Sunday 30 December 2012

జనవరి-1 కొత్త సంవత్సరం కానే కాదు భారతీయులకు.

ఓం 

జనవరి-1 కొత్త సంవత్సరం కానే కాదు భారతీయులకు.

జనవరి 1 వ తేదీన ప్రపంచమంతా కొత్త సంవత్సరం జరుపుకుంటుంది.భారత్ లో కూడా దాదాపు అన్ని వర్గాలు,వయసుల వారు వేడుకలు జరుపుకుంటారు.కేకులు కోస్తారు,విందులు వినోదాలలో మునిగిపోతారు.డిసెంబరు 31న అయితే మరీనూ.శివరాత్రికైన జాగరణ చేయనివారు ఉంటారు కాని,31 డిసెంబరు రాత్రి మాత్రం తప్పకుండా మెలుకువగా ఉంటారు.

మనం ఒక విషయం మర్చిపోతున్నాం.జనవరి 1 మనకు అంటే భారతీయులకు కొత్త సంవత్సరం కాదు.దీన్ని ఆధారంగా చేసుకుని మన సంస్కృతిలో కొత్తగా ఏమి మొదలుకావు.భారతీయులకు కొత్త సంవత్సరం అంటే తేదీలలో మార్పు వలన వచ్చేది అసలే కాదు.మనకు ఒక కొత్త సంవత్సరం జరుపుకునే రోజు ఉంది.అది యుగాది(ఇవాళ మనం ఉగాదిగా పిలుస్తున్నాం).

మన పండగలు ఏదో పబ్బం గడుపుకోవటానికి రాలేదు.ఈ సమస్త విశ్వంలో నిరంతరం జరిగే అనేక సంఘటనలు,నక్షత్రాలు,గ్రహాల నుండి వెలువడే విద్యుత్ అయస్కాంత్ కిరణాలు,వాటి వలన మానవుని పై ఉండే ప్రభావాలను చాలా సూక్ష్మంగా,సరైన విధానంలో లెక్కించి మనం(భారతీయులం,హిందువులం) తిధి,వార,నక్షత్ర,యోగ,కరణాలను నిర్ణయిస్తాం.వాటి భ్రమణంలో జరిగే మార్పులను బట్టే మన పండగల తేదీలు మారుతుంటాయి.ఒక సెకనులో 360వ వంతు(1/360 th part of the second) సమయాన్ని,అంత తక్కువ సమయంలో ఈ సమస్త విశ్వంలో జరిగే అనేకానేక మార్పులను పరిశీలించి,మానవుల మీద వాటి ప్రభావాలను ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడాకుండా,కేవలం మానవ మేధస్సుతోనే లెక్కించి,వివరించిన ఘనత మన మహర్షులకే చెల్లింది.మనం వాళ్ళ వారసులం.మన సంస్కృతి అంత గొప్పది.

ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఆచరించే క్యాలెండర్ గ్రిగోరియన్ క్యాలెండర్.అది బ్రిటిష్ వారు ప్రపంచం మీద రుద్దారు.అది scientificగా చూసిన తప్పుల తడకే. వేరే దిక్కులేక ప్రపంచం దీనిని అనుసరిస్తోంది.

ఇప్పుడింతా ఎందుకంటే ఈ జనవరి 1న కొత్త సంవత్సరం జరుపుకోవడం వలన మనకు ఓరిగేదేమి లేదు,డబ్బు ఖర్చు తప్ప.మనకంటూ ఒక సంస్కృతి ఉంది.దాన్ని మరువకండి.

మీరంటారేమొ?.........మేము enjoy చేస్తుంటే వద్దనే హక్కు మీకు ఎవరిచ్చారని.మేము మిమ్మలని enjoy చెయ్యొద్దని చెప్పటంలేదు.మీరు ఏమి చేస్తారో మీ ఇష్టం.కాని ఇది మనది కాదని మాత్రం గుర్తుపెట్టుకోండి.అంతేకాదు,మీరు చేస్తున్నenjoyment  కేవలం తాత్కాలికమైనది.ఇది మీకు సంతృప్తినిచ్చినా అది అశాశ్వతమైన సంతృప్తినిస్తుంది.మీలో ఇంకా ఇంకా enjoy చేయాలన్న కోరికను కలిగిస్తుంది.చివరకు ఆశాంతిని మిగిల్చుతుంది.మీకు కలిగే ఆనందం కేవలం బాహ్యమైనదే.ఆనందాన్ని బయట ప్రపంచంలో వెతకకండి."చిదానంద రూపః శివోహం శివోహం"-మీలో ఉన్న మీరే(ఆత్మ) నిజమైన,శాశ్వతమైన,ఆనంద రూపం,శివ స్వరూపం అన్న విషయాన్ని గుర్తించండి,అనుభవంలోనికి తెచ్చుకోండి.అప్పుడు కలిగేది పరమానందం,ఆత్మానందం.అదే శాశ్వతమైనది.ఇదే నిజం,సత్యం,యదార్ధం.                    

మన దేవాలయాలు-5

ఓం గం గణపతయే నమః
ఆదివారం-ప్రత్యేకం 
మన దేవాలయాలు-5
దేవాలయో రక్షతి రక్షితః
(దేవాలయాల రక్షణే మన రక్షణ)

గుడి అనగానే మనకు గుర్తుకువచ్చేది ముందుగా గోపురమే.గోపురం విశిష్టత ఏమిటి?


ఆగమ శాస్త్రానుసారం ఆలయ నిర్మాణం దేవుడు పడుకున్నట్లు శయనరీతిలో నిర్మిస్తారు.గర్భగుడి భగవంతుని శిరసు,ఆలయ మంటపం భగవంతుని కడుపు,ఆలయ గోపురం దేవుడి పాదాలు.దైవ దర్శనం అంటే గుడికి వెళ్ళి ప్రదక్షిణ చేసి,స్వామిని చూసి గంటకొట్టి నమస్కరిస్తాం.కాని ముసలివాళ్ళూ,రోగులు,నిత్య జీవితంలోని అనేక కార్యక్రమాల వల్ల గుడికి వెళ్ళలేనివారు(వెళ్ళే అవకాశం లేనివారు),తామున్న ప్రాంతం నుంచే దూరంగా,ఎత్తుగా కనిపిస్తున్న గోపురానికి నమస్కరిస్తే ఆలయంలో ఉన్న స్వామిపాదాలకు నమస్కరినట్టేనని శాస్త్రం తెలియజేస్తోంది. 

పూర్వాకాలంలో ఈరోజు ఉన్నట్టుగా హోటల్ సౌకర్యాలు లేవు.ఇతర దేశాలు,రాజ్యాలు,ప్రదేశాల నుండి వచ్చిన బాటసారులకు దేవాలయం ఎక్కడ ఉందో తెలుసుకోవటానికి గోపురాలు ఎత్తుగా కట్టారు.అంతేకాదు,ఆ కాలంలో దేవాలయాల్లో నిత్యం అన్నదానం జరిగేది.వైద్య సదుపాయాలు కూడా దేవాలయంలో ఉండేవి.అందువల్ల క్రొత్తగా వచ్చిన వారు ఆకలితో ఆహారం కోసం వెత్తుక్కునే పరిస్థితి నేరుగా దేవలయాలకే వెళ్ళి,అక్కడ ప్రసాదం స్వీకరించేవారు,సేద తీరేవారు.వారికి మార్గ నిర్దేశకాలు గోపురాలే కదా.

దేవుడు సర్వోన్నతుడు(అందరికంటే ఉన్నతమైన వాడు/గొప్పవాడు).ఈ విషయాన్ని మరిచిపోయిన మనిషి తానే గొప్పవాడినని,అంతా తనవల్లే జరుగుతోందని,తాన కంటే గొప్పవారేవరూ లేరని అహంకారంతో విర్రవీగుతాడు.అది భ్రమ మాత్రమే,అందరికంటే భగవంతుడే సర్వోన్నతుడు అన్న భావం అందరిలో కలగడానికి,మనసుకి భోధపడటానికి దేవాలయ గోపురాన్ని ఎత్తుగా నిర్మిస్తారు.

గోపురం అంటే పిరమిడ్ ఆకారం(గత భాగాల్లో పిరమిడ్ ఆకారాల గొప్పతనం,వాటి అతీతమైన శక్తిని గురించి చెప్పుకున్నాం).పిరమిడ్ ఆకారాలు మాత్రమే కొన్ని వందల,వేల సంవత్సరాలు స్థిరంగా ఉంటాయి కనుక వాటిని పిరమిడ్ ఆకారంలో నిర్మిస్తారు.అంతేకాదు గోపురం ఈ బ్రహ్మాండంలో ఉన్న అనంతమైన విశ్వశక్తిని ఆకర్షిస్తుంది.కొన్ని వందల,వేల సంవత్సరాల వరకు గోపురాలు శక్తిని గ్రహించి,నిలువ ఉంచుకునే శక్తి కేంద్రాలు.అంతేకాదు మొత్తం దేవాలయానికి అది దివ్యశక్తులను నిత్య అందిస్తూ ఉంటుంది.కనీసంలో కనీసం 500 సంవత్సారాల పాటు ఒక గోపురం అనేక దివ్యశక్తులను దేవాలయానికి అందిస్తుంది.అంటే గోపురం కూడా ఒక అమోఘ శక్తి కేంద్రం.అందుకే దేవాలయానికి వెళ్ళవలసిన రీతిలో వెళ్తే కనుక,ఆలయగోపురం క్రింది నుంచి వెళ్తున్న సమయంలో మనలో తెలియని ఆనందకరమైన అనుభూతి కలుగుతుంది.

ఒక గోపురం ఎత్తు ఆ ఆలయమూలవిరాట్టు(ఆలయ ప్రధాన దైవ విగ్రహం) ఎత్తుని బట్టి నిర్ణయిస్తారు.గాలి గోపురాలు ఉన్న ఆలయాలకు విశేషమైన కీర్తి ప్రతిష్టలు ఉంటాయని ధార్మిక గ్రంధాలు తెలియజేస్తున్నాయి.

ఉరుములు,మెరుపులతో కూడిన వర్షాలు పడిన సమయంలో అక్కడున్న నిర్మాణాలకు,ప్రజలకు ఎటువంటి నష్టం వాటిల్లకూండా,పడుగు పాటును గ్రహించి,ఆ విద్యుత్ శక్తిని భూమిలోనికి పంపించేస్తాయి గోపురాలు.అంతేకాదు అవి గ్రహించిన దివ్యశక్తులను ఆలయంలో ఉన్న మూలమూర్తికి నిత్యం అందిస్తుంటాయి గోపురాలు.


చారిత్రికంగా చెప్పుకోవలసి వస్తే అలనాటి శిల్పకళ చాతుర్యానికి,వైభవానికి ప్రతీకలు మన ఆలయ గోపురాలు.కాని ఈ రోజు అనేక గోపురాలు కూలిపోతున్నాయి,శిధిలమవుతున్నాయి,పాడుతున్నాయి,పిచ్చిమొక్కలు మొలిచి వాటికి అందాన్ని కోల్పోతున్నాయి.ఏన్నో వందల సంవత్సరాల మన చారిత్రిక వారసత్వ సంపద గోపురాలు.మనం ఈ రోజు ఏదినా ఒక నిర్మాణం చేస్తే అది ఎన్ని సంవత్సరాలు ఉంటుంది?ఏన్నో సంవత్సరాల క్రితం,సిమెంట్ లేనికాలంలో రాయిమీద రాయిని పెట్టి,కొన్ని వందల సంవత్సరాల వరకు చెక్కు చెదరకుండా పదిలంగా ఉండేలా నిర్మాణం చేశారు మన పూర్వీకులు.మనమేలాగో అంత గొప్ప నిర్మాణాలు చేయలేము.కనీసం ఉన్నవాటినైన కాపాడుకుందాం.

ఎక్కడైన గోపురం కూలిందంటే అక్కడ కూలింది గోపురం మాత్రమే కాదు.మన వారసత్వ సంపద,మన పూర్వీకుల శ్రమ.ఇకనైన మన గోపురాలను,దేవాలయాలను కాపాడుకుందాం.  
   
దేవాలయో రక్షతి రక్షితః
(దేవాలయాల రక్షణే మన రక్షణ)

ఓం శాంతిః శాంతిః శాంతిః
to be continued.............
      
