Thursday 30 April 2015

చరిత్రకు నోచుకోని విచిత్ర యుగం!

పురాతత్వశాఖ వారి తవ్వకాలలో బయటపడుతున్న మహా విషయాలకు సముచిత ప్రచారం లేదు. మూఢ విశ్వాసాలను వదిలించుకోవాలన్న ప్రచారం జరుగుతున్న సమయంలోనే మూఢ విశ్వాసాలు మన నెత్తికెక్కి కూర్చుని ఉండడం విచిత్రమైన వర్తమానం. ఈ మూఢ విశ్వాసాలు మన విద్యారంగాన్ని రెండువందలు ఏళ్లకు పైగా ప్రభావితం చేస్తున్నాయి. ఈ మూఢ విశ్వాసాలు విదేశీ దురాక్రమణదారుల వారసత్వ శకలాలు. ఒక్కొక్క ‘శకలం’ సకలంగా మారి మన జీవన రంగాలను ముక్కలు ముక్కలుగా మార్చివేస్తున్నాయి. మన వ్యవహారంలో, విజ్ఞానంలో సమన్వయం, సమగ్రత్వం లోపించడానికి హేతునిబద్ధత అడుగంటి పోవడానికి ఇలా ‘శకలం’ సకలమై కూర్చుని ఉండడం ప్రధాన కారణం. శకలాలను మళ్లీ ఒకటిగా కూర్చి సకలత్వాన్ని సాధించడానికి ఇప్పుడైనా కృషిజరగాలి. విద్యాప్రణాళికలలో, పాఠ్యపుస్తకాలలో, భాషాస్వరూపంలో సంస్కరణలు జరిగిపోవాలని ప్రచారం చేస్తున్నవారు ‘తవ్వకాల’ద్వారా బయటపడుతున్న చారిత్రక, భౌగోళిక, సాంస్కృతిక వాస్తవాలను మన జాతీయ జీవనంతో సమన్వయం చేసుకోవాలి! భారతీయ సంస్కృతి గొప్పదని అంటున్నవారే ‘ఆర్యు లు’అనేవారు బయటినుంచి మన దేశానికి వచ్చిపడినారని కూడ పాఠ్యాంశాలలో ఇప్పటికీ ఇరికిస్తూ ఉన్నారు. ఇది మూఢ విశ్వాస చిహ్నం....
‘చరిత్ర’కు ప్రారంభ బిందువును నిర్దేశించడం పాశ్చాత్యుల విశ్వవిజ్ఞాన అవగాహనా రాహిత్యానికి శతాబ్దుల సాక్ష్యం! ఆ చారిత్రక ప్రారంభ బిందువునకు ముందున్న కాలాన్ని ‘చరిత్ర పూర్వయుగం’గా చిత్రీకరించడం కాలగతికి పాశ్చాత్య చరిత్రకారులు చేసిన ఘోరమైన గాయం... ఈ ‘తథాకథిత’- సోకాల్డ్- చరిత్ర పూర్వయుగం- ప్రి హిస్టారిక్ ఏజ్-లో మాత్రం మానవులు లేరా? కనీసం ప్రాణులు లేవా? వారిది లేదా వాటిది మాత్రం చరిత్రకాదా?? చరిత్ర కాదనడం చరిత్రకు జరిగిన అన్యాయం. ఈ అన్యాయం చేసింది మిడిమిడి జ్ఞానం కలిగిన పాశ్చాత్య మేధావులు! ఈ ‘శకల’మే ‘సకల’మని ఐరోపా చరిత్రకారులు మనకు క్రీస్తుశకం పద్దెనిమిదవ, పంతొమ్మిదవ శతాబ్దులలో పాఠాలను చెప్పారు. ఆ పాఠాలను ఆ తరువాత మరింత నిష్ఠతో శ్రద్ధతో వల్లెవేస్తున్నాం! అందువల్లనే గొప్ప విషయాలను చెప్పదలచుకున్న మేధావులు, లేదా చెబుతున్నట్టు అభినయిస్తున్న మహా మేధావులు ‘చరిత్ర పూర్వయుగం’-ప్రిహిస్టారిక్ ఏజ్- అన్న విచిత్ర పద జాలాన్ని ఉటంకించడంతో ప్రారంభిస్తున్నారు! ప్రాచీన రాజధాని అమరావతి నవ్యాంధ్రప్రదేశ్‌కు మళ్లీ రాజధాని అవుతున్న సందర్భంగా ఈ ‘‘చరిత్ర పూర్వయుగం’’అన్న అర్థంలేని పదజాలం మళ్లీ విరివిగా ప్రచారవౌతోంది! ఈ ప్రచారం అతి ప్రాచీన అమరావతికి అవమానం. ఎందుకంటె అమరావతి లేదా కొందరు అంటున్నట్టు ‘్ధన్యకటకం’ ఐదువేల వంద ఏళ్లకు పూర్వం జరిగిన మహాభారత యుద్ధ సమయంలో ఉంది. అంతకు పూర్వం వేలాది ఏళ్లుగా ఉంది! కానీ బ్రిటిష్‌వారు మప్పిపోయిన ‘‘చరిత్ర పూర్వయుగం’’అన్న విచిత్ర పదార్థాన్ని ప్రచారం చేస్తున్నవారు ‘అమరావతి’ చరిత్రను రెండువేలు లేదా రెండు వేల ఐదువందల ఏళ్లకు పరిమితం చేస్తున్నారు! బ్రిటిష్‌వారు కాలాంతకులు, కాలాన్ని అంతంచేసినవారు... వారి వారసులు కూడ కాలాంతకులే! ‘‘చరిత్ర పూర్వయుగం’’ ఒకటుందని నమ్మడం ప్రచారం చేయడం మూఢ విశ్వాసబద్ధమైన బుద్ధికి నిదర్శనం! చరిత్ర అనాది... అనంతం... అందువల్ల చరిత్ర క్రమం ఆద్యం త రహితం! ‘‘చరిత్ర పూర్వయుగం’’,‘‘కోతి యుగం’’,‘‘రాతి యుగం’’,‘‘లోహ యు గం’’ అన్నవి బ్రిటిష్‌వారు, పాశ్చాత్యులు ‘‘విజ్ఞా నం’’గా భ్రమించిన మూఢవిశ్వాసాలు... బ్రిటిష్‌వారు మన దేశాన్ని వదలి వెళ్లినప్పటికీ, వారు అంటించిపోయిన ఈ మూఢ విశ్వాసాలు మన పుస్తకాలను, మస్తకాలను వదలకపోవడం భావదాస్య ప్రవృత్తికి ప్రత్యక్ష ప్రమాణం!

పురాతత్త్వశాఖ వారి త్రవ్వకాలలో బయటపడుతున్న ప్రాచీన అవశేషాలు ‘‘హరప్పా మొహంజాదారో నాగరికత’’ కాలంనాటివని, అంతకు పూర్వంనాటివని వర్గీకరణలు జరుగుతున్నాయి. అంతవరకు కాలానికి సంబంధించిన పేచీలేదు. కాని ‘‘హరప్పా నాగరికత’’ లేదా ‘‘సింధునదీ పరీవాహక ప్రాంత- ఇండస్ వ్యాలీ- నాగరికత’’అన్న పదజాలం మన జాతీయ అద్వితీయ తత్త్వానికి విఘాతకరమైనవి! ఈ దేశంలో గతంలో రెండుమూడు జాతులవారు పరస్పరం కొట్టుకొని చచ్చారన్న అబద్ధాన్ని ప్రచారం చేయడానికి బ్రిటిష్‌వారు ఈ ‘‘హరప్పా నాగరికత’’ను ‘‘కనిపెట్టి’’ పోయారు. ఈ హరప్పా నాగరికత కాలంనాటి మానవ అస్థిపంజరాలు నాలుగు ఇటీవల హర్యానాలో జరిగిన తవ్వకాలలో బయటపడినాయి. ఈ అస్థిపంజరాలు ఐదువేల ఏళ్లనాటివట! హరప్పా, మొహంజోదారో అన్న ప్రాచీన నగరాలు సింధూ పరీవాహ ప్రాంతంలో ప్రాచీన కాలంలో ఉండి ఉండవచ్చు. కానీ నగరాల పేరుతో ‘నాగరికత’లు, ‘‘రాజ్యాలు’’ ఉండడం భారతీయ చరిత్రలో సంభవించలేదు. ఇలా ఉండడం గ్రీకుల పద్ధతి పాశ్చాత్యుల పద్ధతి! నగరాలు మన దేశంలో రాజధానులు మాత్రమే. ‘‘నాగరికత’’అన్నది దేశమంతటా విస్తరించి ఉండిన ఒకే ఒక అద్వితీయ సాంస్కృతిక వ్యవస్థ! అందువల్ల బ్రిటిష్‌వారు కనిపెట్టిన ‘‘హరప్పా నాగరికత’’ నిజానికి భారతదేశమంతటా సమకాలంలో విస్తరించి ఉండిన అద్వితీయ సామాజిక వ్యవస్థ! అది వేద సంస్కృతి, సనాతన సంస్కృతి, భారతీయ సంస్కృతి, హిందూ సంస్కృతి....

ఇలా దేశమంతటా ఉండిన దాన్ని ఒక ప్రాంతానికి పరిమితం చేయడం పాశ్చాత్యుల పరిమిత బుద్ధికి నిదర్శనం. ‘తక్షశిల’ప్రాచీన విద్యాకేంద్రం, రాజ్యంకాదు, రాజధాని కూడ కాదు. కానీ గ్రీకు బీభత్సకారుడైన అలెగ్జాండరు క్రీస్తునకు పూర్వం నాలుగవ శతాబ్దిలో మన దేశంలో కొంత భాగాన్ని గెలిచాడన్న అబద్ధాన్ని పాశ్చాత్య చరిత్రకారుడు క్రీస్తుశకం పద్దెనిమిదవ శతాబ్దిలో ప్రచారం చేశారు. ఈ అబద్ధ ప్రచారంలో భాగంగా విశ్వవిఖ్యాత విద్యాకేంద్రమైన ‘తక్షశిల’ను ఒక ప్రత్యేక రాజ్యంగా కల్పించారు!! ఇదే పద్ధతిలో దేశమంతటా ఒకే జాతీయ సంస్కృతి అనాదిగా ఉండడం వాస్తవం కాగా, ఈ వేద సంస్కృతికి భిన్నమైన ‘‘హరప్పా నాగరికత’’ను పాశ్చాత్యులు ఏర్పాటుచేశారు. పైగా ఈ ‘‘హరప్పా నాగరికత’’ ధ్వంసమైన తరువాత మాత్రమే క్రీస్తునకు పూర్వం పదిహేనవ పనె్నండవ శతాబ్దుల మధ్య వేద సంస్కృతి ఈ దేశంలో పుట్టుకొచ్చిందన్న మరో భయంకర అబద్ధాన్ని కూడ పాశ్చాత్యులు మన చరిత్రకు ఎక్కించిపోయారు!! ఈ దేశంలో ‘యుగాలు’గా వేద సంస్కృతి పరిఢవిల్లుతోందన్నది వాస్తవ చరిత్ర. ఈ చరిత్రను చెరచి, వేదాల ప్రాచీనతను కేవలం మూడువేల ఐదువందల ఏళ్లకు కుదించడానికి బ్రిటిష్‌వారు చేసిన కుట్రలో ఈ తథాకథిత ‘‘హరప్పా నాగరికత’’ భాగం... ఈ కుట్రను భగ్నంచేయడానికి వీలైన అవశేషాలు తవ్వకాలలో అనేక ఏళ్లుగా బయటపడుతున్నాయి. ఇప్పుడు హర్యానాలో జరిగిన త్రవ్వకాలలో ఏడువేల ఐదువందల ఏళ్లనాటి పట్టణం బయటపడింది! ‘‘హరప్పా నాగరికత’’ కేవలం ఐదువేల ఏళ్ల ప్రాచీనమైనదన్న పాశ్చాత్య అబద్ధాన్ని ఈ ‘‘పట్టణం’’ ఇలా బట్టబయలుచేసింది.. భూస్థాపిత సత్యమిలా భువనమెల్ల మార్మోగెను....

హరప్పా నాగరికతను ధ్వంసంచేసిన తరువాత వేదాలు వైదిక సంస్కృతి విలసిల్లాయన్న పాశ్చాత్యుల ‘‘అబద్ధాల చరిత్ర’’కు పెద్ద అవరోధం మహాభారత యుద్ధం. మహాభారత యుద్ధం కలియుగం పుట్టడానికి పూర్వం ముప్పయి ఆరవ ఏట జరిగింది! కలియుగం పుట్టిన తరువాత మూడువేల నూట రెండేళ్లకు క్రీస్తుశకం పుట్టింది. ఇలా క్రీస్తునకు పూర్వం 3138 ఏళ్లనాడు మహాభారతయుద్ధం జరిగిందని అమెరికా శాస్తవ్రేత్తలు సైతం నిర్ధారించిన సంగతి దశాబ్దిక్రితం ప్రముఖంగా ప్రచారమైంది. అమెరికా శాస్తవ్రేత్తలు నిర్ధారించకపోయినప్పటికీ ప్రాచీన భారత చరిత్రకారులు చేసిన నిర్ధారణలు నిజంకాకుండా పోవు. కాని పాశ్చాత్య భావదాస్య సురాపానం మత్తుదిగని భారతీయ మేధావులు అమెరికావారి ఐరోపావారి నిర్ధారణలను నమ్ముతున్నారు. ఆ నిర్ధారణ కూడ జరిగింది కనుక ఇకనైనా ‘హరప్పా’నాగరికత అన్న మాటలను వదలి పెట్టి దేశమంతటా అనాదిగా ఒకే వేద సంస్కృతి కొనసాగుతున్న వాస్తవాన్ని చరిత్రలో చేర్చాలి! ప్రాథమిక స్థాయినుండి స్నాతకోత్తర స్థాయివరకు గల విద్యార్థులకు బోధించాలి! మహాభారత యుద్ధం జరిగిననాటికి, క్రీస్తునకు పూర్వం మూడువేల నూటముప్పయి ఎనిమిదేళ్లనాటికి, దేశమంతటా ఒకే జాతీయత ఒకే సంస్కృతి నెలకొని ఉన్నాయి! అలాంటప్పుడు అదే సమయంలో ‘‘వేద సంస్కృతితో సంబంధం లేని, వేదాలకంటె ముందు ఉండిన’’ ఈ హరస్పా ఎలా ఉండి ఉంటుంది??

చరిత్రను ఆవహించిన మూఢవిశ్వాసాన్ని ఇకనైనా వదలగొట్టాలి!

