఏడాదికి ఉయ్యాలో ॥2॥
మళ్లీ రా బతుకమ్మ ఉయ్యాలో
మళ్లీ రావమ్మ ఉయ్యాలో ॥2॥

Source: http://goo.gl/vOjokt

Sunday 11 October 2015

హిందూ ధర్మం - 179 (నిరుక్తము - 2)

వేదాలకు అనేక విధాలుగా అర్దాలను అన్వయం చేయవచ్చని యాస్కాచార్యులు చెప్పారు. ప్రధానంగా వేదాలకు 6 పద్ధతుల్లో అర్దం చెప్తారు. ఈ విషయాన్ని ఆర్యసమాజ స్థాపకులు మహర్షి దయానంద్ సరస్వతీగారు తమ ఋగ్వేద్ భాష్యభూమికలో వివరించారు.

1. నిరుక్తం ఆధారంగా చెప్పేది మొదటి విధానం. ఇది ప్రధానంగా పదాల ఆవిర్భావం, ధాతువులు (మూలశబ్దాలను) అన్వయించి చెప్పేది. వైదిక వాఙ్మయాన్ని అనుసరించి ఉంటుంది. ఇది సులభంగానే అనిపించినా, అత్యంత క్లిష్టమైనది, పరిపూర్ణంగా విశ్లేషించి చెప్పేది. ఇది యాస్కుడి నిరుక్తం ఆధారంగా వచ్చింది. ఈ పద్ధతి దోషరహితంగా, ఎంతో మేధస్సును ఉపయోగించేదిగా ఉంటుంది.

2. ఐతిహాసిక పద్ధతి. దీన్నే చారిత్రిక విధానం అని కూడా అంటారని యాస్కుడు చెప్పారు. ఇందులో చరిత్రలో జరిగిన కొన్ని ముఖ్యమైన మరియు ప్రత్యేక సంఘటనల ఆధారంగా వేదమంత్రాలకు అర్దాలను అన్వయం చేస్తారు. భారతదేశంలో పూర్వం నుంచి జీవించిన రాజులు, మహానుభావుల పేర్లను వైదిక మంత్రాలకు అన్వయం చేసి అర్దం చెప్తారు. ఇలా అర్దాలు వెతకడం పెద్ద కష్టమేమీ కాదు. ఎందుకంటే వేదాల్లో ఉన్న అనేక పదాలను అనేకులు ఇంతకముందు పేర్లుగా పెట్టుకుని ఉంటారు. వారిని ఆయా మంత్రాలకు అన్వయం చేసి, ఉదాహరణలు చెప్పడం, వేదాన్ని వివరించడం సులభమే. కానీ కాలక్రమంలో ఈ పద్ధతి ప్రాభవాన్ని కోల్పోయింది. ఎందుకంటే ప్రజలు వైదిక సత్యాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సింది పోయి, ఆయా పాత్రలకు, వ్యక్తులకు ప్రాధాన్యం ఇవ్వడం మొదలుపెట్టారు.

3. పౌరాణిక పద్ధతి - ఇందులో వేదానికి పురాణాల్లోని సంఘటనల ఆధారంగా అర్దాలు చెప్తారు. ప్రతి మంత్రానికి లేదా సూక్తానికి ఒక కధను ఉదాహరణగా చెప్తారు. ఈ పద్ధతి ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ పద్ధతిలో వేదమంత్రాలను వివరించని సందర్భం ఉండదు. యాస్కుడు దీన్ని కూడా ఐతిహాసిక పద్ధతి అనే అన్నారు.

4. శాస్త్రీయ (Scientific) పద్ధతి - నిరుక్తం తర్వాత ఇదే అత్యంత కష్టమైన పద్ధతి. ఇందులో వైదిక సత్యాలను భౌతిక శాస్త్ర సూత్రాలు, సహజంగా ప్రకృతిలో జరిగే చర్యల రూపంగా వివరిస్తారు. ఇది కష్టమైన పద్ధతియే అయినా, సరైన అర్దాలను ఇవ్వగలుగుతుంది కనుక పండితులు ఈ పద్ధతినే ఎంచుకుంటారు.