       

Saturday 29 December 2012

సంకష్టహర చవితి

ఓం గం గణపతయే నమః
జనవరి 1 2013-మంగళవారం,సంకష్టహర చవితి,అంగారక చతుర్థి.

మంగళవారం సంకష్టహర చవితి వస్తే అది చాలా విశేషమైనది.దానిని అంగారక చతుర్థి అని పిలుస్తారు.గణపతి ఆరాధనకు విశేషమైన రోజు అది.

సంకష్టహర చతుర్థి:
దీన్నే సంకట చతుర్థి,సంకట చవితి అని కూడా అంటారు.నిజానికి ఇది సంకటహర చవితి. గణపతికి సంబంధించిన ఈ చతుర్థిని ఆలంబనగా చేసుకొని చేసే వ్రతాన్ని సంకటవ్రతం అంటారు.

ప్రతిమాసం కృష్ణపక్షంలో అంటే పౌర్ణమి తరువాత 3,4 రోజుల్లో చవితి వస్తుంది.

ప్రదోషకాలంలో(సూర్యాస్తమయ సమయంలో)చవితి ఎప్పుడు వుంటుందొ ఆ రోజున సంకష్టహర చవితిగా లెక్కలోకి తీసుకోవాలి.రెండు రోజులు ప్రదోష సమయంలో చవితి ఉండటం సాధారణంగా జరగదు.ఒక వేళ ఎప్పుడైనా అలా జరిగితే రెండవ రోజున సంకటహర చవితిగా తెలుసుకోవాలి.

సాధారణంగా ఎక్కువ క్యాలెండర్లలోనూ,పంచాంగాలలోనూ సంకష్టహరచతుర్థి తెలియజేయబడి ఉంటుంది.ఈ వ్రతం ఆచరిస్తే జరగని పని లేదు.

ఈ వ్రతాన్ని 3,5,11 లేద 21 నెలలు ఆచరిస్తారు.ఈ సంకట వ్రతాన్ని సంకట చవితి రోజున ప్రారంభించాలి.ప్రారంభించే రోజున స్నానానతరం గణపతిని పూజించి,తరువాత ఎరుపు లేద తెలుపు జాకెట్ పీస్ గాని,సుమారు అరమీటరు చదరం గల ఎరుపు లేద తెలుపు రంగుగల కాటన్ గుడ్డను గాని తీసుకొని గణపతి ముందుంచి దానికి పసుపు పెట్టి చిటికెడు కుంకుమ వేసి స్వామిని తలుచుకొని మనసులో వున్న కోరికను మనసార స్వామికి తెలిపి మూడు దోసిళ్ళు(గుప్పిళ్ళు) బియ్యాన్ని అందులో పొయ్యాలి.ఆ తరువాత 2 ఎండు ఖర్జురాలు,2 వక్కలు,దక్షిణ ఉంచి తమలపాకులను అందులో వుంచాలి. మనసులొని కోరికను మరోసారి తలచుకొని మూటకట్టాలి.దానిని స్వామి ముందు ఉంచి ధూపం(అగరుబత్తి) వెలిగించి టెంకాయ లేద పళ్ళు నివేదన చేయాలి.


ఏదైనా గణపతి ఆలయానికి వెళ్ళి ఆలయం చుట్టు 3,11 లేదా 21 సార్లు ప్రదక్షిణ చేయాలి.వీలైనంత వరకు గణపతికి ఇష్టమైన గరిక వంటి వాటిని సమర్పించాలి.ఆలయానికి వెళ్ళటం సాధ్యం కానప్పుడు ఇంట్లోనే ఒకచొట గణపతిని వుంచి ప్రదక్షిణ చేయవచ్చు.పూజలో ఉన్న గణపతిని తీయకూడదు.శారీరికంగానూ,మానసికంగానూ స్వామికి ఎంత సేవ చేశామన్నది ముఖ్యం.అంతేకానీ ఎన్ని టెంకాయలు సమర్పించాం,ఎన్ని పళ్ళు నివేదించాం అన్నది ముఖ్యం కాదు.

సూర్యాస్తమయం అయిన తరువాత స్నానం చేసి దీపం వెలిగించి స్వామికి లఘువుగా పూజ చేయాలి."సూర్యాస్తమయం వరకు ఉడికించిన  పదార్ధంగాని,ఉప్పు తగిలిన(కలిసిన)/వేయబడిన  పదార్ధాలు తినకూడదు".పాలు,పళ్ళూ,పచ్చి కూరగాయలు తినవచ్చు.అనుకున్న సమయం(3,5,11 లేదా 21 'చవితి 'లు)పూర్తి అయ్యేవరకు ఇలాగే ప్రతి సంకటహర చవితికి చేయాలి.చంద్రదర్శనం లేద నక్షత్ర దర్శనం చేసుకొని చంద్రునకు ధూప,దీప,నైవేద్యాలను సమర్పించి మాములుగా భోజనం చేయవచ్చు.నియమం పూర్తి అయ్యాక ముడుపు కట్టిన బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం భుజించాలి. ఈ వ్రతం వల్ల ఏది కొరినా సిద్దిస్తుందని ప్రతీతి.

courtesy-sri saila prabha
ఓం గం గణపతయే నమః

ఓం శాంతిః శాంతిః శాంతిః

Friday 28 December 2012

మన తెలుగు




ఒక ప్రాంతానికి,అక్కడి సంస్కృతి సంప్రదాయాలకు,ఆచార వ్యవహారాలకు,భాషకు ఎనలేని సంబంధం ఉంటుంది.కాళేశ్వరం,శ్రీ కాళహస్తి,దక్షరామ క్షేత్రాల మధ్య ఉన్న భూమిని త్రిలింగ దేశమన్నారు.ఆ పవిత్ర త్రిలింగ దేశమే మన తెలుగు నేల.మనమంతా తెలుగు వెలుగులం.మన మాతృ భాష తెలుగు.ప్రతి పదం కూడా అచ్చుతోనే ముగిస్తుంది మన తెలుగు భాషలో.అందుకే దీనిని "ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్" గా పిలుస్తారు.3000 ఏళ్ళ చరిత్ర ఘన చరిత్ర,ఎంతో సాహిత్యం కలిగిన మహోన్నతమైన తెలుగు నాగరికత మనది.ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్నాయి.అక్కడివరకు బాగానే ఉంది.ఎందరో తెలుగు వాళ్ళు హాజరవుతున్నారు.ఎందుకో తెలియదు కాని మనం తెలుగులో మాట్లాడడానికి సిగ్గు పడుతున్నాం.

ఒక మనిషి తల్లిగర్భంలో ఉన్న సమయంలోనే తల్లి మాట్లాడే మాటలను ఆ శిశువు వింటుంది.గమనిస్తుంది.గ్రహిస్తుంది.అంటే మనం పుట్టకముందే మంకు మన భాషకు బంధం ఏర్పడింది.అంతేకాదు,ఒక మనిషి తాను ఏదైనా ఇతర భాషలను విన్నప్పుడు,అది అతని మెదడుకు చేరి,మాతృ భాషలోకి అనువదింపబడుతుంది.ఇది చాలా వేగంగా జరిగే ప్రక్రియ.అప్పుడే అతనికి అర్ధం అవుతుంది.ఆంగ్లం విషయంలో కూడా ఇంతే.మనం విన్న ప్రతి ఆంగ్ల పదాన్ని మన మెడదు మనకు తెలియకుండానే తెలుగులోనికి అనువదించి మనకు అర్ధమయ్యేలా చేస్తుంది.అటువంటిది ఈవేళ మనం తెలుగు నేర్చుకోవడం అనవసరమని భావిస్తున్నాం.తెలుగు నేర్చుకొనకపోతే మనకు మానసిక వికాసం కలుగదు,అభివృద్ధి చెందలేము.అందుకే తెలుగు నేర్చుకోవాలి.అమ్మ భాషలో ఉన్న కమ్మదనం వేరే భాషలో ఎక్కడిది.అందుకని తెలుగులోనే మాట్లాడాలి.

మనకు విలువలు నేర్పే అనేక రచనలు తెలుగులో ఉన్నాయి.
"తల్లి దండ్రి మీద దయ లేని పుత్రుండు
పుట్టనేమి వాడు గిట్టనేమి
పుట్టలోన చెదలు పుట్టవ గిట్టవ
విశ్వదాభిరామ!వినురవేమ!"
అమ్మనాన్నలన మీద దయం,ప్రేమ లేనివాదు,వాళ్ళని చూసుకోని వాడైన కొడుకు పుడితే ఎంత?చస్తే ఎంత?పుట్టలోన చెదలు పుడుతుంటాయి,చస్తుంటాయి,వాడికి చెదలపురుగులకు తేడా ఏంటి?అని అర్ధం.
ఇటువంటివి మనం గొప్పగా నేర్చుకునే భాషలో కనిపించవు.మనకు మంచి,భోధించడానికి అనేక పద్యాలు,కధలను వ్రాసి పెట్టారు మహానుభావులు.మనం తెలుగును మరిస్తే విలువలను భావితరాలకు నేర్పేదేవరు?

ఒకప్పుడు మోకాలే ఆంగ్లేయులు మన దేశాన్ని ఆక్రమించాలి అంటే ఈ దేశస్థులకు సంస్కృతాన్ని దూరం చేయాలని బ్రిటిష్ చట్టసభలో ప్రకటించి,ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టి,మన చరిత్రను చేరిపేసి,కట్టుకధలను భారతీయ చరిత్రగా పుస్తకాల్లో ప్రవేశపెట్టాడు.సంస్కృత భాషలోనే మన సంస్కృతి ఉంది.అంతేనా!మన గ్రంధాలు సన్స్కృతంలోనే ఉన్నాయి.వాటిలో ఉన్న సాంకేతిక పరిజ్ఞానానికి మనం దూరమయ్యాం.అందుకే ఈ రోజు మనం విదేశీయులకు బానిసలుగా మారిపోయాం.మన దగ్గర ఉన్న విషయాలను,వారు క్రొత్తగా కనుకున్నామని చెబుతుంటే అదంతా వారి గొప్పతనమూ,మనకేం లేదంటూ వారిని కీర్తిస్తున్నాం.ఆల్బర్ట్ ఐన్ స్టీన్ కు సంస్కృతం వచ్చని మీకు తెలుసా?ప్రపంచ మేధావులు అందరూ ఒకానొక కాలంలో సంస్కృతం నేర్చుకున్నారు.కాని మనం మాత్రం అదంతా పాతచింతకాయ పచ్చడని మన మీద మనమే విమర్శలు చేసుకుంటున్నాం.

ఇక తెలుగు విషయానికి వద్దాం.2030 నాటికి ప్రపంచంలో అంతరించిపోయే భాషల జాబితాలో తెలుగు కూడా ఉంది, జాగ్రత్త పడండని ఐక్య రాజ్య సమితి హెచ్చరించింది.తెలుగు అంతరించిపోతే తెలుగు సంస్కృతి,తెలుగు చరిత్ర, తెలుగు వాజ్ఞ్మయం,తెలుగుదనం అన్నీ అంతరించిపోతాయి.ఇక తెలుగు వారసులు తమ చరిత్ర ఏంటో, తామెక్కడి వారమో తెలియక దిక్కుమొక్కులేక, ఆవేశంతో, ఆక్రోషంతో మనలని నిందిస్తారు,ఆత్మ గౌరవాన్ని కోల్పోతారు, దిక్కులేని వారిగా మిగిలిపోతారు.ఇప్పటికైన మేల్కొందాం.తెలుగును కాపాడుకుందాం.

మీరందరూ ఆంగ్లాన్ని వదిలేయండి అని నేను చెప్పటంలేదు.అన్ని భాషలు నేర్చుకున్న మన భాషను మన కాపాడుకోవాలి.తెలుగులోనే మాట్లాడుదాం.మన భాషను,సంస్కృతిని కాపాడుకుందాం.