‘రాతియుగం’, ‘కోతియుగం’వంటివి కృతకమైన కల్పితమైన కాలగణన పద్ధతులు. ‘చరిత్ర పూర్వయుగం’అన్నది ఉండడానికి వీలులేదు. ఎందుకంటె సహజమైన విశ్వవ్యవస్థ తుది మొదలు లేకుండా వ్యవస్థీకృతమై ఉంది! ఈ ‘తుది మొదలులేనితనం’ కాలానికీ- టైమ్- దేశానికీ- స్పేస్-వర్తిస్తున్న శాశ్వత వాస్తవం. ఈ వాస్తవం ప్రాతిపదికగా కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగం, కలియుగం వరుసగా తిరుగుతున్నాయి. శిశిర ఋతువు తరువాత వసంత ఋతువువలె రాత్రి తరువాత పగటివలె కలియుగం తరువాత మళ్లీ కృతయుగం రావడం చరిత్ర! ఇది సనాతనమైన నిత్యనూతనమైన హేతుబద్ధమైన వాస్తవం! ఈ వాస్తవం ప్రాతిపదికగా విద్యార్థులకు ఇకనైనా చరిత్రను బోధించాలి! ‘రాతియుగం’తోకాక కృతయుగంతో చరిత్రను మొదలుపెట్టాలి. కృత త్రేత ద్వాపర కలియుగాలు ఒకదానితరువాత ఒకటి రావడం ఖగోళ విజ్ఞానపు గీటురాయిపై నిగ్గుతేలిన నిజం!

ఈ ఖగోళ వాస్తవాలను ఎవ్వరూ మార్చలేరు... వక్రీకరించలేరు. ఈ ఖగోళ వాస్తవం ప్రకారం ‘సప్తర్షులు’అన్న అంతరిక్ష సముదాయం భూమినుండి చూసినప్పుడు వందేళ్లపాటు ‘అశ్వని’వంటి నక్షత్రాలతో కలసి ఉదయిస్తుంది. ఈ సప్తర్షి మండలం అలా ‘రేవతి’వరకూ గల నక్షత్రాలతో ఉదయించే కాలఖండం రెండువేల ఏడువంద ఏళ్లు. ఈ ఖగోళ వాస్తవం ప్రాతిపదికగా కలియుగంలో ఇది యాబయిరెండవ శతాబ్ది! ఇది 5117వ సంవత్సరం. శాతవాహన ఆంధ్రులు కలియుగంలో 2269నుండి 2775వరకు 506 ఏళ్లపాటు మొత్తం భారతదేశాన్ని పాలించారు, దేశానికి రాజధాని గిరివ్రజం...!! ధాన్యకటకం అప్పటికే ఉంది, ధాన్యకటకం అమరావతి కావచ్చు, కోటిలింగాల కావచ్చు!్ధన్యకటకం రాజధానిగా సహస్రాబ్దులు పాలించిన తరువాతనే ఆంధ్రులు గిరివ్రజం రాజధానిగా భారత సమ్రాట్టులయ్యారు. ఇదీ యుగాల చరిత్ర.... ‘చరిత్ర పూర్వయుగం’ లేదు!

- హెబ్బార్ నాగేశ్వరరావు 30/04/2015 (ఆంధ్రభూమి విశ్లేషణ)
http://www.andhrabhoomi.net/content/main-feature-58

భాగవతం నుంచి సూక్తి


Tuesday 28 April 2015

స్వామి చిదానంద సరస్వతీ సూక్తి

భగవంతుని గుర్తుంచుకోవడమే జీవితం. మర్చిపోవడమే మరణం - స్వామి చిదానంద సరస్వతీ (Divine life society, Rishikesh)



Monday 27 April 2015

భూమాత అరోగ్యమే మన ఆరోగ్యం - భవిష్యత్తు మన చేతుల్లోనే

యత్ పిండాండే తత్ బ్రహ్మాండే అని శాస్త్రం అంటుంది. అనగా ఏది పిండాండంలో ఉందో, అదే బ్రహ్మాండంలోనూ ఉంది అని అర్దం. పిండాండం అనగా ఈ శరీరం ................ ఒకే పదార్ధం నుంచి ఈ సృష్టి ఏర్పడింది. దానిలో భాగమే ఈ భూగోళం, భూమి నుంచి వచ్చిదే ఈ దేహం. శరీరం భూమిలో భాగం. అదీగాకా హిందు ధర్మం ప్రకారం భూమి జీవం లేని మట్టి ముద్ద కాదు. భూమిలో జీవం ఉంది, శక్తి ఉంది, సర్వజీవులకు పుష్టినిచ్చే శక్తి ఉంది. శక్తి ఉంటే ఆమెను దర్శించవచ్చు, మాట్లాడవచ్చు, కబుర్లు చెపచ్చు, రోగాలను నయం చేసుకోవచ్చు. మనకులాగా భూమికి ప్రాణం ఉంది. అందుకే ఆవిడను భూమాత అన్నారు. మనకున్న శరీరంలానే, ఆవిడకు ఒక శరీరం ఉంది. అదే భూమి. మనకు శరీరంలో రోగనిరోధకశక్తి ఉన్నట్లే, భూమాతకు ఉంది. రకరకాల మార్పుల ద్వార ఆవిడ తనలో కలిగిన దోషాలను తొలగించుకుంటుంది.

మనిషికి పంచకోశాలు ఉన్నట్లే భూమాతకు పంచకోశాలున్నాయి. ప్రాణమయకోశంలో దోషాలు ఏర్పడప్పుడు వ్యక్తికి స్థూలసరీరంలో రోగాలు సంభవిస్తాయి. అట్లాగే భూమాతకు ప్రాణమయకోశంలో దోషం ఏర్పడితే అవిడకు రోగలు వస్తాయి. భూమాతకు ప్రాణమయకోశం వాతావరణమే. భూవాతవారణం చెడిపోయిన కారణంగా ఆవిడ స్థూలశరీరంలో అనారోగ్యం సంభవిస్తోంది. దాని ఫలితమే తరచూ సంభవించే ప్రకృతి ఉపద్రవాలు.

మానవుడి మనోమయకోశంలో దోషాల కారణంగా మానసిక సమస్యలు ఏర్పడతాయి. భూమాతకు అంతే. ఇది మరచిన మానవుడు ఈ రోజు రకరకాల చర్యలతో భూవాతావరణాన్ని పాడు చేస్తున్నాడు. అనగా భూమాత ప్రాణమయకోశాన్ని కలుషితం చేస్తున్నాడు. హింస, క్రూర ఆలోచనల ద్వారా మనోమయ కోశాన్ని పాడు చేస్తున్నాడు. వాటి కారణం చేతనే మానవుడు ప్రకృతి విలయాలకు అతలాకుతలమవుతున్నాడు .......................

భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది. మనం భూమాత గర్భంలో ఉన్నాం. భూమికి ఏం జరిగినా, అది నేరుగా మన మీదే ప్రభావం చూపిస్తుంది. కనుక మనం సుఖంగా ఉండాలన్న, మన భూతల్లి సుఖంగా ఉండాలన్న భూమాతపట్ల మానవ దృక్పధంలో మార్పు రావాలి. భూమిలో ఉన్న అమ్మను గుర్తించాలి, ఆవిడకు హాని చేసే చర్యలను మానుకోవాలి. ప్రకృతిని పరిరక్షించాలి. సర్వమానవాళి అమ్మ ఆరోగ్యాన్ని రక్షించుకునే విధంగా నడుచుకోవాలి. అమ్మ ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం.

Sunday 26 April 2015

హిందూ ధర్మం - 156 (సామవేదం)

3. సామవేదం - గీతేషు సామాఖ్యా - గానమే సామం అని జైమిని మహర్షి నిర్వచనం. ఋక్కుల యొక్క గానమే సామం. మానవుడు ఏ జ్ఞానం పొంది, ఎటువంటి కర్మలు ఆచరిస్తే జీవాత్మ జననమరణ చక్రం నుంచి (జన్మల పరంపర నుంచి) విడుదలవుతుందో అటువంటి అంశాల గురించి సామవేదం ప్రధానంగా చెప్తుంది. భగవంతుని యొక్క స్తుతి గురించి, ఉపాసనా పద్ధతుల గురించి చెప్తుంది. భగవంతుని యొక్క అనంతమైన శక్తులే వేర్వేరు రూపాల ద్వారా వ్యక్తమవుతున్నాయి. వాటిని ఉపాసించడం వలన మానవుడికి ఆధ్యాత్మిక ఉన్నతికి కలుగుతుంది. సామవేద మంత్రాలు అత్యంత ఉత్కృష్టమైనవి, వాటిని వినడం చేత మానిషి భావావేశానికి లోనవుతాడు. సామవేదమంత్రాలు మానవుడి మనసును, ఆత్మను ప్రశాంతమైన, నిశ్చల స్థితికి తీసుకెళ్ళగల శక్తి కలిగి ఉన్నాయి. మానవుడు మానసిక, ఆధ్యాత్మిక స్థాయిలో శక్తులను సంపాదించేందుకు, అతని అభివృద్ధికి ఇవి తోడ్పడతాయి. వేదల పరంగా సామవేదం 3 వది, మంత్రాల పరంగా చిన్నదే అయినా, వేదాలపై పూర్తి అవగాహన రావలంటే సామవేదాన్ని అర్దం చేసుకోవాలని బృహద్దేవత చెప్తోంది. ఇందులో 95% మంత్రాలు ఋగ్వేదం నుంచి గ్రహించబడినవే. సామగానం దేవతలను తృప్తి పరుస్తుంది. సర్వజీవులయందు ఐక్యతను పెంచి, ప్రపంచశాంతికి దోహదం చేస్తుంది. సామవేద మంత్రపఠనం శుద్ధిని ఇస్తుంది. అణువులు, పరమాణువుల గురించి, వాటిలో ఉండే శక్తి గురించి, అన్నిటియందు పరమాత్మ శక్తి ఏ విధంగా వ్యాప్తమై ఉందో సామవేదం 222 మంత్రం చెప్తోంది. వ్యవసాయం, ఔషధం, ఖగోళం, గణితశాస్త్రల వివరణ సామవేదం, విషములు వాని లక్షణాలు, వాటి విరుగుడు గూర్చిన శాస్త్రము 221 మత్రం వెళ్ళడిస్తోంది. ముఖ్యంగా బీజగణితం గురించి చెప్పబడింది.

'న సమా యజ్ఞోభవతి' - సామవేదం లేనిదే యజ్ఞమే లేదు అని చెప్పబడింది. కృష్ణుడు కూడా గీతలో 'వేదానం సామవేదోస్మి' - నేను వేదాల్లో సామవేదాన్ని అన్నాడు. ఇతర మూడు వేదాలు కూడా సామవేదాన్ని ప్రశంసించడం, సామవేదం యొక్క గొప్పతనాన్ని తెలియపరుస్తోంది.

పతంజలి మహర్షి మాహాభాష్యం రాసే సమయానికి సామవేదానికి 1000 శాఖలు ఉండేవి. కానీ ప్రస్తుతం 3 శాఖలు మాత్రమే మిగిలాయి. వాటిలో కౌధుమశాఖ గుజరాత్‌లో, రాణాయణీ శాక మహరాష్ట్రలో, రామేశ్వరంలో, జైమిని శాఖ కర్ణాటకలో ప్రచారంలో ఉంది. కౌధుమ సంహిత పూర్వార్చికము, ఉత్తారార్చికము అని రెండు భాగాలు. ఈ రెండు భాగములు కలిపి 1824 మంత్రాలున్నాయి.

ప్రతి శాఖకు ఒక బ్రాహ్మణము, ఒక ఆరణ్యకము, కనీసం ఒక ఉపనిషత్తు ఉంటాయి. కానీ ప్రస్తుతం సామవేదానికి సంబంధించి మహాతాండ్య బ్రాహ్మణం ఒక్కటే లభ్యమవుతోంది. జైమినీ బ్రాహ్మణము దొరికిన, అది పూర్తిగా లభ్యమవ్వటంలేదు. ఆరణ్యకలలో తలవకార ఆరణ్యకము, ఛాందోగ్యారణ్యకము లభ్యమవుతున్నాయి. తలవకార ఆరణ్యకము మిక్కిలి ప్రసిద్ధము. కేనోపనిషత్తు దీని అంతర్భాగము. ఈ వేదానికి సంబంధించి ఛాందోగ్యోపనిషద్, కేనోపనిషద్ లభిస్తున్నాయి.

యజ్ఞసమయంలో సామవేద మంత్రోఛ్ఛారణ చేసే సామవేద పండితుడిని 'ఉద్గాత' అంటారు.

To be continued ............................

Saturday 25 April 2015

స్వామి నిఖిలానంద సరస్వతీ సూక్తి

ముక్తిని పొందటానికి ధ్యానమే చివరిమెట్టు.
ధ్యానం చేయడానికి జ్ఞానం ఉండాలి
జ్ఞానం వైరాగ్యంతోనే కలుగుతుంది
వైరాగ్యం కలగాలంటే కర్మయోగంతో ప్రయాణం ప్రారంభించాలి
ముక్తి మార్గం ధ్యానంతో మొదలవ్వదు.