5. గూఢార్ధాలు, యోగపద్ధతి - ఇది ఎంతో క్లిష్టమైన పద్ధతి. కఠినమైన యోగపరమైన జీవితం గడిపేవారు మాత్రమే వేదమంత్రాలకు ఈ విధమైన అర్ధాలను దర్శించగలుగుతారు. ఈ పద్ధతిలో వేదం మొత్తం పరబ్రహ్మం, ఆత్మ, మానవశరీరం గురించి, బహిర్దృష్టి, అంతర్దృష్టిల గురించి వివరిస్తుంది. యాస్కాచార్యులు ఈ పద్ధతిని తన గ్రంధంలో 14 వ అధ్యాయంలో ఉపయోగించారు. వేదంలోని కొన్ని మంత్రాలకు యోగపరమైన అర్దాలు మాత్రమే చెప్పవలసి ఉంటుంది. మరే ఇతర అర్దాలు చెప్పినా, దుష్ఫలితాలు కలుగుతాయి.

6. కర్మకాండకు సంబంధించిన పద్ధతి. వైదిక అర్దాలను చెప్పడంలో ఇది చాలా సులువైన మరియు ప్రత్యక్ష పద్ధతి. ఉదాహరణకు ఏదైనా ఒక సూక్తం జగత్తుకు సంబంధించిన సత్యాన్ని చెప్పేది అవచ్చు, లేదా ఈశ్వర ప్రార్ధన కావచ్చు. కానీ అది పుట్టువెంట్రుకలు తీసే సమయంలో పఠించవలసి ఉంటుంది. అటువంటి సందర్భంలో ఈ పద్ధతి ప్రకారం అర్దాన్ని చెప్తే, దాన్ని అసలు అర్దాన్ని పక్కనబెట్టి, కేవలం పుట్టువెంట్రుకలు తీసే సమయంలో మాత్రమే చదువుతారు. అనగా కేవలం కర్మకు మాత్రమే ఉపయోగిస్తారు.

అన్ని పద్ధతులను గమనిస్తే, ఐతిహాసిక, పౌరాణిక, కర్మకాండకు చెందిన పద్ధతులు కాలక్రమంలో వచ్చినవే తప్పించి, వాటి మీద ఆధారపడకూడదు. ఏదో తాత్కాలికంగా, సమయానుకూలంగా చెప్పుకోదగ్గవి మాత్రమే. అవి ఎల్లప్పుడూ సత్యాలను వ్యక్తపరుస్తాయని చెప్పలేము.

To be continued .................

Sunday 4 October 2015

హిందూ ధర్మం - 178 (నిరుక్తము - 1)

నిరుక్తము - ఈ వేదాంగము వేదానికి చెవి వంటిది. ఇది వైదిక పదాల యొక్క ఆవిర్భావం గురించి వివరిస్తుంది. నిరుక్తం అనేది కఠినమీన వైదిక పదాల సమాహారమైన నిఘంటువుగా భాష్యం వంటిది. వేదాన్ని యధార్ధంగా అర్దం చేసుకోవడానికి నిరుక్తం ఉపయోగపడుతుంది. వేదం ఈశ్వరీయము. మొత్తం సంస్కృతంలోనే ఉంటుంది. అలా అని కేవలం సంస్కృతం నేర్చుకున్నంత మాత్రాన వేదానికి సరైన అర్దం చెప్పలేరు. ఎందుకంటే వైదిక సంస్కృతం వేరు, వ్యావహారిక సంస్కృతం వేరు. వేదం ఉన్నది వైదిక సంస్కృతంలో. ఇది చాలా పైస్థాయి పదజాలం, ఎంతో లోతైన, గంభీరమైన అర్దంతో కూడిన పరిభాష. వ్యవహారంలో వాడేది వ్యావహారిక సంస్కృతం. ఇది మామూలు స్థాయిది. ఈ రెండిటిని కలిపి, వైదిక సంస్కృతంలో ఉన్న వేదానికి, వ్యావహారిక సంస్కృతంలో అర్దం చెప్తే, అది దోషభూయిష్టంగానే ఉంటుంది. అందువలన సంస్కృతంలో పాండిత్యం వలన వేదానికి అర్దం చెప్పచ్చు అనడం తప్పే అవుతుంది. అంతేగాక, వేదంలో చెప్పబడ్డ ఏ పదానికైనా ఒకే అర్దం ఉండదు. ఒకే పదానికి నానార్దాలు ఉంటాయి. మంత్రక్రమాన్ని అనుసరించి, సమయసందర్భాలను అనుసరించి, ఆయా పదాలకు అర్దలాను అన్వయం చేయాల్సి ఉంటుంది. అందుకోసమే నిరుక్తమ్ను ఏర్పరిచారు ఋషులు. ఇది వేదానికి నిఘంటువు వంటిది.

