Friday 28 February 2014

హిందూ ధర్మం - 24

ఇంద్రియాలకు మనసుకు సంబంధం ఉంటుంది. 5 జ్ఞానేంద్రియాలు ప్రపంచం నుంచి జ్ఞానాన్ని తెలుసుకోవడంలో, అనుభూతి చెందడంలో ఉపయోగపడితే, మిగితా 5 కర్మేంద్రియాల ద్వారా మనిషి ప్రపంచంలోకి సంకేతాలను పంపుతాడు, వివిధ పనులు చేస్తాడు. ఒక వస్తువును మీ కళ్ళతో చూస్తున్నారంటే, మీ నయనేంద్రియం (కన్ను) ద్వారా మీరు చూస్తున్న విషయం, మీ మనసుకు చేరుతుంది. మీరు మంచి పాట వినడం అంటే, మీ కర్ణేంద్రియం (చెవి) ద్వారా, ఆ విషయం మీ మనసుకు చేరుతోందని కదా. అదే మీరు మాట్లాడుతున్నారంటే, మీ వాక్కు ద్వారా మీ మనసు ఈ ప్రపంచంలోకి కొన్ని ఆలోచనలను పంపుతోంది. జ్ఞానేంద్రియాల ద్వారా మనసు విషయాలను గ్రహిస్తే, కర్మేయింద్రియాల ద్వారా ప్రపంచం మీ మనసులో విషయాన్ని హ్రగిస్తుంది. అందుకే జ్ఞానేంద్రియాలు శరీరానికి ప్రవేశ ద్వారాలయితే, కర్మేంద్రియాలు బయటకు వెళ్ళే మార్గాలు అంటారు స్వామి పరమార్ధానంద సరస్వతీ. సులభంగా చెప్పుకుంటే, జ్ఞానేద్రియాల ద్వారా లోపలికి తీసుకుంటున్నారు, కర్మేంద్రియాల ద్వారా బయటకు సంకేతాలను పంపుతున్నారు, కర్మ చేస్తున్నారు.

To be continued...........

Friday 21 February 2014

హిందూ ధర్మం - 23

మనసును పాప కార్యాల నుంచి, శాస్త్రవిరుద్ధమైన జీవనం నుంచి, నిషిద్ధకర్మల నుంచి వెనక్కు మళ్ళించడం, నిగ్రహించడం, నిరోధించడం దమము. దమం గురించి అర్ధమవ్వాలంటే, ధర్మంలో వెరొక లక్షణమైన ఇంద్రియ నిగ్రహం గురించి తెలిసి ఉండాలి.

4. ఇంద్రియ నిగ్రహం: ఇంద్రియాలను అదుపు చేసుకోవడం. ఇంద్రియాలంటే మనసుకు, బయట ప్రకృతికి/ప్రపంచానికి వారధి వంటివి. మనకు మొత్తం 10 ఇంద్రియాలు ఉన్నాయి. వాటిని రెండుగా విభజించారు.

మొదటి 5 జ్ఞానేంద్రియాలు :
శ్రోత్రం (చెవులు) - వినికిడి కోసం,
త్వక్ (చర్మం) - స్పర్శకు కారణం అయింది
చక్షుః (కళ్ళు) - ప్రపంచాన్ని చూస్తుంది,
రసన (నాలుక) - రుచి చూస్తుంది,
ఘ్రాణ (ముక్కు) - వాసన పీల్చడం ద్వారా మెదడుకు సంకేతాలు పంపిస్తుంది

తరువాతివి కర్మేంద్రియాలు.
వాక్కు (నోరు)- మటలను బయటకు పంపుతుంది,
పాణి (చేతులు) - అనేక పనులు ఉపయోగ పడతాయి,
పాదం (కాళ్ళు) - మనిషి యొక్క కదికల కోసం,
పాయువు (మలద్వారము) - శరిరంలో మలాన్ని విసరిజిస్తుంది (బయటకు పంపుతుంది),
ఉపస్థ (మూత్రద్వారము) - సంతానానికి కారణమవుతుంది

ఈ పదింటిని దశ ఇంద్రియాలంటారు.
వీటి గురించి వివరంగా చెప్పుకుందాం.

To be continued................... 

Thursday 20 February 2014

హిందూ ధర్మం - 22

3. దమము - అంటే మనో నిగ్రహము, మనసును నిగ్రహించుకోవడం, అదుపులో పెట్టుకోవడం అని అర్ధం.. మీరు మీ మనసుమాట వినడం కాదు, మీ మనసు మీరు చెప్పినమాట వినాలి. మీరు చెప్పినట్టు నడుచుకోవాలి. మీ ఆజ్ఞను శిరాసావహించాలి. అదే దమము. జ్ఞానయోగ మార్గంలో ఉన్న సాధకునికి దమమే పునాది. మహాభారతం శాంతిపర్వం కూడా దమం యొక్క వైభవాన్ని ప్రశంసిస్తూ 'ధర్మానికి అనేక శాఖలున్నా, దమమే (మనోనియత్రణయే) అన్నిటికి మూలం అని అంటుంది.

ఆధ్యాత్మికత గురించి తెలియని వారికి ఉభవించే మొదటి సందేహం 'నా మనసు నా మాట వినడం ఏమిటి? మనసంటే నేనే కదా. నా ఆలోచనలనే నేను కదా. ఇది ఎలా సాధ్యం?'. ఇది చాలా సాధారణంగా తలెత్తె సందేహం. దీనికి భారతీయ తత్వజ్ఞానం చక్కటి సమాధానం ఇస్తుంది. నిజానికి నువ్వు నీ మనసు కాదు, నీ శరీరం కూడా కాదు. నువ్వు శరీరానికి, మనసుకు అతీతమైన వాడివి. నువ్వు మనసును, శరీరాన్ని నడిపిస్తున్న చైతన్యస్వరూడివి, నువ్వు ఆత్మవి అంటుంది. శరీరానికి, మనసుకు, ఆత్మకు మధ్య గల భేధాన్ని, దూరాన్ని స్పష్టంగా చూపిస్తుంది.

ఈ లోకంలో మనసే బంధానికి, మోక్షానికి కారణం అంటుంది గీత. మనకున్న సగం కష్టాలకు, భాధాలకు కారణం మన మనసు గురించి మనకు తెలియకపోవడమే. మనకున్నభాధలకు, కష్టాలకు కారణం మన మానసిక స్థితి. మనసును సక్రమంగా అర్ధం చేసుకుంటే, ఈ ప్రపంచంలో ఉన్న బాధలన్నీ ఈ క్షణంలోనే నశించిపోతాయి. ఇది ఏ సైకాలజీనో, లేక మరే ఇతర ఆధునిక సైన్సు  చెప్పిన విషయం కాదు. మన ఋషులు, యోగులు చెప్పినమాట. ఇది యధార్ధం. ఇది అర్ధం కావాలంటే సాధన చేయాలి.