జై తెలుగు!జై జై తెలుగు!                                         


Thursday 27 December 2012

దత్తజయంతి


ఓం శ్రీ దత్తశరణం మమ

ఒకసారి నారదుడు సరస్వతి,లక్ష్మీ,పార్వతులు కలిసి ఉండగావచ్చి మీకంటే గొప్ప పతివ్రత ఉంది ఈ లోకంలో, ఆమె అత్రి మహర్షి భార్య అనసూయ దేవి అన్నాడు. వారు ఆమె పాతివ్రత్యాన్ని లోకానికి తెలియపరచాలనుకున్నారు. బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి, శివుడు ఆమెను పరిక్షించడానికి, ఆమె పతిభక్తిని లోకాలకు తెలియజేయడానికి సన్యాసుల రూపంలో ఆమె ఇంటికి బిక్షకు వెళ్తారు. అప్పుడు అత్రి మహార్షి ఆశ్రమంలో ఉండరు. అనసూయదేవి వారిని లోపలికి ఆహ్వానించి భోజనానికి ఏర్పాట్లు చేస్తుంది. వడ్డించే సమయానికి వారు ఆమెను వివస్త్రగా ఆహారం పెట్టమని కోరుతారు. ఆమె ఒక్క క్షణం ఆలోచించి, చేతిలో నీరు తీసుకుని, తన భర్తను స్మరించి, మంత్రం జపించి వారి మీద చల్లుతుంది. వేంటనే త్రిమూర్తులు పసిపిల్లలుగా మారిపోతారు. వారు కోరినట్టుగానే అనసూయదేవి త్రిమూర్తులకు పాలు ఇస్తుంది. అత్రిమహర్షి ఆశ్రమానికి తిరిగివచ్చాకా ఆ ముగ్గురు పసిపిల్లలను తన హృదయానికి హత్తుకుని 3 తలలు, 6 చేతులు ఉన్న ఒక పిల్లవానిగా మార్చివేస్తారు. తమ భర్తలు ఎంతసేపటికి రాకపోవడంతో సరస్వతి, లక్ష్మీ, పార్వతులు అత్రి-అనసూయ దంపతులతో తమ భర్తలకు నిజరూపాలు ఇవ్వమని వేడుకుంటారు. అందుకు అనసూయ దేవి అంగీకరించి వారి మీద తిరిగి మంత్రించిన జలం చల్లుతుంది. వారి వారి సాధారణ రూపాలను పొందిన త్రిమూర్తులు అత్రి-అనసూయలకు తమ అంశయైన దత్తాత్రేయ స్వామిని కూమారునిగా ప్రసాదిస్తారు. దత్తాత్రేయ స్వామి అవతారం మార్గశిర పౌర్ణమి నాడు జరిగింది.

ఈయనను పూజిస్తే భూతప్రేతపిశాచాల బాధించవు, గురు గ్రహ దోషాలు తొలగిపోతాయి. విద్యార్ధులకు దత్తాత్రేయ స్వామి విద్యాప్రదాత. మేడి చెట్టు (ఔదుంబర వృక్షం) కింద ఉంటాడు. ఈయన వద్ద నాలుగు కుక్కలు ఉంటాయి. అవి నాలుగు వేదాలకు ప్రతీకలు.

ఓం దత్తాత్రేయాయ నమః
ఓం శ్రీ దత్త శరణం మమ
ఓం శాంతిః శాంతిః శాంతిః  

Wednesday 26 December 2012

ధ్యానం

ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస

పిరమిడ్ అద్భుత శక్తి-
ప్రపంచంలో ఏడు వింతలలో ఒకటైన పిరమిడ్ విశ్వశక్తి(cosmic energy)ని విస్తారముగా తీసుకోగిలిగిన కట్టడం.పిరమిడ్ నండు కూర్చుని ధ్యానం చేయడం ద్వారా 3రెట్ల అధికమైన విశ్వశక్తి(cosmic energy)ని తీసుకొనవచ్చు.పిరమిడ్ లో ధ్యానం చేసినవారు పూర్తి ఆరోగ్యం పొందగలుగుతారు.ప్రతి రోజు ధ్యానం చేస్తే ఆత్మజ్ఞానం పొంది ఆరోగ్యంగా,ఆనందంగా జీవించగలము.

ధ్యానం చేసే పద్ధతి-
హాయిగా సుఖాసనంలో కూర్చుని చేతులు రెండు కలిపి,వేళ్ళలో వేళ్ళు పెట్టుకుని,కళ్ళు మూసుకుని సహజంగా జరిగే ఉచ్చ్వాస,నిశ్వాసలను గమనిస్తూ ఉండాలి.ఏ మంత్రం జపించనవసరం లేదు.ఏ దైవస్వరూపాన్ని ఊహించనవసరం లేదు.మధ్యమధ్యలో వచ్చే ఆలోచనలను విడిచిపెట్టి మళ్ళీమళ్ళీ శ్వాసనే గమనిస్తూ ఉంటే నెమ్మదిగా ఆలోచనలు కలుగని స్థితికి చేరుకుంటాము.ఇదే ధ్యానం!ఈ ధ్యానం పిరమిడ్ క్రింద చేస్తే మూడింతల శక్తి అధికంగా పొందవచ్చు.ఈ ధ్యానం ఏ వయస్సువారైనా,ఎప్పుడైనా,ఎక్కడైనా చేయవచ్చు.  

మన ఆంధ్రప్రదేశ్ రంగారెడ్డి- మహబూబ్ నగర్ జిల్లా సరిహద్దులో ఉన్న కడ్తాల్ గ్రామంలో ఆసియలోనే అతిపెద్ద పిరమిడ్ నిర్మాణం జరిగింది.ఇక్కడ డిసెంబరు 21 నుండి 31 వరకు ప్రపంచ ధ్యాన మహా సభలు జరుగుతున్నాయి.వీలు ఉంటే సందర్శించండి.మీరు ప్రతి రోజు ధ్యానం చేయండి.

ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస
http://pssmovement.org/English/index.php

Thursday 20 December 2012

not the end of the world


Hindu scriptures are very confidently saying  21-12-2012 is not the end of the world. According  to our scriptures, we are now in kaliyuga. The time period of kaliyuga is 420,000 years and it consists of 4 paadas , each of 105,000 years. kaliyuga started 5113 years ago, after the end of dwaparayuga.Now we are in 5114 th year of kaliyuga and it is1st paada. So there no end of this universe till the time period of 420,000 completes. So there is no dooms day but REMEMBER WE PEOPLE ARE DESTROYING NATURE,SO THERE MAY BE NATURAL CALAMITIES.LETUS STOP DESTROYING IT. 

And our scriptures  and Ancient Monks, Sages say, You people are said to be Hindus only if you pray for WORLD PEACE. And they also say pray not only for the peace of fellow Hindus, but also for Muslims, Christians, Zorastrians, Buddhists, Jains and  for followers of all religions and also for ATHEISTS.  So let us pray for World Peace. Let us hope that the bad in the world ends and peace is sustained. Don’t fear. Nothing is going to happen.
Om shantih shantih shantihi ( means praying to lord,let there be peace individually, collectively and universally)

21-12-2012 యుగాంతం జరగదు.

21-12-2012 యుగాంతం జరగదు.
"కలియుగే ప్రధమ పాదే జంబూ ద్వీపే" అంటూ ప్రతిరోజు కొన్ని కోట్ల మంది హిందువులు పూజకు ముందు సంకల్పంలో చెప్తారు.మన ధార్మికగ్రంధాల ప్రకారం కలియుగం 4,20,000 సంవత్సరాల కాలం.దానికి 4 పాదాలు.ఒక్కో పాదం 1,05,000 సంవత్సరాలు.ప్రస్తుతం కలియుగంలో 5114 సంవత్సరంలో ఉన్నాం మనం.ఇప్పుడు కలియుగ ప్రధమపాదం జరుగుతోంది.ప్రధమపాదం కూడా పూర్తవ్వనే లేదు.ఇక యుగాంతం ఎక్కడ?

ఇక జ్యోతిష్యం ప్రకారం గ్రహ గమనాలను చూసినా 21-12-2012 నాడుప్రళయానికి దారితీసే పరిస్థితులేమి లేవు.భయపడవలసిన అవసరమే లేదు.కాని మన రాష్ట్రానికి చెందిన ఒక సిద్ధాంతి మాత్రం 22-12-2012 నాడు గ్రహగమానాలను పరిశీలిస్తే ఆరోజు పశ్చిమదేశాల్లో ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయని ఒక మాసపత్రికలో వ్రాశారు.అది ఎంతవరకు నిజమవుతుందో వేచి చూడాలి.

ఏది ఏం జరిగినా భారతదేశానికి,భారతీయులకు ఏమి జరగదు గాక జరుగదు.ఈ దేశం దేవనిర్మితం,సిద్ధపురుషుల తపశ్శక్తిచేత రక్షింపబడుతున్న పుణ్యభూమి.భగవంతునకు ఈ దేశం అంటే ప్రీతి కనుకనే ఇక్కడ అనేక మార్లు అవతరించాడు.

అటువంటి భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని హైద్రాబాదులో ప్రపంచ ఆద్యాత్మిక సదస్సు ముగుస్తోంది.సదస్సు ముగుంపులో 21-12-2012 భారతకాలమానం ప్రకారం సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మిక గురువులు,1 million ప్రజలు విశ్వశాంతి కోసం ధ్యానం చేస్తున్నారు.ఈ ధ్యానంతో అనంతవిశ్వశక్తిని ప్రపంచానికి అందించి,మానవులలో ఉన్న చెడును,రాక్షలక్షణాలను అంతం కోసం వారు చేస్తున్న ప్రయత్నానికి మన వంతు సహకారం అందిద్దాం.ఒక గంట పాటు ధ్యానం చేద్దాం.విశ్వశాంతిని ఆకాంక్షిద్దాం.

అలాగే రేపటి నుంచి విశ్వశాంతి కోసం మహబూబ్ నగర్ జిల్లా,ఆమన్ గల్లు మండలం,కడ్తాల్ లో ప్రపంచ ధ్యాన మహాసభలు 11 రోజుల పాటు జరగనున్నాయి.ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక దేశాల నుండి ఇక్కడ పాల్గొనడానికి అనేకమంది విచ్చేస్తున్నారు.వీలుంటే మీరు సందర్శించండి.మనశ్శాంతిని పొందండి.       

Wednesday 19 December 2012

యుగాంతం-మయాన్ క్యాలెండర్


యుగాంతం-మయాన్ క్యాలెండర్- ఈ రెండే ఇప్పుడు ప్రపంచమంతా చర్చిస్తున్నారు.అసలు ఈ మయాన్లు ఎవరో తెలుసా?
మీకు తెలుసా?ద్వాపరయుగం 5113 సంవత్సరాల క్రితం అంతమైంది.ద్వాపర యుగాంతం వరకు ప్రపంచంలో భారతదేశం SUPER POWER గా ఉండింది.మహాపురుషుడు శ్రీ కృష్ణపరమాత్మ భారతదేశాన్ని ఒక శక్తిగా తయారుచేశారు.సమస్త ప్రపంచానికి ఆదేశాలు మన భరతభూమి నుండే వెలువడేలా ఒక వ్యవస్థ ఏర్పాటు చేసిన మహాపురుషుడు కృష్ణుడు.మహాభారత యుద్ధం తొలి ప్రపంచయుద్ధం.అందులో ప్రపంచదేశాలన్ని పాల్గొన్నాయి.ఇదంతా సంస్కృత మహాభారతంలో ఉంది.మీకు గుర్తుందా?మయసభలో దుర్యోధనుడు పొరబడి నీటిలో కాలుమోపడం,ద్రౌపది నవ్వడం,దుర్యోధనుడు అది అవమానంగా భావించడం జరిగింది.ఆ మయ సభ కట్టిన మయుడు దక్షిణ అమెరికా ఖండానికి చెందిన వాడు.ఆ మయుడు వారసులే ఈ మయాన్లు.మన సోదరులు.భారతదేసం మీద గౌరవంతో,వారికి ఉన్న technology ఉపయోగించి మయసభ కట్టి బహుకరించాడు మయుడు.కాని ఆ తరువాత కాలక్రమంలో మనకు వారికి మధ్య దూరం ఏర్పడి,ఈ రోజు వారేదో ఆటవికులు అనుకుంటున్నాం.
యుగాంతం జరగదు.అదంతా కేవలం ప్రచారమే.    