ఎప్పుడు ఏ అర్ధాన్ని స్వీకరించాలనే దానికి ఆర్యసమాజ స్థాపకులు మహర్షి దయానంద సరస్వతీ గారు సత్యార్ధ ప్రకాశ్‌లో చెప్పిన ఉదాహరణ చూడండి. ఎక్కడ ఏదీ ప్రకరణమో, అక్కడ దాన్ని గ్రహించటం ఉచితము. ఎట్లనగా, ఒకడు ఒక వ్యక్తితో 'హేభృత్య! త్వం సైంధవమానయ' అన్నాడు, అనగా ఓ సేవకుడా! నీవు సైంధవం తీసుకురా అని అర్దం. అప్పుడు ఆ సేవకుడు సమయము, ప్రకరణము (సందర్భము) గురించి ఆలోచించటం అవశ్యకం. ఎందుకంటే సైంధవం అనే పదానికి రెండు అర్దాలున్నాయి. ఒకటి గుఱ్ఱము, రెండవది లవణము (ఉప్పు). అతని యజమానికి అది బయటకు వెళ్ళే సమయం అయితే, అతడు గుఱ్ఱాన్ని తీసుకువెళ్ళాలి, భోజన సమయం అయితే ఉప్పు తీసుకువెళ్ళడం సరైన పద్ధతి. అలా కాక భోజన సమయంలో గుఱ్ఱాన్ని, గమన సమయంలో ఉప్పుని తీసుకువెళితే, అది యజమానికి ఆగ్రహాన్ని కలిగించి, సమయం, సందర్భం తెలియనివాడు తనకెందుకు అనుకోవచ్చు. అప్పుడు అతడి ఉద్యోగానికే ముప్పు వాటిల్లవచ్చు. అదే విధంగా వేదం విషయంలో అర్దాలను అన్వయం చేసేటప్పుడు ప్రకరణము - సమయము గురించి తప్పక ఆలోచించాలి. దానికి నిరుక్తం సహాయపడుతుంది.

నిఘంటువు మీద అనేక భాష్యలున్నా, యాస్కుడు రాసిన భాష్యాన్నే వేదాంగాల్లో ఒకటిగా స్వీకరించారు. ఇది కేవలం వైదిక పదాల గురించే కాక, వాటి ధాతువుల గురించి, ఒకే ధాతువును నుంచి ఉద్భవించిన సారూప్యత కలిగిన అనేక ఇతర పదాల గురించి వివరిస్తుంది.

To be continued ..............

Friday 2 October 2015

స్వతంత్రమా? గోవధ నిషేధమా? గాంధీగారిని అడిగిన ఆంగ్లేయులు.

స్వతంత్ర పోరాటంతో పాటు గోవధ నిషేధ ఉద్యమం దేశవ్యాప్తంగా తీవ్రంగా జరుగుతున్న సమయంలో గాంధీగారిని పిలిచి బ్రిటీష్ వారు అడిగారు. మీకు స్వాతంత్రం కావాలా? లేక గోవధ నిసేధం కావాలా? అని.... దానికి సమాధానంగా గాంధీగారు 'నాకు గోవధ నిషేధమే కావాలి. మీరు గోవధను నిషేదిస్తే, ఈ స్వతంత్ర పోరాటం ఇప్పుడే ఆపేస్తాను.గోవులను రక్షించుకుంటేనే భారత్‌కు నిజమైన స్వాతంత్ర్యం వస్తుంది' అన్నారు.
స్వాతంత్ర్యం వచ్చి 68 ఏళ్ళు గడిచాయి. ఇప్పుడు 147 వ గాంధీ జయంతి జరుపుకుంటున్నాం. కానీ ఇప్పటికి ఈ దేశంలో గోవధ నిషేధం జరగలేదు. ఎక్కడైనా ప్రభుత్వాలు గోవధ నిషేధం చేస్తే, దాన్ని ప్రజల ఆహారను స్వేఛ్చను హరిస్తున్నారు, మతాన్ని రుద్దుతున్నారని కుహన-లౌకిక వాదులు, అదే వర్గానికి చెందిన మీడీయా పెద్ద గోల చేస్తున్నారు. జంతువధ కాలుష్యానికి, భూతాపానికి పెద్ద కారణమని తెలిసి కూడా, పర్యావరణాన్ని రక్షించడంటూ పోరాటం చేసే ఏ పర్యావరణవేత్త కూడా గోవధ నిషేధాన్ని అమలు చేయమని అడగరెందుకో ???!!! గాంధీగారి సిద్ధాంతాన్ని కనీసం ప్రజలైన అర్దం చేసుకోవాలి. భారతీయ గోవులను, దేశీఆవులను రక్షించుకుని, వాటి సంతతిని పెంచి, మహాత్ముని ఆత్మకు శాంతి చేకూర్చాలి. కనీసం వచ్చే గాంధీ జయంతికైనా వారి కల సాకారం కావాలి. దేశంలో గోవధ నిషేధం జరగాలి. దేశిగోవులను రక్షించడానికి, గో ఆధారిత ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలను రూపొందించి, ప్రత్యేక అధికారాలతో కొత్త సంస్థలను ఏర్పాటు చేసి, గోవులను రక్షించాలి. జై హింద్