- స్వామి నిఖిలానంద సరస్వతీ


Friday 24 April 2015

24 ఏప్రియల్ శ్రీ సత్యసాయి బాబా వర్ధంతి

24 ఏప్రియల్ శ్రీ సత్యసాయి బాబా వర్ధంతి 
ఆంధ్రప్రదేశ్ లో అనంతపురం జిల్లా పుట్టపర్తిలో 24 నవంబరు 1926 లో ఈశ్వరమ్మ, పెద్దవెంకమరాజులకు జన్మించారు సత్యనారాయణరాజు (సత్య సాయి బాబా). 20 వ శతాబ్దపు ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురువు, గొప్ప మానవతావాది ఈయన. 24 ఏప్రియల్ 2011 న నిర్యాణం చెందారు.
"మీ హృదయాలలో ప్రేమ అనే దీపం వెలిగించి దానిని అనుదినం ప్రజ్వలింపజేయడానికే నేను వచ్చాను" అని తన సందేశాన్ని ప్రపంచానికి పంచారు సత్యసాయి. Love all, Serve all (అందరిని ప్రేమించండి, అందరికి సేవ చేయండి) అన్నది సత్యసాయి వారి సందేశం. 
ప్రపంచవ్యాప్తంగా 130 దేశాల్లో 1200 సత్యసాయి కేంద్రాలను సత్యసాయి సంస్థ వారు స్థాపించారు. అనేక సేవా కార్యక్రమాలు చేశారు. సత్యసాయి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని స్థాపించి, అత్యంత ఖరీదైన వైద్యాన్ని ఏ విధమైన ఖర్చులు లేకుండా ఉచితంగా వైద్యసేవలు, ఆపరేషన్లు చేస్తున్నారు.
166 దేశాల్లో అనేక విద్యాలయాలు, ఆసుపత్రులు, ఇతర సేవాసంస్థలను స్థాపించారు. పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి విశ్వవిదాలయం, విమానాశ్రయము కట్టించారు. పుట్టపర్తిలో ఉన్న విశ్వవిద్యాలయం స్వయం ప్రతిపత్తితో కూడినది. ప్రతిభ ఆధారంగా మాత్రమే అందులోకి ప్రవేశం ఉంటుంది. అత్యంత నాణ్యతా ప్రమాణాలకు ఆ విశ్వవిద్యాలయం పెట్టింది పేరు. ఈయన విద్యాసంస్థల్లో చదువుకున్నవారు ప్రపంచంలో అత్యంత గొప్ప కంపెనీల్లో మంచి స్థానాల్లో ఉన్నారు. మంచి విలువలు కలిగి, నిజాయతీగా జీవిస్తున్నారు, తల్లిదండ్రులను ప్రేమగా చూసుకుంటున్నారు. మంచి ప్రతిభను కనబరుస్తున్నారు. కులమత ప్రాంతాలకు అతీతంగా అందరికి వేదవిద్యను అందించి, కులవ్యవస్థ నిర్మూలనకు తనవంతు కృషి చేశారు.
అనంతపురం, మహబూబ్ నగర్ జిల్లాలకు, చెన్నై నగరానికి త్రాగు నీరు అందించడానికి లక్షల రూపాయల ప్రాజెక్టులు చేపట్టి విజయవంతం చేశారు. ఆ జిల్లాలో ఈ రోజు జనం దాహం తీరుతోదంటే అందుకు కారణం సత్యసాయిబాబావారి సేవా కార్యక్రమాలు తప్ప వేరొకటి కావు. ప్రభుత్వాలు చేయలేని పనిని నిస్వార్ధంగా చేశారు సత్యసాయిబాబా. సత్యసాయి బాబా గారు కనుక ఇంకొనెళ్ళు బ్రతికి ఉంటే, మహబూబ్‌నగర్ జలకళతో కళకళలాడేది.
ఎక్కడైన విదేశాల్లో స్థిరపడిన భారతీయులను చూసి ఉంటాం, కానీ పుట్టపర్తిలో మాత్రం విదేశీయులు వచ్చి స్థిర నివాసం ఏర్పర్చుకున్నారు. పూర్తి హిందూ సంప్రదాయం దుస్తులు ధరించి, ముఖాన బొట్టు పెట్టుకుని కనిపిస్తారు. హిందూ సంస్కృతిని అవలంబిస్తున్నారు. 
ఈయన మీద అనేక ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే బిల్ ఐట్కిన్ అనే సాయి భక్తుడు, ధార్మిక విశ్లేషకుడు, యాత్రికుడు,"Sri Sathya Sai Baba: A life" అనే పుస్తక రచయిత చెప్పిన ప్రకారం బాబా మీద అపనిందలు అధికంగా బాధ్యతా రహితమైనవి, దురుద్దేశ్య పూర్వకమైనవి, పరిశీలనకు నిలవనివి. కాకపోతే బి.బి.సి. వంటి ఛానళ్ళు ఈ విషయంపై దృష్టి కేంద్రీకరించడానికి కారణం 'చర్చి' వ్యవస్థకు పోటీ నిలవ గలిగే ఉద్యమాల పట్ల వారికున్న అనాదరణా భావమేట.  ఎందుకంటే బిబిసి పోప్, క్రైస్తవ ఆదేశాలకు, ప్రయోజనాలకు లోబడి పనిచేస్తుంది. 166 దేశాల్లో ప్రజలు ప్రేమతో సత్యసాయిబాబావారిని అనుసరించడం వల్ల ఆయా దేశాల్లో క్రైస్తవం దెబ్బతింటుందని, ఈయన పోప్‌ను కూడా ఓడించి ప్రపంచాన్ని శాసిస్తారన్న భయంతో చర్చి ప్రోద్బలంతో అన్యమతాలపై ద్వేషం నింపుకున్న బి.బి.సి బాబాపై బురదచల్లే కార్యక్రమాలు చేపట్టింది. దాన్ని భారతీయ కుహనా లౌకిక మీడియా అందిపుచ్చుకుంది. కానీ బాబాపై ఆరోపణలను ఋజువు చేయలేకపోయాయి.
సత్యసాయిబాబా గారి సనాతన హిందూ ధర్మ వ్యాప్తికి చేసిన సేవ ఎనలేనిది. హిందూ ధర్మాన్ని, సంప్రదాయాలను ప్రపంచం వ్యాప్తంగా అనేకమందికి పరిచయం చేశారు. అందుకు ఉదాహరణయే ఈ వీడీయో. చూడండి, విదేశీయులు పుట్టపర్తిలో సత్యసాయిబాబా గారి సమాధి సమక్షంలో వేదాన్ని స్వరంతో ఎంత చక్కగా చదువుతున్నారో. అద్భుతం, అత్యధ్బుతం ఈ వీడియో. అందరూ తప్పక వీక్షించవలసినది.

Originally Posted: 23 April 2013
1st Edit: 23 April 2014
2nd Edit: 23 April 2015

సత్యసాయి బాబా సూక్తి

ఈ రోజు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారి వర్ధంతి

నేను దేవుడిని. నీవు కూడా దేవుడివే. తేడా ఏమిటంటే ఈ సంగతి నాకు తెలుసు. నీకు అసలు తెలియదు - శ్రీ సత్యసాయి బాబా



Thursday 23 April 2015

ఏప్రియల్ 24, 2015, శుక్రవారం, శ్రీ రామానుజ జయంతి

వైశాఖ శుద్ధ షష్టి నాడు క్రీస్తు శకం 1071 సంవత్సరంలో దక్షిణ భారతదేశంలో జన్మించిన గొప్ప తత్వవేత్త భగవద్రామానుజులు. ఆదిశేషుని అంశతో భువిపై జన్మించారు రామానుజులు.  రామానుజాచార్యుడు త్రిమతాచార్యుల లో ఒకరు. కర్తవ్యదీక్షలో ప్రదర్శించవలసిన ధైర్యానికి, దేవుని పై చూపవలసిన అనన్య సామాన్యమైన నమ్మకానికీ, సాటిలేని భక్తికీ, రామానుజాచార్యుని జీవితం ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ప్రబలంగా కొనసాగుతున్న, బౌధ్ధ, జైన, శైవ, వైష్ణవ సాంప్రదాయాలన్నీ అనాదిగా వస్తున్న వైదిక మతాన్ని అనుసరించి వచ్చినవేననీ, ఈ మతాలు దేవుడిని కొలవటానికి వచ్చిన వేర్వేరు మార్గాలే కానీ, వైదిక మతానికి బదులుగా పాటించవలసినవి కాదని నిరూపించి లోకానికి చాటారు. 16 ఏళ్ళ వయసుకే సమస్త శాస్త్రాలను కంఠస్థం చేసారు.

విశిష్టాద్వైత మతాన్ని, శ్రీ వైష్ణవ సంప్రదాయాన్నిస్థాపించారు. జీవాత్మ పరమాత్మ నుంచి వేరు కానప్పటికి ఇద్దరికి కొంత వ్యత్యాసం ఉన్నది అంటూ చెప్తుంది విశిష్టాద్వైతం. కర్మసిద్ధాంతం, బ్రహ్మసూత్రాలు, భగవద్గీతలను ప్రస్థానత్రయం అంటారు. వీటికి భాష్యం రాశారు. అట్లాగే అనేకానేక ఇతర గ్రంధాలను రచించారు.

తన జీవితం ద్వారా ఈ ఆచార్యుడు మానవాళికి ఇచ్చిన సందేశాలు ఇవి:

1. ప్రస్తుతం సాంప్రదాయకంగా కొనసాగుతున్న ఆచార వ్యవహారాలు ఛాందసంగా మారి సామాజిక పురోగతికి అడ్డురాక మునుపే వాటిని గుర్తించి సమాజ శ్రేయస్సుకై వాటిని మానటమో, మార్చటమో చేయటం బ్రాహ్మణుని లేదా ఆచార్యుని ప్రధమ కర్తవ్యం.

2. దేవుడిని పూజించటం, మోక్షాన్ని సాధించటం, మానవుడిగా జన్మించిన ప్రతి ఒక్కరి హక్కు. ఆ హక్కును ధిక్కరించే అధికారం ఎవ్వరికీ లేదు. దేవుని దృష్టిలో అందరూ సమానమే. కుల మత తారతమ్యాలను పరిశీలించి అర్థం చేసుకోవటం మహత్వం. వైషమ్యాలను పెంచుకోవటం మూర్ఖత్వం.

3. మునుపు గురువులు చెప్పినదంతా నిజమేనని గుడ్డిగా నమ్మవలసిన అవసరం లేదు. వారు చెప్పినదాన్ని తర్కానికి గురిచేసి అది ఒప్పో, తప్పో నిర్ణయించుకోవటం పాపం కాదు. ఈ విషయంలో అధైర్యపడవలసిన పనిలేదు.

4. ఒక పనివల్ల పదిమందికి మేలు జరుగుతున్నప్పుడు, తమకు కీడు జరిగినా, పదిమందికి జరిగే మేలుకై, తమ కీడును లెక్కచేయవలసిన అవసరం లేదు. సమాజ శ్రేయస్సు ముఖ్యం కానీ వ్యక్తిగత శ్రేయస్సు కాదు.

తిరుమల సప్తగిరులు సాక్షాత్తు ఆదిశేషుడేనని తెలిసిన రామానుజులు తన పాదాలను కొండపై మోపడానికి ఇష్టపడలేదు. శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం మోకాళ్ళపై కొండెక్కి స్వామిని కటాక్షం చేసుకున్నారు. తిరుమల ఆలయంలో పూజా విధానం కొరుక చక్కని వ్యవస్థను ఏర్పరించింది, తిరుమల ఉన్న దైవం విష్ణువేనని చాటి చెప్పింది భగవద్రామానుజులే.

ఓం శ్రీమతే శ్రీ రామానుజాయ  

ఏప్రియల్  24, 2015, శుక్రవారం, శ్రీ రామానుజ జయంతి

Originally posted: 03 May 2014
1st Edit: 23 April 2015

శంకరాచార్యుల సూక్తి

వేదవిదుడూ, పాపరహితుడూ, కామరహితుడూ, బ్రహ్మనిష్ఠుడూ, పరమశాంతుడూ, కరుణాసముద్రుడూ, ఆశ్రిత రక్షకుడూ, భేదరహితుడు అయినవాడే సద్గురువు - శ్రీ ఆదిశంకరాచార్యులు
తస్మై శ్రీ గురువే నమః


Wednesday 22 April 2015

ఏప్రియల్ 23, 2015, గురువారం, జగద్గురువులు శ్రీ శంకరాచర్యులవారి జయంతి

హిందూ/భారతీయ ధర్మం మీద దాడి జరిగిన ప్రతిసారీ, ధర్మం తన వైభవాన్ని మర్చిపోయిన ప్రతిసారీ పరమాత్ముడు అనేకమంది మహాపురుషులను ప్రేరేపణ చేసి, కొన్ని సందర్భాల్లో స్వయంగా తానే అవతరించి, ధర్మాన్ని కాపాడుతూ వస్తున్నాడు.

సనాతన ధర్మాన్ని ఉద్ధరించడానికి సరిగ్గా 2524 సంవత్సరాల క్రితం, 509 BCE లో వైశాఖ శుద్ధ పంచమి రోజున దక్షిణ భారతదేశంలోని నేటి కేరళ రాష్ట్రంలో కాలిడి గ్రామంలో శివ గురువు, ఆర్యాంబ దంపతులకు బిడ్డగా, వేద ప్రమాణాన్ని నిలబెట్టడానికి, ధర్మ పునః ప్రతిష్ట చేయడానికి పరమశివుడి అంశతో శ్రీ జగద్గురు ఆది శంకరాచార్యలు అవతరించారు.  

చిన్న వయసులోనే వేదవేదాంతలను, తత్వశాస్త్రాన్ని (Philosophy) , Metaphysics, Theology మొదలైన ఇతర శాస్త్రాలనుకంఠస్థం చేసారు బాలశంకరులు. 8 ఏళ్ళ వయసులోనే సన్యాసం స్వీకరించారు. ఆ సమయంలో భారతదేశంలో బౌద్ధ, జైన మతాలు, నాస్తిక వాదం విపరీతంగా ప్రబలాయి. ప్రజలంతా హిందూ ధర్మాన్ని వదిలి, నాస్తికం, చార్వాక మతాల వైపు నడవడం ప్రారంభించారు. దాదాపు 90% ప్రజలు సనాతన ధర్మాన్ని విడిచిపెట్టేసారు.


ధర్మోద్ధరణకు శంకరులు గొప్ప సాహసం చేసారు. ఇతర మతస్థులతో శాస్త్ర చర్చలు చేసి, తాను చర్చలో ఓడిపోతే హైందవ ధర్మాన్ని విడిచిపెడతానని, ఒకవేళ అవతలివారు ఓడిపోతే వారు సనాతన హిందూ ధర్మాన్ని స్వీకరించాలని చెప్పి, తన వాదన ప్రతిభతో బౌద్ధ, జైన మతాలను అనుసరించే రాజుల వద్దకు వెళ్ళి, శాస్త్రచర్చలు నిర్వహించి, తాను ఒక్కడే జైన, బౌద్ధ మతాలకు సంబంధించిన అనేక మంది పండితులతో శాస్త్రీయంగా వాదించి, వారిని ఓడించి, వైదిక ధర్మంలోకి వారిని తీసుకువచ్చారు. ఆ చర్చల సమయంలో వచ్చిందే అద్వైత సిద్ధాంతం. యావత్ భారతదేశం పాదచారిగా పర్యటించి, హిందూ ధర్మాన్ని ప్రచారం చేశారు. శంకరాచార్యులు కనుక అవతరించి ఉండకపోతే హిందు అనేవాడు గాని, హిందూ ధర్మం కానీ మిగిలి ఉండేవికావు.