To be continued...................

Originally published: 20 Feb 2014
1st Edit: 22 April 2015

Wednesday 19 February 2014

హిందూ ధర్మం - 21

వికలాంగులైన ఈ 100 మంది, బాధపడుతూ, భారమైన మనసుతో, కంటతడి పెడుతూ, రాజమందిరంలోనికి ప్రవేశించగా, అది చూసిన కుశనాభుడు తన కూమార్తెలతో 'ఏం జరిగింది? మిమ్మలని ఈ స్థితికి తీసుకువచ్చిందెవరు, మీ ధర్మాన్ని నాశనం  చేసిందెవరు, మిమ్మలని పొట్టిగాం అందవీహినంగా చేసిందెవరు, మీరెందకు ఏమి చెప్పకుండా మౌనంగా ఉన్నారు' అంటూ ప్రశించాడు.

కుశనాభుడి మాటలు విన్న ఈ 100 ఆడపిల్లలు, ఆయన పాదాలకు తమ నుదురు తగిలేలా నమస్కరించి, 'వాయుదేవుడు సంకల్పం వలన మాకు ఈ స్థితి వచ్చింది' అని చెప్పి, జరిగినదంతా వివరిస్తారు. అప్పుడు కుశనాభుడు వారితో 'చాలామంచి పని చేశారమ్మా! నాకు చాలా గర్వంగా ఉంది. క్షమించడమనేది స్వీయ నియంత్రణ (తమ మీద తమకు నియంత్రణ) ఉన్నవారు మాత్రమే చేయగలరు. మీరు మానసికంగా బలవంతులు. మీరు చేసిన పనివల్ల మన వంశం కీర్తి మరింత పెరిగింది. క్షమా గుణం స్త్రీలకు అలంకారం. ఆమాటకు వస్తే, ప్రతి పురుషుడికి ఉండవలసిన లక్షణం. మీరు అప్సరస కూమర్తెలు, శపించగల శక్తి ఉండి కూడా, నిగ్రహించుకున్నారు, సాధారణ మనుష్యులలా ఆవేశానికి లోనుకాలేదు.

క్షమా దానాం క్షమా సత్యం క్షమా యజ్ఞస్య పుత్రికా
క్షమా యశః క్షమా ధర్మః క్షమాయాం విష్ఠితం జగత్

క్షమా గుణమే దానము, సత్యము, క్షమయే గొప్ప యజ్ఞము, క్షమాగుణమే యశస్సు, క్షమించడమే ధర్మం, క్షమా గుణం చేతనే ఈ జగత్తంతా నడుస్తున్నది ఓ పుత్రికలారా! అని కుశనాభుడు వారి యొక్క క్షమాగుణాన్ని పొగిడారు.

తర్వాత బ్రహ్మదత్తుడనే ఒక ఋషుతుల్యుడైన మహారాజుకిచ్చి వివాహం చేశారు. వివాహానంతరం బ్రహ్మదత్తుని చేయి తగలగానే, 100 మంది తమ పూర్వరూపాన్ని పొందారు.

To be continued...................

Tuesday 18 February 2014

హిందూ ధర్మం - 20

క్షమా గుణం మీద రామాయణం బాలకాండ 32-33 సర్గల్లో చక్కటి కధ ఒకటి వాల్మీకి మహర్షి అందించారు.

కుశనాభుడనే ఒక రాజుకు, ఘృతాచి అనబడే ఒక గంధర్వకాంత వలన 100 మంది మహసౌందర్యవతులైన కుమార్తెలు జన్మించారు. యవ్వనంలో ఉన్న ఆడపిల్లలు ఒకసారి దగ్గరలో ఉన్న ఉద్యానవనానికి వెళ్ళి, ఆటపాటలతో కాలక్షేపం చేస్తున్నారు. ఆకాశం నుంచి తారలు దిగివచ్చాయా అన్నట్టుగా ఉన్నది వారి అందం అని వర్ణించారు వాల్మీకి మహర్షి. వారు ప్రపంచంలోనే మహసౌందర్యవతులు. ఆ సమయంలో వారి ముందు వాయుదేవుడు ప్రత్యక్షమై మీ చాలా అందంగా ఉన్నారు, నేను మిమంలని వివాహం చేసుకుంటాను, నన్ను పెళ్ళి చేసుకుంటే మీకు ఈ మానవ శరీరాలు పోయి, దేవతలవుతారు, అధికకాలం, మానవులకు యవ్వనం కొంతకాలమే ఉంటుంది, కానీ నన్ను వివాహం చేసుకుంటే మీ యవ్వనానికి, అందానికి ఇక మరణం ఉండదు అంటాడు.

వాయుదేవుని మాటలు విన్న ఆ కాంతలందరూ ఒక్కసారి నవ్వి 'నీవు సకల ప్రాణకోటికి జీవనాధరమైనవడివి, మాకు నీ యొక్క గొప్పతనం తెలుసు, అయినా నీవు మమ్మల్ని ఎందుకు అవమానిస్తున్నావు. మేము కుశనాభుడి కుమార్తెలము, ఓ దేవోత్తమా! మేము తల్చుకుంటే నిన్ను, నీ వాయుపదివి నుంచి తప్పించగలము, అయినా మా తపశ్శక్తిని రక్షించుకోవడం కోసం మమ్మల్ని మేము నిగ్రహించుకుంటున్నాము. ఓ మదాంధుడా! తగిన సమయం వచ్చినప్పుడు మేము స్వతంత్రంగా, మా తండ్రి అనుమతితో నచ్చిన వరుడిని ఎంపిక చేసుకుని వివాహం చేసుకుంటాము. మా నాన్నగారు మాకు దైవంతో సమానం, వారు మమ్మల్ని ఎవరి చేతిలో పెడితే, వారితోనే జీవితం గడుపుతాము' అన్నారు.

ఈ మాటలు విన్న వాయుదేవుడు, కోపంతో వారి శరీరాల్లోకి ప్రవేశించి, వారి సౌందర్యాన్ని నాశనం చేశాడు, వారిని అందవిహీనంగా, వికలాంగులుగా మార్చేశాడు.

To be continued................... 