మార్గశిర గురువారం


ఓం నమో లక్ష్మీనారాయణాయ
మార్గశిర మాసంలో వచ్చే గురువారానికి(లక్ష్మీవారానికి) చాలా విశిష్టత ఉంది.శ్రావణమాస శుక్రవారాలలో,దీపావళి నాడు చేసే లక్ష్మీపూజకు ఎంత ప్రాధాన్యత ఉందో దీనికి అంతే ప్రాధాన్యం ఉంది.రేపు,ఈ మాసంలో  వచ్చే మిగితా గురువారాలలో తెల్లవారుజామునే నిద్రలేచి,శిరస్నానం చేసి శ్రీ లక్ష్మీనారాయణులను ఆరాధించండి.సాయంత్రం వేళ ఇంటి గడపకుకు రెండు వైపులా దీపాలను పెట్టాలి.
ఓం నమో లక్ష్మీనారాయణాయ
ఓం శాంతిః శాంతిః శాంతిః

Tuesday 18 December 2012

21 డిసెంబరు 2012 యుగాంతమా?

21 డిసెంబరు 2012 యుగాంతమా?

ప్రస్తుతం ఎక్కడ చూసినా,ఏ నోట విన్నా ఒకటే మాట.ప్రతి టి.వి.చానేల్ లోనూ ఒకటే చర్చ.అదే 2012 డిసెంబరు 21 న ప్రళయం సంభవిస్తుందా?మయా క్యాలెండరు ఇదే చెబుతోందా?

"మయా" నాగరికతలో ఆనాటి ఖగోళ శాస్త్రజ్ఞులు రెండు రకాల క్యాలెండరలు తయారుచేసి ఉపయోగించారు.రోజుల వివరాలే కాకుండా సృష్టిలో కలిగే ప్రతి మార్పును గమనించే విధంగా వీటిని రూపొందించారు."మయా"ప్రజలు కాలపరిమితిని "సూర్యులు"గా పిలిచేవారు.

మయా నాగరికత తయారుచేసిన ప్రముఖమైన క్యాలెండరు "జోల్కిన్".మతపరమైన ఉత్సవములౌ,పండుగలు ఎప్పుడు వస్తాయి?ఏఏ సమయాల్లో వస్తాయి?వంటివి అనేకం చేప్పే ఈ క్యాలెండారు "గణిత శాస్త్రం"ఆధారంగా నిర్మించరాని ఆయ్ పురావస్తు శాఖ అధికారుల పరిశోధనలో తేలింది.

ఇక రెండవది "హాబ్"అనే క్యాలెండరు.18 నెలల దీనిలో ఉంటాయి.వాటికి వ్యవసాయకార్యకలాపాల పేర్లు పెట్టారు.ఇది డిసెంబరు 21వ తేదీన ప్రారంభవుతుంది.

ప్రపంచం మాట్లాడేది 360 రోజులతో ఉన్న LONG COUNT CALENDAR  క్యాలెండరు గురించి.ఇది మూడవది.ప్రస్తుతం దీని ప్రకారమే 2012 లో ప్రపంచ ప్రళయం వస్తుందని భావిస్తున్నారు.ఈ క్యాలెండరు క్రీస్తుపూర్వం 3114లో మొదలయ్యింది.ఇది ఈ డిసెంబరు 21 తేదీతో ముగుస్తున్నది.394.3 సంవత్సరాల కాలపరిమితిని మయా ప్రజలు ఒక "బక్షన్" అన్నారు.ఈ విధానం క్రీస్తుపూర్వం 3114లో ఆగష్టు 11 వ తేదీన ప్రారంభమైంది.అప్పటినుంచి ప్రతి 394.3 ఏళ్ళకు ఒకసారి చొప్పున ఇది ముగిస్తూవుంది,తిరిగి ప్రారంభమవుతూవుంది.క్రీస్తు శకం 1618 సెప్టెంబరు 18న మొదలైన ఈ 13వ బక్షన్ 2012 డిసెంబరు 21 తో ముగుస్తుండడంతో ఇప్పుడు ప్రళయం సంభవిస్తుందని ప్రచారం జరుగుతోంది.అదంతా అబద్దం.ప్రళయం వస్తుందన్న సంగతి అసలు "మయా"వారికే తేలిదట.వారే ఈ మధ్య ఈ విషయాన్ని ప్రసార మాధ్యమాల్లో చెప్పారు.ఈ 13వ బక్షన్ ముగియగానే 14 బక్షన్ మొదలై 2407 మార్చి 26 తో ముగుస్తుంది.అలా 4772 అక్టోబరు 13 వరకు మనకు సమాచారం అందుబాటులో ఉంది.

(పండిత బుట్టే వీరభద్ర దైవజ్ఞ గారి వ్యాసం నుంచి గ్రహించడమైనది).

అందువల్ల 21 డిసెంబరు 21న ప్రళయం వస్తుందన్నది కేవలం కల్పిత ప్రచారమే.డిసెంబరు 20 లాగే 21 వస్తుంది,22 కూడా వస్తుంది,2013 కూడా వస్తుంది.భారత్ ప్రపంచంలో పెద్దశక్తిగా ఎదిగి తీరుతుంది.అలా ఎదగాలని ఆశిద్దాం.

సమస్త సన్మంగళాని భవంతు
సర్వే భధ్రాణి పశ్యంతు
ఓం శాంతిః శాంతిః శాంతిః      

Monday 17 December 2012

సుబ్రహ్మణ్య షష్ఠి



ఓం శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః

సుబ్రహ్మణ్య షష్ఠి  

శివుని కుమారుడైన కుమారస్వామి జన్మించింది మార్గశిర శుద్ధషష్ఠి నాడు.తారాకాసుర సంహారం కోసం కుమారసంభవం జరిగింది.ఈ విశిష్టమైన పర్వదినం సుబ్రహ్మణ్య స్వమికి ప్రీతికరమైన మంగళవారం నాడు రావడం మరింత విశేషం.ఈ రోజు ఉదయమే శిరఃస్నానం చేసి ఆలయంలో కాని,చెట్ల క్రింద ఉన్న నాగప్రతిష్ట వద్ద పూజ చేయాలి,ఉపవసించాలి.ఈరోజు స్వామిని ఆరాధించడం వలన కుజదోషాలు తొలగిపోతాయి.

ఓం శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః    

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం బాగా అభివృద్ధి చెందింది.మనిషి చంద్రమండలం మీద ఇళ్ళుకట్టుకుని పరిస్థితికి వచ్చాడి.అంగారక గ్రహం మీద ఇప్పుడు పరిశోధనలు చేస్తున్నారు.గత 200 సంవత్సరాలలో ఏన్నో సాధించానని చెప్పుకుంటున్న ఆధునిక మానవుడు "శాంతి" మాత్రం సాధించలేకపోయాడు.అది మనశ్శాంతే అవ్వచ్చు,ప్రపంచ శాంతే అవచ్చు,లేక ఆత్మశాంతే అవచ్చు.ఎంత సంపాదించినా ఇంక సంపదించాలన్న "దురాశ" గత 200 సంవత్సరాలలో విపరీతంగా పెరిగింది.ఫలితంగా ప్రకృతి విధ్వంసం జరిగింది.అయినా మనిషి ఆశ తీరలేదు సరికదా,ఇంకా దురాశ ఎక్కువైంది.మానభంగాలు,నేరాలు,ఘోరాలు,దాడులు,హత్యలు,ఆత్మహత్యలు చాలా పెరిగాయి,పెరుగుతున్నాయి.మరి ఆధునిక మానావాళికి,ముఖ్యంగా యువతకు దిశానిర్దేశం చేసేదేవరు?ఈ అకృత్యాలను ఎలా ఆపాలి?వీటికి సమధానాలు రెండు.ఒకటి ఆధ్యాత్మికత(SPIRITUALITY),రెండు ధ్యానం(MEDITATION).

ఈ నెల 17 అంటే ఈ రోజు నుండి 21 వరకు మన హైద్రాబాదులో THE WORLD UNITED వారి ఆధ్వర్యంలో ప్రపంచ మొట్టమొదటి ఆధ్యాత్మిక సదస్సు జరుగుతోంది.మతాలకు అతీతంగా మనమంతా ఒక్కటే,మన ధ్యేయం విశ్వశాంతి అనే లక్ష్యంతో 200 వక్తలు,2000 మంది సభ్యులు,70 దేశలు,60 ప్లీనరీలు పాల్గొంటున్న చారిత్రాత్మిక సదస్సు ఇది.        

Today we people say that with the help of Modern Science we have achieved a lot.With the development of Scientific Technology,People stepped on moon,trying to build houses on moon and searching for life on other planets too.But not only technology has developed,but there has been increase in Crime rate,Robberies,Thefts and Rapes in these days.We have achieved mostly everything but not PEACE.The way to attain peace,to decrease crime rate,robberies and rapes is only through SPIRITUALITY and MEDITATION.For Global peace and Harmony,"The World United"organisation is presenting THE 1ST WORLD PARLIAMENT ON SPIRITUALITY with 200 spiritual masters from 70 countries with 2000 delegates and 60 plenaries in GLOBAL PEACE AUDITORIUM,HYDERABAD,ANDHRA PRADESH,INDIA FROM 17 December 2012 to 21 December 2012.

For more Detalis visit http://www.wpsconnect.org/home.php

Sunday 16 December 2012


ఓం గజననాయ నమః
మన దేవాలయాలు-3
దేవాలయో రక్షతి రక్షితః
(దేవాలయాల రక్షణే మన రక్షణ)

సాధారణంగా మనకు దేవాలయం అనగానే గుర్తుకువచ్చేది విమానం/గోపురం.అవి పిరమిడ్ ఆకారంలోనే ఎందుకుంటాయి? అని మనలో చాలా మందికి సందేహం కలుగుతుంది.మాములుగా ఉండచ్చు కదా కూడా అనిపిస్తుంది.అసలు ఆలయ విమానం నిర్మాణం అలా ఎందుకుంటుంది?

ఆలయవిమానం పిరమిడ్ ఆకారంలో ఉంటుంది.కాకపోతే ఆ విమానం మీద రకరకాల శిల్పాలను,దేవతావిగ్రహాలను చెక్కబడి ఉంటాయి కనుక మనం అంతగా అది గమనించం.పిరమిడ్ అంటే "మధ్యలో అగ్ని" అని అర్ధం.ఏ ఆకారాన్ని ఆధారంగా/కేంద్రస్థానంగా చేసుకుని శక్తి ప్రసారమవుతుందో అదే పిరమిడ్.ఈజిప్షియన్(egyptian) భాషలో పిరమిడ్ అంటే దివ్యప్రకాశం అని అర్ధం.ఈ పిరమిడ్ కి ఉన్న శక్తి శాస్త్రవేత్తలకు కూడా అర్ధం అవ్వక,దానిని ఆశ్చర్యజనకము,సర్వాతీతము,వివరించడానికి సాధ్యం కానిది" అని వర్ణించారు.

1931లో బ్రిటిష్ శాస్త్రవేత్తల బృందం పిరమిడ్లపై పరిశోధన జరిపింది.రెండూ వేర్వేరు పాత్రలలో అప్పుడే పితికిన పాలు సమానపరిమాణంలో నింపి ఒకదాన్ని గదిలో,ఇంకొకద్నిని పిరమిడ్ కిందా ఉంచారు.

6 రోజుల తరువాత ఈ రెండుపాత్రలను పరిశీలించినప్పుడు,పిరమిడ్ పాత్రలో ఉన్న పాలువిరిగిపోయి "పాలవిరుగు"గాను,నీరుగాను రెండుపొరలుగా విడిపోయాయి.గదిలో ఉంచిన పాలు ఇంత స్పష్టమైన పొరలుగా విడిపోలేదు.అంతేకాదు గదిలో ఉంచిన పాలమీద ఫంగస్ ఏర్పడింది.మరొకరోజు పాలను అలాగే ఉంచారు.పిరమిడ్ బయటున్న పాలపై మరింత ఫంగస్ ఏర్పడింది.పిరమిడ్ లో ఉంచిన పాలపై ఎలాంటి ఫంగస్ లేదు.ఆ పాలను 6వారాలపాటు అలానే ఉంచారు.తెల్లవారితే విరిగిపోయే పాలు,పిరమిడ్ లో అన్నిరోజులు ఉంచినా ఏమాత్రం చెడిపోలేదు.తరువాత అది తోడుకొని రుచికరమైన పెరుగుగా మారడం చూసి పరిశోధకులు ఆశ్చర్యపోయారు.