Thursday 1 October 2015

భారతదేశం గురించి అన్నీబిసెంట్

ప్రపంచంలోని గొప్ప మతాలను నలభై ఏళ్ళకు పైగా అధ్యయనం చేసిన తర్వాత, నేను తెలుసుకున్నదేమిటంటే హిందూ ధర్మం తప్ప మరే ఇతర మతము పరిపూర్ణము, పూర్తి శాస్త్రీయము, సంపూర్ణతాత్వికము, పూర్తి ఆధ్యాత్మికం కాదు. మీరు హిందూత్వం గురించి ఎంత తెలుసుకుంటే, దాన్ని అంత ప్రేమిస్తారు. దాన్ని ఎంతగా అర్దం చేసుకుంటే, అంత విలువనిస్తారు. పొరబడకండి.  హిందూధర్మం లేనిదే భారతదేశానికి భవిష్యత్తు లేదు. హిందూత్వం అనే మట్టిలోనే భారతదేశం అనే చెట్టు వ్రేళ్ళు వ్యాపించి ఉన్నాయి, దాని నుంచి దేశాన్ని వేరు చేస్తే, వ్రేళ్ళనుంచి చెట్టును పెకిలించి వేస్తే జరిగినట్టుగా, దేశం చచ్చిపోతుంది. ఈ దేశంలో అనేక ఇతర మతాలు, జాతులున్నా, అవి సుదూరగతం నుంచి ఉన్నవి కావు, ఈ భూమి దేశంగా కొనసాగడానికి వాటి అవసరం ఏ మాత్రం లేదు. అవి ఏ విధంగా వచ్చాయో, అదే విధంగా వెళ్ళిపోయినా, భారతదేశం స్థిరంగానే ఉంటుంది. కానీ హిందూ ధర్మం నశించిందా, ఇక భారతదేశమంటే ఏమిటి? అప్పుడు ఆమె కేవలం గడిచిపోయిన గతానికి ఒక భౌగోళిక చిహ్నం, తుడిచిబెట్టుకుపోయిన కీర్తికి, కళలకు, సాహిత్యానికి, కట్టడాలకు మసకబారిన జ్ఞాపకం మాత్రమే ..... ఎందుకంటే వాటియందు అంతటా హిందూత్వమే నిండి ఉంది. హిందువులే హిందూ ధర్మాన్ని పాటించకపోతే, ఇంకెవరు రక్షిస్తారు? భారతమాత సొంత పిల్లలే తమ ధర్మం పట్ల విశ్వాసం కలిగి ఉండకపోతే, దీన్ని ఎవరు కాపాడుతారు? భారతదేశం మాత్రమే భారతదేశాన్ని రక్షించుకోగలదు మరియు భారతదేశం, హిందూధర్మం ...... రెండూ ఒకటే.      

అన్నీబిసెంట్


“After a study of some forty years and more of the great religions of the world, I find none so perfect, none so scientific, none so philosophic, and none so spiritual as the great religion known by the name of Hinduism. The more you know it, the more you will love it; the more you try to understand it, the more deeply you will value it. Make no mistake; without Hinduism, India has no future. Hinduism is the soil into which India’s roots are struck, and torn of that she will inevitably wither, as a tree torn out from its place. Many are the religions and many are the races flourishing in India, but none of them stretches back into the far dawn of her past, nor are they necessary for her endurance as a nation. Everyone might pass away as they came and India would still remain. But let Hinduism vanish and what is she? A geographical expression of the past, a dim memory of a perished glory, her literature, her art, her monuments, all have Hindudom written across them. And if Hindus do not maintain Hinduism, who shall save it? If India’s own children do not cling to her faith, who shall guard it? India alone can save India, and India and Hinduism are one.”