Monday 17 February 2014

బహుళ చవితి

ఓం గం గణపతయే నమః

కలియుగంలో త్వరగా ప్రసన్నమయ్యే దేవతలలో వినాయకుడు మొదటివాడు. భక్తులపాలిటి కల్పవృక్షం వినాయకుడు. కోరిన వెంటనే అడిగినవన్ని త్వరగా తీర్చుతాడు బొజ్జగణపతి. శివ పార్వతుల వలే గణపతి కూడా త్రినేత్రుడు (3 కళ్ళు కలవాడు), తలపై చంద్ర వంక ధరించి ఉంటాడు. నిత్యం కోలిచే వారికే సదా అనందాన్ని ప్రసాదిస్తాడు గణనాధుడు. అటువంటి గణపతికి అత్యంత ప్రీతికరమైనది చవితి తిధి. అందులోనూ ప్రతి మాసంలో పౌర్ణమి తరువాత వచ్చే బహుళ చవితి గణపతి ఆరాధనకు ఇంకా విశేషమైనది. దీనికే సంకష్టహర చవితి అని పేరు. ఈ చవితికి ఉపవాసం ఉండి గణపతిని పూజిస్తే జీవతంలో ఉండే సంకటాలు తొలిగి విజయం తప్పకుండా సిద్ధిస్తుంది.

ఈ సంకటహర చవితి మంగళవారం వస్తే, దాన్ని అంగారక చవితిగా పరిగణిస్తారు. మంగళవారం సంకష్టహరచవితి చాలా పవిత్రమైన తిధి. ఈ అంగారక చవితి రోజున గణపతిని విశేషంగా పూజించండి. సంకటనాశన గణేశ స్తోత్రం పఠించండి. 'ఓం గం గణపతయే నమః' అనేది గణపతి మహామంత్రం. దాన్ని వీలైనన్ని సార్లు జపించండి. ఉదయమో, సాయంత్రమో గణపతి ఆలయాన్ని సందర్శించండి. గణపతికి 21 ప్రదక్షిణలు చేయండి. కుదిరితే గణపతికి గరిక, ఎర్ర పూలు సమర్పించండి. గణపతి అనుగ్రహాన్ని పొందండి. జీవితాన్ని ఆనందమయం చేసుకోండి.

18-02-2014, చంద్రోదయ సమయం, రాత్రి 09:07 నిమిషాలకు (హైద్రాబాదు). అంగారక చవితి ఉపవాసం ఉండదలచినవారు రాత్రి 09:07 తరువాతనే భోజనం చేయాలి.

మీ మీ నగరాల్లో చంద్రోదయ సమయం కోసం ఈ వెబ్‌సైట్ చూడండి.
http://www.drikpanchang.com/vrats/sankashti-chaturthi-dates.html

ఓం గం గణపతయే నమః 

Friday 14 February 2014

హిందూ ధర్మం - 19

క్షమించమన్నారు కదా అనీ, అన్ని వేళలా ఇది వర్తించదు. దేశం విషయంలోనూ, ధర్మం విషయంలోనూ మితిమీరిన క్షమా గుణం పనికిరాదు. మాతృదేశంపై ఆక్రమణకు, యుద్ధానికి శత్రుదేశం పాల్పడినప్పుడు, స్వదేశరక్షణ కోసం ఎదుటివాడితో పోరాటం చేయాలి. అక్కడ క్షమించకూడదు, గట్టి సమాధానం చెప్పాలి, తగిన గుణపాఠం నేర్పాలి. అదే ధర్మం.అట్లాగే ధర్మానికి హానీ ఏర్పడినప్పుడు, ధర్మం మీద దాడి జరుగుతునప్పుడూ మౌనం వహించకూడదు, క్షమించకూడదు.

అదే మహాభారతంలో కనిపిస్తుంది. అంతా తన బంధువేలననీ, తనవారిపై పోరాటం చేయడం కంటే రాజ్యాన్ని విడిచిపెట్టడం మేలు అనుకున్న అర్జునుడికి శ్రీ కృష్ణపరమాత్మ గీత భోధించాడు. ధర్మానికి హానీ ఏర్పడప్పుడు, పిరికివాడిలా పారిపోవడం కాదు, నిజమైన క్షత్రియుడులా యుద్ధం చేసి, ధర్మాన్ని పునఃప్రతిష్టించమని చెప్పాడు, గీతను భోధించి అర్జునుడిని మానసికంగా బలవంతుడిని చేసి, యుద్ధం చేయించి, ధర్మరాజుకు రాజ్యం అప్పగించాడు. ధర్మానికి హాని ఏర్పడుతందంటే, బంధుత్వాలు, క్షమాగుణాలు అన్నీ విడిచిపెట్టాలని, ధర్మాన్ని, దేశాన్ని కాపాడడమే ప్రధమ కర్తవ్యం అని తెలియజేశాడు.

వందలమందిని దారుణంగా హతమార్చిన ముష్కరుడిని గట్టిగా దండించడమే రాజు యొక్క ధర్మం. అంతేకానీ, వాడిని క్రూరంగా దండిస్తే, మనకూ వాడికి తేడా ఏముంటుందండీ? వాడిని క్షమించి, విడిచిపెట్టాలి అంటారు కొందరు. అక్కడ క్షమాగుణం చూపవలసిన అవసరమే లేదంటుంది ధర్మం.

To be continued................... 

Thursday 13 February 2014

హిందూ ధర్మం - 18

క్షమించడం గొప్ప లక్షణం. మాటమాట పెరగకుండా, మనమే ఒక అడుగు ముందుకేసి, వాదనను, యుద్ధాన్ని నివారించడం, ఆపడం అందరికి సాధ్యం కావు. ఎవరు ఎక్కువగా వాదిస్తారో, ఎక్కువగా పోరాడతారో, వారే గోప్పవారననేది సమాజం యొక్క భావన. కానీ శక్తి ఉండీ, వెనక్కు తగ్గడం అనేది చాలా కష్టతరమైన పని, అది ధీరులు మాత్రమే చేయగలరు. ఉదాహరణకు మీకు బాగా కోపం వచ్చిందనుకోండి, ఎదుటివాడిని చెంప పగిలేలా కొట్టే పరిస్థితి వస్తే, అక్కడ మీరు, మిమ్మల్ని నియంత్రించుకోవడానికి, శాంతపడడానికి, వెనక్కు తగ్గడానికి బోలెడు శక్తి కావాలి. కొట్టడం ఎంత సేపు చెప్పండి. అది గొప్ప కాదు. నిగ్రహించుకోవడం గొప్ప. ఇలా నిగ్రహించుకోవడం, అవతలవారిని క్షమించడం వల్లే సంకల్ప శక్తి పెరుగుతుంది. ఇటువంటి క్షమాగుణం జ్ఞానుల్లో ఎక్కువగా ఉంటుంది. ఎదుటివాడు పాపం అమాయకుడు, అజ్ఞాని, పసిపిల్లవాడు లాంటివాడని జ్ఞాని మనస్పూర్తిగా క్షమించగలుగుతాడు.