ఈ విషయం గమనించిన ఇటలి,ఫ్రాన్స్ కు చెందిన పరిశోధకులు ద్రవపదార్ధాలపై(liquids) పిరమిడ్ కున్న శక్తిని విసృతంగా వివరించి,వాటికి అమోఘమైన శక్తి ఉండడం నిజమేనని తెలిపారు.కాఫీ,పళ్ళరసాలు వంటివి దీర్ఘకాలం పిరమిడ్ల క్రింద నిలువ ఉంచడం వలన వాటి రుచి గణనీయంగా పెరుగుతుందని షికార్డి శాస్త్రవేత్త తేల్చిచేప్పారు.

ఇంత గొప్పశక్తి కలిగినవి పిరమిడ్లు,మన ఆలయవిమానాలు..భారతీయులు పిరమిడ్లను చూసి ఆలయవిమానాలను ఆ ఆకారంలో కట్టారనుకుంటే మీరు పొరబడినట్టే.పిరమిడ్ల నిర్మాణానికి ప్రేరేపణ చేసినవి సనాతన భారతీయ సంప్రదాయంలో ముఖ్యస్థానం సంపాదించుకున్న "నిత్యాగ్నిహోత్రం".మరొకటి "శ్రీ చక్రం".ఇప్పటికే అగ్నిహోత్రం మీద పరిశోధనలు జరిగి దాని గొప్పతానాన్ని "ఆధునిక సైన్సు" కూడా అంగీకరించింది."శ్రీ చక్రం" మీద ఎప్పటినుంచో అనేకానేక పరిశోధనలు జరుగుతూనేవున్నాయి."శ్రీ చక్రం" నిర్మాణం చాలా కష్టతరమైనదని,దాని నిర్మాణాన్ని ఆధారంగా చేసుకునే పిరమిడ్ల నిర్మాణం జరిగిందని విదేశిశాస్త్రవేత్తలే దృవికరించారు.మన ముందు ఒక పాత్రలో నీటిని నింపి,"ఓం"కారం ఉచ్చరించడం చేత ఆ నీటిలో ఉన్న పరమాణువులు శ్రీచక్రం ఆకారం సంతరించుకుంటాయని,ఆ నీటికి అమోఘమైన శక్తి లభిస్తుందని tonoscope  సహాయంతో జపాన్ కు సంబంధించిన మసరు ఏమొటొ అనే ప్రొఫెస్సర్ నిరూపించారు.

ఆలయ విమానాలు,పిరమిడ్లకున్న మరిన్ని విశేషాలు వచ్చే ఆదివారం చెప్పుకుందాం.

దేవాలయో రక్షతి రక్షితః
(దేవాలయాల రక్షణే మన రక్షణ)

ఓం శాంతిః శాంతిః శాంతిః
to be continued.............

                         


Sunday 2 December 2012

మన దేవాలయాలు

మన దేవాలయాలు

దేవాలయో రక్షతి రక్షితః
(దేవాలయాలను రక్షించడం అంటే మనల్ని మనం రక్షించుకోవడమే)      

సనాతన హిందూ సంస్కృతిలో దేవాలయాలకు చాలా ముఖ్యమైన స్థానం ఉంది.మన హిందూ సంస్కృతిని,ధర్మాన్ని,ఆచారాలను రక్షించడంలో అవి చాలా కీలకమైనవి.3,000 వేల సంవత్సరాల విదేశి దండయాత్రలు,విదేశిమతస్థుల కుట్రల తరువాత కూడా మన సంస్కృతి ఇంకా బ్రతికి ఉంది అంటే అందుకు కారణం మన ఆలయాలే.ఒకనాటి దేవాలయాలు వైధ్యాలయాలుగా,విద్యాలయాలగా,పేద ధనిక అనే తేడా లేకుండా అందరి మధ్య ఐక్యతను పెంపొందించే ప్రదేశాలగాను,నాయాస్థానాలుగా విలసిల్లాయి.దేవాలయాలే మన సంస్కృతికి,ఐక్యతకు ఆయువుపట్టు.

మీకు తెలుసా?పరాయిమతాల హింసకూ,ఇతరమతాల దోపిడికి,ఆక్రమిత ధర్మాల అక్రమాలకు హిందూధర్మం చిన్నాభిన్నమై చిద్రమైపొయిందొకప్పుడు.ఎందరో హిందువులు పరాయిమతాల పాలైపొయారు.మన హిందూ ఆడబిడ్డల మీద ఆఘాయిత్యాలు చేశారు.మతం మార్చుకోమని బలవంతపెట్టారు.మార్చుకోని వాళ్ళని చంపేశారు.ప్రాణభయంతో కొంతమంది మారిపోయినా,కొందరు మాత్రం ప్రాణలను సైతం పణంగా పెట్టి,వారి మీద పోరాటం చేశారు.వారితో యుద్ధం చేసి ఓడిపొయిన హిందూ రాజవంశస్థులను నానా భాధలు పెట్టారు.వారు సమాజానికి దూరంగా ఊరి బయట బ్రతకాలని ఆంక్షలు విధించారు విదేశి ఆక్రమణదారులు.అలా వచ్చినవారే లంబాడ జాతి వారు.వారు నిజానికి శౌర్యము,పరాక్రమము కలిగిన క్షత్రియవీరులు.మాలా,మాదిగ కులాలు కూడా ఇలా ఏర్పడ్డవే.ఈ విధంగా హిందూసమాజం ముక్కలయ్యింది.    

మన విద్యాలయాలను,ప్రాచీన గ్రంధాలను,పురాణాలను,దేవాలయాలను ధ్వంసం చేశారు.మన దేశంలో క్రీస్తుపూర్వం 700 వ సంవత్సరానికే తక్షశిల విశ్వవిద్యాలయం ఉంది.అందులో 60 పైగా సబ్జెక్టులను భోదించేవారు.ఆ సమయానికి ప్రపంచం నలు మూలల నుండి 10500 మంది అక్కడకు వచ్చి విద్యాభాసం చేశారు అంటే మీరే ఆలోచించండి అది ఎంత గొప్ప విషయమో.అటువంటిదే నలందా విశ్వవిద్యాలయం.అందులో ఉన్న విద్యాసంపదను,జ్ఞాన్ని,గ్రంధాలను నాశనం చేయదలచిన మహమదీయ పాలకులు దానికి నిప్పు పెట్టారు.ఆ మంటల్లొ చిక్కుకొని కొన్ని వేలమంది ప్రాణాలు కోల్పోయారు.నిప్పుపెట్టబడ్డ ఆ విశ్వవిద్యాలయం 3 నెలల పాటు ఆగకుండా కాలినా అది పూర్తిగా నాశనమవ్వలేదు.ఆ చుట్టు ప్రక్కల ప్రాంతాలు పొగ చేత కప్పబడ్డాయి.ఆ తరువాత వచ్చిన బ్రిటిష్ పాలకులు కూడా అనేక గ్రంధాలను నాశనం చేశారు.ఈ విధ్వంసకాండ 2వేల సంవత్సరాలా పాటు సాగింది.  

ఇటువంటి కారణాల చేత తన స్వరూపాన్ని,అంధకారంలో మగ్గుతు,ఉనికిని కోల్పోయే పరిస్థితికి వచ్చిన యావత్ హిందూ జాతిని ఒక్క చోట చేర్చడానికి,హిందువులు మధ్య ఐక్యత పెంచడానికి,స్నేహసంబంధాలను నెలకొల్పటానికి,మనమంతా హిందువులము,మనమంతా ఒక్కటే అని చెప్పడానికి,మన ఘనవారసత్వం భావితరాలకు అందించడానికి ఒక వేదిక అవసరమైనది.వీటిని అన్నిటిని నేరవేర్చి మన సంస్కృతిని,ధర్మాన్ని అందరికి తెలియజెప్పి మొత్తం భారతీయులను తన ఒడిలోనికి చేర్చుకున్నాయి మన దేవాలయాలు.విభిన్న ఆచారాలు,అనేక భాషలు,సంప్రదాయలు,1280 ధార్మిక గ్రంధాలు,10,000 వ్యాఖ్యానాలు,1,00,000 ఉప-వ్యాఖ్యానాలు,33 కోట్ల దేవతలు,వందలమంది ఆచార్యులు,వేలమంది ఋషులు,16000 వేలకు పైగా కులాలు ఉన్న హిందూ సమాజాన్ని ఒక్క ప్రదేశంలోనికి చేర్చినవి మన దేవాలాయాలు.దేవాలయాలు కళామతల్లికి పుట్టినిల్లు.

మన దేవాలయాలు కేవలం పూజలకే పరిమితం కాలేదు.వాటిలో చాలా సైన్సు కూడా ఉంది,కాని ఇవాళ దేవాలయాలు మన నిర్లక్ష్యం కారణంగా మూతపడుతున్నాయి,కూలిపొతున్నాయి.

ఈశా వాస్యమిదం సర్వం-ఈ విశ్వమంతా ఈశ్వరునితో మాత్రమే వ్యాపించి ఉంది అని ఈశావాస్య ఉపనిషత్ అంటొంది.ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్ఠతి-సర్వజీవుల హృదయంలో పరమాత్మ ఉన్నాడు అని భగవద్గీత వచనం.చిదానంద రూపః శివొహం శివొహం-మనమే(ఆత్మ) ఆ సత్,చిత్,ఆనందమయమైన శివరూపం అని జగద్గురువులు శ్రీ ఆదిశంకరాచార్యులు వారు అన్నారు.
విష్ణు అంటే అంతటా వ్యాపించి ఉన్నవాడని అర్ధం.మరి విశ్వమంతా ఆ విశ్వేశ్వరుడే వ్యాపించి ఉన్నప్పుడు,ఆయనకు ఆలయం ఎందుకు?ప్రత్యేకంగా పూజలు,అభిషేకాలు చేయడమెందుకు?అనే ప్రశ్నలు మనలని వేదిస్తూ ఉంటాయి.

గంగానది అనంతమైన జలరాశితో గంగోత్రి నుండి బంగాళాఖాతంలో కలిసే వరకు ప్రవహించినా,మనం దాహం తీర్చుకోవడానికి అవసరమైన నీటిని మాత్రమే త్రాగుతున్నాం.అలాగే అఖిల జగమంతా అనంతమైన శక్తిరూపంలో ఆ పరమాత్మ వ్యాపించి ఉన్నా,ఆలయంలో ఆ అనంతశక్తిని ఒక మూర్తిలో కేంద్రీకరించి మన ఆధ్యాత్మిక దాహార్తిని తీర్చుకోవడానికి ఆలయం ఒక వేదిక.

మన చుట్టూ ఉన్న గాలిలో ఆక్సిజెన్(ప్రాణవాయువు)వ్యాపించి ఉన్న,ఆసుపత్రిలో ఉన్న రోగికి ప్రత్యేకంగా ప్రాణవాయువును అందించి బ్రతికిస్తారు.అతను తిరిగి మాములుగా మారిన తరువాత అతని శరీరం అందరిలాగే ప్రకృతినుండి ఆక్సిజెన్ తీసుకుంటుంది.అలాగే అంతటా వ్యాపించి ఉన్న దైవాత్వాన్ని అర్ధం చేసుకోలేని సాధారణ మానవులకు కొద్ది ప్రదేశంలోనే దైవత్వాన్ని చూపించగల పరమపవిత్ర ప్రదేశం దేవాలయం.దేవాలయ సందర్శన ద్వారా మొత్తం విశ్వమంతా వ్యాపించిన పరమాత్మ తత్వాన్ని అర్ధం చేసుకోగలిగిన శక్తి లభిస్తుంది.

ఆలయమంటే లయమవడం,లీనమవడం,తాదాత్మ్యం చెందడమని అర్ధం.మనం పూజలు,భజనలు,జపధ్యానాలు చేసినప్పుడు ఎక్కడ మన మనసు పూర్తిగా దైవభావనలో,దైవంలో లీనమవుతుందో,లయమవుతుందో ఆ ప్రదేశమే దేవాలయం.ఏ ప్రదేశానికి వెళ్ళడం వలన మనలో ఉన్న దైవం గురించి మనకు అవగాహన వస్తుందో అదే దేవాలయం.