ఈయన కేవలం 32 సంవత్సరాలు మాత్రమే జీవించి  477 BCE లో మహనిర్యాణం చెందారు. తన 32 ఏళ్ళ జీవితకాలంలో అనేక రచనలు చేశారు. జీవుడు, దేవుడు, ఇద్దరూ ఒక్కటే, ఇద్దరికి బేధంలేదు అంటూ అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు. ప్రస్థాన త్రయంగా చెప్పబడే భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, కర్మసిద్ధాంతాలకు బాష్యం రాశారు. అనేక స్తోత్రాలు అందించారు. శైవ, వైష్ణవ, శాక్తేయ, గాణాపత్య మొదలైన 6 మతాలను స్థాపించారు. కలియుగంలో ప్రజల్లో శౌచం తగ్గిపోయిందని, దేవాలయాల్లో ఉన్న దేవాత విగ్రహాల శక్తిని ఇటువంటి మానవసమూహం తట్టుకోలేదని, దేవాతశక్తిని శ్రీ చక్రయంత్రాల్లోకి ప్రవేశపెట్టారు.

ఆత్మతత్త్వాన్ని తెలుసుకొన్నవాడు, నేను జడత్వాన్ని కాను, చైతన్యాన్ని అని నిశ్చితమైన జ్ఞానం కలవాడు, అతడు చండాలుడైనా, బ్రాహ్మణుడైనా, అతనే నాకు గురువు. ఇది తధ్యము అంటూ శంకరాచార్యుల వారు ఎలుగెత్తిచాటారు. అలా వచ్చిందే మనీషా పంచకం. జ్ఞాన్మార్గాన్ని పునరుద్ధరించిన శంకరులు, కేవలం జ్ఞానభోధకే పరిమితం కాక, అనేకస్తోత్రాలు అందించారు.

వైదిక ధర్మాన్ని ఎప్పటికి ప్రచారం చేసేవిధంగా భారతదేశం నాలుగు దిక్కుల నాలుగు వేదాలకు ప్రతీకగా నాలుగు మఠాలను దక్షిణ భారతదేశం శృంగేరీలో శారదపీఠం, ఉత్తరమున ఉత్తరాఖండ్‌లో జ్యోతిర్‌మఠం, తూర్పున పురీలో గోవర్ధన పీఠం, పశ్చిమాన ద్వారకలో ద్వారకాపీఠం స్థాపించారు. ఎప్పుడొ 2492 సంవత్సరాల క్రితం ఈయన ఏర్పాటు చేసిన పరంపర ఈనాటికి అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది. అదేకాకుండా సన్యాస ఆశ్రమాన్ని సంస్కరించి పది సంప్రదాయాలను ఏర్పరిచారు.

భారతదేశంలో అందరిని తన వాదన పటిమతో అందరిని ఓడించిం కాశ్మీర్‌లో ఉన్న సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించారు. వారి తర్వాత అంతటి మేధావి, సూక్ష్మదర్శి ఇంకొకరు రాలేదు, అందువల్ల సర్వజ్ఞపీఠాన్ని శంకరాచార్యుల తర్వాత ఈ 2000 సంవత్సరాలలో ఎవరు అధిరోహించలేదు. కానీ ఇప్పుడా సర్వజ్ఞపీఠం, కశ్మీర్ సరస్వతీ దేవాలాయం ముష్కరులు, దేశద్రోహుల దాడిలో శిధిలమైపోయింది. ఇక్కడొక విషయాన్ని గమనించాలి. శంకరులు సర్వజ్ఞపీఠాన్ని అధిరోహిస్తారనగా, వారితో వాదించడానికి ఒక 8 ఏళ్ళ పిల్లవాడు వచ్చాడు. ఉద్దండులనే ఓడించాను, నీతో వాదించేదేంటీ అని శంకరాచార్యులు అనలేదు. ఆ పసిపిల్లవాడితో కూడా అమోఘమైన శాస్త్రచర్చ జరిపారు. ఇది శంకరుల యొక్క వ్యక్తిత్వాన్ని సూచిస్తోంది. అంత గొప్పవారైనా, కాస్తంత అహాకారం కూడా శంకరాచార్యులవారికి లేదు. ఇప్పటికే వారు అందించ సాహిత్యాన్నే భారతదేశమంతటా అనుసరిస్తున్నారు. అటువంటి శంకరాచార్యులవారికి ప్రపంచమంతా ఋణపడి ఉంది. వారి జయంతి నాడు వారిని స్మరించి ఒక్క నమస్కారం చేయండి.

ఏప్రియల్ 22, 2015, గురువారం, వైశాఖ శుద్ధ పంచమి, జగద్గురువులు శ్రీ శంకరాచర్యులవారి జయంతి.

జయ జయ శంకర! హర హర శంకర!!    

Originally Posted: 2013 Sankara Jayanti
1st Edit: 02 May 2014
2nd Edit: 22 April 2015

Tuesday 21 April 2015

భూతాపం - భూతల్లికి జ్వరం - ఆధునిక మానవుడి భస్మాసుర హస్తం

కన్నతల్లికి బ్రతికి ఉండగానే ఆమెకు చితి పేర్చి నిప్పు అంటించే పిల్లలని ఏమనాలి?
అమ్మ లేకపోతే తాము బ్రతికి బట్టకట్టలేమని, కూడు, గూడు ఉండదని గ్రహించకుండా, అన్నంపెట్టి గౌరవంగా, ప్రేమతో చూసుకోవలసిన అమ్మ నెత్తిన నిప్పు పెట్టే మూర్ఖపు పిల్లలను ఏం చేయాలి? వారి అజ్ఞానాన్ని ఎలా దూరం చేయాలి?
కన్నతల్లిని చంపుకునే కసాయి కొడుకులకు ఏం శిక్ష వేయాలి?
-------------------------------------------------------సముద్రవసనే దేవి పర్వతస్థన మండలే
విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే

సముద్రములను వస్త్రంగా ధరించి, కొండలు, పర్వతాలు, అడవులను శరీరభాగాలుగా కలిగిన విష్ణుమూర్తి భార్య అయిన ఓ భూదేవి, నీ మీద నా కాలు మోపుతున్నందుకు నన్ను క్షమించమ్మా అని అర్ధం. ఇది ప్రతి ఒక్కరు ఉదయం నిద్రలేవగానే మంచం మీది నుండి కాలు కింద పెట్టకముందు ఈ శ్లోకం చదివి, మంచం దిగి, భూమాతను చేతులతో తాకి, నమస్కరించాలి అని శాస్త్రం చెప్తోంది.  

మనము భూదేవిని అమ్మగా భావిస్తాం. శ్రీ విష్ణుభగవానుడి దశవతారాల్లో ఒకటైన వరహ అవతారం భూదేవి రక్షణకు వచ్చింది. ఆయన భార్యగా భూదేవిని ఆరాధిస్తాం.

కేవలం కాలు మోపినందుకే క్షమాపణ చెప్పమని మన ధర్మం చెప్పింది. కాని మనం నమస్కారం చెయ్యట్లేదు. అక్కడితో ఆగక మూర్ఖత్వంతో ఆమె నెత్తిన నిప్పుల కుంపటి పెట్టాం. అదే global warming, అంటే భూతాపం. ఇది భూమాతకు వచ్చిన జ్వరం. ఇప్పుడామే మంచం మీద ఉంది, ఆమెకు కీడు జరిగితే మొత్తం జీవరాశి మరణిస్తుంది.

--------------------------------------------------------------------------------

మానవుడు చేసే కాలుష్యం కారణంగా మన భూమి రోజురోజుకు వేడెక్కిపోతోంది. మొత్తం జీవరాశి ఉనికే ప్రశార్ధకంగా మారే పరిస్థితికి ఏర్పడుతోంది. 2100వ సంవత్సరానికి ఈ భూమి మీద జీవం ఉంటుందా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. తలా పాపం తిలా పిడికేడు అన్నట్టు ఈ భూతాపానికి అందరం కారకులమే.

అసలు ఈ భూతాపం (global warming) అంటే ఏంటి? భూమి ఎందుకు వేడెక్కుతోంది? దాని పర్యవసానాలు ఏంటి?

భూతాపం (global warming) అంటే భూవాతావరణం (earth's atmosphere) వేడిగా మారిపొవడం. మనం చలికాలంలో చలి నుండి తప్పించుకోవాలని, వెచ్చదనం కోసమని దుప్పటి / లేదా రగ్గు (బొంత అని కూడా అంటారు) కప్పుకుంటాం. 1 లేదా 2 కప్పుకుంటే వెచ్చగా ఉంటుంది. 3 లేదా 4 కప్పుకుంటెనో వెచ్చదనం ఎక్కువ అవుతుంది. 6 లేక 7 కప్పుకుంటే భరించలేము, చెమటలు పడతాయి. అదే 10 రగ్గులు కప్పుకుంటేనో ? ....... ఇంకేమైనా ఉందా?

భూవాతావరణం కూడా అంతే. మన వాతావరణంలో water vapourcarbon dioxidemethanenitrous oxide, ozone ఉంటాయి. వీటిని green house gases అంటారు. సూర్యుడి నుండి భూమికి వచ్చే సూర్యకిరణాల్లో వేడిని 50% భూమి గ్రహిస్తుంది (absorbtion). మిగితా వేడిని తిరిగి అంతరిక్షం (space) లోకి పంపుతుంది, అంటే reflect చేస్తుంది. వాతావరణంలో ఉన్న greenhouse వాయువులు (gases) ఈ వేడిని అంతరిక్షం (space) లోనికి వెళ్ళకుండా అడ్డుకుని, వాతావరణాన్ని వేడిగా ఉంచుతాయి, అంటే ఉష్ణొగ్రతను (temperature) పెంచుతాయి. Green house వాయువుల సహకారంతో భూమి మీద జీవరాశి (life) ఎంత ఉష్ణొగ్రత ఉంటే బ్రతుకగలవో,అంతే ఉష్ణొగ్రత  మాత్రమే భూమి మీద ఉండేలా చేస్తుంది ప్రకృతి. దీనినే green house effect అంటారు. మంచుయుగం (ice age) లో Green house వాయువులు అసలే లేవు. అందువల్లే అప్పుడు చాలా చల్లగా ఉండింది. ఇప్పుడు ఇవి ఉండడం వల్లే భూమి సగటుఉష్ణొగ్రత (average temperature) 14°C (57 °F)గా ఉంది. ఇవి కనుక లేకపొయి ఉంటే -19°C గా ఉండేది. అప్పుడు జీవం (life) ఉండేది కాదు. ఇవి ప్రకృతిలో సహజంగానే ఉంటాయి. ఎంత ఉంటే మన భూమికి మంచిదో అంతమాత్రమే ఉండేలా చేస్తుంది ప్రకృతి. కాని ఇవాళ అవి మనిషి దురాశ వల్ల, అతను చేసే కాలుష్యం (pollution) కారణంగా, Green house వాయువులు ఉండవలసిన సాంద్రత (density/concentration) కన్నాఎక్కువ అవ్వడం చేత అవి భూమి ఉష్ణోగ్రతను వీపరీతంగా పెంచేస్తున్నాయి. అందువల్ల భూగోళం వేడేక్కుతోంది. వాతావరణం (climate) లో ఎన్నడు లేని మార్పులు వస్తున్నాయి. అదే భూతాపం(global warming). ఇలా పెరిగితే 2100 సంవత్సరం కల్లా జీవం అంతరించిపోతుంది. మనిషి భూమి మీద నుంచి మాయమైపోతాడు.

అవి ఎంత శాతం పెరిగాయి? వాటికి కారణాలు ఏమిటి?

1750 నుండి 1850 మధ్య యూరపుదేశాల్లో పారిశ్రామిక విప్లవం (industrial revolution) ప్రారంభమైంది. అది జరిగిన తరువాత గాలిలో carbon-di-oxide 30%, nitrous oxide 15%, methane విషవాయువు 100% పెరిగాయి.

ఈ  1995లో 6.5 billion metric tonnes కు చేరుకున్నాయి. 2000 సంవత్సరం నాటికి 7.2 billion metric tonnes కు చేరుకున్నాయి. గత 15000 సంవత్సరాలుగా భూమి ఉష్ణోగ్రత 3.5°C  మాత్రమే పెరుగగా, గత 76-80 సంవత్సరాలలో ఒక్కసారి 15°C పెరిగింది. వచ్చే 45 సంవత్సరాల్లో ఇది ఇప్పుడు ఉన్నదానికంటే 7°C  లేక 8°C  పెరగగలదని శాస్త్రవేత్తల అంచనా.

1860 తో పోలిస్తే నేడు వాతావరణంలో carbon-di-oxide 30% అధికంగా ఉంది. రోజురోజుకు పెరుగుతున్న ఈ  greenhouse వాయువులు సూర్యుని నుండి వచ్చే రేడియేషన్ ను భూమివాతావరణంలోనికి ప్రవేశించేలా చేస్తూ, సూర్యుని వేడిని మరింతగా ఒడిసిపట్టి భూతాపానికి (global warming) కారణమవుతున్నాయి. గత 600సంవత్సరాలతో పోలిస్తే ఈ 100 సంవత్సరాలలో భూగోళం వేడెక్కడం ప్రారంభమైంది. ముఖ్యం గత 20 సంవత్సరాలలో ఇది మరీ ఎక్కువైంది.

ఇంకా వివరంగా చెప్పాలి అంటే పారిశ్రామికీకరణ (1750-1850) జరగక ముందు గాలిలో 280 parts per million by volume (ppmv) గా ఉన్నకార్బన్-డై-ఆక్సైడ్, 1900 నాటికి 299 ppmv కి, 2003  నాటికి 276 ppmv కి, ఈ నాటికి 380 ppmv కి చేరుకుంది. 2000 సంవత్సరం నుండి సంవత్సరానికి 1.9 ppm (rate of increase) చొప్పున పెరుగుతోంది. 21 వ శతాబ్దం చివరకు ఇది 490 ppmv నుండి 1260 ppmv కు పెరుగుతుంది. అంటే పారిశ్రామిక విప్లవం కంటే ముందు ఉన్న దానితో పోలిస్తే 75-350% పెరుగుతుందని శాస్త్రవేత్తల అంచనా.

ఈ రోజు వాతావరణంలో ఉన్న కార్బన్-డై-ఆక్సైడ్ గత 6,50,000 సంవత్సరాల ముందు భూమి పై ఉన్నకార్బన్-డై-ఆక్సైడ్ కేంద్రీకరణతో (concentration) పోలిస్తే  చాలా ఎక్కువైంది. 180 ppmv నుంచి 380 ppmv కు పెరిగింది.