ఇక రెండవ అంశం. క్షమించడం అన్నది కేవలం మాటలకే పరిమితం అవ్వరాదు. త్రికరణశుద్ధిగా క్షమించాలి. అంటే మనసులోనూ, మాటలలోనూ, చేతలలోనూ క్షమా గుణం కనిపించాలి. ఒకడి మీద మనసులో బోలెడు కోపం, కసి, పగ, ద్వేషం వున్నా, అందరూ చూస్తున్నారనీ, అందరి ముందు ఇవి ప్రదర్శిస్తే, చెడ్డపేరు వస్తుందని, బయటకు 'వాడిని నేను క్షమించేసానండీ!'  అని సులువుగా అనేస్తారు. కానీ మీకు తెలుసు, మీ మనసులో వాడి మీద కోపం ఉన్నదని, వాడి మీద కసి తీర్చుకునే సమయం కోసం ఎదురు చూస్తున్నారనీ. లేదా, తగిన సమయం కాదు కాబట్టి, తాత్కాలికంగా క్షమిస్తారు. అది నిజంగా క్షమించడం ఎలా అవుతుంది? మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. మీ మనసులో మీ శత్రువు పట్ల విపరీతమైన ద్వేషాన్నీ వేళ్ళతో సహ తొలగించడమే నిజమైన క్షమా. ఇటువంటి నిజమైన క్షమాగుణమే ధార్మికులకు ఉండవలసిన లక్షణం. ఇది ఒక్క రోజులో రాకపోవచ్చు. కానీ సాధన చేత, ధర్మాన్ని తెలుసుకోవడం వల్ల మెల్లమెల్లగా అలవడుతుంది.

To be continued...................

Wednesday 12 February 2014

హిందూ ధర్మం - 17

2 - క్షమా:

క్షమించడం, క్షమా గుణం కలిగి ఉండడం ధర్మం యొక్క రెండవ లక్షణం. క్షమించడం అన్నమాటని జాగ్రత్తగా అర్ధం చేసుకోవాలి. ఒకడు బలహీనుడై, ఎదుటివాడు బలవంతుడైనప్పుడు, వాడితో పోరాటం చేయలేక, వాడు ఎన్ని అకృత్యాలు చేస్తున్నా, వాడిని క్షమించేస్తాం. ఇది పరికితనంతో చేసే పని. ఇది క్షమా గుణం కాదు, చేతకానీతనం అంటుంది ధర్మం. ఏలా అంటే, మీకు ఎవరి మీదో బాగా కోపం వచ్చింది, గట్టిగా నాలుగు తగించాలనుకున్నారు, కానీ అవతలివాడు మీకంటే శక్తివంతుడని, మీరు ఒక్క దెబ్బ కొడితే, వాడు పది దెబ్బలేస్తాడని తెలిసు కనుక, మీరు వెనక్కు తగ్గుతారు. అది కాదు క్షమా అంటే అంటుంది ధర్మం.

మీరు ముందు బలవంతువులుగా మారండి. ఎవరైనా మీ జోలికి వస్తే వాడికి బుద్ధి చెప్పేటంతగా, శారీరికంగానూ, మానసికంగానూ మీరే బలవంతులవ్వాలి. ఎదుటివాడిని మట్టి కరిపించే శక్తి మీకు ఉండాలి. అన్నీ ఉండి, అవతలవాడు బలహీనుడని తెలిసి కూడా మీరు క్షమించగలగాలి. అదే నిజమైన క్షమా గుణం. ఇదే కర్మయోగం చెప్తుంది. ధర్మం కూడా అటువంటి క్షమాగుణాన్నే అలవరచుకోవాలని చెప్తున్నది. ఎందుకంటే ఏమి లేనీవాడు, శక్తిహీనుడు ఎట్లాగో వాదన చేయలేడు, కనుక సర్దుకుపోతాడు. క్షమించడం ధీరులైనవారి లక్షణం. చేతగానితనం బలహీనుల లక్షణం. అందుకే  బలహీనులు ఎప్పటికి క్షమించలేరు, క్షమించడం బలవంతుల సద్గుణం అన్నారు గాంధీ.

To be continued...................

Tuesday 11 February 2014

Anubhava Mantapa - The World's first Parliament

Anubhava Mantapa - The World's first Parliament.

Anubhava Mantapa was the first parliment in history of mankind. Prabhudeva, a great Yogi of extraordinary achievement, was the president and Lord Basava acted as the prime minister. Chennabasava can be compared to the speaker while at the same time working as the editor, and compiler of Vachana literature.

The only difference between the present day parliament and Anubhava Mantapa is that the members were not elected by the people, but were picked up or nominated by the higher authorities of the Mantapa; the necessary qualification expected being spiritual attainment. The problems tackled were of a various nature covering social, religious, spiritual, yogic psychological, economic and literary spheres.

Members of the Mantapa and followers of the religion were given full freedom of thought, speech and action. They were allowed to put any questions or doubts to get them cleared in front of the congregation and a systematic program was launched to record and to preserve the dialogues that were going on in the House.
These discussions reminisced us of Dialogues of Plato, the great Greek philosopher. But they differ from the later in being characterized by a high type of mystic experience. As silent documents we can see even today the caves cut out of the brittle stony hillocks, in and around the city of Kalyana.

The people of high caste, with their vested interests tried to impose on the ignorant masses the idea that the former are the issues of meritorious ancestry and that the latter are of sinful birth. Owing to their ignorance the low-casts and untouchables laboured under the delusion that they were born to be slaves because of the sins committed during and inherited from their past births. They believed that to strive to improve their miserable plight was a heinous sin, and that to live where and as they lived was their life's purpose as well as its fulfillment.

Anubhava Mantapa criticized sharply the meaningless differentiation of human beings as high or low either on their birth or on their occupation. Unique preaching's of equality charged with the acceptance of the parenthood of god and the fraternity of humanity fascinated the tortured minds and consoled the gasping hearts of the oppressed and distressed masses.

The burning zeal of Basava to place religion on a democratic basis, his passionate love for God and his untiring energy in serving humanity added to the glory of Anubhava Mantapa .