ఆలయం అఖిల జగత్తునకు సంకేతమైతే,అందులో ప్రతిష్టితమైన దైవం అనంతశక్తికి ప్రతీక.ఆ శక్తిని ఆరాధించడం ద్వారా మన ఆత్మశక్తి జాగృతమవుతుంది.కామక్రోధ లోభ మొహ మదమాత్సర్యాలనే అరిషడ్వర్గాలను పారద్రోలే వైద్యాలయం మన దేవాలయం.దేవాలయం,మన అంతరాత్మ ప్రతిబింబాన్ని మనకు చూపే ఒక అద్దం.అందువల్లే శ్రీ రామానుజులు ఆలయం మన ఆధ్యాత్మిక పురోగతికి ఆలంబనమని సూచించారు.

సాధారణంగా మనకు దేవాలయం అనగానే గుర్తుకువచ్చేది విమానం/గోపురం.అవి పిరమిడ్ ఆకారంలోనే ఎందుకుంటాయి? అని మనలో చాలా మందికి సందేహం కలుగుతుంది.మాములుగా ఉండచ్చు కదా కూడా అనిపిస్తుంది.అసలు ఆలయ విమానం నిర్మాణం అలా ఎందుకుంటుంది?

ఆలయవిమానం పిరమిడ్ ఆకారంలో ఉంటుంది.కాకపోతే ఆ విమానం మీద రకరకాల శిల్పాలను,దేవతావిగ్రహాలను చెక్కబడి ఉంటాయి కనుక మనం అంతగా అది గమనించం.పిరమిడ్ అంటే "మధ్యలో అగ్ని" అని అర్ధం.ఏ ఆకారాన్ని ఆధారంగా/కేంద్రస్థానంగా చేసుకుని శక్తి ప్రసారమవుతుందో అదే పిరమిడ్.ఈజిప్షియన్(egyptian) భాషలో పిరమిడ్ అంటే దివ్యప్రకాశం అని అర్ధం.ఈ పిరమిడ్ కి ఉన్న శక్తి శాస్త్రవేత్తలకు కూడా అర్ధం అవ్వక,దానిని ఆశ్చర్యజనకము,సర్వాతీతము,వివరించడానికి సాధ్యం కానిది" అని వర్ణించారు.

1931లో బ్రిటిష్ శాస్త్రవేత్తల బృందం పిరమిడ్లపై పరిశోధన జరిపింది.రెండూ వేర్వేరు పాత్రలలో అప్పుడే పితికిన పాలు సమానపరిమాణంలో నింపి ఒకదాన్ని గదిలో,ఇంకొకద్నిని పిరమిడ్ కిందా ఉంచారు.

6 రోజుల తరువాత ఈ రెండుపాత్రలను పరిశీలించినప్పుడు,పిరమిడ్ పాత్రలో ఉన్న పాలువిరిగిపోయి "పాలవిరుగు"గాను,నీరుగాను రెండుపొరలుగా విడిపోయాయి.గదిలో ఉంచిన పాలు ఇంత స్పష్టమైన పొరలుగా విడిపోలేదు.అంతేకాదు గదిలో ఉంచిన పాలమీద ఫంగస్ ఏర్పడింది.మరొకరోజు పాలను అలాగే ఉంచారు.పిరమిడ్ బయటున్న పాలపై మరింత ఫంగస్ ఏర్పడింది.పిరమిడ్ లో ఉంచిన పాలపై ఎలాంటి ఫంగస్ లేదు.ఆ పాలను 6వారాలపాటు అలానే ఉంచారు.తెల్లవారితే విరిగిపోయే పాలు,పిరమిడ్ లో అన్నిరోజులు ఉంచినా ఏమాత్రం చెడిపోలేదు.తరువాత అది తోడుకొని రుచికరమైన పెరుగుగా మారడం చూసి పరిశోధకులు ఆశ్చర్యపోయారు.

ఈ విషయం గమనించిన ఇటలి,ఫ్రాన్స్ కు చెందిన పరిశోధకులు ద్రవపదార్ధాలపై(liquids) పిరమిడ్ కున్న శక్తిని విసృతంగా వివరించి,వాటికి అమోఘమైన శక్తి ఉండడం నిజమేనని తెలిపారు.కాఫీ,పళ్ళరసాలు వంటివి దీర్ఘకాలం పిరమిడ్ల క్రింద నిలువ ఉంచడం వలన వాటి రుచి గణనీయంగా పెరుగుతుందని షికార్డి శాస్త్రవేత్త తేల్చిచేప్పారు.

ఇంత గొప్పశక్తి కలిగినవి పిరమిడ్లు,మన ఆలయవిమానాలు..భారతీయులు పిరమిడ్లను చూసి ఆలయవిమానాలను ఆ ఆకారంలో కట్టారనుకుంటే మీరు పొరబడినట్టే.పిరమిడ్ల నిర్మాణానికి ప్రేరేపణ చేసినవి సనాతన భారతీయ సంప్రదాయంలో ముఖ్యస్థానం సంపాదించుకున్న "నిత్యాగ్నిహోత్రం".మరొకటి "శ్రీ చక్రం".ఇప్పటికే అగ్నిహోత్రం మీద పరిశోధనలు జరిగి దాని గొప్పతానాన్ని "ఆధునిక సైన్సు" కూడా అంగీకరించింది."శ్రీ చక్రం" మీద ఎప్పటినుంచో అనేకానేక పరిశోధనలు జరుగుతూనేవున్నాయి."శ్రీ చక్రం" నిర్మాణం చాలా కష్టతరమైనదని,దాని నిర్మాణాన్ని ఆధారంగా చేసుకునే పిరమిడ్ల నిర్మాణం జరిగిందని విదేశిశాస్త్రవేత్తలే దృవికరించారు.మన ముందు ఒక పాత్రలో నీటిని నింపి,"ఓం"కారం ఉచ్చరించడం చేత ఆ నీటిలో ఉన్న పరమాణువులు శ్రీచక్రం ఆకారం సంతరించుకుంటాయని,ఆ నీటికి అమోఘమైన శక్తి లభిస్తుందని tonoscope సహాయంతో జపాన్ కు సంబంధించిన మసరు ఏమొటొ అనే ప్రొఫెస్సర్ నిరూపించారు.


పిరమిడ్ల క్రింద ఉంచిన నీటిలో ప్రాణవాయువు అధికంగా నిలువుంటుందని టెన్నిహాల్ అనే శాస్త్రవేత్త నిరూపించారు. కాల్పులు, కత్తిగాట్లు, పుండ్లు మొదలగువాటిని పిరమిడ్ నీటితో శుభ్రపరచడం వలన అవి త్వరగా మానిపోతాయని,నిత్యం ఉదయం ఒక గ్లాసు పిరమిడ్ నీరు త్రాగితే జీర్ణకోశరోగాలు నయమవుతాయని,ఈ నీటితీ ముఖం కడుక్కుంటే ముఖవర్చస్సు గణనీయంగా పెరుగుతుందని,ఈ నీటితో తలస్నానం చేస్తే చుండ్రు పూర్తిగా పోతుందని వేర్వేరు పరిశోధనలలో నిరూపించబడింది.అంతేకాదు,అలసిపోయిన కళ్ళను ఈ నీటితో కడిగితే కంటి అలసట త్వరగా,సులభంగా పొతుంది.పిరమిడ్ నీటితో తయారైన వంటకాలు చాలా రుచిగా ఉన్నట్లు,ఆక్వేరియంలో పిరమిడ్ నీరు పోస్తే చేపలు హుషారుగా ఎక్కువకాలం జీవించాయని,ఇదే నీటిని మొక్కలకు పోస్తే మరణించే మొక్కలు కూడా తిరిగి పచ్చగా మారుతాయని,సాధారణ నీటికన్నా ఈ నీరు పోయడం వలన మొక్కలు త్వరగా పెరుగుతాయని,ప్రోస్టేట్ గ్రంధివాపుతో బాధపడేవారు 3 నెలలు ఈ నీరు విడువకుండా త్రాగితే సర్జరి అవసరంలేకుండానే తగ్గిపోయినట్ట్లు,పిరమిడ్ నీటిని పుక్కిలించడం వలన దంత సంబంధమైన సమస్యలు పూర్తిగా తొలగిపోయయని,ఈ నీటితో నిత్యం స్నానం చేసేవారికి చర్మరోగాల నివారణ జరిగి చర్మం కాంతివంతమైనట్ట్లుగా వివిధ దేశాల శాస్త్రవేత్తల పరిశోధనలలో తేలింది.పదును తగ్గిన బ్లేడ్లను పిరమిడ్ల క్రింద ఉంచితే అవి తిరిగి పదునుగా మారడం చూసి శాస్త్రవేత్తలే విస్తుపోయారు.ఇది గమనించిన అమెరికా వారి గోదాములను,గిడ్డింగ్లను పిరమిడ్ ఆకారం ఉండేలా నిర్మాణం చేశుకున్నారు.అందువల్ల వారి ధాన్యాలు త్వరగా పాడుకావు.

అంతటిగొప్ప శక్తి పిరమిడ్లకు ఉందికనుకనే మన దేవాలయ విమానాలు పిరమిడ్లను,గుమ్మటాలను పోలిన ఆకారాలలో నిర్మాణం చేస్తాం.ఆగమశాస్త్రం కూడా ఇటువంటి ఆకరంలోనే నిర్మించమని చేబుతోంది.అందువల్లే మనం ఆలయంలో తీసుకునే తీర్ధానికి అంత శక్తి.పిరమిడ్ల క్రింద ఒక గంట పాటు ధ్యానం చేస్తే ఒక మనిషికి 24 గంటలపాటు పనిచేయలగల శక్తి లభిస్తుంది.అనువల్లే ఆలయానికి వెళ్ళినప్పుడు కాసేపైన ప్రశాంతంగా ధ్యానంలో కూర్చుని రమ్మంటారు.ఇంతగొప్ప శక్తి మన ఆలయగోపురాలకు,విమానాలకు ఉంది.

కాకపోతే మనకు ఈజిప్ట్ వారికి తేడా ఏమిటంటే వారు పిరమిడ్ల క్రింద శవాలను దాచిపెడితే,మనం మాత్రం విశ్వశాంతి కోసం,విశ్వాంతరాత్ముడు,సర్వవ్యాపి,నిర్వికారుడు,సత్చిందానందుడు అయిన పరమాత్మను ప్రతిష్టించి పూజించి తరిస్తున్నాం.

గుడి అనగానే మనకు గుర్తుకువచ్చేది ముందుగా గోపురమే.గోపురం విశిష్టత ఏమిటి?
ఆగమ శాస్త్రానుసారం ఆలయ నిర్మాణం దేవుడు పడుకున్నట్లు శయనరీతిలో నిర్మిస్తారు.గర్భగుడి భగవంతుని శిరసు,ఆలయ మంటపం భగవంతుని కడుపు,ఆలయ గోపురం దేవుడి పాదాలు.దైవ దర్శనం అంటే గుడికి వెళ్ళి ప్రదక్షిణ చేసి,స్వామిని చూసి గంటకొట్టి నమస్కరిస్తాం.కాని ముసలివాళ్ళూ,రోగులు,నిత్య జీవితంలోని అనేక కార్యక్రమాల వల్ల గుడికి వెళ్ళలేనివారు(వెళ్ళే అవకాశం లేనివారు),తామున్న ప్రాంతం నుంచే దూరంగా,ఎత్తుగా కనిపిస్తున్న గోపురానికి నమస్కరిస్తే ఆలయంలో ఉన్న స్వామిపాదాలకు నమస్కరినట్టేనని శాస్త్రం తెలియజేస్తోంది.

పూర్వాకాలంలో ఈరోజు ఉన్నట్టుగా హోటల్ సౌకర్యాలు లేవు.ఇతర దేశాలు,రాజ్యాలు,ప్రదేశాల నుండి వచ్చిన బాటసారులకు దేవాలయం ఎక్కడ ఉందో తెలుసుకోవటానికి గోపురాలు ఎత్తుగా కట్టారు.అంతేకాదు,ఆ కాలంలో దేవాలయాల్లో నిత్యం అన్నదానం జరిగేది.వైద్య సదుపాయాలు కూడా దేవాలయంలో ఉండేవి.అందువల్ల క్రొత్తగా వచ్చిన వారు ఆకలితో ఆహారం కోసం వెత్తుక్కునే పరిస్థితి నేరుగా దేవలయాలకే వెళ్ళి,అక్కడ ప్రసాదం స్వీకరించేవారు,సేద తీరేవారు.వారికి మార్గ నిర్దేశకాలు గోపురాలే కదా.