ప్రపంచ ఉష్ణోగ్రతలు 19 వ శతాబ్దం చివరినుండి 0.74°C పెరగగా, గత 50 సంవత్సరాలుగా ప్రతి 10 సంవత్సరాలకు 0.13°C చొప్పున పెరిగాయి. అంటే గత శతాబ్దం (century) తో పోలిస్తే రెండింతలు.

సాధరణంగా ఉష్ణోగ్రతలో 0.1°C మార్పు జరిగితేనే వాతావరణంలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. అటువంటిది 4°C ఉష్ణొగ్రత (earth's temperature)  పెరిగితే అది మహావినాశనానికి దారి తీస్తుంది. మనం కాలుష్యాన్ని ఆపకపోతే 2100 కల్లా అది 4°C పెరుగుతుంది.


భూతాపానికి కారణాలు ఏమిటి?

మొదటి కారణం పరిశ్రమలు (industries), విచ్చిలవిడిగా పారిశ్రామికీకరణ (industrialization). పరిశ్రమలనుండి హానికరమైన కార్బన్ మోనాక్సైడ్ (CO), కార్బన్-డై-ఆక్సైడ్ (CO2), nitrous oxide, methane, hydrofluro carbons, halogenated carbons వంటి వాయువులు వాతావరణంలోనికి వదలడం వలన green house వాయువులు ఇంకా ఇంకా ఉత్పత్తి జరిగి భూతాపానికి కారణమవుతున్నాయి. ముందుచూపు లేని కారణంగా, ప్రభుత్వాలకు లంచాల మీద ఉన్న శ్రద్ధ ప్రకృతివనరుల (natural resources) మీద లేని కారణంగా పరిశ్రమలు వాటి హానికర వ్యర్ధాలను చెరువుల్లోను, నదుల్లోను, సముద్రాల్లోనూ కలుపుతున్నాయి. అవి ఆ నీటి వనరులను కలుషితం చేసి, నీటి కాలుష్యాన్ని పెంచుతున్నాయి. అక్కడ నివసించే జీవజలం ఈ కాలుష్యం వలన మరణించి, మరింత కాలుష్యాన్ని చేస్తున్నాయి. ఇది నాణానికి(coin) ఒక వైపు. మరి రెండవ వైపు ఏమిటి?



ఈ నీటిని త్రాగిన జనం రోగాల బారిన పడుతున్నారు.వారి రోగాలకు వాడే మందుల తయారిలో కూడా అనేకానేక వాయువులు, విషపదార్ధాలు వెలువడతాయి. విషవాయువులు వాయుకాలుష్యాన్ని(air pollution) పెంచి భూతాపానికి కారణమైతాయి. విషపదార్ధాలను భూమిలోనికి పంపుతారు. ఫలితంగా భూగర్భజలాలు కలుషితమై భూమి కూడా కలుషితం అవుతోంది. వాటితో పండిన పంటల నుండి మానవుడు ఆహారం తీసుకోవడం ద్వారా అతని శరీరం కలుషితమై రోగాల బారిన పడుతున్నారు. మళ్ళీ అదే కధ మొదలువుతుంది.

అవి విడుదల చేసే పోగ కారణంగా స్థానికంగా ఉండే జీవరాశిపై తీవ్రప్రభావం చూపుతుంది. చెట్లు, పక్షులు, జంతువులు చనిపోతాయి. పరిశ్రమలు నుండి వెలువడే బూడిద (ash) ప్రజలకు శ్వాస సంబంధిత రోగాలను కలిగిస్తుంది. ప్రజలు అనారోగ్యాల బారిన పడతారు. ఇలా ఒక్క పరిశ్రమలే వాతావరణంపై తీవ్రప్రభావం చూపుతున్నాయి.

పరిశ్రమల కాకుండా మరొక ముఖ్యమైన కారణం శిలాజఇంధనాలను (fossil fuels) మండించడం. Thermal power stations లో బొగ్గును మండించి, కరెంటును ఉత్పత్తి చేస్తారు. ఈ క్రమంలో బొగ్గును మండించినప్పుడు అధికశాతంలో carbon-di-oxide వాతావరణంలోనికి విడుదల అవుతుంది. దానితో పాటు nitrous oxide, methane వంటి green house వాయువులు విడుదలవుతున్నాయి. భూతాపానికి కారణమవుతున్నాయి. వాహనాలు వంటివి కూడా green houseను విడుదలచేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా రోజు రోడ్ల మీదకు వచ్చే వాహనాలు వల్ల భూతాపం ఎక్కువ అవుతోంది.

మనం వాడే refrigeratorలు, A.C.లు, విద్యుత్ ఉపకరణాలు (electronic items), కార్బన్-డై-ఆక్సైడ్ ను, మరికొన్నిహానికారక వాయువులను విడుదల చేస్తున్నాయి. అడవుల నరికివేత (deforestation), చెట్లను నరకడం ఒక కారణం. చెట్లు తమలో carbonను దాచి ఉంచుకుంటాయి. వాటిని నరికి వేసినప్పుడు వాటిలో దాగి ఉన్న carbon వాతావరణంలో కలిసి వేడిని పెంచి భూతాపానికి కారణమవుతోంది. ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా 34 మిల్లియన్ ఎకరాల అడవులను నరికి కాల్చి వేస్తున్నారు. తద్వారా విడుదలైన carbon భూతాపానికి కారణమయ్యే carbonలో 25%.

పెరుగుతున్న జనాభ (population) కూడా ఒక కారణం.మనం వదిలే carbon-di-oxide ను పీల్చుకునే అవకాశం లేకుండా చెట్లు నరికివేస్తున్నాం. అందువల్ల అది కూడా వాతవరణంలో కలిసి భూగోళం వేడెక్కడంలో తొడ్పడుతోంది.

అణువిద్యుత్ కేంద్రాల (nuclear power plants) నుండి విడుదలయ్యే అణువ్యర్ధాలు(nuclear waste), వాటి నుండి ఉత్పత్తి జరిగే అధికవేడి కూడా పుడమితల్లికి నిప్పు పెడుతున్నాయి.

అగ్నిపర్వతాలు (volcanoes) బద్దలైనప్పుడు అక్కడ విడుదలయ్యే వేడి,వాయువులు వంటివి కూడా global warming కి కారణమవుతున్నా, అది ప్రకృతిలో ఎప్పుడొ కొన్ని వందల ఏళ్ళకు ఒక్కసారి జరిగుతుంది. మూర్ఖమానవుడు చేసే దానితో పొల్చినప్పుడు, ఇది చాలా తక్కువ.

కరెంటు వస్తువులను వాడడం, కరెంటును అధికంగా వాడడం చేత వాటి నుండి carbon వెలువడుతుంది.

ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మన చేసే చాలా పనులు భూతాపానికి కారణమవుతున్నాయి.అలా అని ఆయా వస్తువులను వాడకుండా ఉండమని కాదు, పర్యావరణానికి హాని కలిగించని రీతిలో వాటిని తయారు చేయాలి. కాస్త జాగ్రత్తగా, అవసరమైనంత వరకే వాడాలి.

ఇవే కాక భూతాపానికి అతి ముఖ్యమైన కారణాలలో ఒకటి మాంసాహారం తినడమని శాస్త్రవేత్తల బృందం తేల్చింది. జనం మాంసాహారం తినడం కనుక మానేస్తే, జరిగే నష్టాన్ని సగం వరకు తగ్గించవచ్చని చెప్తున్నారు. ఈ విషయం మీద ప్రముఖ ఉద్యమకారుడు, శాస్త్రవేత్త, రాష్ట్రబంధు స్వర్గీయ శ్రీ రాజీవ్ దీక్షిత్ గారి ప్రసంగం ఈ వీడియోలో వినండి.


భూతాపం వల్లే కలిగే అనర్ధాలు ఏమిటి?
(effects of global warming)

భూమి వేడెక్కడం చేత ధృవపు ప్రాంతాల్లో(polar region) ఉన్న మంచు కరిగిపోతోంది. మంచు కరిగి ఆ నీరు సముద్రంలో చేరడం వల్ల సముద్రం మట్టం (sea level) పెరుగుతోంది.

మొత్తం 57,73,000 cubic miles నీరు ice-caps, galciers, మంచుకొండల్లోనూ ఉంది. Glaciers కరిగితే కనుక ప్రపంచంవ్యాప్తంగా 230 అడుగుల (feet) మేర సముద్రమట్టం పెరుగుతుంది. అంటే ప్రపంచవ్యాప్తంగానున్న పెద్ద పెద్ద నగరాలు, దేశాలు, ద్వీపాలు (islands) సముద్ర గర్భంలో కలిసిపోతాయి.

ప్రపంచవ్యాప్తంగా తీరప్రాంతం నుండి 100 కిలోమీటర్ల దూరంవరకు గల ప్రాంతంలో 40% జనాభ (population) నివసిస్తున్నారు. సముద్రమట్టం పెరిగితే వీరంతా దిక్కులేనివారైపోతారు. అతలాకుతలమైపోతారు. ఆహారం దొరకక అలమటిస్తారు.

ఒక్క మీటరు సముద్రమట్టం పెరిగితేనే బంగ్లాదేశ్ లో 25-35 మిల్లియన్ల జనాభ నివాసం, ఆహారం కోల్పోతారాని అంచనా. ఇంకా ఎక్కువ పెరిగితే మాల్దివులు (Maldives), బంగ్లాదేశ్ వంటి అనేక దేశాలు పూర్తిగా కనుమరుగవుతాయి.

 భారత్ తన స్వరూపాన్ని కోల్పోతుంది. Glaciers, Himalayas మీద ఆధారపడిన అనేక నదులు ఎండిపోతాయి. ఫలితంగా ఎప్పుడు చూడనటువంటి భయంకరమైన కరువు సంభవిస్తుంది.

అంటార్టికా (Antarctica) ప్రాంతంలో ఉండే ధృవపు ఎలుగుబంట్ల (polar bears) జాతి ఈ భూమి మీది నుండి పూర్తిగా అంతరించిపోతుంది.

ఇంకా చాలా భయంకరమైన అనర్ధాలు పొంచున్నాయి.

భూతాపం (global warming) వలన కలిగే అనర్ధాలు ఏమిటి?

కరుగుతున్నice caps  ప్రపంచ జీవావరణవ్యవస్థను(ecology) అస్తవ్యస్తం చేస్తాయి. Icebergs లో మంచినీరే ఉంటుంది. ఇవి కరిగి సముద్రంలో కలిసినప్పుడు సముద్రనీటిలో ఉన్నలవణత (salinity) తగ్గిపోతుంది. అంటే నీటిలో ఉప్పు శాతం తగ్గిపోతుంది. ఫలితంగా సముద్రపు నీటి ఉష్ణొగ్రత (temperature) పెరుగుతుంది. అనగా కడలి వేడెక్కుతోంది.

భూఉపరితలంలో 70శాతం సముద్రాలే కాని 95% జీవరాశి కి ఆవాసం. సముద్రాలు కర్బనాన్ని(carbon) ఒడిసిపట్టే అతి పెద్ద రిజర్వాయర్లు. గత 250 సంవత్సరాలుగా మానవులు విడుదల చేసిన carbon-di-oxide లో 3వ వంతును సముద్రాలే గ్రహించాయి. 350 బిల్లియన్ టన్నుల (350 billion tonnes) తమలో దాచుకోని మనకు సాయం చేశాయి. 1960లో అవి మన చర్యలవల్ల  విడుదలైన 2.4 బిల్లియన్ టన్నుల carbon గ్రహించగా, 2010 నాటికి 5 బిల్లియన్ టన్నుల carbon గ్రహించాయి. అటువంటి సాగరం ముప్పులో పడింది.

ప్రాణవాయువును (oxygen) జీవారాశికి అందించడంలో సాగరం కీలక పాత్ర పోషిస్తోంది. మనం పీల్చే ప్రాణవాయువులో 50% సముద్రాల చలువే. భూఉపరితలం (earth's crust/land) పై ఉష్ణొగ్రతలు సముద్రం మీద ఆధరపడి ఉంటాయి. ఇంకా చెప్పాలంటే సముద్రాలే ఉష్ణోగ్రతలను నియంత్రిస్తాయి. సముద్రం వేడెక్కడం వలన ఉష్ణొగ్రత్లలో మార్పు వస్తుంది. ఇప్పటికే బాగా మార్పు వచ్చింది. భవిష్యత్తులో ఇంకా వస్తుందన్నది యదార్ధం.

సముద్రం వేడెక్కడం వలన వాటికి కర్బనాన్ని (carbon) దాచి ఉంచుకొనే శక్తి తగ్గిపోతుంది. ఫలితంగా  వాతావరణంలో ఉన్నcarbon-di-oxide కు తోడుగా వాటిలో దాగి ఉన్న carbon-di-oxide విడుదలవతుంది. అంటే భూతాపం ఇంకా పెరుగుతుంది. వాటిలో ఉన్న జీవరాశి చనిపోతుంది. వాటినుండి విడుదలయ్యే ప్రాణవాయువు తగ్గిపోతుంది.

ప్రపంచజనాభలో 50% అవాసం కొల్పోతారు. 300 కోట్ల మంది జీవనోపాధి కోల్పోతారు.

భూతాపం కారణంగా వచ్చే 100 ఏళ్ళలో సరాసరిన 9-88 సెంటిమీటర్ల మేర సముద్రమట్టాలు పెరుగుతాయి. ఫలితంగా తీరప్రాంతాల ముంపు, మడ అడవులు, చిత్తడినేలలు కనుమరుగవుతాయి. తీరప్రాంతాలు కోతకు గురవుతాయి. ఉప్పునీరు వచ్చి మంచినీటిని, వ్యవసాయాన్ని(agriculture) దెబ్బతీస్తుంది. వ్యవసాయం దెబ్బతింటే కరువు వచ్చి జనం ఆకలి చావులు చస్తారు.

Ice-capsకు, అగ్నిపర్వతాలకు, భూకంపాలకు, సముద్రాలకు చాలా సంబంధం ఉందని శాస్త్రవేత్తలు చెప్పారు. Ice caps కరగడం మొదలైతే కొన్ని వందలవేల ఏళ్ళుగా తమలో బడబాగ్ని(lava) ని దాచి ఉంచుకొన్న అగ్నిపర్వతాల (volcanoes) మీద ప్రభావం చూపిస్తుంది. ఫలితంగా అవి బడబాగ్ని(lava) ని బయటకు కక్కుతాయి, అంటే బద్దలవుతాయి. అలాగే ice-caps కరిపోవడం చేత భూకంపాలు చాలా తరుచుగా సంభవిస్తాయి. ఎప్పుడొ వచ్చే ఉప్పెనలు (tsunamis) ఎప్పుడు పడితే అప్పుడు విరుచుకుపడతాయి. భారత్ లాంటి దేశాల మీద అవి చాలా ప్రభావం చూపిస్తాయి. అమెరికా వంటి దేశాల్లో చాలా తరుచుగా మహాభయంకరమైన hurricanes ఏర్పడి అతలకుతమవుతాయి. ఈ hurricanes ప్రభావం 2004, 2005 సంవత్సరాలలోనే ప్రపంచానికి స్పష్టంగా కనిపించింది. ఇవన్ని గొలుసుకట్టు చర్య (chain reaction) లాగా ఒకటి తరువాత ఒకటి చాలా వేగంగా జరిగిపోతాయి.