The Lingayath religion, being reformative in its out-looking was more progressive than aggressive. It placed more emphasis on evolution by tergiversation or change of mind rather than on sanguinary revolution. So it is not to say that Basaveshwara and his followers were imbued with an antagonistic spirit towards any other community. But, "Rev. N. C. Sargent aptly says, "Basava's aim was not to oppose or propose any religious or philosophical system; but to show people the existing social and religious evils and, if possible, to remove these evils from society".

Source : Hindu news

హిందూ ధర్మం - 16

మనం కూడా చాలా పనులు మొక్కుబడికి చేస్తుంటాము. ఎప్పుడో, ఏదో ఆవేశంలో, ఒక మాట అనేస్తాం, నేను అది చెస్తాను, ఇది చేస్తాను అని ప్రగల్భాలు పలికేస్తాం. తర్వాత ఆ పని పూర్తి చేయడానికి నానా తంటాలు పడతాం. ఎందుకు చెప్పాన్రా బాబోయ్! అంటూ మన మీద చిరాకుపడతాం. ఆఖరికి పనైతే పూర్తవుతుంది. కానీ ఇది ధృతి అనిపించుకోదు అంటారు ఋషులు. బలవంతంగా పనులు, కార్యాలు పూర్తి చేయడం కాదు, అయిష్టంగా సంకల్పాలు నెరవెర్చడం కాదు, ఇష్టంతో చేయాలి, ఉత్సాహంతో చేయాలి, మనసా, వాచా, కర్మణా (త్రికరణ శుద్ధిగా) చేయాలి. అలా చేయడమే ధృతి అనిపించుంకుటుంది.

నేను ఈ ధర్మాన్ని ఆచరిస్తాను అనుకుంటాం. సుఖాలు ఉన్నప్పుడు, సమయం అనుకూలించినప్పుడు ఆచరించడం సులువే. కానీ కష్టం వచ్చినా, మరణం సమీపిస్తున్నా, ప్రళయం వస్తున్నా, ధర్మాన్ని అదే ఉత్సాహంతో, సంతోషంతో ఆచరించడం ధృతి. ధృతిని మనుమహర్షి ధర్మానికి మొదటి లక్షణంగా చెప్పడంలో ఒక రహస్యం ఉంది. ఈ ధర్మంలో ఆధునిక వైద్యశాస్త్రంలో ఉన్నట్టుగా దేనికి క్షణికమైన ఫలితాలు (Instant results) ఉండవూ, అనుసంగ ప్రభవాలు (Side Effects) ఉండవు. ఆయుర్వేదమే తీసుకోండి, ఒక్కో ఔషధం పని చేయాలంటే కనీసం 41 రోజులు పాటు దాన్ని సేవించాలి, కానీ దాని ఫలితాలు అధ్బుతంగా ఉంటాయి. ధ్యానం, యోగా కూడా అంతే. గురువు దగ్గరకు వెళ్ళగానే, రా నాయానా! నేను నీ కోసమే వేచి ఉన్నాను. మొత్తం నీకు ఇప్పుడే భోధిస్తాను అని చెప్పడు. ముందు బోలెడు పరీక్ష పెడతారు, మన ఓపికను పరీక్షిస్తారు, మన శ్రద్ధను గమనిస్తారు, మనం అన్నిటిని తట్టుకుని సిద్ధమయ్యాక, అప్పుడి జ్ఞానాన్ని భోధిస్తాడు. ఇక్కడ కూడా వ్యక్తికి ధృతి ఉండాలి. లేకుంటే మోక్షం పొందలేడు. అట్లాగే భగవంతుని అనుభూతి ఒక్క రోజులో కలగదు. దానికి బోలెడు సాధన కావాలి, ఆహార నియమాలు పాటించాలి, బాగా ఓపిక కావాలి, నిరనతరం ఉత్సాహం ఉండాలి, భగవంతుడిని చేరాలన్న తపన నిరనతరంగా కలుగుతూనే ఉండాలి. ఇదంతా కేవలం ధృతి వల్లనే కలుగుతుంది. కనుక మనుమహర్షి ధర్మాచరణలో ధార్మికునకు ఉండవలసిన మొదటి లక్షణం ధృతి అని ప్రవచించారు. తరువాతి లక్షణం  క్షమా.

To be continued...................

Monday 10 February 2014

హిందూ ధర్మం - 15

ఈరోజు మన సమాజాన్ని చూడండి. ఎంసెట్‌లో ర్యాంకు రాలేదని ఒకరు, టీచరు కొట్టిందని మరొకరు, టి.వి. చూడనివ్వడలేదని ఇంకొకరు, ప్రేమ విఫలమైందని వేరొకరు, ఇలా ......... ప్రతి చిన్న చితకా, విషయాలకు ఆత్మహత్య చేసుకుంటున్నారు. పరీక్ష పాస్ కాకపోవడం కూడా ఒక సమస్యేనా? ఆలోచించండి. పరీక్షే జీవితం కాదు, ప్రేమే జీవితం కాదు, ఆర్ధిక ఇబ్బందులే జీవితం కాదు, ఇవన్నీ పెద్ద జీవితంలో చిన్న చిన్న భాగాలు మాత్రమే. యోగులకైతే అసలు వీటి పట్టింపే ఉండదు. ముష్టి ఉద్యోగం పోయిందని చచ్చిపోతాడు ఒకడు. ఏం? మాములు జీవితం బ్రతకచ్చు కదా. బ్రతకడానికి లక్షలే అవసరంలేదు. బ్రతకాలనుకుంటే పాచిపనులు చేసైనా బ్రతకచ్చు.ఆత్మహత్య చేసుకోవడం పిరికి చర్య. బ్రతకండి, ధృతితో బ్రతకండి, ధీరులుగా బ్రతకండి. అదే ధర్మం యొక్క మొదటి లక్షణం.