దేవుడు సర్వోన్నతుడు(అందరికంటే ఉన్నతమైన వాడు/గొప్పవాడు).ఈ విషయాన్ని మరిచిపోయిన మనిషి తానే గొప్పవాడినని,అంతా తనవల్లే జరుగుతోందని,తాన కంటే గొప్పవారేవరూ లేరని అహంకారంతో విర్రవీగుతాడు.అది భ్రమ మాత్రమే,అందరికంటే భగవంతుడే సర్వోన్నతుడు అన్న భావం అందరిలో కలగడానికి,మనసుకి భోధపడటానికి దేవాలయ గోపురాన్ని ఎత్తుగా నిర్మిస్తారు.

గోపురం అంటే పిరమిడ్ ఆకారం(గత భాగాల్లో పిరమిడ్ ఆకారాల గొప్పతనం,వాటి అతీతమైన శక్తిని గురించి చెప్పుకున్నాం).పిరమిడ్ ఆకారాలు మాత్రమే కొన్ని వందల,వేల సంవత్సరాలు స్థిరంగా ఉంటాయి కనుక వాటిని పిరమిడ్ ఆకారంలో నిర్మిస్తారు.అంతేకాదు గోపురం ఈ బ్రహ్మాండంలో ఉన్న అనంతమైన విశ్వశక్తిని ఆకర్షిస్తుంది.కొన్ని వందల,వేల సంవత్సరాల వరకు గోపురాలు శక్తిని గ్రహించి,నిలువ ఉంచుకునే శక్తి కేంద్రాలు.అంతేకాదు మొత్తం దేవాలయానికి అది దివ్యశక్తులను నిత్య అందిస్తూ ఉంటుంది.కనీసంలో కనీసం 500 సంవత్సారాల పాటు ఒక గోపురం అనేక దివ్యశక్తులను దేవాలయానికి అందిస్తుంది.అంటే గోపురం కూడా ఒక అమోఘ శక్తి కేంద్రం.అందుకే దేవాలయానికి వెళ్ళవలసిన రీతిలో వెళ్తే కనుక,ఆలయగోపురం క్రింది నుంచి వెళ్తున్న సమయంలో మనలో తెలియని ఆనందకరమైన అనుభూతి కలుగుతుంది.

ఒక గోపురం ఎత్తు ఆ ఆలయమూలవిరాట్టు(ఆలయ ప్రధాన దైవ విగ్రహం) ఎత్తుని బట్టి నిర్ణయిస్తారు.గాలి గోపురాలు ఉన్న ఆలయాలకు విశేషమైన కీర్తి ప్రతిష్టలు ఉంటాయని ధార్మిక గ్రంధాలు తెలియజేస్తున్నాయి.

ఉరుములు,మెరుపులతో కూడిన వర్షాలు పడిన సమయంలో అక్కడున్న నిర్మాణాలకు,ప్రజలకు ఎటువంటి నష్టం వాటిల్లకూండా,పడుగు పాటును గ్రహించి,ఆ విద్యుత్ శక్తిని భూమిలోనికి పంపించేస్తాయి గోపురాలు.అంతేకాదు అవి గ్రహించిన దివ్యశక్తులను ఆలయంలో ఉన్న మూలమూర్తికి నిత్యం అందిస్తుంటాయి గోపురాలు.

చారిత్రికంగా చెప్పుకోవలసి వస్తే అలనాటి శిల్పకళ చాతుర్యానికి,వైభవానికి ప్రతీకలు మన ఆలయ గోపురాలు.కాని ఈ రోజు అనేక గోపురాలు కూలిపోతున్నాయి,శిధిలమవుతున్నాయి,పాడుతున్నాయి,పిచ్చిమొక్కలు మొలిచి వాటికి అందాన్ని కోల్పోతున్నాయి.ఏన్నో వందల సంవత్సరాల మన చారిత్రిక వారసత్వ సంపద గోపురాలు.మనం ఈ రోజు ఏదినా ఒక నిర్మాణం చేస్తే అది ఎన్ని సంవత్సరాలు ఉంటుంది?ఏన్నో సంవత్సరాల క్రితం,సిమెంట్ లేనికాలంలో రాయిమీద రాయిని పెట్టి,కొన్ని వందల సంవత్సరాల వరకు చెక్కు చెదరకుండా పదిలంగా ఉండేలా నిర్మాణం చేశారు మన పూర్వీకులు.మనమేలాగో అంత గొప్ప నిర్మాణాలు చేయలేము.కనీసం ఉన్నవాటినైన కాపాడుకుందాం.

ఎక్కడైన గోపురం కూలిందంటే అక్కడ కూలింది గోపురం మాత్రమే కాదు.మన వారసత్వ సంపద,మన పూర్వీకుల శ్రమ.ఇకనైన మన గోపురాలను,దేవాలయాలను కాపాడుకుందాం. 

ఆలయ ప్రవేశంలో గోపురం దాటగానే,మనకు కనిపించేది ధ్వజస్థంభం.ధ్వజస్థంభం ప్రాముఖ్యత ఏమిటి?

ధ్వజస్థభం భూలోకానికి,స్వర్గలోకానికి మధ్య వారధి.అంతరిక్షంలో ఉన్న దైవ శక్తులను దేవాలయంలోనికి ఆహ్వానిస్తుంది.అనతమైన విశ్వంలో ఉండే దివ్యశక్తులను,కాస్మిక్ కిరణాలను దేవాలయంలోకి తీసుకువచ్చేందుకు దోహదపడుతుంది.ధ్వజస్తంభానికి పైన ఉండే గంటలు కూడా పాజిటివ్ ఎనర్జిని ఆకర్షిస్తాయి.

ధ్వజస్థభం ఆలయ నిర్మాణాన్ని పిడుగుపాటు నుండీ రక్షిస్తుంది.అది ఆలయంకంటే ఎత్తులో ఉండడం వలన అది విద్యుత్ శక్తిని గ్రహించి,భూమిలోకి పంపించివేసి,ఆలయాన్ని కాపాడుతుంది.

ధ్వజస్థభం ప్రతిష్ట ముందు దానిక్రింద పంచలోహాలు(బంగారం,వెండి,ఇత్తడి,రాగి,కంచు)ను వేస్తారు.అవి భూమిలోపల ఉన్న విద్యుత్ అయస్కాంత శక్తి(electro-magnetic energy)ని గ్రహిస్తాయి.అందుకే ధ్వజస్థభం వద్ద విద్యుత్ అయస్కాంత్ క్షేత్రం(electro-magnetic energy) ఏర్పడుతుంది.అంతేకాదు ద్వజస్థభానికి వేసే పంచలోహ్ల తొడుగు కూడా విద్యుత్ అయస్కాంత్ శక్తిని గ్రహించి ఈ క్రింద ఏర్పడిన విద్యుత్ ఆయస్కాంత్ క్షేత్రానికి మరింత శక్తిని చేకూరుస్తుంది.దాని దగ్గరకు వెళ్ళి నమస్కరించడం వలన మన శరీరానికి కావలసిన శక్తి అందుతుంది.ధ్వజస్థంభం వద్ద ఉండే బలిపీఠం ఈ విద్యుత్ అయస్కాంత శక్తిని అత్యధికంగా నిలువ ఉంచుకునే ప్రదేశం.

ధ్వజం అంటే జెండా.బ్రహ్మోత్సావాల సమయంలో ధ్వజారోహణం పేరున ధ్వజస్థంబానికి జెండాను ఎగిరేస్తారు.దీనికి ఎగురేసిన జెండా దేవలోకంలో ఉన్న సమస్త దేవతలను ఉత్సవాలకు ఆహ్వానిస్తుంది.

ధ్వజస్తంభం అడుగుభాగంలో శివుడు,మధ్యభాగంలో బ్రహ్మ,పై భాగంలో శ్రీ మహావిష్ణువు కోలువై ఉంటారు.విశ్వాసం శ్వాస కంటే గొప్పది.వేదం పరమాత్ముడి శ్వాస.నాలుగు వేదాలకు ప్రతీక ఆ నిలువెత్తు ద్వజస్థంభం.

మనం దేవాలయంలోనికి ప్రవేశించే ముందే ఆలయం బయట మనలో ఉన్న చెడు భావనలను,ఒత్తిళ్ళను విడిచిపెట్టి ప్రవేశిస్తాం.ధ్వజస్థంభం దగ్గరకు రాగానే,మనలో మిగిలి ఉన్న చెడు భావనలను,అహకారాన్ని పూర్తిగా వదిలిపెట్టాలి.

ధ్వజము అంటే మరొక అర్ధం పతాకం అని.మనిషికి ఆత్మజ్ఞానం కలిగినప్పుడు,అతనికి అత్యున్నతమైన ఆలోచనలు కలుగుతాయి.అవి అతనిని పతాక స్థాయికి తీసుకువెళతాయని,అతను జీవితంలో అత్యున్నతస్థాయిలో నిలబడతాడని గుర్తుచేస్తుంది ధ్వజస్థంభం.

ఇంత ప్రాముఖ్యం ఉన్న ద్వజస్థంభానికి ఏదో ఒక చెట్టు మాను తీసువచ్చి పెట్టరు.ఆగమశాస్త్రం ప్రకారం ధ్వజస్థంభానికి వాడే మానుకు కొన్ని లక్షణాలు కలిగి ఉండాలి.ఆ మానుకు ఎలాంటి తొర్రలు ఉండకూడదు.కొమ్మలు ఉండకూడదు.ఎలాంటి పగుళ్ళుఉండకూడదు.ఏ మాత్రం వంకరగా ఉండకూడదు.సుమారు 50 అడుగులకంటే ఎత్తు ఉండాలి.ఇలాంటి మానునే ధ్వజస్థంభానికి ఉపయోగించాలి అని ఆగమశాస్త్రం చెబుతోంది.

మనకు దేవాలయంలో ఉండే విగ్రహాలును చాలా మంది బొమంలంటారు. సంస్కృతంలో విగ్రహానికి అర్ధం విశేషంగా శక్తిని గ్రహించేది అని.ఆలయంలో ఉన్న విగ్రహం క్రింద యంత్రం పెడతారు. మంత్రం ప్రకృతిలో కలిగించే తరంగాల ఆకారం యొక్క సాకార రూపమే యంత్రం. అటువంటి రాగి యంత్రాన్ని విగ్రహం క్రింది భాగంలో పెట్టి దాని మీద విగ్రహాన్ని ప్రతిష్టిస్తారు. క్రింద పంచలోహాలు వేస్తారు. పంచలోహాలు,రాగి యంత్రం భూమిలో ఉన్న విద్యుతయస్కాంత శక్తిని ఆకర్షిస్తుంది. పైన పిరమిడ్ ఆకారంలో ఉన్న గోపురం/ విమానం కూడా శక్తిని గ్రహిస్తుంది. ఈ రెండు శక్తులను కూడా విగ్రహం గ్రహిస్తుంది.

ఒక ముఖ్యమైన విషయం. చాలామంది అవి శిలలు మాత్రమే అనుకుంటారు. కాని మన దేవాలయాల్లో ఉన్నవి శిలలు కాదు. హిందువులు రాళ్ళకు పూజలు చేయటంలేదు. ఆ విగ్రహాన్ని వేదమంత్రాలు చదువుతూ వడ్లు, ధాన్యం, పాలు, పెరుగు, గోధుమలు............... ఇలా మన ప్రాణానికి ఆధారమైన ప్రాణశక్తి కలిగిన వస్తువుల మధ్యలో పెడతారు. ఆగమ శాస్త్రాన్ని అనుసరించి విగ్రహ ప్రతిష్ట చేసే సమయంలో తంత్రశాస్త్రాన్ని ఆధారంగా చేసుకుని ఆ విగ్రహానికి ప్రాణం పోస్తారు. అదే ప్రాణప్రతిష్ట. అప్పటినుంచి అది విగ్రహం కాదు. దానిలోనికి మహామహిమాన్వితమైన దైవశక్తి వస్తుంది. ఆ సమయం నుంచి ఆ విగ్రహం మన మాటలు వింటుంది, తన కళ్ళోతొ జరిగేవన్ని చూస్తుంది. మనం చెప్పుకునే కష్టాల్లన్నీ కూడా ఆ విగ్రహంలో ఉన్న దైవానికి వినిపిస్తాయి. అక్కడ శక్తి ఉందికనుకే దేవాలయంలో దేవునికి నిత్యం ధూపదీపనైవెధ్యాలు పెడతారు. ఏ ఊరిలో అయితే దేవాలయం మూతపడుతుందో, ఎక్కడైతే గుడిలో దేవునకు నిత్యం నైవెధ్యం ఉండడో ఆ ఊరి కరువుకాటకాలతో, రోగాలతో, మరణాలతో అల్లాడుతుంది.