అర్కిటిక్ (arctic) ప్రాంతంలో  ఈ వాతావరణ మార్పును (climate change) తట్టుకునే అతి కొద్ది జీవాలు తప్ప మిగితా జీవరాశి అంతా మరణిస్తుంది.

Ice caps, Ice bergs తెల్లటి రంగులో ఉండడం చేత అవి సూర్యకిరణాలను పరావర్తనం (reflection) చెందించి భూమిని చల్లగా ఉంచుతున్నాయి (because of their white color,ice caps reflect sun rays into space,there by keeping earth cool). Ice-caps,glaciers కరిగిపోతే ఇక మిగిలేది సముద్రాలే. అవి dark color లో ఉండడం వలన సూర్యకిరణల నుండి వచ్చే వేడిని మరింతగా గ్రహించి భూగోళాన్ని మరింత వేడిక్కిస్తాయి.

ఒక్క గ్రీన్ ల్యాండ్ లోనే 2,850,000 క్యూబిక్ కిలోమీటర్ల పైగా మంచు ఉందని అంచనా. ఆ మంచుకరిగితే ప్రపంచవ్యాప్తంగా సముద్రాలు 70 మీటర్ల ఎత్తు పెరుగుతాయి. అక్కడ ఉన్న మంచు చాలా వేగంగా కరుగడం మొదలైపోయింది. గత శతాబ్దం లో లో 9°C వరకు ఉష్ణొగ్రత పెరిగింది. కొన్ని వందల వేల సంవత్సరాలకు జరగవలసిన ఈ పరిణామం చాలా తొందరగా జరగడంతో శాస్త్రవేత్తలు ఆందోళనతో పాటు ఆశ్చర్యపడ్డారు. ఇప్పటికే అక్కడ 40% మంచు కరిగిపోయిందని నాసా (NASA) వాళ్ళు తేల్చారు.

వేడెక్కిన సముద్రాల నుండి వేడిగాలులు భూఉపరితలం మీదకు వీస్తాయి. అందువల్ల ఏమి జరుగుతుంది ??? భూగోళం వేడక్కడం వలన కలిగే పర్యవసానాలేమిటి?

వేడెక్కిన సముద్రం నుండి భూఉపరితలం మీదకు వేడిగాలులు / వడగాలులు (heat waves) వీస్తాయి. భూమిపై ఉష్ణొగ్రత పెరుగుతుంది.

పెరిగిన green house gases వలన భూతాపం పెరుగుతుందని చదివాం కదా. ఇది అతివృష్టికి, అనావృష్టికి దారి తీస్తుంది. వర్షాలు బాగా పడే ప్రాంతాల్లో మరింత అధిక వర్షపాతం నమోదవుతుంది. కరువు ప్రాంతాల్లో వానజాడ లేకుండాపోతుంది. పంటలు నాశనమవుతాయి. చాలా ప్రాంతాలు ఎడారిగా మారుతాయి. అధికవర్షపాతం వలన నదులకు వరదలు సంభవిస్తాయి. మంచుకరిగిపోవడం వలన glaciers నుండి ఉధ్భవించే నదులకు మొదట వరదలు సంభవించి, తరువాత అవి పిల్లకాలువలా మారిపోతాయి. కొన్ని నదులు పూర్తిగా ఎండిపోతాయి. 

ఆంధ్రప్రదేశ్, బంగ్లాదేశ్ తీరంలో తరుచూ సంభవించే తుఫానులు, మొజాంబిక్ అమెరికా లోని కాలిఫోర్నియాలో ఏర్పడిన అనావృష్టి దీని ప్రభావమే. మనకు తెలుసు మన రాష్ట్రంలో తరుచూ సంభవించే తుఫానుల వల్ల ఎంత నష్టం జరుగుతోందో.     

ఏడాదిలో ఎండాకాలానికి, మిగితా కాలాలకు మధ్య వత్యాసం తగ్గిపోతుంది. అన్ని కాలాల్లోనూ వాతావరణం వేడిగానే ఉంటుంది. ఎండాకాలంలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతాయి. మీరు నమ్ముతారా? మనకు ఏప్రిల్, మే నెలలో ఎండాకాలంలో మధ్యాహ్నం ఉండే ఎండ వేడి, చలికాలంలో సూర్యోదయం సమయానికే వస్తుందని చెప్తున్నారు. అంటే ఇక మనం ఎలా బ్రతుకుతకగలమో ఆలోచించండి.

భూగర్భ జాలాలు (under-ground water) అడుగంటిపోతాయి. వాతావరణంలో తేమ (moisture) అధికమవుతుంది. పెరిగిన ఉష్ణోగ్రతలు కారణంగా కొత్త కొత్త క్రిములు (bacteria/virus) పుడతాయి. రకరాకాల రోగాలు వస్తాయి. మలేరియా, డయేరియా, కలరా వంటి వ్యాధులు ప్రపంచాన్ని పట్టి పీడిస్తాయి. ఇప్పుడు వచ్చిన డెంగ్యూ (dengue) వ్యాధి కూడా భూ ఉష్ణోగ్రతల పెరగడం వలన పుట్టిన సూక్షక్రిమి సంభవించింది.

పగటి ఉష్ణోగ్రతలకు (temperatures), రాత్రి ఉష్ణోగ్రతలకు మధ్య తేడా తగ్గిపోతుంది. "చల్లని రాత్రి"అన్నది ఒక ఆశగా, ఒక కలగా, కేవలం కధగా మిగిలిపోతుంది.

ఋతుచక్రం (season) పూర్తిగా గాడితప్పుతుంది. అకాలంలో వర్షాలు పడడం, ఎండలు మండిపోవడం వంటివి సాధరణం అవుతాయి.

తరుచువీచే వేడిగాలులకు నిప్పు అంటుకుని కొన్నివేల కిలోమీటరల అడవులు తగలబడతాయి. ఫలితంగా అధికంగా carbon-di-oxide వాతావరణంలోనికి విడుదలవుతుంది. కొద్దికాలం క్రితమే రష్యాలో forest-fires ప్రభావం కనిపించింది.

జంతువులు, పక్షులు తమ స్వభావాలను మార్చుకుంటాయి.మనుష్యులు మీద దాడి చేస్తాయి. ఒక ప్రాంతపు జంతువులు, ఆహారం కోసం, జీవనం కోసం మరొక ప్రాంతానికి తరలివెళ్ళడం వల్ల ఆయా ప్రాంతాల్లో ఉండే జీవవైవిధ్యం (bio-diversity) దెబ్బ తింటుంది.

ఆఫ్రికా ఖండంలో (africa continent) భయంకరమైన కరువు వస్తుంది. ప్రజలు ఆహారం కోసం యుద్ధాలు చేస్తారు.ఇతర ప్రాంతాలకు తరలివెళ్ళి ఆహారం కోసం, నివాసం కోసం అక్కడి ప్రజలతో పోరాటం చేస్తారు. ప్రపంచంలోని చాలా ప్రాంతాలు స్మశాన భూములుగా మారుతాయి.

వ్యవసాయం దెబ్బతినడం వలన, రకరకాల ప్రకృతి ఉత్పాతాల వలన ప్రపంచ ఆర్థికవ్యవస్థ (economy) అతలాకుతలం అవుతుంది. కోట్లమంది ప్రజలు ఆకలితో హాహాకారాలు చేస్తారు. వాతావరణ కాలుష్యం పెరగడం వలన నగరాలంతట దుమ్ముతోనూ, పొగతోను నిండిపోతాయి. ప్రజలు బయట తిరగలేని పరిస్థితి ఏర్పడుతుంది పిడిగుపాట్లు 100% పెరుగుతాయి. పెరిగిన ఉష్ణోగ్రతల కారణంగా 12 భయంకరమైన వ్యాధులు ప్రపంచాన్ని పట్టిపీడిస్తాయి.

ఇవన్నీ నేను చెప్తున్నవి కావు, ఎందరో శాస్త్రవేత్తలు,ఐక్యరాజ్య సమితి వంటి దృవీకరించినవి. ఇంకా భయంకరమైన నిజాలు తెలిసినా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలు, ప్రజలకు నిజాలు తెలియనివ్వట్లేదు.

భూతాపం-భారతదేశం
పెరుగుతున్న భూతాపం వలన మనకు ఏం నష్టం అంటారా?

మీకు తెలుసా భుతాపం వలన వేదభూమి, యోగ భూమి, కర్మభూమి, జ్ఞానభూమి అని ప్రపంచమంతా చెప్పుకుంటున్న భరతఖండం తన నిజస్వరూపాన్ని కోల్పోతుంది.



"హిమాలయస్య సమారంభ్యా యావదిందు సరోవరం

 తత్ర దేవనిర్మితం దేశం హిందూస్థానం ప్రశ్యస్తయత్" అంటే హిమాలయం మొదలుకొని, హిందూమహాసముద్రం (Indian ocean) అంతా వ్యాపించిన ఈ భరతఖండం దేవతల చేత నిర్మింపబడింది. అటువంటి గొప్ప దేశం, పెరుగుతున్న భూతాపాన్ని తట్టుకోలేకపొతోందని చాలా నివేదికల్లో ఎందరో పర్యావరణవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.



భూతాపాన్ని పెంచడంలో అమెరికా అగ్రస్థానంలో ఉంది. కేవలం 5% జనాభ కలిగిన అమెరికా భూతాపానికి కారణమయ్యే carbon-di-oxideలో తన వాటా 23%. మిగితా 34 పాశ్చాత్యదేశాలు (western countries) కలిసి 75% విషవాయువులను విడుదలచేస్తున్నాయి. నిజానికి ఈ పాపంలో భారతదేశం వాటా చాలా తక్కువ, దానికి కారణం మన జీవన విధానం, జీవినవిధానానికి మూలమైన భారతీయ సంస్కృతి. కాని పెరుగుతున్న భూతాపం వలన అధికంగా నష్టపోయేది మాత్రం భారతదేశమే అంటే మీరు నమ్ముతారా?......

అవునని అంటున్నారు శాస్త్రవేత్తలు.

భారతదేశనికి 7517 కిలోమీటరల తీరరేఖ / తీరప్రాంతం ఉంది. 25% జనాభ తీరప్రాతంలో నివసిస్తున్నారు. ప్రతి ఏటా సముద్రమట్టం 2.4 మిల్లిమీటర్లు పెరుగుతోంది. ఇది 2050 నాటికి 38 సెంటీమీటర్లు పెరుగుతుంది. దీని వలన కొన్ని వేలమంది నిరాశ్రయులవుతారు. ఈ శతాబ్దం చివరికి ముంబాయి, చెన్నై, కలకత్త, మచిలీపట్నం (ఆంధ్రప్రదేశ్), విశాఖపట్టణం (ఆంధ్రప్రదేశ్) వంటి అనేక ముఖ్యమైన నగారాలు జలసమాధి అవుతాయి. అంటే సముద్రంలో కలిసిపోతాయి. ఇవే కాదు తీరం వెంబడి విస్తరించిన అనేకానేక చిన్నపట్టణాలు, గ్రామాలను సముద్రం ముంచివేస్తుంది. అంటే దాదాపు 30.25% జనాభ నివాసం కోల్పోతారు.

ప్రపంచదేశాల్లో భారత్ కు తనదైన స్థానం ఉంది. ప్రపంచంలో 6వ వంతు జనాభాకు నివాసం. ప్రపంచంలో మరెక్కడలేని వాతావరణపరిస్థితులు మన దేశంలోనే ఉన్నాయి. ప్రపంచంలో అత్యధిక, అత్యల్ప వర్షపాతాలు నమోదయ్యే ప్రాంతాలు ఇక్కడే ఉన్నాయి. ఒకవైపు హిమాలయాలు ఉంటే మరొక వైపు ఏడారి (desert) ఉంది. భారత్ అనగానే మనకు గుర్తుకువచ్చేది పల్లెలు (villages), అక్కడి వాతావరణం, వ్యవసాయం (agriculture). మనదేశం, మన ఆర్థిక వ్యవస్థ (economy) పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడ్డాయి. వ్యవసాయం ఋతుపవనాలు(monsoons), నదుల మీద ఆధారపడి కొనసాగుంతోంది.

పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, భూతాపం వలన ఋతుపవనాల మీద తీవ్రప్రభావం చూపుతాయి. సమయానికి ఋతుపవనాలు రాకపోవడం, అకాల వర్షాలు, తరుచు తుఫాన్లు సంభవించడం, పంటపొలాలకు క్రొత్త క్రొత్త పురుగు, చీడ వంటివి రావడం వంటివి అనేక ప్రకృతి భీభత్సాలు మన దేశంలో చోటు చేసుకుంటాయి. అంటే మన వ్యవసాయం నాశనమవుతుంది. వర్షాలు తగ్గిపోవడం వలన వర్షాల మీద ఆధారపడ్డ నదులు పూర్తిగా ఎండిపోతాయి. ప్రజలకు త్రాగునీరు, పంటపొలాలకు నీరు దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. నీటి యుద్ధాలు మొదలవుతాయి. ఈ నదుల నీటి మీద ఆధారపడి నడుస్తున్న పరిశ్రమలు శాశ్వతంగా మూతపడతాయి. అంటే ఇప్పటికే మనలను పట్టి పీడిస్తున్న నిరుద్యోగం సమస్య మరింత పెరుగుతుంది.
ఈ దేశంలో వ్యవసాయం మీద అధికశాతం మేర ఆధారపడింది పేదప్రజలే. వారికి ప్రకృతికి చాలా దగ్గరి సంబంధం ఉంది. ప్రకృతి నాశనమయితే పేదరికం పెరుగుతుంది. దానికితోడు వ్యవసాయం రంగం దెబ్బతినడం వలన దాని మీద ఆధారపడ్డవారు మరింత పేదవారిగా మరుతారు. ఇప్పటికే భారత్ లో పేదరికం 40% వరకు ఉందని అంచనా. దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుంది. 125 కోట్ల జనాభకు ఆహరం అందించడం గగనమవుతుంది.