పెద్ద పనులు, చిన్న పనులు అని ఉండవు, అన్ని సమానమే, సమాజంలో ఎవరు పని చేయకపోయినా ఈ సమాజం నడవదు. అటువంటప్పుడు ఏదో ఒకపని మాత్రమే చేస్తాను, లేకుంటే చస్తాను అనుకునేవాడు మూర్ఖుడు. అట్లాగే, ఫలాన పని చేసేవాడే గొప్పవాడు, మిగితా వాళ్ళు అల్పమైనవారని భావించే సమాజం కూడా మూర్ఖపు సమాజమే. ఈనాటి కాలంలో జనం సమస్యలనే జీవితం అనుకుంటున్నారు, ప్రతి చిన్న విషయానికి మనసుపై నియంత్రణ కోల్పోతున్నారు, అన్నిటికి బాధపడిపోతున్నారు. అదే వద్దంటుంది ధర్మం. పరీక్ష పేయిల్ అయితే భోరున ఏడుస్తారు? అప్పుడు ఏడ్చి లాభం ఏంటి? ఆ ఏడుపు ఏదో ముందే ఏడిస్తే, పరీక్ష పాస్ అయ్యేవారు కదా. మార్కులు ప్రకటించాకా, మీరు ఏడిస్తే, మీ మార్కులు ఏమైనా మారుతాయా? లేదు కదా. జీవితంలొ అనేకం వస్తుంటాయి, వాటిని అంగీకరించాలి. మీరు కొన్ని అంగీకరించకపోయినా, అవి మారవు, మీరు మార్చలేరు. అటువంటప్పుడు బాధపడడం ఎందుకు? జీవితంలో ఏం వచ్చినా ఎదురుకోవాలి. జరిగినది ఏదో జరిగిపోయింది, జరగాల్సింది మీ చేతుల్లో ఉంది, రేపటి మీ జివితానికి విధాతలు మీరే, అందుకే ఆత్మస్థైర్యంతో, ఆత్మవిశ్వాసంతో బ్రతకాలి. అదే ధృతి.

To be continued................... 

Sunday 9 February 2014

హిందూ ధర్మం - 14

మొదలుపెట్టిన పనిని పూర్తి చేయడం ధృతి అని తప్పుడు పనులను కూడా అట్లాగే పూర్తి చేయాలనుకోకూడదు. మనం చేసే పని మంచిదైనప్పుడు, లోకమంతా అడ్డగించినా, పూర్తి చేయడం మాత్రమే ధృతి అవుతుంది. అంతేకానీ, దుష్ట ఆలోచనలు చేసి, అవి తప్పని తెలిసినా, వాటిని వదిలిపెట్టక, వాటిని పూర్తి చేయాలనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది

ఈ జీవితం అనేది సుఖదుఃఖాల కలియక, గెలుపు, ఓటముల సంగమం. ఒక సమయంలో సుఖం ఉంటే, మరొక సమయంలో దుఖం ఉంటుంది. సుఖం వచ్చిందని అతిగా ఆనందపడిపోకూడదు, దుఖం వచ్చిందని క్రుంగిపోకూడదు. ఎన్ని కష్టాలు వచ్చినా, తట్టుకుని, మరణం వచ్చేవరకు జీవించాలి. సముద్రానికి ఆటుపోట్లు ఉన్నట్టే జీవితానికి ఉంటాయి. తనలో ఎన్నో నదులు వచ్చి కలుస్తున్నా, సముద్రం పొంగిపోదు. సూర్యుడు తన నీటిని ఆవిరిరూపంలో పీల్చుకున్నా క్రుంగిపోదు. ఎప్పుడు ఒకేలా ఉంటుంది. అట్లాగే మనిషి కూడా జీవితంలో అన్నిటిని తట్టుకుని నిలబడాలి. ఈ ప్రపంచం ఒక వ్యాయమశాల వంటిది, ఇక్కడ నిన్ను బలవంతుడిగా చేసుకోవాలి అంటారు స్వామి వివేకానంద. స్వామిజీ చెప్పిన ఈ మాటలను గుర్తుపెట్టుకుని, జీవితంలో మనం అనుభవించే ప్రతి కష్టం నుంచి ఏదో ఒక విషయం నేర్చుకోవాలి. ఇక్కడ మన బలవంతులుగా మారాలి. ఎక్కడ జీవితం మీద నిరాశ చెందకుండా, ఆశవాదంతో జీవితాన్ని పరిపూర్ణంగా జీవించడం ధృతి. అదే ధర్మం యొక్క ప్రధమలక్షణం.

To be continued................... 

Saturday 8 February 2014

Great scientists and Indian Rishis

How is it that all of a sudden, through 1000's of years of human history, all the great scientists of the western world were born together??? Was it a lottery into the materialistic development of countries like UK, USA, Germany, etc.???


Only an Indian, who is well aware of his culture can raise such a question, as westerners give less scope for going against them.

The truth is that when Newton's forefathers were monkeys, Bhaskaracharya, an Indian scholar, wrote an entire book on gravity. Einstein was wise enough to accept that the source of inspiration for all his research was Indian culture. 

Our science, though lot more advanced, was never patented, as the generations who lived then, did lot of research beyond the materialistic world as well. 

But when thieves arrived our country, they had no option but to steal and register our research in their names. All they needed was a stamp which gave them a license to steal our research.

Via Hindu news

హిందూ ధర్మం - 13

1- ధృతిః : ఎంతటి ఆపద వచ్చినా, మానసిక స్థైర్యాన్ని, దైర్యాన్ని కోల్పోకపోవడం, ధృడ నిశ్చయం కలిగి ఉండడం ధృతిః. ప్రారంభించిన పనిని, ఎన్ని ఆపదలు, విఘ్నాలు వచ్చినా, తట్టుకుని, ఎదురించి, పోరాడి, పూర్తి చేయడం ధృతిః. నిత్యం సంతోషంగా ఉండడం, చావు తన్నుకు వస్తున్నా, ఆత్మవిశ్వాసం సడలకుండా, మృత్యువుకు సైతం ఎదురు నిలబడి పోరాటం చేయడం ధృతిః..

చిన్నప్పుడు భర్తృహరి సుభాషితాల్లో ఒక పద్యం చదివాం. గుర్తుందా?

ఆరంభించరు నీచమానవులు విఘ్నాయససంత్రస్తులై
యారభించి పరిత్యజింతురు విఘ్నాయాత్తులై మధ్యముల్
ధీరుల్ విఘ్ననిహన్యమాను లగుచున్ ధృత్యున్నతోత్సాహులై
ప్రారబ్ధార్ధము లుజ్జగింపరు సుమీ ప్రజ్ఞానిధుల్ గావునన్

ఏదైన ఒక పని మొదలుపెడితే, ఆపదలు, అడంకులు, కష్టాలు వస్తాయని భయపడి, అసలు చేయాల్సిన పనిని చేయకుండా తప్పించుకుంటారు కొందరు. వాళ్ళను నీచులు/అధములు అన్నాడు శతకకర్త. ఇక రెండవ రకంవారు, పని మొదలుపెట్టినా, ఆటంకాలు వచ్చాయని మధ్యలోనే వదిలిపెట్టేస్తారు, ఇక మావల్ల కాదు అని చేతులు ఎత్తేస్తారు, వీరు మధ్యములు. మూడవ రకంవారు, కష్టాలే రానీ, కన్నీళ్ళే రానీ, వచ్చిన ప్రతి ఆటంకాన్ని తొలగించుకుంటూ, ప్రతి ఆపదను ఎదురుకుంటూ, ఎప్పుడో ఏదో వస్తుందని భయపడకుండా, దిగులు చెందకుండా, 'ధృతి'తో, ఉత్సాహం కలిగినవారై, పనిని పూర్తి చేస్తారు, వీళ్ళు ధీరులు అనగా బుద్ధిమంతులు. ప్రతి మనిషికి ఉండవలసిన లక్షణం కూడా అదే అంటున్నది మనుస్మృతి. అందరూ కర్తవ్య నిర్వహణలో ధీరులు కావాలి. ధృతితో ఆఖరివరకు పోరాడి విజయం సాధించాలి. అదే ధర్మానికున్న మొదటి లక్షణం.