Annie Besant (1847-1933), English theosophist


క్షిప్ర ప్రసాద గణపతి

ఓం గం గణపతయే నమః

భక్తులపాలిటి కల్పవృక్షం క్షిప్రప్రసాద గణపతి. 32 గణపతులలో వినాయకుడి 20 వ రూపం క్షిప్ర ప్రసాద గణపతి. క్షిప్రప్రసాది అంటే కోరిన కోరికలు వెంటనే సులభంగా తీర్చేవాడని అర్దం. ఎర్రని మందార పువ్వు వంటి వర్ణం గల శరీరంతో, 6 చేతులతో దర్శనమిస్తాడు క్షిప్ర గణపతి. శివుడి వలే 3 వ నేత్రం కలిగి, తలపై చంద్రవంకను ధరించి ఉంటాడు. కుశములు (ధర్భలు) ఆసనంగా చేసుకుని కూర్చుని ఉంటాడు. ఈయన పెద్ద బొజ్జ బ్రహ్మాండానికి ప్రతి రూపం. ప్రధానమైన కుడి చేతిలో విరిగిన తన దంతం, ఎడమ చేతిలో కల్పవృక్షపు తీగ ధరించి ఉంటాడు. మిగితా చేతులలో పాశం, అంకుశం, దానిమ్మ, తెల్ల కవుల ధరించి ఉంటాడు. ఈ రూపంలో ఉన్న స్వామిని ధ్యానించడం వలన కోరిన కోరికలు త్వరగా నెరవేరుతాయి. ఈ రూపంలో వినాయకుడు త్వరగా కోరికలు తీర్చడమే కాదు, దుష్టులను వెంటనే శిక్షిస్తాడు, తప్పు చేస్తే, ఆలస్యం చేయకుండా శిక్ష విధిస్తాడు. ఈ గణపతిని రోజు ధ్యానించడం వలన ఆధాత్మిక మార్గంలో అడ్డంకులు తొలగి, త్వరగా ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది.


స్వాతి నక్షత్ర జాతకులు ఈ గణపతిని పూజించడం వలన శుభపలితాలు కలుగుతాయి. ఈయన భక్తుల పాలిట కల్పతరువు. పిళ్ళయార్‌పట్టి కర్పగ వినాయకర్ దేవాలయం, కరైకుడి, తమిళనాడులో క్షిప్రగణపతి కొలువై ఉన్నాడు. అట్లాగే కర్ణాటకలోని చమరాజనగర్ మరియు మైసూర్ జిల్లాలోని నంజన్‌గుడ్ దేవాలయాల్లో 32 మంది గణపతుల విగ్రహాలున్నాయి.

క్షిప్రప్రసాద గణపతి ధ్యాన శ్లోకం

ఘృతపాశాంకుశ కల్పలతా స్వదంతశ్చ బీజపూరయుతా
శశికళ కళితమౌళీ త్రిలోచనో అరుణశ్చ గజవదనః
భాసుర భూషణ దీప్తః బృహదురః పద్మవిశిష్టోరల్లసితః
విఘ్నపయోధర పవనః కరధృత కమలః సాధాస్తుమే భూత్యై  


Kshipra Prasada Ganapati

Kshipra Prasada Ganapati is the 20th of Lord Ganesha’s 32 forms. In this form Lord Ganesh is considered quick rewarder of the wishes and instant punisher of the wrong. Kshipraprasada Ganapati appears in crimson red hue complexion with six hands. Also in this form he appears with third eye and with crescent moon on his crown like Lord Shiva. The lord is seated in Kusha grass throne, a sacred grass for Hindus. His big belly represents the manifestation of the universe. On his main right hand holds his broken tusk and on main left hand holds the twig of Kalpavriksha (Wish Fulfilling Tree). On the other hands Lord Ganapathi holds a noose, an elephant goad, pomegranate and a white lotus.

Picture of Kshipra Prasada Ganapati Form of Ganesha

Chothi (Swati) Nakshatra is related to Kshipra Prasada Ganapati. Worshipping this form is believed to bestow devotees with peace and prosperity. Meditating every day removes the obstacles   in the path of self realisation. Kshipra Prasada Ganesha can be worshipped at Pillayarpatti Karpaga Vinayagar Temple in Karaikudi, Tamil Nadu. Also temples in Chamarajanagar and Nanjangud in Mysore district in Karnataka has 32 forms of Ganapati sculptures.

Kshipra Prasada Ganapati Mantra

Ghrita pashankusha Kalpalata Svadatascha Beejapoorayutah!
Shashikala Kalita Moulihi Trilochana Arunascha Gajvadanaha!!
Bhasurabhooshana Deeptah Brihaduaraha Padmavishatrollasitah!
Vighnapayodharapavanah Karadhrita Kamalah Sadaastu Me Bhootayai!!

Translation of Kshipra Prasada Ganapati Mantra

Ganapati bestowing quickly his mercy. He has six arms. He is red in colour. His hands hold the single tusk, the elephant goad, the lotus, the creeper of the votive tree (kalpalata), the noose and the lemon.

Source: http://www.hindudevotionalblog.com/search/label/ganapathi32forms