భారతీయ సంస్కృతిలో గంగానదికి విశేషస్థానం ఉంది. "గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి, నర్మదే సింధు కావేరి" అంటూ ప్రతిపూజలో ఈ నదులను ఆవాహన చేస్తాం, పూజిస్తాం, వాటికి హారతులిస్తాం. ఇప్పటికే ప్రకృతిలో కలిగిన మార్పులవల్ల సరస్వతి నది అంతర్వాహినిగా మారింది. పెరుగుతున్న భూతాపం హిమాలయాల నుండి పుట్టిన గంగా, యమున, సింధు నదుల మీద, దక్షిణభారతంలో అన్నినదుల మీద తీవ్రప్రభావం చూపుతుంది.
పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా హిమాలయాలలో ఉన్న మంచు కరిగిపోతోంది. ఇక్కడున్నglaciers నుండే ఉత్తరభారతానికి నీటిని అందించి నదులు పుడుతున్నాయి. ఇవి గతంలోకంటే చాలా త్వరగా కరుగుతున్నాయి. ఎక్కువగా కరగి సముద్రంలో చేరుతున్న నీరు భవిష్యత్తులో తీర ప్రాంతాలకు పెద్ద ముప్పుగా పరిణమించబోతోందని IPCC (Inter governmental panel on climate change) తన తుదు నివేదిక (final report) లో పేర్కొంది. ఫలితంగా 2080 నాటికి లక్షల జనాభ నిరాశ్రయులవుతారు. 

ఇక గంగా విషయానికి వద్దాం. గంగా గంగోత్రి glacier నుండి మొదలవుతుంది. అటువంటి గంగోత్రి glacier గత 30 సంవత్సరాలలో చాలావేగంగా కరిపోతోంది. దీని కారణంగా 2050-2070 నాటికి గంగా నది నీటిమట్టం విపరీతంగా పెరుగుతుంది. భారీగా వరద సంభవించి చుట్టుప్రక్కల ఉన్న ప్రాంతాల్లో ఏనలేని నష్టం సంభవిస్తుంది. 

ఇది ఒక్కటేనా అంటే కాదు మరొక విపత్తు కూడా పొంచి ఉందని ఆ నివేదిక మొత్తుకుంది.హిమాలయాల్లో ఉన్న మంచు పూర్తిగా కరిగి అవి మట్టి కొండలుగా మారుతాయి. ఫలితంగా 2070 నాటికి గంగా శాశ్వతంగా ఏండిపోవడం అంటే శాశ్వతంగా కనుమరిగవ్వడం, లేదా చిన్న పిల్ల కాలువలా మారిపోవడం జరుగుతుంది. ఆకాశం నుండి భగీరథుని తపస్సు వలన భూమికి వచ్చిన దేవగంగ, ఆకాశ గంగ మనం చేస్తున్న భూతాపం వలన ఏండిపోతుంది .గంగా లేని భారతీయ సంస్కృతి మీరు ఊహించగలరా? తన ప్రవాహాంలో మునిగిన ఎంతో మంది పాపాలను కడిగేసే ఆ గంగా ప్రవాహం తగ్గిపోయి ఇసుకదిబ్బలుగా మారే పరిస్థితి వస్తే అప్పుడు మనం మేల్కొని ప్రయోజనం ఏమిటి? గంగ ప్రత్యేకత ఏంటి? ఈ లింక్‌లో చూడండి - పావనగంగా రహస్యాలు

గంగను కాపాడాలి అంటే భూతాపాన్ని అరికట్టాలి. అందుకోసం అందరిని జాగృత పరచాలి. రండి గంగను, భూగోళాన్ని కాపాడుకుందాం.          


ప్రపంచంలో ఉన్న ఏ దేశస్థులైనా, వారికి వారి దేశానికి తరతరాల వారసత్వ అనుబంధం లేదు, ఒక్క భారతీయులకు, భారతదేశానికి మాత్రమే ఉంది అటువంటి బంధం. మన తాతలు, ముత్తాతలు, వారి ముత్తాతలు అందరూ ఇక్కడే పుట్టారు, ఈ మట్టిలోనే కలిసిపోయారు. ఉదహరణకు అమెరికాను చూస్తే, అక్కడ నివసిస్తున్న అధికశాతం జనాభ ప్రపంచంలో వివిధప్రాంతాల నుండి అక్కడకు వెళ్ళి స్థిరపడినవారే. కాని భారత్ విషయంలో అలా కాదు. ఈ దేశంలో పుట్టినవాడు హిందువైనా, ముస్లిమైనా, సిక్కైనా అతడి పూర్వీకులు కూడా భారతీయులే. ఈ భూమి మనది, మన అందరిది. ఈ భరతఖండం మన తల్లి. అటువంటి భరతభూమిని భారతీయులు శాశ్వతంగా వదిలివేళ్ళే పరిస్థితి వస్తే? .......... ఎప్పుడైన అలా ఆలోచించారా? భూతాపం పెరిగితే అదే జరుగుతుందని మీకు తెలుసా?

గంగానది మీద ఆధారపడి ఈ దేశంలో 50 కోట్లమంది జీవనం సాగిస్తునారు. గంగా 11 రాష్ట్రాలకు, 40% జనాభకు నీరు అందిస్తోంది. గంగా-బ్రహ్మపుత్ర నదులు 10,86,000 చరపు కిలోమీటర్ల ఆయకట్టుకు నీరు అందిస్తున్నాయి. యమున, సింధు వంటి అనేక నదులు కూడా ఈ దేశంలో ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నాయి. అటువంటి గంగా 2030 నాటి హిమాలయాలు కరిగి, పిల్ల కాలువలా మారుతుందని, ఋతుపవనాల మీద ఆధారపడే పరిస్థితి వస్తుందని తాజాగా విడుదలైన UN Climate Change Report చెప్తోంది. ఇక మిగితా నదుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీటితో పాటు ఇదే సమయానికి దక్షిణ భారతంలో నదులు ఋతుపవనాలు సరిగ్గా రాక అడుగంటిపోతాయి. ఫలితంగా ఈ దేశంలో వ్యవసాయం పూర్తిగా నాశనమవుతుంది, పరిశ్రమలు మూతపడతాయి. ఎందరో ఆకలి చావులు చస్తారు. తినడానికి మెతుకు ఉండదు, త్రాగడానికి చుక్క నీరు ఉండదు. ఇక 2050-2070 నాటికి భారతీయులు జీవనం కోసం భారతదేశాన్ని విడిచివెళ్ళవలసిన పరిస్థితులు ఏర్పడతాయని, వారు కూలి పని చేసుకోవడానికి, పొట్ట చేతపట్టుకుని, మూట సర్దుకుని యూరపు దేశాల వైపు పయనం సాగించవలసిన సందర్భం ఏర్పడుతుంది అని నివేదికలు ఘోషిస్తున్నాయి.    
కొన్ని వందల సంవత్సరాలుగా ఎందరికో అన్నం పెట్టిన భరతమాత తన బిడ్డల కడుపు నింపలేని పరిస్థితి భూతాపం పెరగడం వలన ఏర్పడుతుంది. అన్నపూర్ణగా పిలువబడుతున్న భరతవర్షం ఒక స్మశానంగా మారిపోతుందంటే మన వాళ్ళకు రవ్వంతైన భాధ కలగట్లేదా? ఎందరో దీనార్తులకు ఆశ్రయం కల్పించిన భారతప్రజలు, ధీనంగా ఇతర దేశాల్లో బిక్షమెత్తుకునే పరిస్థితి వస్తుందంటే మనం చూస్తూ ఊరుకోవాలా? 150 సంవత్సరాల స్వాత్యంత్ర పోరాటంలో ఎందరో స్వాత్యంత్ర సమరయోధుల త్యాగఫలితం మూణాల్ల ముచ్చటవుతుందన్నా మనకు సంబంధం లేని విషయంగా ఎందుకు భావిస్తున్నాం ?

ఈ దేశం వదిలివెళ్ళవలసిన పరిస్థితి రాకుండా మనం అడ్డుకోవాలి. రండి భూతాపాన్ని అరికడుదాం. భారతదేశాన్ని కాపాడుకుందాం.

ఇక భూతాపం వలన మన దేశంలో ఏ ఏ ప్రాంతాలకు ముప్పో చెప్పుకుందాం.

బెంగాల్ ప్రమాదపుటంచున ఉంది.
భూతాపం(global warming) కారణంగా హిమాలయాలు అతివేగంగా కరుగుతున్నాయి. 1971లో ఏటా 19 మీటర్లమేర కరిగేవి, ఇప్పుడు 34 మీటర్ల మేర కరిగుతున్నాయి. ఇవి కరగడం వలన దేశంలో ఉష్ణోగ్రతలు, సముద్రమట్టం విపరీతంగా పెరిగి sundar bans ను ముంచివేస్తాయి. అక్కడ అడవుల్లోనే పులులు సంచరిస్తూ ఉంటాయి. ఇప్పటికే sundar banలలో 2 ద్వీపాలు నీట మునిగాయి. సమీప భవిష్యత్తులో 102 ద్వీపాలను (islands) మునిగిపోతాయట. బెంగాల్ (వంగ దేశం) ప్రమాదంలో పడుతుంది.

మన దేశంలో సముద్రమట్టం 1మీటరు పెరిగితే 70 లక్షల మంది ప్రత్యక్షంగా నిరాశ్రయులవుతారు. 5,764 కిలోమీటర్ల తీరప్రాంత భూమి, 4,200 కిలోమీటర్ల రోడ్ల వ్యవస్థ నాశనమవుతాయి.

కళింగ దేశం (ఓడిషా రాష్ట్రం) లో కేంద్రపుర జిల్లా మొత్తం సముద్రంలో కలిసిపోతుంది. అనేకానేక పల్లెలు నీట మునుగుతాయి. నిజానికి పల్లే ప్రజలు ప్రకృతితో మమేకమై జీవనం సాగిస్తున్నా, మిగితా జనం చేసిన పాపానికి వారు ఫలితం అనుభవిస్తున్నారు.

బంగాళఖాతం తీరంలో ఉన్న అన్ని రాష్ట్రాలు తీవ్రంగా దెబ్బతింటాయి. తరుచుగా తుఫాన్లు సంభవిస్తాయి. బంగ్లాదేశ్ ప్రపంచ పటం నుండి పూర్తిగా కనుమరుగైనా ఆశ్చర్యపడనవసరం లేదు.

మచిలిపట్నం, విశాఖపట్టణం, కృష్ణపట్నం, చెన్నై అదృశ్యమవుతాయి, సాగరగర్భంలో కలిసిపోతాయి.


మీకు ఇంకో విషయం తెలుసా? 2010లో భూతాపానికి సంబంధించి ఒక నివేదిక విడుదలైంది. 2010-2020 మధ్య మనం భూతాపాన్ని అరికట్టడానికి, మరింత పెరగకుండా ఉండడానికి చర్యలు చేపడితేనే ఈ భూగోళం మిగులుతుంది. అలసత్వం వహిస్తే ఇక జరగబోయే వినాశనాన్ని ఆపడం ఎవరి తరమూ కాదు. 2100 కి ఈ భూమి మీద మానవజాతి బ్రతకలేని పరిస్థితి వస్తుందని ఆ నివేదిక సారాంశం. ఈ వార్త అన్ని టి.వి.చానెళ్ళలో చాలా రోజుల పాటు వచ్చింది. మన భూమిని కాపాడుకోవడానికి ఇంక కేవలం 5 ఏళ్ళ సమయం మాత్రమే మిగిలి ఉంది. నిరాశ పడాల్సిన అవసరం లేదు. ఇప్పటికైన మేల్కొందాం.మన ప్రయత్నం మనం చేద్దాం.    

"పంజాబ సింధు గుజరాత మరఠా ద్రావిడ ఉత్కల వంగా,వింధ్య హిమాచల యమున గంగా ఉత్కల జలధితరంగా" అంటూ మనం పాడే జాతీయగీతంలో ఉన్న పంజాబ్, గుజరాత్, మహారాష్ట్ర, తమిళ్ నాడు, బెంగాల్ తమ స్వరూపాన్ని కోల్పోతుంటే దేశభక్తి గుర్తుకురావట్లేదా? జలతరంగాలతో ప్రవహించే గంగా, యమునల్లో నీరే లేని పరిస్థితి ఏర్పడుతున్నా, హిమాలయాల్లో హిమం(మంచు) కరిగుతున్నా భారతీయుల హృదయం కరగట్లేదా?

మన దేశభక్తిని నిరూపించుకుందాం. స్వాత్యంత్ర సంగ్రామంలో పాల్గొనలేదన్న భాధ యువతకు అవసరంలేదు. భారతదేశాన్ని భూతాపం అనే రాకాసి విషకోరల నుండి విముక్తి చేయడానికి యువత ముందుకు రావాలి. ఈ దేశం మనది. భవిష్యత్తు మనది. రండి కాపాడుకుందాం భారతావనిని, ప్రపంచాన్ని.

జరిగే వినాశనం ముందు ఇవి చిన్నవే అయినా ఏవో కొన్ని. భూతాపాన్ని నివారించడానికి చిన్న చిన్న మార్గాలు. http://ecoganesha.blogspot.in/2013/04/blog-post_22.html

Originally published: 3 December 2012
1st Edit: 21 April 2015

Monday 20 April 2015

అక్షయతృతీయ విశేషాలు

ॐ  ఏప్రియల్ 21 మంగళవారం , వైశాఖ శుద్ధ తదియ, అక్షయతృతీయ సంధర్భంగా అక్షయ తృతీయ గురించి ఆసక్తికరమైన అంశాలను తెలుసుకుందాం.

పురాణ ప్రాశస్త్యం :
వైశాఖ శుద్ధ తృతీయ (తదియ) నాడు కృతయుగం ప్రారంభమైందని పురాణాలు చెబుతున్నాయి. అంటే కృతయుగాదే అక్షయ తృతీయగా వ్యవహారంలోకి వచ్చింది.

"అక్షయ తృతీయ" నాడే మహావిష్ణువు ఆరో అవతారమైన పరుశురాముడు జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి. శ్రీ నృసింహుడు ప్రహలాదుడిని అనుగ్రహించింది కూడా ఈ రోజే అని చెప్తారు. అక్షయ తృతీయ రోజు సింహాచలంలో చందనోత్సవం చేస్తారు. ఏడాదికి ఒకసారి మాత్రమే జరిగే ఈ ఉత్సవానికి లక్షల సంఖ్యలో భక్తులు చేరుకుంటారు. ఈ రోజునే సింహాచలం అప్పన్న (నరసింహస్వమి) నిజస్వరూపం చూడవచ్చు. మిగితా రోజులలో స్వామి నిత్యం చందనం (గంధం) తో అలకరించబడి ఉంటారు.