To be continued...................

Thursday 6 February 2014

హిందూ ధర్మం - 12

ధర్మానికి అనేకమంది ఋషులు నిర్వచనాలు చెప్పారు. అందులో ప్రధానంగా మనువు మహర్షి, తన మనుస్మృతిలో ధర్మానికి 10 లక్షణాలు ఉంటాయని చెప్పారు.

धृतिः क्षमा दमोऽस्तेयं शौचमिन्द्रियनिग्रहः ।
धीर्विद्या सत्यमक्रोधो दशकं धर्मलक्षणम् ॥
                                                             
- मनुस्मृति

ధృతిః క్షమ దమోస్తేయః శౌచం ఇంద్రియనిగ్రహః |
ధీవిద్యా సత్యమక్రోధః దశకం ధర్మలక్షణం ||

మనుస్మృతిః

ధృతి, క్షమా, దమము, అస్తేయం, శౌచం, ఇంద్రియ నిగ్రహం, ధీః (బుద్ధి), విద్యా, సత్యం, అక్రోధము (కోపం లేకపోవడం) అనే ఈ 10 ధర్మం యొక్క లక్షణాలు. ఏ మనిషైయిన ధర్మాన్ని ఆచరిస్తున్నాడా లేదా అని అనుమానం వస్తే, అతనిలో ఈ 10 లక్షణాలు ఉన్నాయో లేదొ గమనించుకోవాలని మనుమహర్షి చెప్పారు. ధర్మాన్ని ఆచరించాలనుకునేవారు ఈ 10 లక్షణాలు నిత్యం అవలంబించాలని చెప్పారు.

To be continued...................

Wednesday 5 February 2014

ఫిబ్రవరి 6, రధసప్తమి

రధసప్తమి


హిందు ధర్మంలో ఆదివారం చాలా పవిత్రమైంద రోజు. ఎప్పుడైనా సరే అదివారం సూర్యోదయ సమయానికి నిద్రించకూడదు. సూర్యోదయ సమయానికే నిద్రలేచి స్నానం చేసి, ఉదయించే సూర్యునకు నమస్కరించాలి.

రధసప్తమి రోజు ఎవరు సూరోదయానికంటే ముందే నిద్రలేచి ఉదయించే సూర్యునకు నమస్కరిస్తారో వారికి గత 7 జన్మల పాప ఫలితంగా వచ్చే రోగాలు తొలగిపోతాయి. ఎవరు సూర్యోదయానికి నిద్రిస్తుంటారో వారికి సకల రోగాలు వస్తాయట.

అలాగే రాగి చెంబులో నీరు తీసుకుని అందులో ఎర్రని పూలు, ఎర్ర గంధం, ఎర్రని అక్షతలు, లేత జిల్లేదు ఆకులు, గరిక ఇవన్నీ కొద్దిగా ఆ నీటిలో వేసి సూర్య భగవానుడికి చూపించి వదలాలి. దీనిని అర్ఘ్యం అంటారు. నీరు వదులుతూ ఈ శ్లోకం చెప్పుకోవాలి.

సప్తసప్తివహ ప్రీత సప్తలోక ప్రదీపన
సప్తమీ సహితో దేవ గృహాణార్ఘ్యం దివాకర

ఈ విధంగా చేయడం వలన ఆరోగ్యం చేకూరుతుంది.  

ఓం సూర్యాయ నమః |

హిందూ ధర్మం - 11

ఈ సృష్టిలో దేనికి జన్మ ఉంటుందో, దానికి మరణం ఉంటుంది, దేనికి మొదలు/ఆది ఉంటుందో, దానికి అంతం కూడా ఉంటుంది. కానీ ఈ ధర్మానికి ఆది, ఆంతమూ అన్నవి లేనేలేవు. సృష్టి అంతమైనప్పుడు అంతర్లీనమైన ఈ ధర్మం, సృష్టి ఆవిర్భావంతోనే తిరిగి అమలులోకి వస్తుంది. భూమి గురుత్వాకర్షణశక్తి మానవసమాజం గుర్తించని సమయం నుంచి ఉంది, మనిషి మర్చిపోయినా కూడా అలాగే ఉంటుంది. అట్లాగే ధర్మం కూడా. ఒకవేళ ఏదైనా ఉపద్రవం సంభవించి, ఈ ధర్మాన్ని ఆచరించే వారందరూ మరణించినా, ఈ ధర్మం నశించడం అన్నమాట ఉండదు. అది ప్రకృతిలో అట్లాగే ఉంటుంది. వేరొక సమయంలో తిరిగి ప్రారంభవుతుంది. సృష్టి లేకపోయినా, ధర్మం బీజరూపంలో ఎప్పుడూ ఉంటుంది.

సనాతనము అంటే చావు, పుట్టకలు లేనిది, నిన్న ఉండినది, ఈరోజు ఉన్నది, రేపు ఉండేది, ఎప్పటికి, ఎన్నటికి ఉండేది అని. ఈ ధర్మం ఆది, అంతములు లేనిది, ఎప్పటి నుంచో ఉన్నది, ఎప్పటికి ఉండేది, కనుక దీనికి సనాతన ధర్మం అని పేరు.

ఈ ధర్మాన్ని ఆచరించేవారు సనాతనులు (శరీరానికే పుట్టుకచావులు కానీ, ఆత్మకు కాదు, ఆత్మ సనాతమైనది, మనం శరీరం కాదు, శరీరంలో ఉన్న ఆత్మస్వరూపులం, ఆత్మకు చావు లేదు), ఈ ధర్మాన్ని చెప్పిన భగవంతుడు సనాతనుడు (ఆది, అంతములు లేనివాడు, ఎప్పటికి ఉండేవాడు), ఈ ధర్మం సనాతనంగా వస్తున్నది, ఇది పాటించడం వలన సృష్టి అధిక కాలం సుఖసంతోషాలతో, శాంతిసౌభాగ్యాలతో కొనసాగుతుంది, ఇది ఆచరించి మానవుడు తన సనాతన తత్వాన్ని తెలుకుంటాడు, కనుక దీన్ని సనాతన ధర్మం అన్నారు. ఈ ధర్మానికి మూలం వేదం కనుక వైదిక ధర్మం అన్నారు.