చాలామంది విగ్రహారాధన తప్పంటారు. అంతటా భగవంతుడున్నాదు, ఆయనకు రూపం లేదు.......... ఇల రకరకాలుగా అంటారు. అది నిజమే భగవంతుడు అంతటా ఉన్నాడు. ఆయనకు రూపం లేదు, ఎందుకంటే అన్ని రూపాలు ఆయనవే. అన్ని తానై ఉన్నాడు. రాయిలోనూ ఉన్నాడు, పక్షిలోనూ ఉన్నాడు, చెట్టు, పుట్ట, మనిషి, నది, అలా సర్వవ్యాపిగా ఉన్నాడు. కాని ఇది అందరు అర్ధం చేసుకోవడం కష్టం. అందరికి భగవంతుడిని అంతట చూసేంత జ్ఞానం ఉండదు. మరి కష్టాలు వస్తే ఎల చెప్పుకుంటారు? తమ భాధను ఎలా పంచుకుంటారు? తమకు భయం వేసినప్పుడు ఏ రూపాన్ని స్మరిస్తారు? ఆధ్యాత్మిక జ్ఞానం అంతగా లేనివారు తమకు వచ్చిన భాధను పంచుకోవడం కోసం పరమాత్మ ఒక విగ్రహంగా దర్శనమిస్తున్నాడు. వారికి భాధ కలగగానే తమకంటూ ఒకడున్నాడన్న భావంతో వెళ్ళి తమ భాధను పరమాత్మతో పంచుకుంటున్నారు. రామకృష్ణ పరమహంస కూడా విగ్రహారాధన తప్పకాదు, మొదట సగుణారాధాన చేస్తుంటే కాలక్రమంలో భగవత్తత్వం అర్దం అవుతుందంటారు. విగ్రహాల్లో మాత్రమే దేవుడు లేడు, అంతటా ఉన్నవాడు విగ్రహాల్లో కూడా ఉన్నాడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. 

దేవాలయాలు పవిత్రమైన స్థలాలు. మన దేవాలయానికి వెళ్ళగానే, ఆలయ ప్రవేశానికి ముందు ప్రదక్షిణం చేస్తాం. అసలు ప్రదక్షిణం అంటే ఏమిటి?

 ప్రదక్షిణం పదంలో ప్రతి అక్షరానికున్న గొప్పతనం తెలుసుకుందాం.'ప్ర ' అనే అక్షరం సకలపాపవినాశనానికి సూచకం. ' ద ' అనే అక్షరానికి అర్ధం కోరికలన్నీ తీరడం. 'క్షి ' అంటే రాబోవు జన్మలఫలం. 'ణ ' అంటే అజ్ఞానం నుండి విముక్తిని ప్రసాదిస్తుంది.

యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ............ అంటూ ప్రదక్షిణం చేస్తాం, అంటే అనేక జన్మల నుండి నేను చేసిన పాపాలన్ని ఈ ప్రదక్షిణలు చేయడం వలన నశించిపోవాలి. పాపపు పనులు చేసి ఉండచ్చు, అనేక జన్మల పాపం వల్లే ఈ కష్టతరమైన జీవితం గడుపుతున్నాను, నాకు నీవు తప్ప వేరే దిక్కే లేదు పరమాత్మ. నా మీద కారుణ్యంతో నన్ను రక్షించు అని అర్దం.

యానికానిచ పాపాని జన్మాంతర కృతాని చ
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే
................................
..............................
అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ
తస్మాత్ కారుణ్య భావేన రక్షరక్ష జనార్దన

 అంటూ ప్రదక్షిణం చేస్తాం, అంటే అనేక జన్మల నుండి నేను చేసిన పాపాలన్ని ఈ ప్రదక్షిణలు చేయడం వలన నశించిపోవాలి. పాపపు పనులు చేసి ఉండచ్చు, అనేక జన్మల పాపం వల్లే ఈ కష్టతరమైన జీవితం గడుపుతున్నాను, భవిష్యత్తులో కూడా పాపం చేసే అవకాశం ఉంది. నాకు నీవు తప్ప వేరే దిక్కే లేదు పరమాత్మ. ఓ జనార్దన! నా మీద కారుణ్యంతో నన్ను రక్షించు అని అర్దం.

ప్రదక్షిణం చేయడం అంటే " ఓ భగవంతుడా! నేను అని వైపుల నుండి నిన్నే అనుసరిస్తున్నాను. నా జీవితం అంతా నీవు చెప్పిన మార్గంలోనే నడిపిస్తాను, నీవు చెప్పినట్టే జీవిస్తాను " అని పరమాత్మకు చెప్పడం.

 ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్న పరమాత్మ చుట్టూ మనం తిరిగే అవకాశమే లేదు. అటువంటి పరమాత్మ మనలో ఆత్మస్వరూపంగా ఉన్నాడు, మనలో ఉన్న పరమాత్మను గురించి తెలుసుకోవాలంటే, బాహ్యవిషయాలను పక్కనబెట్టి, మన గురించి మనం విచారించాలని గుర్తుచేసేది, మనల్ని మన ఆత్మతత్వం చుట్టు తిప్పెది ఈ ప్రదక్షిణం.

ప్రదక్షిణం గురించి మరిన్ని ఆసక్తికరమైన అంశాలు తెలుసుకుందాం.

దేవాలయంలో విగ్రహప్రతిష్ట చేసే సమయంలో విగ్రహం క్రింద పంచలోహాలు వేస్తారు. అలాగే ద్వజస్థభం క్రింద కూడా పంచలోహాలు వేస్తారు. ఇవి భూమిలో ఉన్న విద్యుతయస్కాంత్ శక్తిని ఆకర్షిస్తాయి. సైన్సు ఏమి చెబుతోందంటే? Nulei/ Nucleus చుట్టూ Electrons వృతాకారంలో తిరుగుతుంటాయి. అక్కడ ఒక విద్యుతయస్కాంత్ క్షేత్రం ఏర్పడుతుంది. వీటికి దగ్గరలో కూడా ఇదే విధమైన ప్రక్రియ( Nucleus/ Nulei చుట్టు Electrons తిరగడం) జరుగుతుంటే, ఇవి పరస్పరం ఆకర్షణకు గురవుతాయి. వాటి మధ్య మరింత బలమైన బంధం ఏర్పడి, అక్కడ ఉన్న Electrons అన్నీ కూడా వృత్తాకారంలో అంటే కుడి నుంచి ఎడమకు తిరగడం వలన అక్కడ ఒక విద్యుతయస్కాంత్ క్షేత్రం ఏర్పడుతుంది.

దేవాలయంలో కూడా ఇదే జరుగుతుంది. ఆలయంలో ఉన్న మూలవిరాట్టు(ప్రధాన విగ్రహం), ఆయన వాహనం, ద్వజస్థభం మధ్య ఒక శక్తివంతమైన శక్తి క్షేత్రం ఏర్పడుతుంది. మనం కూడా కుడి నుండి ఎడమకు దైవం చుట్టూ తిరిగితే,మన శరీరంలోనికి ఆ విద్యుతయస్కాంత్ శక్తి ప్రవేశిస్తుంది. అందుకే ప్రదక్షిణంలో మనం కుడి నుండి ఎడమకు తిరుగుతాం. అంటే మన కుడి చేయి వైపు దైవం ఉండేలా చూసుకోవాలి. ఇది ప్రదక్షిణంలో ఉన్న అంతరార్ధం. 

అసలు ప్రదక్షిణ ఏలా చేస్తే మన శరీరానికి శక్తి అందుతుంది? ప్రక్షిణం ఎలా చేయాలని శాస్త్రం చెప్తోంది?

ముందు కాళ్ళు, చేతులు శుభ్రంగా కడుక్కుని, ద్వజస్థంభం దగ్గర నమస్కరించి మొదలుపెట్టాలి. ఎలా పడితే అలా వేగంగా తిరగడం కాదు, పచ్చికుండలో నిండుగా నూనె నింపుకుని, ఒక 9 నెలల గర్భిణీ స్త్రీ ఆ పచ్చి కుండను ఎత్తుకుని, ఆ నూనె క్రింద పడకుండా ఎంత జాగ్రత్తగా, మెల్లగా నడుస్తుందో, అంతే మెల్లగా, నెమ్మదిగా ప్రదక్షిణం చేయాలని శాస్త్రం చెప్తోంది. అలా చేస్తేనే దేవాలయంలో ఏర్పడే విద్యుతయస్కాంత్ క్షేత్రం యొక్క శక్తి మనకు అందుతుంది. రోజూ వేగంగా 100 ప్రదక్షిణలు చేయడం కంటే శాస్త్రానుసారం 3 ప్రదక్షిణలు చేయండి చాలు.

ప్రదక్షిణలు చేయడం వలన చాలా అద్భుతమైన ఫలితాలుంటాయి. వినాయకుడు తన తల్లిదండ్రులైన శివపార్వతుల చూట్టు ప్రదక్షిణ చేసి గణాధిపత్యాన్ని పొంది, గణాధిపతి అయ్యాడు. గౌతమ మహర్షి గోవు చూట్టు ప్రదక్షిణ చేసి బ్రహ్మమానస పుత్రిక, మహా సౌందర్యవతి అయిన అహల్యను భార్యగా పొందాడు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా విశేషాలుంటాయి.

అయితే ప్రదక్షిణ వలన కలిగే ఫలితాలను సంపూర్ణంగా పొందాలంటే శ్రద్ధతో చేయాలి. ఫోన్ మాట్లాడుతూనో, పాటలు వింటునో,లేక ఏదో పందెంలో పరిగెత్తినట్టు పరుగులు తీస్తేనో, ప్రక్క వాళ్ళతో మాట్లడుతూనో, ప్రదక్షినలు చేస్తే ఒరిగేదేమి లేదు.

ప్రదక్షిన సమయంలో, మనం ఏ దైవం చూట్టు ప్రదక్షిణం చేస్తామో, ఆ దైవానికి సంబంధించిన శ్లోకాలనో, కీర్తనలనో, మంత్రాలనో పఠిస్తూ ప్రదక్షిణ చేయాలి. ఉదాహరణకు, శ్రీ వేంకటేశ్వర స్వామి చూట్టూ ప్రదక్షిణం చేస్తుంటే, "ఓం నమో వేంకటేశాయ " అనే నామన్ని ఉచ్చరించాలి. ఒకవేళ మనకు కీర్తనలు, పాటలు, మంత్రాలు ఏవి తెలియవనుకోండి, అప్పుడు "ఓం " కారాన్ని ఉచ్ఛరిస్తూ ప్రదక్షిణం చేయండి.

ఓంకారం చాలా శక్తివంతమైంది. ప్రపంచవ్యాప్తంగా జరిగిన అనేక పరిశోధనలు కూడా ఇదే విషయాన్ని దృవీకరించాయి. ఒక జెర్మన్ శాస్త్రవేత్త ఓంకారం మీద పరిశోధన చేసి, ఓం కారాన్ని కనుక గదిలో కూర్చుని, ఒక విధమైన స్వరంతో కనుక ఉచ్ఛరిస్తే, అక్కడ పుట్టే తరంగాలు, శక్తికి ఆ గది గోడలు బద్దలయిపోతాయని చెప్పారు.

ॐ ప్రదక్షిణం నిర్మలమైన మనసుతో చేయాలి. అలా చేయడం వలన మనకు మంచిమంచి ఆలోచనలు వస్తాయి. జీవితంలో మంచి ఉన్నత స్థానానికి చేరుకుంటాం.