విధులు:
అక్షయము అంటే క్షయములేనిది, లెక్కించలేనిదని అర్దాలున్నాయి. ఈ అక్షయతృతీయ రోజున చేసే జపము, స్నానం, దానము, పూజ మొదలైన అన్ని కార్యాలు అక్షయమైన (లెక్కించలేని) పుణ్యాన్ని ప్రసాదిస్తాయి. ఈ రోజు తప్పక గంగా స్నానం చేయాలి. అది కుదరని పక్షంలో 'ఓం గంగాయై నమః' అని మనసులో జపిస్తూ స్నానం చేయాలి. ఈ స్నానం సూర్యోదయానికి పూర్వమే ముగించాలి. పేదలకు, ఆర్తులకు దానం చేయడం ముఖ్యమైన విధి. అక్షయ తృతీయ రోజున గోదానం, జలదానం, విసురుకర్రలను, గొడుగును దానం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఎవరి శక్తి కొలది వారు దానం చేయవచ్చు.

ఏ దానం చేస్తే ఏం ఫలితం వస్తుంది?
ఈ రోజు రోగులకు సేవ చేయడం వలన మృత్యుసమయంలో అనుభవించే బాధ తొలగుతుంది.
పేదలకు, దీనులకు కావలసిన వస్తువులను దానం చేయడం వలన వచ్చేజన్మలో సకల సంపదలు చేకూరుతాయి.
పేదలకు బట్టలు దానం వలన రోగాలు తగ్గుతాయి లేక రావు.
పండ్లు దానం చేస్తే, జీవితంలోనూ, ఉద్యోగంలోనూ మంచి స్థితికి ఎదుగుతారు, ప్రమోషన్లు వస్తాయి.
మజ్జిగ దానం వలన విద్యలో అభివృద్ధి, పురోగమనం కలుగుతాయి.
ఆహారధాన్యాల దనం అపమృత్యదోషాన్ని నివారిస్తుంది
దేవతర్పణం పేదరికాన్ని దూరం చేస్తుంది
పెరుగన్నం దానం జీవితంలో చేసిన దుస్కర్మలను దూరం చేసి, చక్కటి అభివృద్ధిని ఇస్తుంది.

అంతేకానీ అక్షయతృతీయకు బంగారం కొనుగోలు చేయాలన్న నిబంధన ఏమీ లేదు. అసలు బంగారం కొనమని ఏ శాస్త్రమూ చెప్పలేదు. భారతీయ చరిత్రలో 19వ శతాబ్దం చివరి వరకు భారతీయులు ఏనాడు బంగారం కొనుగోలు చేసిన దాఖలాలు లేవు. బంగారం కొంటే అది అక్షయమవుతుందని చెప్పడంలో సత్యం ఎంత మాత్రమూ లేదు. బంగారం అమ్మకాల్లోకి బహుళజాతి సంస్థలు అడుగుపెట్టడంతో అమ్మకాలు పెంచుకోవడం కోసం మొదలుపెట్టిన ప్రచారమే ఇదంతా. శాస్త్రం ఎప్పుడు దాచిన దనాన్ని దానం చేసి పుణ్యంగా మార్చుకోమని చెప్తుంది, అలా దాచిన పుణ్యమే మరు జన్మల్లో సహాయపడుతుంది. ఏదో జన్మలో మనం చేసిన దానం వల్ల కలిగిన పుణ్యమే ఈ రోజు మనం ఇలా రెండు పుటాల తిని, బ్రతకడానికి, సుఖాలు అనుభవించడానికి కారణమవుతోంది. ఇప్పుడు కూడా దానం చేసి పుణ్యం మూటగట్టుకుంటే తర్వాతి జన్మల్లో ఉపయోగపడుతుంది. అదే డబ్బు దాచి, కూడబెడితే, మరణించిన తర్వాత పిల్లలు పంచుకోవడం తప్పించి, ఒక్క రూపాయి కూడా వెంటరాదు. డబ్బు దాచకూడదు అని శాస్త్రం చెప్పడంలేదు, కొంతరవర్కు దాచుకోవలి, కానీ పుణ్యం కూడా కూడబెట్టమంటుంది శాస్త్రం. బంగారం కొనడానికి 'గురుపుష్య' యోగం ఉన్న రోజు శుభకరం. పుష్యమి నక్షత్రం గురువారం వచ్చిన రోజు, అది ఏ మాసమైన, బంగారం కొనడానికి శ్రేష్ఠమైనదని శాస్త్రం చెప్తోంది. అది తప్పించి వెరొక ప్రత్యేక దినం చెప్పలేదు.

అక్షయ తృతీయ రోజున మృత్తికను (మట్టిని) పూజించాలి. మట్టి వల్లనే మానవులకు సర్వ సంపదలు కలుగుతున్నాయి. సహజవనరులు, ఆహారం, నీరు అన్నిటికి భూమాతే కారణం. ఈ రోజు మట్టిని పూజించడం వలన ధనలక్ష్మీ, ధాన్యలక్ష్మీ, వైభవ లక్ష్మీల అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుందని, మట్టిని కృతజ్ఞతా పూర్వకంగా, అమ్మగా భావించాలని శాస్త్రం చెప్తున్నది. అక్షయతృతీయ రోజున విత్తనాలు చల్లాలని, ఒక మొక్క నాటలని సంప్రదాయం చెప్తోంది. అట్లాగే పితృదేవతలకు తర్పణాలు వదలాలి.

వీలుంటే ఎవరికైన సహాయం చేయండి. మీకు అందుబాటులో, వీలుగా ఉన్నదాంట్లో ఎవరో ఒకరి సహాయపడండి. దేవాలయాన్ని సందర్శించండి. సాధ్యమైనంతవరకు అబద్దాలు ఆడకుండా, ఎవరి మీద కోపం ప్రదర్శించకుండ, కసురుకోకుండా గడిపేందుకు ప్రయత్నించండి. దైవధ్యానం చేయండి.

అక్షయతృతీయ రోజు మనం ఏ కార్యం (మంచిదో, చెడ్డదో) చేసినా దాని ఫలితం అక్షయమని గుర్తుపెట్టుకోండి.
ఈ సంవత్సరం (2015), అక్షయత్రీత్య పూజ ముహూర్తసమయం ఉదయం 6 గంటల నుండి మద్యాహ్నం 12 గంటల 14 నిమిషాల వరకు

|| ఓం శాంతిః శాంతిః శాంతిః ||

Originally Published : Akshya Tritya 2013
1st Edit: 01 May 2014
2nd Edit: 20 April 2015

Sunday 19 April 2015

హిందూ ధర్మం - 155 (యజుర్వేదం)

2. యజుర్వేదం

'అనియతాక్ష రావసానో యజుః' - నియతమైన అక్షరములు లేనిది యజస్సు. యజుః అనేదానికి ప్రధానంగా 'గద్య' అనే అర్దం ఉంది, ఋగ్ వేదంలా కాకుండా యజుర్వేదం గద్యరూపంగా ఉంటుంది. 'యజుర్ యజతే' - మంత్రాలను యజ్ఞార్ధం ఉపయోహిస్తారు కనుక యజుర్వేదం అంటారని అర్దం.

యజుర్వేదం అనుసరించవలసిన పద్ధతులు, మానవ మనస్తత్వశాస్త్రం (human psychology), మానవుడు పరమ పురుషార్ధము, మానవజన్మ యొక్క ముఖ్య ఉద్ద్యేశమైన మోక్షాన్ని పొందటానికి ఏ విధమైన కర్మలు చేయాలో, ఎలాంటి మార్గాలను అనుసరించలో ప్రధానంగా చెప్తుంది. మానవుడు తాను పొందిన జ్ఞానాన్ని ఆచరణలోకి తెచ్చుకుని, లోకానికి మేలు చేసే కార్యాలను చేసి, ఇతర మానవులకు జ్ఞానాన్ని, మేలును ఎలా చేకూర్చే విధానాన్ని స్పష్టం చేస్తుంది. ఇవేకాక తత్వం గురించి, మనసు, ప్రాణం గురించి కూడా వివరిస్తుంది.

యజుర్వేదం 33 వ అధ్యాయం, 7 వ శ్లోకంలో వేల మైళ్ళు ఆగకుండా ఎగిరే విమానాల గురించి ప్రస్తావన ఉంది. ఖగోళ (Astronomy), భూగోళ (Geography), భూగర్భ(Geology ), Hydrostatics, ఔషధ (Medicine), విమానశాస్త్రాల (air-flight) ప్రస్తావన యజుర్వేదం, 6 వ అధ్యాయం, 21 వ శ్లోకంలో ఉంది.

స్త్రీపురుషులు, అన్ని వర్ణాల వారు సమానమని యజుర్వేదం 31 వ అధ్యాయం చెప్తున్నది. స్త్రీలకు గౌరవం ఇవ్వాలని సందేశం ఇస్తోంది. 18 వ అధ్యాయం 48 వ మంత్రం స్నేహ సందేశాన్ని ఇస్తోంది. 21 వ అధ్యాయం 67 నుంచి 70 మంత్రాల వరకు వ్యవసాయపనులైన దున్నడం, నారుపెట్టడం, విత్తడం మొదలైన పనుల గురించి వివరణ ఉంది. ఇనుము, వెండి మొదలైన ఖనిజాల ప్రస్తావన కూడా ఉంది. 24 వ అధ్యాయం మొత్తం పక్షులు, జంతువులు, కీటకాల గురించి ప్రస్తావిస్తూ జంతుశాస్త్రానికి బీజం వేసింది. 21 వ అధ్యాయం ఋతువుల గురించి, ఆయ ఋతువులలో ఆరోగ్య సంరక్షణ కోసం తీసుకోదగిన ఆహారం గురించి చెప్తుంది. 23 వ అధ్యాయం 10వ మంత్రం చంద్రుడు స్వయం ప్రకాశకుడు కాదని, సూర్యుని నుండి వెలుగును గ్రహించి ప్రసరిస్తున్నాడని వెల్లడిస్తోంది.

యజుర్వేద సంహితల్లో చాలా రకాల యజ్ఞాల ప్రస్తావన ఉంది. వాజసనేయ సంహిత దర్శపూర్ణమాసాలు, అగ్నిహోత్రం, వాజపేయం, అశ్వమేధం, సర్వమేధం, బ్రహ్మయజ్ఞం, పిత్రిమేధం, శౌత్రామణి మొదలైన వాటి గురించి చెప్పబడింది. సులువగా అర్దమవ్వడం కోసం వాటిని దర్శపూర్నమాశాలని, సోమయాగాలని, అగ్నిచయనాలని 3 గా విభాగం చేయచ్చు.

యజ్ఞం అంటే కేవలం అగ్నితో చేసేది మాత్రమే కాదనీ, మనకు తెలిసిన మంచి విషయాలను, జ్ఞానాన్ని పంచుకోవడం, ధర్మప్రచారం చేయడం కూడా యజ్ఞమేనని చెప్తుంది. సమానత్వము, ఐక్యత, విశ్వజనీన సహోదరత్వం గురించి సందేశం ఇస్తుంది.

ఉఛ్చారణా పద్ధతిని అనుసరించి యజుర్వేదాన్ని రెండుగా చెప్తారు. ఒకటి కృష్ణ యజుర్వేదం, రెండు శుక్లయజుర్వేదం. శుక్ల యజుర్వేదాన్నే వాజసనేయము అని కూడా అంటారు. ఉత్తరభారతదేశంలో శుక్ల యజుర్వేదము, దక్షిణ భారతదేశంలో కృష్ణ యజుర్వేదము తరతరాలుగా బోధిస్తున్నారు.
వీటి మధ్య బేధాన్ని ఈ వీడియోలో వినండి.

1) కృష్ణయజుర్వేదం

2) శుక్లయజుర్వేదం


యజుర్వేద మంత్రాలను काण्डिका (కాణ్డికాలు) అంటారు. యజుర్వేదంలో 40 అధ్యాయాలు, 1975 కాణ్డికాలు ఉన్నాయి. పతంజలి మహర్షి మహాభాష్యం రాసే సమయానికి యజుర్వేదానికి 101 శాఖలు ఉన్నాయి. కానీ ప్రస్తుతం 6 శాఖలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి, మిగితావి లుప్తమైపోయాయి.  తైత్తిరీయ, భార్గవ, కాత్యాయన, మైత్రాయణ, కరు కృష్ణ యజుర్వేదానికి సంబంధించిన బ్రాహ్మణాలు. శతపథ బ్రాహ్మణం శుక్ల యజుర్వేదానికి చెందినది. అయినప్పటికి ప్రస్తుతం మొత్తం యజుర్వేదానికి సంబంధించి శతపధ బ్రాహ్మణం ఒక్కటి మాత్రమే లభిస్తోంది.

యజుర్వేదానికి సంబంధించిన ఆరణ్యకాలు ఏవీ కూడా లభించడం లేదు.

ఉపనిషత్తుల విషయానికి వస్తే ఈశావాస్య, తైత్తరీయ, బృహదారణ్యక ఉపనిషత్తులు యజుర్వేదానికి సంబంధించి అందుబాటులో ఉన్నాయి. అందులో శుక్ల యజుర్వేదానికి సంబంధించినది బృహదారణ్యక ఉపనిషత్తు. ఉపనిషత్తులను కూడా స్వరంతో చదివే సంప్రదాయం ఉన్నా, హిందువులకు లభిస్తున్న అన్ని ఉపనిషత్తుల్లో ఒక్క తైత్తరీయ ఉపనిషత్తు మాత్రమే స్వరంతో కూడి లభిస్తోంది. మిగితావి అన్యమతాల దండయాత్రాల్లో కోల్పోగా, కేవలం ప్రతులు మాత్రమే లభిస్తున్నాయి. యజ్ఞసమయంలో యజుర్వేదం చదివే పండితుడిని అధ్వర్యుడు అంటారు.

To be continued ...............

ఈ రచనకు సహాయపడిన వెబ్‌సైట్లు:
http://ignca.nic.in/vedic_heritage_intro_yajurveda.htm
http://archive.org/stream/yajurveda029670mbp/yajurveda029670mbp_djvu.txt
http://www.vedicgranth.org/what_are_vedic_granth/the-four-veda/yajur-veda