To be continued...................

Sunday 2 February 2014

హిందూ ధర్మం - 10

మతం ఎప్పుడు మానవులకే, అందునా దాన్ని అంగీకరించేవారికి పరిమితం అయ్యింది. మనం చెప్పుకుంటున్న ధర్మం మనుష్యులకే కాదు, అన్నిటికి అన్వయం అవుతుంది. జంతువులకు ఒక ధర్మం ఉంది. దాన్నే మన పశుధర్మం అంటాం. వాటికి ఉదయం లేచిన దగ్గరి నుంచి, ఆహారం కోసం వెతకడం, ఏదైనా జంతువు కనిపిస్తే దాన్ని చంపి తనడం, తన కడుపు నింపుకోవడం, తనకు హాని చేసే ఇతర జంతువులను చంపడం, తమ శారీరిక కోరికలను తీర్చుకోవడంలో బంధుత్వాలు వంటివి లేకపోవడం పశుధర్మం. అవి ప్రకృతి ధర్మానికి అనుగుణంగా, ప్రకృతి చక్రంలో భాగంగా జరుగుతున్నాయి. వీటిని కూడా భగవంతుండే నిర్ణయించాడు.

ఉదాహరణకు పక్షులనే గమనించండి. కొన్ని పక్షులు సూర్యోదయం వరకు గూడులోంచి కదలవు. సూర్యుడు రాగానే, ఆహారం కోసం బయటకు వస్తాయి, సూర్యాస్తమయానికి తిరిగి ఎట్టి పరిస్థుతుల్లోనూ గూళ్ళకు చేరుకుంటాయి. అట్లాగే కొన్ని పక్షులు రాత్రి బయటకు వస్తాయి. ఈ విధంగా, అవి కొన్ని నియమాలకు, కట్టుబాట్లకు లోబడి పనిచేస్తాయి. ఆ కట్టుబాట్లే వాటి ధర్మం. వాటిని ప్రక్రృతి నియంత్రిస్తుంది. పుట్టుకతోనే వాటికి వాటి ధర్మం తెలుసు. ఎందుకంటే ఒక్క మానవ జన్మ తప్ప, ఇతర జన్మలలో ఆత్మకు కర్మ చేయడంలో స్వేఛ్చలేదు. వాటికి కూడా మనసు ఉంటుంది, బుద్ధి ఉంటుంది, కానీ వాటి బుద్ధి పూర్వ జన్మవాసనల మీద ఆధారపడి ఉంటుంది. కానీ మనిషికి మాత్రం తను చేసే కర్మల మీద పూర్తి స్వేచ్చనిచ్చాడు, స్వతంత్రంగా ఆలోచించే బుద్ధినిచ్చాడు ఈశ్వరుడు. ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నవాడు భగవంతుడిని చేరితే, దుర్వినియోగం చేసుకున్నాడు మళ్ళీమళ్ళీ జంతువులుగా, పక్షులుగా పుట్టి బాధలు అనుభవిస్తాడు. అందుకే ప్రతి మనిషి ధర్మాన్ని తెలుసుకుని, ఆచరించి, తరించాలి.

అసలు మన ధర్మం ఏంటి? మనం ఏం ఏం ఆచరించాలి? ఏల బ్రతకాలి? ధర్మం లక్షణాలు ఏంటి? అదేమని భోధిస్తుంది వంటి విషయాలు తెలుసుకుందాం.

To be continued...................

Saturday 1 February 2014

హిందూ ధర్మం - 9

ఈ విశ్వమంతా కొన్ని నియమాలను అనుసరించి నడుస్తున్నదే. ఈ విశ్వం ఇలా ఎందుకు ఉండకూడదు అంటే ఎవరు సమాధానం చెప్పగలరు ? ఈ విశ్వానికి ఒక ధర్మం ఉన్నది, దాన్ని అనుసరించే ఇదంతా సాగుతోంది. మనం మాట్లాడుకునేది కూడా ఆ ధర్మం గురించే. ఏ విధంగానైతే ఈ లోకంలో అన్నిటికి భగవంతుడు ఒక ధర్మాన్ని ఏర్పరిచాడో, అదే విధంగా మనిషి బ్రతకవలసిన విధానం గురించి కూడా చెప్పాడు.

మానవుడు ఏ విధంగా బ్రతకడం చేత, తను చేసిన పాపాన్ని నశింపజేసుకుని పరమాత్మను చేరగలడో, దేన్ని పాటించడం చేత విశ్వ ధర్మాలకు అనుగుణంగా జీవించి, కాలచక్రానికి విఘాతం ఏర్పరచకుండా జీవనం సాగించగలడో, ఏలా బ్రతకడం చేత మానవుడు దైవత్వాన్ని పొందగలడో, ఏది జనులందరూ ఆచరించడం చేత లోకంలో శాంతి వర్ధిల్లుతుందో, అదే ధర్మం. మనిషి ఇలా బ్రతకాలని చెప్తుంది ధర్మం. ధర్మం చెప్పినట్టు చేయడం వలన పుణ్యం కలిగితే, ధర్మానికి విరుద్ధంగా చేయడం వలన పాపం కలుగుతుంది. ధర్మం విముక్తికి మార్గం అయితే, ధర్మాన్ని ఆచరించకపోవడం బంధానికి హేతువవుతుంది.

ఇప్పుడు మనం ఏదైతే ధర్మం గురించి చెప్పుకుంటున్నామో, ఆ ధర్మానికి ఒక పేరు లేదు. గత 5,000 ఏళ్ళ క్రితం వరకు, మహాభారత యుద్ధం ముగిసిన తరువాత కొంతకాలం వరకు, ప్రపంచమంతా, అన్ని దేశాల జనం ధర్మాన్ని మాత్రమే ఆచరిస్తూ వచ్చారు కనుక దీనికి ప్రత్యేక పేరు పెట్టవలసిన అవసరం రాలేదు. ధర్మం అన్నమాటకు సమానమైన ఆంగ్లపదం కానీ, మరే ఇతర పదం కానీ ప్రపంచభాషల్లో లేదు. పాళీ లిపిలో ధర్మాన్నే ధమ్మము అన్నారు. కానీ అది పూర్తిగా స్వీకరించదగ్గది కాదు.

To be continued.......